లోయ నుంచి శిఖరానికి - యండమూరి
నేను ఈ రోజు మీ అందరికి పరిచయం చేయాలనుకున్న పుస్తకం యండమూరి వారి లోయ నుంచి శిఖరానికి. ఈ పుస్తకానికి తిక్కన గారి పద్యానికి ఎంతో సామీప్యం ఉన్నది
మహాభారతంలోని విదుర నీతి ఒక్కటి చాలు మనిషిని కుదురుగా ఉంచడానికి.
ఆమూలాగ్రము చదివి వంటపట్టించుకొని సాధన చేస్తే ప్రతి మనిషి ఒక ఋషి అవుతాడు. సగం పాటిస్తే ప్రపంచ నాయకుడవుతాడు!
కనీసం ఒక్క నీతి వాక్యాన్ని తన జీవిత ధ్యేయంగా మనుగడ సాగిస్తే మహామనిషి అవుతాడు!
ఏ Modern Management book దీనికి సరితూగుతుంది.?
Moral values ,customs,systems అన్నీ కూలంకషంగా చర్చించాడా మహానుభావుడు.
విదురుడు ప్రాతఃస్మరణీయుడు .
నీతి పథంబునన్ బ్రదుక నేర్చుట యుత్తమ భంగి; శౌర్య సం
జాతములై కరం బలరు సంపద లొందుట మధ్యవృత్తి; య
స్ఫీతములైన భారవహజీవనముల్ దలఁపం గనిష్ఠముల్
నీతికి బాహ్యులైన, ధరణీవర! మెత్తురె వారి నుత్తముల్?
నేను ఎప్పుడూ చెప్పినట్లే, యండమూరి వారి పుస్తకాలలో అత్యద్భుతమైన నీటిని సాహిత్యాన్ని గోరు ముద్దలుగా అందిస్తారు
పుస్తకం : "లోయ నుంచి శిఖరానికి"
రచయిత : యండమూరి వీరేంద్రనాధ్
సమీక్ష : కస్తూరి శివశంకర్
ప్రతి వారం ఒక యండమూరి వారి పుస్తకం అందరికీ పరిచయం చేస్తున్నాను. ఈ వారం కూడా ఆ ఆలోచన వచ్చినప్పుడు ఏ పుస్తకం మీ అందరికీ పరిచయం చేయాలా అని ఆలోచించాను. ఎందుకంటే వారి పుస్తకాలని చదవని వారు అరుదు
సుమారు 100 పైగా అద్భుత రచనలు. ఖచ్చితంగా అన్నీ వీలైనంత వరకు పరిచయం చేస్తాను
ఈ వారం నేను వ్రాయాలనుకున్న పరిచయ వ్యాసం : యండమూరి వీరేంద్రనాధ్ గారి "లోయ నుండి శిఖరానికి"
"ధర్మో రక్షిత రక్షితః" అనే సూక్తి విన్నారు కదా. అలగే "జ్ఞానో రక్షిత రక్షితః" అని నమ్మినవారు యండమూరి.
జ్ఞానాన్ని మనం కాపాడులుంటే అది మనల్ని కాపాడుతుంది అని బలంగా నమ్మినవారు
మానవజాతి విజ్ఞాన సోపానాలు కోసం అనుక్షణం ఏంతో విజ్ఞానాన్ని సమకూర్చిన మేధావులందరికీ ఈ పుస్తకం అంకితం చేస్తారు
ముందుమాట లోనే ఆయన ఏమి చెప్పాలనుకున్నదేదో స్పష్టంగా చెబుతారు. మనిషికి జీవితం ఒక పుస్తకం. అయితే దాని ముఖ్యాశం కేవలం ఆనందం మాత్రమే అని చెబుతారు. అయితే ఈ ఆనందం సంపాదించే ప్రస్థానంలో అప్పుడప్పుడూ Twists ఉంటాయి కదా అంటారు.. వాటి వెనకే విషాదాలు, ఆ ఏడుపు, భయం దగ్గర పుస్తకం చదవడం ఆపేస్తే ఎలా
మన పుస్తకం తాలూకు PROLOGUE భావుకత;
పుస్తకం INDEX : Being Romantic / Romanticism
Epilogue : ఆధ్యాత్మికత
ఉపసంహారం మాత్రం భవబంధ విముక్తి అని చెబుతారు
పుస్తకం చదూతుంటే ఎప్పుడో చదివిన భర్తృహరి సుభాషితాలు గుర్తొచ్చాయి.
గొప్పవారు ఇతరుల అనుభవాల నుండి నేర్చుకుంటారు, సామాన్యులు తమ అనుభవాల నుండి గ్రహిస్తారు. మూర్ఖులు మాత్రం వేటినుంచి కూడా నేర్చుకోరు
జీవిత పుస్తకాన్ని నిర్లిప్తత అనే సాలె పురుగుల పాల్చేయ్యకు. నీ పుస్తకాన్ని నీవే ప్రేమించ(లే)కపోతే ఇతరులు దాని వైపు కన్నీటీ కూడా చూడరు. ప్రతి రోజూ నీ పుస్తకాన్ని చదువుకో. ఎన్నో అచ్చుతప్పులు కనిపిస్తాయి. గత అనుభవాల సాయంతో వాటిని సరిదిద్దే వరకు నీ జీవిత పుస్తకం మరింత అందంగా తయారవుతుంది. ఈ ప్రక్రియ నే ఆత్మ పరిశీలన అంటారు.
పుస్తకంలో అధ్యాయాలు ఉంటాయి కదా, అలగే నీ జీవితంలో అధ్యాయాలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి అధ్యాయానికి చదువు, సంపాదన, ప్రేమ, పెళ్లి, కుటుంబం లాంటి పేరు పెట్టండి. ఈ చాఫ్టర్లు విడగొట్టడం లో confuse అయ్యామో, అయోమయంలో పాడేటాము (ఉదాహరణకి చదువు అనే అధ్యాయం లో ప్రేమ , పెళ్లి లాంటివి ఎప్పుడూ కలపకూడదు)
బుద్ధుడు చెప్పినా, కృష్ణుడు చెప్పినా చెప్పడం వరకే కదా వారు చెప్పేది. వినడం ధర్మం. ఆచరించకపోవడం ఖర్మం
మనిషికి జ్ఞానం రావడమంటే అన్నిటి మీద, అందరి మీద ప్రేమ వదులుకోవడం కాదు, అన్నిటినీ, అందరినీ ప్రేమించడం (ప్రేమించగలగడం) . ఇంకా చెప్పాలంటే మునుపటి కంటే ఇంకా ఎప్పువగా ప్రేమించగలగటం.
ఈ దృక్పధంతో చూడడం మొదలు పెడితే రోజూ ప్రపంచమూ, మనుషులు ఎంత ఇష్టంగా కనిపిస్తారో.
ఇలా ప్రతి చోట మనిషి మేధకి, కళ కి అబ్బురపడడం మొదలుపెడితే, మనకు పక్కవాడిని చూసి అసూయ చెందాల్సిన అవసరం లేదు.
పుస్తకమే లో ఒక చోట ఆనందం - సౌకర్యం అనే మన రెండు విషయాలకు చక్కగా క్లారిటీ ఇస్తారు. సినిమా టిక్కెట్లు దొరక్కపోవడం, ఏకాంత లేకపోవడం, ప్రణాళిక ప్రకారం మీ విహార యాత్ర జరక్కపోవడం, కరెంటు పోయినప్పుడు దోమలు కుట్టడం, బంధువులు వచ్చినప్పుడు విశ్రాంతి లేకపోవడం, పనిమనిష్ రాలేకపోవడం.. ఈ అన్ని విషయాలు మన ఆనందం పాడుచేయడం లేదు. మీకు నిజానికి చిన్న అసౌకర్యం కలిగిస్తున్నాయి
ఆనందం అనేది మన ఆలోచనా విధానంలో ఉంది తప్ప, ఏ ఒక్క వస్తువు, వ్యక్తి సంఘటనలో కాదు.. చిన్న సౌకర్యం దూరం అవడం వలన మనం ఆనందం ఎలా కోల్పోతాము. అకారణంగా ఆనందం కోల్పోవడం అనే విష్యం మన చేతుల్లోనే ఉంది
విదుర నీతి ఒక్కటి చాలు మనిషిని కుదురుగా ఉంచడానికి. ఆమూలాగ్రము చదివి వంటపట్టించుకొని సాధన చేస్తే ప్రతి మనిషి ఒక ఋషి అవుతాడు. సగం పాటిస్తే ప్రపంచ నాయకుడవుతాడు!
కనీసం ఒక్క నీతి వాక్యాన్ని తన జీవిత ధ్యేయంగా మనుగడ సాగిస్తే మహామనిషి అవుతాడు!
ఏ Modern Management book దీనికి సరితూగుతుంది.?
Moral values ,customs,systems అన్నీ కూలంకషంగా చర్చించాడా మహానుభావుడు.
విదురుడు ప్రాతఃస్మరణీయుడు .
నీతి పథంబునన్ బ్రదుక నేర్చుట యుత్తమ భంగి; శౌర్య సం
జాతములై కరం బలరు సంపద లొందుట మధ్యవృత్తి; య
స్ఫీతములైన భారవహజీవనముల్ దలఁపం గనిష్ఠముల్;
నీతికి బాహ్యులైన, ధరణీవర! మెత్తురె వారి నుత్తముల్?
అన్నది విదుర నీతి.. చూసారా నేను ఎప్పుడూ చెప్పినట్లే, యండమూరి వారి పుస్తకాలలో అత్యద్భుతమైన నీటిని సాహిత్యాన్ని గోరు ముద్దలుగా అందిస్తారు
మనిషి జీవితంలో ఇప్పుడున్న క్లిష్టత ఒకప్పుడు లేదు. తెలివితేటలూ పెరిగాయి. గెలుపుకి కొలమానం కేవలం డబ్బు, కీర్తి మాత్రమే అయ్యాయి. చిన్న కుటుంబాల్లో నిశబ్దం తాండవమాడుతోంది. పిల్లల బాల్యం ఛిద్రం చేయటానికి కర్కశ హస్తాలతో, కరాళ పాదాలతో, కార్పొరేట్ కాలేజీలు కదం తొక్కుతున్నాయి. ఇటువంటి పారిస్తుతులలో జీవితం గెలుపు నిర్వచనం తెలుసుకోవడం, పిల్లలకు తెలియచేయడం ఈ పుస్తకము ఉద్దేశం
గెలుపు కి భర్తృహరి నుండి నన్నయ్య వరకు, చానాకుడి నుండి వివేకానందుని వరకు ఎందరో మేధావులు చెప్పిన చిన్న చిన్న విషయాలని తెలుపుతూ మనకి పరిచయం చేసే పుస్తకమే యండమూరి "లోయ నుంచి శిఖరానికి
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి