10, డిసెంబర్ 2020, గురువారం

ప్రహేళిక సంఖ్య -36, తెలుగు కవులు - రచనలు - బిరుదులు

 


ప్రహేళిక సంఖ్య -36

 

సమాధానములు

*******

తెలుగు కవులు - రచనలు - బిరుదులు

********

1. శశికళ పాటల సంపుటి రచించిన ప్రముఖ కవి ఎవరు? అతని బిరుదు ఏమిటి?

జవాబు)

అడవి బాపిరాజు,  కళామూర్తి, రసద్రష్ట  బిరుదాంకితులు

 

2. కవి, గేయ రచయిత, సాహితీవేత్త, విమర్శకుడు, పరిశోధకుడు, హేతువాది అయిన కవి ఎవరు? అతను రచించిన తెలుగు సాహిత్య పరిశోధనా గ్రంథం ఏమిటి?

 

జవాబు) 

"సమగ్ర ఆంధ్ర సాహిత్యం" సమగ్రమైన పరిశోధనా గ్రంధం. గ్రంధాన్ని అందించిన వారు ఆరుద్ర  

ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి  

 

3. ఆంధ్ర గోర్కీ గా ప్రసిద్ధి చెందిన నవలా రచయిత ఎవరు? అతను రచించిన ప్రసిద్ధ సామాజిక నవల పేరేమిటి?

 

 

జవాబు) 

"ఉన్నవ లక్ష్మినారాయణ". వీరు  అందించిన  మొట్టమొదటి అభ్యుదయ నవల మాలపల్లి

 

4. కవితా ప్రవీణ అనే బిరుదు పొందిన రచయిత్రి ఎవరు? గృహలక్ష్మి మాస పత్రికలో శీర్షికతో వ్యాసాలు వ్రాశారు?

జవాబు) 

కనుపర్తి వరలక్ష్మమ్మ గారు.   ఈవిడ గారు  గృహలక్ష్మి మాస పత్రికలో శారదా లేఖలు అనే పేరుతో  వ్యాసాలు వ్రాశారు

 

5. దేవాలయాలపై బూతు బొమ్మలు ఎందుకు అనే రచన చేసిన హేతువాద కవి ఎవరు? అతని బిరుదు ఏమిటి?

జవాబు )

తాపీ ధర్మారావు గారు.  ఆంధ్రవిశారద బిరుదాంకితులు  

 

6. సామాజిక మత సంస్కరణ ఉద్యమాల్లో పాల్గొన్న కవిరాజు అని పిలువబడే ప్రసిద్ధ రచయిత ఎవరు? ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం ఏమి చేసింది?

జవాబు) 

త్రిపురనేని రామస్వామిగారు,  1987 సంత్సరంలో భారతదేశ ప్రభుత్వము ఆయన స్మారక చిహ్నముగా  తపాలా బిళ్ళ విడదల చేశారు

ప్రముఖ నవలా రచయిత శ్రీ త్రిపురనేని గోపీచంద్ వీరి కుమారుడు

 

7. అభినవ సరస్వతులు అని పిలువబడే వారు ఎవరు? వారి ప్రత్యేకత ఏమిటి?

 

జవాబు)

జంట కవులు అయిన తిరుపతి వెంకట కవులు.. (దివాకర్ల తిరుపతి శాస్త్రి మరియు చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి)

చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి  గారు విశ్వనాథ సత్యనారాయణ, వేటూరి ప్రభాకరశాస్త్రి, పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వేంకటేశ్వరరావు, వేలూరి శివరామశాస్త్రి వంటి వారికి గురువులు  

వీరు వందకు పైగా అవధానములు మాత్రమే కాకఎంతో ప్రఖ్యాతమైన నాటకాలు, పద్యాలు అందించారు. *పాండిత్యము తెలియని వారు కూడా చక్కగా పాడుకునే పద్యాలు అందించిన ఘనత ఆధునిక యుగంలో వీరిదే    

 

8. గయోపాఖ్యానం నాటక కర్త ఎవరు? నాటకంలో అర్జునుడి వేషధారణ వేసిన ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు ఎవరు?

 

జవాబు )

గయోపాఖ్యానం మొట్టమొదటి సారి తెలుగులో వ్రాసిన వారు రామానాత్యుడు

కావ్యాన్ని జనసామాన్యం అలరించే పద్యాలతో చక్కని నాటకంలా శ్రీ చిలకమర్తి వారు రచించారు. వీరు, వారి శిష్యులు టంగుటూరి ప్రకాశం గారు కూడా నాటకాల్లో రచించారు 

చిలకమర్తి వారి గయోపాఖ్యానం లో శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు కూడా చాలా సార్లు ప్రదర్శన లో పాల్గోని అర్జునుని వేషం వేసేవారు.  ఆయన చిలకమర్తి వారి ప్రియ శిష్యులలో ఒకరు  

కావ్యం ఆధారంగా వచ్చిన తెలుగు సినిమా శ్రీకృష్ణార్జున యుద్ధము

 

 

9. సవర భాషా పాండిత్యంతో పేరు గడించి వ్యవహారిక భాషా ఉద్యమం నడిపిన చరిత్రకారుడు ఎవరు? అతని బిరుదు లేమిటి?

 

జవాబు)

శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారు. తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు   రావు సాహెబ్ , కైజర్ హింద్ , అభినవ వాగానుశాసనుడు వంటివి ఈయనకున్న ముఖ్యమైన బిరుదులు

కళా ప్రపూర్ణగౌరవం కూడా లభించింది 

 

10. అమృత వీణ గేయమాలిక రచించిన కవి ఎవరు? అతని బిరుదు లేమిటి?

 

జవాబు)

శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. వీరు ఆంధ్రా షెల్లీ బిరుదాంకితులు. పద్మభూషణ్ గౌరవం కూడా లభించిన చాలా కొద్దీ మంది కవుల్లో ఈయన ఒకరు

 

విశ్లేషణ పూర్వక సమాధానాలు అందించిన కస్తూరి వారికి ధన్యవాదాలతో

 

వెంకట్.సి హెచ్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...