29, సెప్టెంబర్ 2020, మంగళవారం

రచనలు, సమీక్షలు, శనివారము 26.09.2020

 


సంఘసంస్కర్త, రచయిత, నాటకకర్త -కళాప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి జయంతి.గయోపాఖ్యానము నాటకముగణపతి పేరెన్నికగన్న రచనలు


 

నేటి వ్యాసం:

దేవతలు దానవులు- సాగర మధనం

 

మనము దేవతలు దానవులు గురించి చాలా మారులు విన్నాము చదివాము మననం చేసుకున్నాము.. దేవతలు దానవులు కలిసి సాగర మథనం చేశారని అందు నుండి గరళం  మరియు అమృతం ఉద్భవించాయని కూడా తెలుసుకున్నాము.. అంశంపై కొన్ని విశేషాలు సమర్పిస్తున్నాను.

దేవతలు మంచి గుణాలకు ప్రతీక దానవులు చెడ్డ గుణాలకు ప్రతీక. ఇంకొక రకంగా , దేవతలంటే మంచి గుణాలని దానవులు అంటే చెడ్డ గుణాలని అన్వయించుకోవచ్చు. కలియుగంలో మంచి గుణాలు చెడ్డ గుణాలు కలిసి ఓకే మనిషి   అంతరంగములో

కాపురం చేస్తాయి. మనుషుల వృత్తులు 

వైననూ  వారి ప్రవృత్తిని నిర్ణయించేది గుణములే..

అసలు గుణములు అనగా ఏమిటి? మన పవిత్ర గ్రంథమైన శ్రీ భగవద్గీత లో 16 అధ్యాయం లో దైవాసుర ( దైవ , అసుర ) గుణాలు గా నిర్వచించడం జరిగింది. రెండు గుణాలను మళ్లీ మూడు గణాలుగా వర్గీకరణ చేసి- సాత్విక , రాజస , తామస అనే త్రిగుణాలు గా పేర్కొన్నారు.  త్రిగుణాలు అనేక సమీకరణాలలో మనుషుల అంతరంగములలో ప్రవర్తించి మనుషుల ప్రవృత్తికి కారణమవుతాయి.

 పైన పేర్కొన్న దైవాసుర లేదా త్రిగుణాలు మనందరిలో నిరంతరం ఘర్షణ పడుతూనే ఉంటాయి. ఘర్షణయే మన మనో సాగరంలో నిత్యము జరిగే మధనం. మనో మధనం  నుండి యే జనిస్తాయి మనుషులు అనుభవించే బంధాలు- అనుబంధాలు, కష్టాలు -, కన్నీళ్లు -మున్నిళ్లు ,బాధలు- భయాలు, కోపాలు -, ఆనందాలు -ఆశ్చర్యాలు ,కరుణ- దయ, భక్తి - వైరాగ్యం మొదలగు ఎన్నో భావాలు అనుభూతులు.

మంచి గుణాలను మనం గెలిపిస్తే దేవతల మవుతాము, చెడ్డ గుణాలను గెలిపిస్తే దానవులమవుతాము . ఇక్కడ ఒక విషయం గమనించాలి.. మంచి చెడ్డ గుణాలు ఎల్లప్పుడూ అంతరంగంలో ఉంటాయి , ఏవి నాశనం కావు.. మన వివేకాన్ని బట్టి వాటి ప్రాముఖ్యత లో ప్రభావతలో తేడా ఉంటుంది.. ఉదాహరణకు వెలుగు చీకటులు. ఇంటిలో రాత్రి వేళలో లైట్ స్విచ్ ఆన్ చేస్తే వెలుగు వస్తుంది చీకటి పోతుంది, స్విచ్ ఆఫ్ చేస్తే వెలుగు పోతుంది చీకటి వస్తుంది. అంటే వెలుగు చీకట్లలో ఏదీ నాశనం కావడం లేదు. అనగా మన అంతరంగ మధనం నిరంతరం జరిగే ప్రక్రియ. మన జాగరూకత లో ఏమాత్రం అలసట ప్రదర్శించిననూ చెడ్డ గుణాలు ప్రభావశీలి అవుతాయి, అందువల్ల మంచి గుణాలకు ఎల్లప్పుడు పట్టం కడుతూ ఉండాలి.

ఇంకొక ప్రశ్న- సాగర మధనానికి అంతమే లేదా? లేదు,  జనన మరణ చక్రంలో జీవులు పరిభ్రమిస్తున్నంత కొరకు పోటీ నడుస్తూ ఉంటుంది.

 

సర్వేజనా సుఖినోభవంతు.. సర్వే సంతు నిరామయా...

CA కె మల్లికార్జునరావు____ తెలుగు తేనియలు

*****

 

(ఆంధ్రజ్యోతి ఆదివారం 20-9-20 సౌజన్యంతో-)

కళ్ళజోడు కధ

సరసి

కడగకపోతే కళ్ళజోడు కూడా కరోనా వ్యాప్తికి కారణం కాగలదట! నీళ్ళలో ముంచి తియ్యగానే కళ్ళజోడు కథ చెప్పసాగింది. బహుశా యాభై ఏళ్లనాటిది!

దేవుడి గుళ్ళో ఉత్సవాలకి బెజవాడ నించి శాస్త్రి గారిని పిలిపించి పురాణ ప్రవచనం పెట్టేరు. సతీసమేతంగా విచ్చేసిన శాస్త్రి గారికి గుడి వెనక ఒకరింట్లో విడిది ఏర్పాటు చేసారు. ప్రతిరోజూ మధ్యాన్నం మూడింటికి గుడి మండపంలో భాగవతం చదువుతూ వివరించసాగేరు శాస్త్రి గారు. ఇరవై ముప్ఫయి మంది వరకూ శ్రద్ధగా వినే శ్రోతలు.

ఆరు రోజులు గడిచేయి. ఏడో రోజు ప్రవచనానికి కూర్చున్నాక గుర్తుకొచ్చింది శాస్త్రి గారికి తను కళ్ళజోడు విడిదిలో మరిచొచ్చిన సంగతి. వెళ్లి తెచ్చుకునే టైము లేదు. అసలే అది ఆఖరి రోజు. ఎలాగైనా పూర్తి చేసెయ్యాలి.

ఎవరైనా కళ్ళజోడిస్తారా మరిచిపోయానుఅన్నారాయన. ముగ్గురు నలుగురు తీసిచ్చారు. అయితే గంగాధరం గారి కళ్ళజోడు కాస్త వదులుగా ఉన్నా చూపుకి సరిపోయింది. దాన్ని తగిలించుకుని పురాణం ప్రారంభించారు.

సంధ్య వేళ కావొస్తోంది. మిగిలింది నా శ్రీమతి చదివి పూర్తి చేస్తుంది. నేను చెరువుకెళ్ళి సంధ్య వార్చుకొస్తానుఅని లేచారు శాస్త్రి గారు భార్య చేతికి పుస్తకం అందించి.

పక్కనే ఉన్న చెరువుకు చేరుకొని, మెట్లు దిగి,  ముందుకు వంగి నెత్తిమీద ఇలా నీళ్ళు చల్లుకున్నారో లేదో వదులుగా ఉన్న కళ్ళజోడు కాస్తా బుడుంగుమని నీళ్ళలో పడిపోయింది. కంగారు పడిపోయారు శాస్త్రి గారు. నీళ్ళల్లో చెయ్యి పెట్టి ఎంత కెలికినా దొరకలేదు. నీరసంగా గుడికి చేరుకొని విషయం చెప్పారు. “బాధపడకండి. పోయే యోగం వచ్చింది దానికి. కృష్ణార్పణం అనుకుంటాఅన్నారు గంగాధరం గారు పెద్ద మనసుతో.

రాత్రి భోజనాలు అయ్యేక బయలుదేరుతున్న శాస్త్రి గారికి వీడ్కోలు చెప్పడానికి గ్రామస్తులు కొందరొచ్చారు. శాస్త్రి గారు గంగాధరం గారిని పక్కకి పిలిచి, వంద రూపాయలు చేతిలో పెట్టబోయారు. “అబ్బెబ్బే.. కృష్ణార్పణం అనుకున్నాఅన్నారాయన.  కళ్ళజోడుకు వెల కట్టలేను. కేవలం నా తృప్తి కోసం ఇస్తున్న నష్టపరిహారంఅంటూ బలవంతంగా ఆయన చేతిలో పెట్టి, బండెక్కేసారు శాస్త్రి గారు తృప్తిగా.

కధ పూర్తి కాలేదు. మర్నాడు చెరువుకి వెళ్ళిన ఒకామె కాళ్ళకి కళ్ళజోడు తగిలింది. ముందు రోజు సంఘటన వూళ్ళో వాళ్లకి తెలిసిందే కాబట్టి దాన్ని తెచ్చి గంగాధరం గారి కిచ్చిందామె. “కృష్ణార్పణంఅనుకున్నారాయన.

అక్కడితో కూడా కధ పూర్తి కాలేదు. మరుసటి ఏడాది కూడా అదే శాస్త్రి గారి ప్రవచనం పెట్టారు నిర్వాహకులు. వారు ఊళ్ళోకి రాగానే కళ్ళజోడు దొరికేసిన సంగతి ఆయన చెవిన వేసారొక ఔత్సాహికుడు.

సాయంత్రం పురాణానికి కూర్చోబోతూ గంగాధరం గారిని గుర్తు పట్టి దగ్గరకెళ్ళి  కళ్ళజోడు దొరికిందటగా?” అన్నారు శాస్త్రి గారు లౌక్యంగా. “అవునండిఅన్నారు గంగాధరం గారు. ఇద్దరి మధ్యా రెండు నిమిషాల మౌనం. “మీ వస్తువు మీకు దొరికింది కాబట్టి నా సొమ్ము నాకిచ్చేస్తారేవిటి పోనీ?” అన్నారీయన. “ఇచ్చుకోలేనుఅన్నారాయన. కోపం వచ్చింది శాస్త్రి గారికి. “అయితే నా కళ్ళజోడు నాకిప్పించెయ్యండిఅన్నారు. “క్షమించాలి. కళ్ళజోడుకు మీరిచ్చినది నష్టపరిహారమే కాని దాని వెల కాదు. అందువల్ల అది మీది కాదు. ఇకపోతే నేను కృష్ణార్పణం అనుకుంటా అంటున్నా వినకుండా మీరు డబ్బిచ్చారు. అది అప్పు కాదు. నేనిచ్చుకోలేనుఅన్నారు గంగాధరం గారు. శాస్త్రి గారు బుర్ర గోక్కునిసరే కానివ్వండి. కృష్ణార్పణం అనుకుంటా!” అన్నారు.

శ్రీదేవి___ తెలుగు తేనియలు



నవల  : హిమబిందు
రచన : అడవి బాపిరాజు
సమీక్ష : కస్తూరి శివశంకర్

 

నేపధ్యం ఏమిటి

శాతవాహన రాజుల్లో 17 రాజు హాలుడు అందించిన గాథాసప్తశతి, గుణాఢ్యుడి బృహత్కథ, కుతూహలుడి లీలావతి పరిణయం, సోమదేవుడి కథాసరిత్సాగరం, వాత్సాయన కామసూత్రాలు, బౌద్ధ, జైన గ్రంథాలు, ప్లినీ, టాలమీ (Ptolemy) రచనలు, అజ్ఞాత నావికుడు రాసిన 'పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ' మొదలైనవి శాతవాహనుల చరిత్రకు ఆధార గ్రంథాలు.ఈవన్నీ మల్లంపల్లి వారు, అడవి బాపిరాజు వంట మేటి చరిత్రకారులు చెప్పిన విషయాలే  

ఆంధ్ర శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు. ఇతడికే శ్రీముఖ, సిముక, సింధుక , చిముక అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయి.

మన ప్రాచీన శాసనాలుపురాణాలు శ్రీముఖుడినే ఆంధ్ర రాజ్య స్థాపకుడిగా వర్ణించాయి.

జైన మత పోషకుడిగా, జైన దేవాలయాలను కట్టించినట్లు జైన సాహిత్యం ద్వారా తెలుస్తోంది.

మొదట జైన మతాభిమానిగా ఉన్నప్పటికీ, తర్వాత వైదిక మతం స్వీకిరించినట్లు తెలుస్తోంది.

శ్రీముఖుడు అశోకుడి సమకాలికుడు.

ఆంధ్రుల చరిత్రలో శాతవాహనులది ముఖ్యమైన కాలం. హిమబిందు నవలా కధా కాలం శ్రీముఖుడు ఆంధ్ర సామ్రాజ్యాన్ని పాలిస్తున్న రోజులు (క్రీ.పూ. 225  అని భావింపబడే కథ)  

ధాన్యకటకం లోని  ప్రముఖ వ్యాపారి చారుగుప్తుని ఏకైక కుమార్తె హిమబిందు. గ్రీకు వ్యాపారవేత్త డెమస్తనీస్ సోదరి పేర్లా (ముక్తావళి దేవి గా మారిపోయింది). ఆమె కూతురయిన ప్రజాపతి మిత్ర హిమబిందు తల్లి.. విధంగా ఆమె రక్తంలో ఆంధ్ర, యువన (గ్రీకు)  రక్తాలు ఉన్నాయి చరిత్రకారుల అని భావన 

శ్రీముఖుని సైనికాధికారి అయిన సుమదర్శి చారుగుప్తుని మేనల్లుడు. సుమదర్సకి కి చారుగుప్తుని సోదరి అమృతలతా దేవికీ మేనకోడలు అయిన హిమబిందు ని కోడలిగా చేసుకోవడం ఇష్టం. అయితే చారుగుప్తునికి మాత్రం శ్రీముఖిని కుమారుడైన శ్రీకృష్ణ శాతవాహనుడుకి తన కుమార్తె హిమబిందు నిచ్చి పెళ్లి చేయాలని అభిలాష 

శ్రీముఖుడు అనుసరిస్తున్న బౌధ్ధ ధర్మం వలన ఆర్ష ధర్మం అడుగంటుతోందన్న ఆగ్రహంతో శ్రీముఖుడు కొడుకైన యువరాజు శ్రీకృష్ణ శాతావాహన యువరాజుని అంతం చేయడానికి ప్రయత్నిస్తాడు స్థౌలతిష్య మహర్షి. ఇంతలో ఉజ్జయినీ పై శత్రువులు దండయాత్ర చేయడం, జంబూ ద్వీపానికి చక్రవర్తి కావాలనే తలపుతో శ్రీముఖుడు దండయాత్ర సన్నాహాలు చేయడం...

చారుగుప్తుడు యుద్ధానికి కావలసిన ధన సహాయం చేస్తానని మాటివ్వడం జరిగిపోతాయి 

కానీ యుద్ధ వీరుడు అయిన సువర్ణశ్రీ ని హిమబిందు ప్రేమిస్తుంది..తండ్రి చారుగుప్తుడు మాత్రం యువరాజైన శ్రీకృష్ణ శాతవాహనికి ఇచ్చి పెళ్లి చేయాలని తలంపు.  స్థౌలతిస్య మహర్షి ఒక పక్కన శ్రీ కృష్ణ శాతవాహనుని తన మనవరాలు అయినా చంద్రబాలని విషకన్య గా చేసి చంపాలన్న ఆలోచన  

కథ ఆసాంతమూ ప్రణయం, విరహం, ఎత్తుగడలూ, పన్నాగాలూ, యుద్ధనీతులతో ఓహో అనిపిస్తుంది నా అభిప్రాయం ప్రకారం తెలుగులో ఇంత విస్తారమైన కథ (చరిత్ర) బహుశా అద్భుతం అనిపిస్తుంది 

శాతవాహనుల జీవన విధానం , పరమత సహనం కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు రచయిత

అన్నిటికన్నా ముఖ్యం తెలుగు వారు, తెలుగు చక్రవర్తులు ప్రపంచాన్ని ఎన్నో సమార్జాలాని ఒక 5౦౦ సంవత్సరాలు ఎలా  పరిపాలించారో తెలుసుకుని ఆహా అనిపిస్తుంది.

చారిత్రిక నవలలు మనం ఎందుకు చదవాలి ? మన తరువాతి తరాలకు ఎందుకు తెలియచేయాలి ???

కస్తూరి శివశంకర్___ తెలుగు తేనియలు

అసలు మన జాతి దురదృష్టం ఏమిటంటేపాశ్చాత్య చరిత్రకారులు మన చరిత్రనే వక్రీకరించి మనకు నేర్పించారు. మన పురాణాలన్నీ పుక్కిట పురాణాలు అని చెప్పి మనకి "Mythology" అనే పదాన్ని పరిచయం చేశారు ఒకప్పుడు కొన్ని సాహితీ సంస్థలు కూడా పిల్లలకు ప్రత్యేకమైన Mythology Quiz అని చెప్పి తామేదో గొప్ప మేలు స్తున్నామనుకుంటున్నారు.

Mythology అనే పదము వలన మన చరిత్ర కు మనమే తూట్లు పొడుస్తున్నామన్న అవగాహన కొంతైనా మన వారికి లేకుండా పోయింది      

అందువలన మన చరిత్ర మన సనాతన శాసనాలని పరిశీలించి చెప్పిన మన చరిత్రకారుల ద్వారా తెలుసుకోవడం చాలా అవసరం. వీరిలో అత్యంత ప్రముఖులు విశ్వనాధ వారు, తరువాత అడవి బాపిరాజు గారు, శ్రీ నోరి నరసింహశాస్త్రి. వీరందరి పరంపరలో ఆఖరి వారు శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారు    

మన శకకర్తలైన విక్రమార్క శాలివాహనులని మిధ్యాపురుషులుగా అభివర్ణించి, వారి అస్తిత్వాన్నే కాదన్న ఘనులు పాశ్చాత్త్య చారిత్రకారులు 

విశ్వనాధ వారు చరిత్ర ని పరిశీలించి, ఎన్నో వ్యయ ప్రయాణాలకు ఓర్చి శాలివాహనుని శక నిరూపణకునివేదితఅనే నవలను, గౌతమబుద్ధుని కాలాన్ని నిరూపించటానికిచిట్లీచిట్లని గాజులుఅనే నవలను, ఆదిశంకరాచార్యుల వారి కాలనిరూపణకుసౌదామిని" అనే నవలను, శ్రీకృష్ణుని అస్తిత్వాన్ని, కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగిన కాలాన్ని వివరించటానికియశోవతినవలను రచించారు

 జనమేజయుని శాసనాన్ని బహిర్గతమొనర్చటానికిభగవంతుని మీది పగఅనే నవలను రచించారు. విధంగా చారిత్రక సత్యాలకి అందమైన ఆసక్తికరమైన కధనాన్ని జోడిచి, నవలా రూపాన్నిచ్చి, అచ్చమైన చరిత్రను పాఠకులకు అందించారు.

 

****



స్వేచ్చా సమర్పణలు


సమస్య  కుప్పలుగా సిరులు కూడ క్షోభించ దగున్

 

ఇచ్చిన పాదము కందము

నా 1001. పూరణ. సీసములో

 

బంధు గణంబులు బారులు తీర్చుచు గడప ముందర చేరి గొడవ చేతు

రప్పు లివ్వ మనుచు, రాత్రులు నిదుర రా క భయము తో మనంగ వలయు గద,

సతతము పన్నుల శాఖయు, పోలీసు శాఖల దాడులు జరుగ వెతలు

కలుగు ,కుప్పలుగా సిరులు కూడ క్షోభించ దగునెప్పుడు నిలలో, ధర్మ గతిని

ధనము పొంద నిరతము ముదమ్ము పొంద గలము, చెరసాల బాధలు కలుగ వెపుడు,

లంచమును గైకొన ననుచు లక్షణముగ తెలిపె నొక భర్త తన భార్య తీరు గాంచి

 

పూసపాటి____ తెలుగు తేనియలు



ఎవరికి లేవని వ్యధల కథలు?

కానలకేగిన రామయ్యకి లేవా

శరాఘాతానికి కూలిన

కన్నయ్యకు లేవా

శిలువనెక్కిన ప్రభువుకు లేవా

పుణ్యకాలం కోసం అంపశయ్య పై

బతుకుండగానే నరకం చూసిన

ఆగర్భ శతృవుల తాతకు లేవా

కష్టాలొస్తే గుడి వైపు సాగే

వేవేల కాళ్ళ  క్రింద నలిగే

చిరు చీమలకు లేవా

భక్త కోటి ధాటికి

ఉక్కిరిబిక్కిరి అయ్యే

రాతి దేవుళ్ళకు లేవా

తిన్నగుండక తిన్నడి కన్ను పీకను

కంట రుధిరాన్ని గార్చిన

ముక్కంటికి లేవా

నీ తొలి ఏడుపు కోసం

విలవిల్లాడిన అమ్మకి లేవా

ఎవరికి లేవని వ్యధల కథలు?

ఎవరికి రావని కంట కన్నీళ్ళు??

క్షణక్షణం రణం రణం

క్షణక్షణం ఒక జీవం

క్షణక్షణం ఒక మరణం

క్షణక్షణం ఘనం ఘనం

క్షణక్షణం గతం గతం

క్షణభంగురమీ జీవన

శతమానపు ఉబలాటకు

ఆటవిడుపు వల్లకాడు.

ఈలోగా నవ్వు నువ్వు

నవ్వుకోక రువ్వు నవ్వు

ఫెళ ఫెళ ఫెళమంటూనో

పక పక పకమంటూనో

నగుమోమే పెడుతూనో!

నవ్వు నవ్వు నవ్వు నవ్వు.

_

బం బం బం బం వందే సాంబం

జగదాలంబం మమావలంబం

 

ప్రణతహృదయగత భావకదంబం

నవసంధ్యాతాండవ సంరంభం

ఉమామానసాంబుజరోలంబం

విపులకృత్యమయ విశ్వారంభం

 

అభయ శుభాకృతి మఘగిరి శంబం

పటుదృశాదగ్ధ మన్మధ దంభం

స్మితవదనం లాలితహేరంబం

ఆద్యంతరహిత జ్వలనస్తంభం

గళ వాద్యమైనబం బంశివుని కత్యంత ప్రీతిపాత్రమైనదిపూజవసానంలోబం బంఅంటూప్రవర్తతాం వాచీ సదైవ బంబం “—నా వాక్కు నందు ఎల్లప్పుడూబం బంనాదం oడు గాకఅని మ్రోక్కుతాడు భక్తుడు.

కారణం చేత శివ ప్రీతికరంగాబంనాదబంధుర గీతి ఇది .ఎందుకో తెలుసా నేస్తమా!

ప్రపంచానికి పంచగలిగే

తిరుగులేని సంపద

కల్తీ లేని నవ్వొక్కటే గనక!

   ----.----

అత్తిలి అనంతు____తెలుగు తేనియలు

 


బం బం బం బం వందే సాంబం

జగదాలంబం మమావలంబం

 

ప్రణతహృదయగత భావకదంబం

నవసంధ్యాతాండవ సంరంభం

ఉమామానసాంబుజరోలంబం

విపులకృత్యమయ విశ్వారంభం

 

అభయ శుభాకృతి మఘగిరి శంబం

పటుదృశాదగ్ధ మన్మధ దంభం

స్మితవదనం లాలితహేరంబం

ఆద్యంతరహిత జ్వలనస్తంభం

గళ వాద్యమైనబం బంశివుని కత్యంత ప్రీతిపాత్రమైనదిపూజవసానంలోబం బంఅంటూప్రవర్తతాం వాచీ సదైవ బంబం “—నా వాక్కు నందు ఎల్లప్పుడూబం బంనాదం oడు గాకఅని మ్రోక్కుతాడు భక్తుడు.

కారణం చేత శివ ప్రీతికరంగాబంనాదబంధుర గీతి ఇది .


ఆదిబోయడు వీడు సాడు విలుకాడు

అడవులకు ఎకిమీడు అమ్మసైదోడు

 

పూలవలువల తోడ పొలతి గౌరమ్మ

నెమలిపించెముదాల్చి నిలచే మాయమ్మ

పలువిరుల సొబగులను కులుకులోలికే తల్లి

కొందరాయని అనుగుకూతురీ సురవల్లి

 

వనకళలకే రూపువచ్చెనో యనగ

సకల సౌందర్యాల సారమే యనగ

మూడు లోకపు సిరుల మూర్తియే యనగ

శివుని సరసన నిలిచె చెలువంపు కళిక

 

ఏమి రాజసమోయి ఈశ్వరుని మురువు

అమ్మచేతికి యిచ్చె శరములును ధనువు

హరువామ(ఎడమ)కరము మా అమ్మ యోడ్డాణము

కుడిచేతిలో పూలగుత్తి ఒయ్యారము

 

అడవి బుడుతులు చుట్టి ఆటలాడంగా

వేదాలసామి బలు వేటగాడాయే

వనసంపదలు కొలిచి వినుతి సేయంగా

ఆరుమొగములవాని అయ్య వెంచేసే

                        ******* 


కనకనగకోదండధారీ! ఘన  మహాదేవ! త్రిపురారీ!

మహిత పృధ్వీరధిక! మాయావిదారీ!

పాహియను ప్రార్ధింతు పాపాపహారీ!

ఫణీశజ్యావల్లి ప్రణవఝూoకృతి పలుక

విశ్వమయ! నీదైన విష్ణుభావాశుగము

సంధించుమా శూర! స్వామీ! ధనుర్దీర!

తికరణ మహాఘములు ప్రకటముగా భస్మమగు

చందగమనమ్ములను సాగు వేదాశ్వముల

నీ బ్రహ్మభావమ్మే నియతియై నడిపించు

ఇనచంద్రగతి ననుసరించు కాలాధ్వమ్ము

నేర్పరచి శాసించు ఈశా! మహా కాల!

 

మోహన్ అల్లాడి____ తెలుగు తేనియలు

 

****

 

 ఏకాంతం

 

ఈశాన్యం మహమ్మారి

తూరుపు వాకిలి

తలుపు తట్టి తిష్ట వేసింది

అనురాగపు పొదరిళ్ళకు చెద పట్టింది

నవ్వుతూ పలకరించే పలకరింపు

ఇప్పుడు ఏకాంతమైంది

తన వారికి ఏమౌతుందో నని

గంభీరం గా వున్న వదనం వెనుక

విషాదం వికృతం గా నవ్వుతుంది

భయం గుప్పిట మౌనం గా రాలే

కన్నీటి బిందువు ఛిద్రమైంది

చాటు మాటున దాగి

పలకరించిందో గాని

మానసిక స్థైర్యంను

నిలువుదోపిడీ చేసింది

పలకరించే పలుకు వినపడక

చూసి ధైర్యం చెప్పే వీలు లేక

ఏకాంతం శిక్షగా అనుభవించే ఖైదు లా

తన కౌగిలి చెర విడిచే గడియ కోసం.......

 

కోవూరి___ తెలుగు తేనియలు

(మా బావగారు సి. హెచ్ వెంకట్  గారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ..... )

 

****


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...