15, సెప్టెంబర్ 2020, మంగళవారం

శని, ఆదివారముల పుస్తక సమీక్ష 12 & 13 . 09 . 2020, "మనసు కవి" ఆత్రేయ, ముళ్ళపూడి వెంకటరమణ

 

పుస్తక సమీక్ష


శ్రీ విశ్వనాధ సత్యనారాయణ,

ఆత్రేయ గారి స్మరణ

ముళ్ళపూడి వెంకటరమణ, 

అమరావతి  కథలు 


 


వేయి పడగలునాలుగు మాటలు

 

వేయి పడగలు మీద సమీక్ష కాదు కదా ఒక వ్యాసం రాయాలన్నా ఒక చిన్నపాటి పుస్తకమంతా రాయాల్సి వస్తుంది.. నాకు తెలిసిన నాలుగు మాటలు వివరిస్తున్నాను..

1.
వేయి పడగలు కవిసామ్రాట్ విశ్వనాథవారి ఒక అద్భుత సృష్టికేవలం 29 రోజుల్లోనే వ్రాయబడింది బృహత్ నవలలో 999 పేజీలు ఉన్నాయిప్రపంచ సాహిత్యంలోని బృహత్ నవలలో దీన్ని ఒకటిగా పేర్కొనవచ్చు..
 
2.
ఆదిశేషునికి వేయి పడగలు ఉంటాయి కుండలిని సాధనకు కూడా ఆదిశేషుడు ప్రతీక.
వేయి పడగలు అనగా భారతీయ ధర్మాలు మరియు సంప్రదాయాలు .
3.
సర్వ ధర్మాలు నశించినప్పటికీ భారతదేశాన దాంపత్య ధర్మం మిగిలి ఉంటుందని అని అర్థం వచ్చేట్టు ధర్మారావు పాత్ర ద్వారా చివర్లో చెప్పిస్తారు విశ్వనాధవారుభారతీయ దాంపత్య ధర్మానికి సంప్రదాయానికి పెద్ద పీట వేసింది వేయి పడగలు.
 
4. గ్రంథ తత్వం:
కథా స్థలమైన ఒక కుగ్రామం సుబ్బన్న పేట  కాలక్రమంలో పాశ్చాత్య ప్రభావాల కారణంగా ఎలా దుష్పరిణామాలకు లోని అయింది అన్నది వేయి పడగలు ఇతివృత్తంసుబ్రహ్మణ్యేశ్వరుడు వేయి పడగల స్వామి "వేయి ముఖాలుగా ధర్మం పాలింపబడిన భారత దేశమే సుబ్బన్న పేట గా చెప్పబడింది అంతేగాని ఇది ఒక ఊరు కాదు ఇది ఒక జమీందారీ కాదు " అని విశ్వనాథ వారే ఒక రేడియో ప్రసంగంలో వివరించారు.
 
5. ప్రకృతి రక్షణ:
ఈనాడు పర్యావరణ శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా ఏయే అంశాలను గూర్చి చర్చిస్తున్నదో వాటిని వేయిపడగలు ఎనభై ఏళ్ళ క్రితమే చర్చించిందిప్రకృతిలో ఉన్న సమతుల్యాన్ని  భంగం చేయడం వల్ల మానవ జీవితం ఎంత దుఃఖ మయ మవుతుందో విపులంగా చర్చించినది  నవల.. ఇది ఒక అరుదైన విషయం..  చెట్లను నిర్మూలించడంమెట్ట పొలాలను లేకుండా చేయడంవాణిజ్య పంటలకు ప్రాధాన్యం యిచ్చి తిండి గింజలు తగ్గిపోవడంఇవన్నీ పాశ్చాత్య నాగరికత తెచ్చిపెట్టిన బస్తీల పెరుగుదలతో వచ్చిన కష్టాలు నష్టాలు . ఇంతేకాక సృష్టి అంతా మానవుడి  కోసమే ఏర్పడిందని భావించిన నవ  నాగరికత మిగిలిన జీవకోటికి ఆధారమైన ప్రకృతి ని అంతా వికవికలు చేసింది . 20   అధ్యాయంలో  కల్లోలం అద్భుతంగా  చిత్రింపబడిందివృషన్నిది అన్న మేఘ వృత్తాంతం మేఘం ఆదివటం అనే చెట్టు మీద నిలుస్తుంది చెట్టు మేఘముల మైత్రి ఊరు పుట్టినప్పటినుండి కొనసాగుతున్నది .  స్నేహం క్రొత్త నాగరికత వల్ల విచ్ఛిన్నమైంది . ఆదివటము విద్యుద్దీపముల కొఱకు విచ్చేదమైపోవడం వల్ల  మేఘానికి  గ్రామాన్ని గుర్తుపట్టడం కష్టమయిందివృషన్నిధి అక్కడ కురియలేదుఅయితే వృషన్నిధికి కూడా ఒక తుపాకీ గుండు తగిలింది గుండు సామరస్యాన్ని త్రోసివేస్తూ ఆక్రమిస్తూ వున్న నాగరికత కు ప్రతీక.   గుండు వల్ల నాగరికతా మోహంలో  తమ ఉనికి కోల్పోయిన  ప్రజల నూతన భావాల  వల్ల  మేఘము ఎక్కడో నీరక్కరలేది ఒక గుట్ట పైభాగాన కూలబడిపోయిందిమేఘాన్ని ప్రియా సందేశ వాహకంగా కాళిదాసు నిర్మిస్తేఆధునిక కాలంలో పృథ్వీ మండలంలో ప్రాకృతిక అసంతులనం వల్ల ఏర్పడ్డ విషాదాన్ని వ్యక్తం చేయడానికి  వృషన్నిధిని తీర్చిదిద్దారు విశ్వనాథ వారు

 

CA కె మల్లికార్జునరావు

******************** 


 

మీద విశ్వనాధ వారి ఆంధ్ర పౌరుషం లోని    అద్భుతమైన పద్యం... నాకు బాగా ఇష్టమైన పద్యమూనూ

సీసము

గోదావరీ పావనోదకంబుల తరం గాలపై నౌకలుయ్యాలలూచి

అరికంఠరక్తచిహ్నములు పోవుటకునై పెన్నానదిని కత్తిపొన్ను కడగి

అరినిషూదనకార్యమందు గల్గిన తాప మడపఁ గృష్ణాపగయందు మునిగి

తుంగభద్రాసముత్తుంగరావము రిపు  శ్రీభేదకముగ ఘోషింపజేసి

 

మాటిమాటికి దెసలెల్ల మాఱుమ్రోగ

గడగడవడంకి దిక్కు లుగ్రతఁ జలింప

శత్రుల హృదంతరమ్ములు సంచలింప-

విశ్వమునదించె నాంధ్రుల విజయభేరి

 

అరుణారుణ కిరణాల స్పర్శతో

అంతరంగం చైతన్య భరితం కావాలి

ఉషోదయ కాంతులతో ముఖబింబం వెలుగు లీనాలి

నిన్నటి ప్రొద్దు లోని నిరాశ అంతమై

నేడు ఆశావహగీతిక పల్లవించాలి

దేవిక చల్లా

*************

 పావనుడపురుషోత్తమాభావనుండ!

సంతసములిమ్ము మా పతిశంఖపాణి!
వందనంబు లివియె శౌరిపద్మనాభ!

విద్య లొసగి మమ్ము నిలుపు విశ్వరూప!

 

వెంకట్ సి.హెచ్

************************

నేటి  సమీక్ష / వ్యాసం
భ్రమరము బోధ

భ్రమరము జీవితము మనిషికి ఎన్నో పాఠాలు నేర్పుతుంది. విశేషాలను నీకు వివరిస్తాను.

1.  "భ్రమర కీటక న్యాయం" 

 

తుమ్మెద ఒక కీటకం పై శబ్దం చేస్తూ తిరుగుతూ ఉంటుంది .అలా చేసినందువల్ల కీటకం భ్రమరంగా మారిపోతుంది.దీనినే భ్రమర కీటక న్యాయం అంటారు. వాల్మీకి ఒక బోయవాడు .దారి దోపిడీ చేస్తూ కిరాత కుడిగా ఉండేవాడు.సప్త ఋషుల ఉపదేశంతో రామ నామాన్ని జపిస్తూ ఋషిగా మారిపోయాడు.అలాగే మంచి వారితో స్నేహం చేస్తే చెడ్డవాడు కూడా మంచి వాడుగా మారిపోతాడు అనే న్యాయమేభ్రమర కీటక న్యాయం”. సజ్జన సాంగత్యం అంటే ఇదే..

2.  

భ్రమరములు  ఎన్నో పూల నుండి మకరందాన్ని సేకరించి తేనెను తయారు చేస్తాయి. పూలు చాలా సుకుమారమైనవి.. అట్టి పూలకు విధమైన హాని కలగకుండా భ్రమరములు మకరందము సేకరిస్తాయి. మనుషులు నేర్చుకోవాల్సిన పాఠం ఇది. ఇతరుల నుండి మనము ఏదైనా గ్రహించినప్పుడు వారికి ఎలాంటి హాని కలుగు రాదు .

3 

భ్రమరములు  పూల నుండి మకరందాన్ని సేకరించి ఎంతో శ్రమించి తేనెను తయారు చేస్తాయి. కానీ తేనెలో రవంత కూడా తన కోసం ఉపయోగించుకోదు. నిస్వార్థ సేవకు ఇదొక అద్భుత ఉదాహరణ. మనుషులు ఎంతైనా నేర్చుకోవాలి భ్రమరముల జూచి.

  4

భ్రమరములు చిన్న ప్రాణులు. తేనెను తయారు చేయడం అన్నది వీటికి చాలా పెద్ద లక్ష్యం. ఒక చుక్క తేనే తయారు చేయాలంటే కొన్ని వేల పూల నుండి మకరందం సేకరించాలి. తమ ముందున్న లక్ష్యం ఎంత పెద్దదైనను, భ్రమరములు వెనుకంజ వేయక పట్టుదలతో కష్టపడి లక్ష్యాన్ని చేరుకుంటాయి. విషయం కూడా మనుషులు నేర్చుకోవలసిన గొప్ప పాఠం.

 

 CA కె మల్లికార్జునరావు

**************************** 


 

కొన్ని రోజుల క్రితం శతక పద్యాలు క్రోడీకరిస్తుంటే, దాశరధి శతకంలోని   పద్యం ఆకర్షించింది.

మన శతకకర్తలు, తత్వవేత్తలూ, మహా కవులూ స్పృశించని అంశం లేదు కదా అనిపించింది.

 

చంపకమాల

భ్రమరము కీటకంబుఁగొని పాల్పడి ఝాంకరణోపకారియై

భ్రమరముగా నొనర్చునని పల్కుటఁజేసి భవాదిదుఃఖసం

తమస మెడల్చి? భక్తిహితం బుగ జీవుని విశ్వరూప

త్త్వము, నధరించుటే మరుదు దాశరథీ కరుణాపయోనిధీ!


****************

 

విశ్వనాథ వారి నవలా సాహిత్య వైభవము

 విశ్వనాథ వారి నవలా సాహిత్యము కున్న ప్రత్యేకత కొంత వారి జయంతోత్సవ దినమున తెలుసుకొనుట జరిగింది. రోజు పాఠకుడిగా మరికొంత నా అనుభూతిని పంచుకొనదలచినాను.

వారి నవలా సాహిత్యములోకి వెళ్ళపోయే ముందు అసలు ఒక పాఠకుడు పుస్తకాన్ని ప్రయోజనము లాశించి చదువుతాడు? అనే ప్రశ్నకు సమాధానాలు పరిశీలిస్తే ఒకరు ఆనందము కోసమని, ఇంకొకరు విజ్ఞానము కోసమని, మరొకరు వ్యాపకమని, సాహిత్యభిలాష కలిగిన వారు రచనా శైలి నవగాహన చేసుకొను నిమిత్త మని ఇలా రక రకాలుగా చెపుతారు. ఇవన్నీ కించిత్కించిద్భేదములు గల సమాధానము లైనప్పటికీ, ప్రధానముగా పఠన ముఖ్యోద్దేశ్యము తనను తాను మరచిపోయి తత్గ్రంథము లో లీనమై ఆస్వాదన చెందడము. అనగా అనుభూతి చెందడము. అనుభూతి వైవిధ్య భరితముగా ఉంటుంది. ఒక సన్నివేశపు పాత్రలో పఠితుడు తనను ఊహించుకోవడము, తెలియని కొత్త విశేషము తెలుసుకోవడము, పదప్రయోగ నైపుణ్యాని కబ్బురపడడము, తత్సంఘటనల కల్పనా చతురతకు ముగ్ధు లవ్వడము, చదివినంత సేపు తనను తాను మరచిపోయి గొప్ప అనుభూతి పొందడము(రసానుభూతి)కవి గ్రంథములో తెలిపెడి వైవిధ్య పాత్రల స్వరూపములను వీక్షించి లోక జ్ఞానము పొందడము ఇలా చెప్పుకుంటూ పోతే అనేకానేక ప్రయోజనములు పఠితులు పొందడము మనకు విదితమే.
 
సాధారణంగా పైన తెలుపబడిన  ప్రయోజనములు నేరవేర్చుటకు కవికి కష్ట సాధ్యమైన విషయము. అయినప్పటికీ మన తెలుగు సాహిత్యములో ఇలాంటి రచనలతో మెప్పించిన కవులు ఎందరో ఉన్నారు. వారి రచనలన్ని తత్ప్రయోజనము ఇవ్వలేకపోయినప్పటికి నధిక భాగ రచనలు లేదా అల్పాదిల్పముగా నైనా యిచ్చాయని చెప్పుట యధార్థము. అయితే విశ్వనాథ వారు పైన తెలుపబడిన సర్వ ప్రయోజనాలను వాగ్దేవి కరుణాకటాక్షాలతో తన అపార నైపుణ్యముతో ప్రతి రచనలో జొప్పించారని చెప్పుట అత్యంత సహశయము. ప్రతి రచనలో పఠితుడికి కొండంత లోకజ్ఞానము, రసాస్వాదన, గొప్ప పదప్రయోగ నైపుణ్యత, అవసరము మేరకు వర్ణన, అద్భుత సన్నివేశాల కల్పన కనిపిస్తుందిముఖ్యంగా సన్నివేశ వర్ణనతో పఠితులను తత్సన్నివేశమును కనుల ముందు సాక్షాత్కరింప చేయుట, పాత్ర వర్ణనతో పాత్ర స్వభావ సర్వ స్వరూపాన్ని ఎరుక పరుచుట, అవసరమైన చోట వాడే అద్భుత మైన వర్ణనలతో పఠితుడు తత్ప్రాంతములో తాను ప్రత్యేక్ష సాక్షి వోలె యున్న ట్లనిపించుట విశ్వనాథ వారికి దైవ యోగమని చెప్పాల్సిందే.
 
 ఊపిరి బిగపట్టే ఉఠ్కంఠ కలిగించడము అంతలోనే చక్కని హాస్యచతురతతో ఆహ్లాదపరచడము వారికే సాధ్యము. వైవిధ్య భరితమైన సన్నివేశాల కల్పనలు, అనర్గళమైన వర్ణనలు, మనోహర దృశ్యాల సాక్షాత్కరింప చేసెడి గొప్ప రచనా శైలి మొదలైన వన్నియు కళా ప్రపూర్ణునికి వెన్నతో పెట్టిన విద్య
 
ప్రధానముగా నేపాలి రాజుల చరిత్రకు సంబంధించిన మరియు పురాణ వైర గ్రంథమాల నవలల్లో వారు రచించిన పాత్రల స్వభావము, సన్నివేశాల కల్పన , ఆనాటి కాల పరిస్థితుల వర్ణనలను చదువుతుంటే తత్పఠితుడు భూత కాలములోకి వెళ్ళి ఆస్వాదన పొందుట తథ్యము.
 
అదేమీ జ్ఞానము ఆనాటి దేశ విదేశాల పాలనా విశిష్ఠత యేమి, రాచరికపు యెత్తుల పోకడ లేమీ, రణరంగ స్వరూప రూపు రేఖలేమీ, కదన రంగమున యుండెడి సర్వాయుధములు, సర్వ సైనిక హంగులేమీ, శత్రు సైనికుల కుట్రకుటంత్రల తీరు తెన్నులేమీఆనాటి రాజాస్థానములో రాజవంశీయులు వెలయించిన భోగమేమీ, వారు ధరించిన వజ్ర వైఢూర్య రత్న మరకత అభరణ భూషణముల నైగనిగ్యమేమి, భారత దేశ వైభవ ప్రాభవములేమీ ఇలా ఇవన్నీ మహానుభావుడు వ్రాయుట కొరకు జన్మించిన కారణ జన్ము డనిపించక పోవడము పాఠకుడి తప్పు అవుతుంది.
 
ఇక సాంఘిక నవలల్లో పాత్రల కల్పనలు మన పరిసరాల్లో చూచినట్లు ఉంటుంది. సమాజంలోని మానవ సహజ స్వభావాల పరిచయము, సంఘములో వ్యక్తు లాచరించ వలసిన నియమ నిబంధనల అవశ్యకత, సంఘ పరిస్థితుల నేపథ్యము, సంప్రదాయ సంస్కృతి విశేషా లన్నియు వీరి నవలల్లో కథ వస్తువులుగా యుండుట పాఠకులకు మిక్కుటముగా కనిపిస్తాయిలోకోక్తులతో, సామెతలు, జాతీయాలతో తెలుగు భాషలోని సౌందర్యమంతా వీరు సద్వినియోగపరుచుకొ న్నట్లు మరొక కవి ఉపయోగించలేదనుట అతిశయ మేమి కాదు. ప్రతి నవలలోని కథ నుండి కవి సమ్రాట్ ఇచ్చే సందేశ మాధారముగా పాఠకుడు  సమాజంలో తనను తాను రూపు దిద్దుకొని తన వ్యక్తిత్వాన్ని వికసింప చేసుకొని తత్సమాజ మాచించెడి విధముగా మంచి పౌరు డగునులోకానుభవాల నుండి తాను రచనలు చేశానని విశ్వనాథ వారు చెప్పుకొనుట జగమెరిగిన రహస్యమే. ఇలా చెప్పుకుంటూ పోతే కవిసమ్రాట్ వారి ప్రతి నవల కొక సమీక్ష చేస్తూ ఒక గ్రంథము వ్రాయవచ్చని సవినయముగా తెలుపుకుంటూ……
వారు ఉపయోగించిన నాకు తెలిసిన మరి కొన్ని వర్ణనలతో మరల కలుద్దాము.

                                                                       

ధన్యవాదాలతో,   వెంకట్. సిహెచ్

*************************************

 

నవలఏకవీర

రచన :   కవిసమ్రాట్ విశ్వనాధ

సమీక్ష : కస్తూరి శివశంకర్

 

విశ్వనాధ వారి నవలల్లో వేయి పడగలు, ఏకవీర తెలుగు నవలా సాహిత్యంలో అత్యంత విశిష్ఠ స్థానం సంపాదించుకున్న నవలలు. అంతటి మహాకవి నవలా ప్రక్రియని ఊరికే చేపట్టరు .  

 

తెలుగు సాహిత్యానికి సంబంధించిన అద్భుతమైన విషయం ఏమిటని ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే

నేను విశ్వనాధ వారి కధాకథన కౌశలం అని తటపటాయికాకుండా చెప్పగలను  

 

మధురాంతకం రాజారాం

 

పాఠకులకు రచయిత ఉద్దేశాన్ని అవగాహన చేసుకోవడంకావ్య పఠనం ద్వారా కన్నా నవల పఠనం ద్వారా తక్కువ శ్రమతోనే  లభిస్తాయి 

ప్రతిభావంతుడైన రచయిత తన పాఠకులకు ఏదైనా ఉద్దేశాన్ని, సందేశాన్ని బలంగా చెప్పాలనుకున్నప్పుడు, పాఠకులనూ, వారి అవగాహనా సామర్ధ్యాన్ని ఎంతో కొంత ఉంచుకోక తప్పదు.

 

కారణం వలనే విశ్వనాధ వారు మహా కావ్యాలనీ, లఘుకావ్యాలనీ ఎంత ఉన్నతమైన కళా స్థాయిలో వ్రాశారో, అంతే ఉన్నతమైన కళా స్థాయిలో కూడా నవల రచనలు అందించారు   

  

విశ్వనాధ వారు జగమెరిగిన దేశభక్తులు. భారతీయతకు పెట్టింది పేరు, వారి నవలలో, కావ్యాలలో, రచనల్లో భారతీయ వైభవం, భారత చరిత్ర లోని మేలి గుణాల స్వచ్ఛత, విలువల తత్పరతా విడదీయరానంతగా ఉంటాయి.. ఆయన వివ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తాయి     

నిజానికి ఏకవీర చాలా చిన్న నవలకానీ, విషయాలన్నీ కూడా ఏకవీర లో కనిపిస్తాయి

 

 ఏకవీర నవలలోని కథ

*************************

ఏకవీర లోని కథ చాలా ప్రసిద్ధమైనదే..  చాలా క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను

 

కుట్టాన్, వీరభూపతి సాహాధ్యాయులు. అంతస్తులకు అతీతమైన మంచి స్నేహం కలవారు

వీరి స్నేహాన్ని తెలియచేసే సందర్భంలో విశ్వనాధ వారు ఆనాటి రాజకీయ స్థితి గతులనీ, సామజిక పరిస్థితులనీ, విద్యా వ్యవస్థ లోని తీరు తెన్నులూ పరిచయం చేస్తారు  

వీరిరువురూ ధర్మపరులూ, సమర్థులూ, సంస్కారవంతులూ, సుందరులూ కూడా

 

మధురను ముద్దు కృష్ణప్ప నాయకుడు పరిపాలిస్తున్న కాలం కథాకాలం.

నవలలో నలుగురు ప్రధానపాత్రలు-ఏకవీర, మీనాక్షి, కుట్టాన్, వీరభూపతిలు. కుట్టాన్ కృష్ణప్ప నాయకుని మంత్రుల్లో ఒకరైన ఉదయన్ సేతుపతి కుమారుడు. వీరభూపతి అతని ప్రాణ స్నేహితుడు, మొదట సామాన్య రైతు కొడుకు హోదాలో ఉన్నా తదనంతరం రాజ్యపరిపాలనకు చెందిన ముఖ్యపదవిలో చేరుతాడు.

 

కుట్టాన్ మీనాక్షి అనే సామాన్య సంసారి కుమార్తెను ప్రేమిస్తాడు, మీనాక్షికి కూడా కుట్టాన్‌పై ప్రేమ ఉంటుంది. కానీ కుట్టాన్ తండ్రి విషయం తెలిసి కూడా నిర్లక్ష్యం చేసి ఉన్నత కుటుంబానికి చెందిన ఏకవీరను ఇచ్చి వివాహం చేస్తాడు. కుట్టాన్ ఆమెపైకి తన ప్రేమను తిప్పుకోలేక, మీనాక్షిని మరచిపోలేక సతమతమవుతూంటాడు.

 

మరోవైపు అతని ప్రాణమిత్రుడు వీరభూపతి కూడా ఉన్నత కుటుంబానికి చెందని ఏకవీరను ప్రేమించివుంటాడు. ఏకవీర కూడా వీరభూపతిని ప్రేమించినా ఆమె తల్లిదండ్రులు ఆమె ఇష్టాయిష్టాల ప్రసక్తి లేకుండా కుట్టాన్‌కి ఇచ్చి వివాహం చేస్తారు. కుట్టాన్ ప్రేమించిన మీనాక్షి వీరభూపతి భార్య అవుతుంది. వీరిద్దరి మధ్య కూడా నిశ్శబ్దమే రాజ్యమేలుతూంటుంది. ఇలాంటి స్థితిలో ఇద్దరు జంటల జీవితాలు మార్పులు తిరిగాయో, చివరకు కథ తీరానికి చేరిందో నవలలోని మిగిలిన కథాభాగం.

 

నవలలో ప్రధానమైన పాత్రలు ఏకవీర, మీనాక్షి, కుట్టాన్, వీరభూపతి. వీరిలో ప్రతిపాత్ర విశిష్టమైనవే, పాత్ర లేకున్నా కథాగమనం మారిపోతుంది. కానీ మీనాక్షి అనో, వీరభూపతి అనో, కుట్టాన్ అనో మరేదో పేరో కాకుండా ఏకవీర అనే పేరు పెట్టడం వెనుక విమర్శకులు కారణాన్ని విశ్లేషించారు.

 

నవల ముగుస్తున్నప్పుడు సుందరేశ్వరుడు ఏకవీరను ఆవహించి ఆమెతో ఒక మహత్కార్యం చేయించాడని, అందుకే వారి కన్నా పాత్ర కొంత మిన్నయైనదని భావించారు.

*******************************************


నా సమీక్ష - గొల్లపూడి వారి ఐదు నాటకాలు నుండి

The Thirty-Nine Steps - 39 మెట్లు

 

వారు ఎప్పుడు లండన్ వెళ్లిన ఖచ్చితంగా చూసేది అక్కడి నాటకాలు..  వారిని బాగా ఆకర్షించేది అక్కడి నాటక రంగమే అని చెప్పారు..

 

లండన్ స్టేషన్ ఎదుట అండర్గ్రౌండ్ నుండి బయటకు వస్తే ఉండే వీధి పేరు హే మార్కెట్ దాని క్రింద వారు గొప్పగా వ్రాసుకున్న పేరు హే మార్కెట్- ధియేటర్ లాండ్. ఇది నాటక ప్రపంచం అని చెప్పుకోవడం వారికి గర్వకారణం...

 

గొప్ప విషయం ఏమిటంటే టికెట్స్ కోసం అన్ని దేశాల వారు క్యూ లో నిలబడటం, వెల ఎంత అయినా వెనుకాడకుండా కొనడం..

 

రాత్రి పేగులు కొరికే చలిలో ఉత్సాహంగా ప్రేక్షకులు రావడం 7.30 నుండి 10.30 వరకు ..

 

వారు చెప్పిన 5 నాటకాలలో మొదటిది... the thirty-nine steps - 39 మెట్లు... పేరుతో నవల రాసిన రచయిత జాన్ బచన్, పాత్రికేయుడు, రాజకీయ నాయకుదు, దౌత్య వేత్త, ఇంకా చాలా రంగాలలో ఉన్నారువారి 39 ఏట మంచం పడి ఉన్నప్పుడు రాసిన కథే 39 మెట్లు.

 

కథ

నిరపరాధి, నేలబారు మనిషిని ఒక అందమైన అమ్మాయి పలకరిస్తుంది, తన ఇంటికి తీసుకు వెళ్ళమంటుంది హడావిడిగా.   మనిషి షాక్ అవుతాడు. ఎందుకువద్దు అనేలోగా అతడిని నేరుగా ఇంట్లోకి తోసుకొస్తుంది..  ఆమె ఎవరుఅలా రావడానికి కారణం ఏమిటి  అని అడిగే లోగా, ఎవరో ఆమెను కాల్చి చంపేస్తారుఇక హత్యానేరం తనమీద పడకుండా తప్పించుకోవడం వీలైతే హంతకుల్ని పట్టుకోవడానికి ప్రయత్నమే నాటకం...

 
అద్భుతమైన విషయం ఏమిటంటే 
ఇందులో పోలీసులున్నారు, ముఠా మనుషులు ఉన్నారురైతులు ఉన్నారుహోటల్ సిబ్బంది ఉన్నారురైతు భార్య ఉందిఇలా 139 మంది ఉన్నారు.   కేవలం  నలుగురే నటులు,   ఆద్యంతము మీసాలు మార్చిమేకప్పులు మార్చి, దుస్తులు మార్చి, నటనను మార్చిమేనరిజాలు కొత్తవి నేర్చుకొని.. ఊపిరి నిలప కుండా రెండు గంటల సేపు  ఒక సాహస గాధ ని హాస్యస్ఫోరకంగా  రంగస్థలం మీద ప్రదర్శించారు...  ఇది ఒక అద్భుతంగార్డియన్ పత్రిక మాటల్లో చెప్పాలంటే clever, Very funny, imaginative, brilliantly enacted..
 
గొల్లపూడి వారికి  బాగా నచ్చిన ఐదు నాటకాలలో ఇది ఒకటి...
ఓపికగా చదివిన అందరికీ
 

కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి


తెలుగు తేనియలు సాహితీ మిత్రులకు నమస్సులు.
వారాంతపు సాహితీ పరిచయ కార్యక్రమంలో భాగం గా రోజు
 
అమరావతి కధలు పుస్తకం లోని
మట్టి ఒట్టి మట్టి కధ ను మీకు పరిచయం చేస్తాను.
 
రచయిత :సత్యం శంకరమంచి
 

అమ్మా తమ్ముడు మన్ను తినంగనే అంటూ మనం చెప్పుకొనే ఇతిహాస పద్యాల నుండి
మన్నుతో మన అనుబంధం పెనవేసుకు పోయింది.
 
మన బాల్యం అంటే మట్టిలో ఆడుకునే ఆటలు, అల్లరి గుర్తురాని వారు ఉండరు. కాలక్రమం లో మనలో చాలా మందిమి మట్టికి దూరంగా బ్రతుకుతున్నాము.
 
 అది మన ఊరి మట్టి కావచ్చు,
మన తొలి
అడుగుల
జాడలు
వెతుకుతూ
మన అమ్మలు మురిసిపోయే మన ఇంటి పెరటి
మట్టి కావచ్చు.
 
తొలకరి జల్లు పడగానే పుడమితల్లి పులకరించే మట్టి పరిమళం లాంటి
మట్టి కథలోకి వెళ్దాం రండి. అమరావతి వీధుల్లో అలా అలా తీసుకెళ్లారు
శంకరమంచివారు.
 
వీధిలో నడుస్తున్నాను
మట్టిలో నడుస్తున్నాను
దుమ్ము రేపుకుంటూ ,
ధూళి తోసుకుంటూ నడుస్తున్నాను.
 
ఆమట్టి .... ధూళి..... దువ్వ అందులో ఉన్నాయి లక్ష కధలు అందులో అణిగి మణిగి రేణువులై ఉన్నాయి కోటి బతుకులు.
 
దేవేరుల కధలు, దేవతల కధలువూళ్లేలినవాళ్ళ కధలు , ఊరేగినవాళ్ళ కధలు, అడుక్కుతిన్నవాళ్ల కధలు
అర్ధాకలిగాళ్ల కధలు,
అసలుతీరని కధలు, చెట్టుకొమ్మెక్కిన కధలు
నక్షత్రాలైన కధలు ,
పక్షి కధలు పావురాళ్ల కధలు అన్నీ మనుషుల గాధలే
ఎన్నో ఉన్నాయి
  మన్నులో.
 
మెత్తటి దుమ్ములో సన్నటి దుమ్ము కన్నీరు మున్నీరై పోతోంది. అక్కడే పిచ్చి పిల్ల ! జానకి ! తాను మనసారా వలచి తప్పక తాళి కడతాడని    నమ్మిన వయసుగాడు ఇంకొకరిని చేపట్టి పల్లకిలో ఊరేగుతూ వెళ్లిపోతుంటే చెట్టు చాటున నుంచుని చూసింది. పెన్నిధి తనకు దూరమైపోగా, కళ్ళు కరిగిపోగా జల జల రాలిన కన్నీళ్లు మట్టిలోనే ఇంకిపోయినాయి. ఇప్పటికీ తడియారని మట్టి అది. అంటుకుంటే  అన్నా! నా జోలి నీకేలా అని తన దుఃఖం లో మునిగిపోతుంది.
 
ముందు కెళ్తే ఉప్పర సంగడి గుడిసె. సంగడు పెద్దవాడై మంచంలో పడి ఉంటే కూతురు లచ్చి కూలి చేసి గంజి పోస్తోంది. గుడిసె సగం కూలిపోయింది.
సంగడు మట్టిలో పుట్టాడు మట్టిలో బతికాడు. మట్టిలో కలిసాడు.
ఊర్లో సగం ఇళ్ల గోడలన్నీ మూడొంతులు వాడి చేత్తో కట్టినవే! కానీ వాడి గుడిసె గోడ పడితే వాడు వేసుకోలేడు.
 
పైన అరవై ఏళ్ల కుమ్మరి సీతాలు కూడా మట్టి ఆంటే ప్రాణమే. గబ గబ కుండలు చేస్తోంది. చల్లటి కుండలు.... అన్నం వండుకునే కండలు,తిరగమోత కూరల చట్లు, పప్పుచార్లు, పాయసాలు, ఎంచక్కటి మూతలో.... కానీ ఇంత వయసొచ్చినా వరి అన్నం
ఎరుగదు సీతాలు. పక్కనే జ్ఞాన పలకలు...జ్ఞాన పలకలు బలపం పట్టుకుని
స్వాతి ముత్యాల్లా
ఓనమాలు దిద్దే పలకలు.
పెరిగి పెద్దయి మేధావులై, పదిమందిలో గొప్ప వారనిపించుకుని
పలకల్ని
సీతాలుని మర్చిపోయిన
అమ్మలారా
అయ్యాలారా మట్టి ముందుకు రమ్మంటోంది రండి.
అయ్య నాగలి భుజానికెత్తుకొని ఎదురొస్తున్నాడు. నేలని నమ్ముకున్న అయ్య! మనకి పెరుగన్నం, పాలబువ్వ అందించే అయ్య రెండు పూటలా సంకటే తింటాడు.
ముద్దలో నేతి బొట్టు ఎరుగడు. అయితేనేమి నడకలో ఠీవి, కళ్ళలో దీక్ష ఎక్కడనుండి వచ్చాయి. అయ్య నేల తల్లి కొడుకయ్యా! తండ్రీ నీ నాగలికి అంటిన మట్టి కాసింత  నాకియ్యవూ!
మట్టి పలుకుతోంది. మట్టి తుళ్లి తుళ్లి పడుతోంది. ఇది మహానుభావుల పాదాలు తాకిన మట్టి. బౌద్ధుల పావుకోళ్లలో దూరి పాదాభివందనం చేసుకున్న మట్టి.
కృష్ణ అవతల మట్టి, ఊరు నిండా మట్టి, యుగ యుగాల మట్టి.
మనం మట్టిని మార్చిపోతున్నామా? తమ్ముడూ చిన్నప్పుడు గుప్పెళ్లతో తిన్న మట్టి ఇదే! ఎంతో సాధించాం అనుకున్నాక వెళ్ళిపోతే మనం అయ్యేది మట్టే.
మట్టిని రేపుతాను... ఉవ్వెత్తుగా రేపుతాను.... కథల కథల మట్టి మనిషి మనుషుల మట్టిని తుఫానులా రేపుతాను.
ఇందులో దొర్లుతాను, వొళ్ళంతా విభూది పూసుకుని కళ్ళు విచ్చుకుని మట్టి కడుపులోకి చూస్తాను.
 
తల్లిని మర్చిపోతున్నార్రా చిన్నారులూ అంటోంది నేలతల్లి
మట్టిని మర్చిపోతున్నాం.
మనుషుల్ని మర్చిపోతున్నాం.
నాకు మట్టి పిచ్చి ఎక్కిందని తమరనుకోవచ్చు.
 
 నాలాగే మట్టి పిచ్చి నా తోడి జనులకు ఎప్పటికొచ్చునో! ఎప్పుడు నా వారంతా మట్టిని మట్టిలో మనుషులను కౌగిలించుకుంటారో! అంటూ ఎప్పుకో ఐదు దశాబ్దాల క్రితమే ఆక్రోశం వెలిబుచ్చారు
శంకరమంచి వారు. మరి ఇప్పుడుండి ఉంటే ఇంకెంత క్షోభించే వారో?
మట్టి తోటి అనుబంధం కనుమరుగైపోతున్న కాంక్రీట్ కారడవులను చూస్తే ఇంకెంత తల్లడిల్లిపోయేవారో కదా!
మట్టికి, మనిషికి,
మనిషిలోని మనసుకు దగ్గరగా వుండటానికి ప్రయత్నిద్దాం.
మీ విలువైన సమయాన్ని కధా పరిచయం చదవడానికి వెచ్చించి నందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు🙏
 

నాకు అప్పటి రోజులు తర్వాత మధ్యనే పరిచయం...అదీ తెలుగు గురించి వెతుకుతూ ఉంటే...
తెలుగు వాడు కాకుండా తెలుగు ని గుర్తించినది ఎవరా అని వెతికితే...
 డి కొంటి, శ్రీకృష్ణ దేవరాయలు తర్వాత ఈయనే....
సుందర తెలుగు అని బహుచక్కగా మెచ్చాడాయన...
చాలా సంతోషమేసింది....
ఆయన ఉద్యమకారుడు.. సంస్కర్త... కవి అన్నీను...
పాపం39 ఏళ్ళు మాత్రమే బ్రతికారు...
కాని ఆయన రచనలు మాత్రం ఇప్పటికీ జీవించి ఉన్నాయి...మహాకవి అని తమిళులు గౌరవించు కుంటారు...
నేను ఇప్పుడు పంచుకుంటున్నది భారత దేశం అనే రచన.
ఆయన భారతీయుల సమైక్యత పై ఎన్ని కలలుకన్నారో తెలుస్తుంది.
 
ఆయన రచనల తెలుగు సేత కు నేను చాలా వెతికాను.చివరికి నేనే దొరికిన ఇంగ్లీష్ అనువాదం ద్వారా తెలుగు లోనికి అన్వయించే ప్రయత్నం చేసాను.
మీ అందరి సలహాలు ఎప్పుడూ అమూల్యం.చదివి చెప్పండి‌.
 
భారత దేశం
రచన:శ్రీ సుబ్రహ్మణ్య భారతి
అనువాద ప్రయత్నం:కన్నాజీరావు
VeLLIp-pani malaiyin mIdulavuvOm aDimElaik-kaDal muzhudum kappal viDuvOm
Pallit-talamanaittum kOyil sheiguvOm engaL bhArata dEshamenru tOL koTTuvOm
 
భారతదేశమని పలుకగానే
బానిసత్వ భయం పటాపంచలవ్వాలి
బాధలూ పగవారూ పారిపోవాలి
 
వెండిమెఱుపు హిమాలయాల పై మనం విహరించాలి
మన ఓడలు విశాల సముద్రాలలో పయనించాలి
మనదైన విద్యాలయాలు ఆలయాలు కావాలి
ఱొమ్ము విరిచి  భారతావని మనదేనని చెప్పాలి
 
Sindhu nadiyen misai nilavinilay
Sera nan nattilam pengaludaney
Sundara telunginil paatisaithu
Thonigal ooti vilai yadivaruvom
 
సింధూనది అలలపై చంద్రకాంతి లో
చెంత కూడి సాగెదమా చేరదేశ కాంతలతో
తెలుగు పాటల జిలుగు క్రాంతులతో..
నావలో తిరిగెదమా తూగులాటలతో
 
Gangai nathipurathu kodumai pandam
Kaveri vetrilaiku maaru kolvom
Singa maratiyar tham kavithai kondu
Serathu thanthangal parisalipom
 
గంగాపరీవాహ  గోధుమ మధురిమలకు
కావేరి గంధముల తాంబూలములందిద్దామా?
మరాఠి కవిసింగాల అభంగ ఝరులకు
మలబారు కరిదంత నగిషీలద్దెదమా?
 
Singala  theevinukor  paalam  amaipom
Sedhuvai  meduruthi  veedhi  samaippom
Vangathil  odi  varum  neerin  migaiyaal
Vaiyathu  naadu galil  payir  seiguvom
 
భారత సింహళ  సౌభ్రాత్రమునకు
సేతు సముద్రపు స్నేహబంధనం వేద్దామా
వంగదేశపు వఱద జలములను తెచ్చి
 వలసినచోటున వరదలా సేచన చేద్దామా
 
kAsinagarp pulavar pEsum urai tAn
kAnjciyil kETpadaRkOr karuvi seyvOm..
rAjapUtAnattu vIrar tamakku
nalliya kannadattu tangam aLippOm'
 
వారణాసి వేద నాద ఘోషల వెల్లువ వచ్చి
కంచిలోన  కర్ణపేయమయ్యే మార్గం చూద్దాం
రాజపుత్ర శూరుల వీరధీరత్వానికి
కన్నడ కోలారు బంగరు శోభలద్దుదాం
 
భారతదేశమని పలుకగానే
బానిసత్వ భయం పటాపంచలవ్వాలి
బాధలు పగవారు పారిపోవాలి...
 
విశ్వనాథ వారి రచనలు రెండు రోజులుగా శ్వాశిస్తూ  ఉండటం వల్ల...
చిన్ని వేదాంత పరమైన ఉదంతం జ్ఞప్తికి తెచ్చుకొని మీతో పంచుకో డానికి సాహసిస్తున్నాను.
 
తప్పులున్న,   పెద్దలు  మన్నించాలి.
 
 
విశ్వనాథవారు తెలుగు లో రచించని ప్రక్రియ లేదు. (వచనం తప్ప)
వచనాన్ని అసలు వారు కవిత్వం గానే పరిగణించే వారు కాదుట.
 
"విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు" లో హాస్యాన్ని జోడించి, ఆనాటి సమాజానికి దర్పణం చూపెట్టెలా రాసిన వైనం అపూర్వం.
 
1960 లోనే అసలు ఇంగ్లీషు భాషలో ఉన్న లొసుగులు, భాష యొక్క అసంపూర్ణత వివరించారు. అటువంటి వారు వేదాంత సారమైన ఉపనిషత్ సారాన్ని ఎలా అలవోకగా ఒక సందర్భం లో విశదీకరించారో చూడండి.
 
"కావ్యానందం" లో  ఆయన రాసిన ఒక వాద ప్రతివాదం నన్ను చాలా ఆకర్షించి, ఆలోచింపచేసింది.
 
దాని గురించి ఇక్కడ మీతో పంచుకుంటా.
 
వాదన విషయం :
 
జీవునిలో మరణం సంభవించే క్రమం
చందోగ్యోపనిషత్     ప్రకారం
వాక్కు మనసును,
మనసు ప్రాణమునందును,
ప్రాణము తేజస్సునందును,
తేజస్సు పరదేవతయందును
విలీనము అవుతుంది.
 
ఐతే
క్రమం సామాన్యుడికీ,
విద్వాంసుడికీ సమానమా కాదా అని చర్చ!
కావ్యానందం సరాసరి జీవుడ్ణికదా చేరేది...
జీవుడు ఎలాంటి జీవుడు?
విజ్ఞానాత్ముడైన జీవుని పొందుతుంది
తాత్విక దర్శనం ప్రకారం జీవుడు "అవిద్యా కర్మపూర్వోపజ్ఞుడు"
 
అంచేతనువ్వు చెప్పేది పొసగదన్నాట్ట తాత్విక వేత్త... మన విశ్వనాథ తో
ఐతే మన విశ్వనాధుడు ఏమీ తక్కువ తినలేదు. మాకు(విద్వాంసులు) పొసగకపోతే యోగులకూ పొసగదు అన్నారుట.


అని ఇంతకీ మాకు ప్రాణనిష్క్రమణతో పనిలేదు.
వాక్కు,ప్రాణం వరసలో ఒకదాన్నొకటి చెందుతున్నాయంటే అవి స్థబ్దం అవుతున్నాయేకాని పూర్తిగా నశించలేదు.
ఆఖరున వాక్కు జీవుని పొంది బ్రహ్మానందంలాంటి కావ్యానందం పొందుతున్నామని చెప్పి ఈయన ముగించారుట వాదన.

 

మాకు(విశ్వనాథ సార్వభౌములకు) పొసగక పోతే యోగులకు కూడా పొసగదు అన్నమాట నూటికి నూరు పాళ్ళు నిజం.
సంప్రదాయం తెలిసి సనాతన ధర్మం, వేదం ఊపిరిగా బ్రతికిన బహుకొద్ది మంది విద్వాంసుల లో బహు దొడ్డ వారు శ్రీ విశ్వనాధ వారు
 
ఝాన్సీ

***********

 

ఈ రోజు "మనసు కవి" ఆత్రేయ గారి వర్థంతి

 



రమ, కంకిపాడు.


శ్రీ సుబ్రహ్మణ్య భారతి గురించి మనం ఏదో   పాఠంగా లేక చరిత్రలోనూ అదీ కూడా చాలా తక్కువ చదివామేమో....

 

నదులు అనుసంధానం,దేశరక్షణ,వ్యాపారవాణిజ్యాల, దేశాలతో సంబంధాలు అనేక విషయాలపై ఆయన దూరదృష్టి కూడా కనపడుతుంది.

 

BhArata dEshamenru peyar sholluvAr miDi bhayam kolluvAr tuyar paghai velluvAr

**********

 

 

హాస్యమందున అఋణ

అందె వేసిన కరుణ

బుడుగు వెంకటరమణ

కూనలమ్మా... ఆరుద్ర

 

పుస్తకం : బుడుగు

రచన : ముళ్ళపూడి వెంకటరమణ

సమీక్ష : వేదాంతం  విష్ణుప్రియ

 

" భూమ్మీద ఎదుటి వాడి నుంచి కృతజ్ఞత ఆశించేకన్నా రాజకీయ నాయకుల్లో ఐకమత్యాన్ని ఆశించు" అని తనురాసిన ఒక కథలో సెటైర్ వేసి తెలుగువాడి చమడాలొలిచిన వ్యక్తి ముళ్ళపూడి వెంకట్రావ్ ఉర్ఫ్ ముళ్ళపూడి వెంకటరమణ ...ఆయన పని నవ్వడం నవ్వించడం, నవ్వేవాడు ఎలాగూ నవ్వుతాడు, ఏడ్చేవాడిని కూడా నవ్విస్తాడీయన....

 

            హాస్య పరంపర 1945 లో "బాల" అనే చిన్న రచనతో ఓంకారం రాసి 1950 నుంచి పూర్తిగా అంటే గట్టిగా దీక్షగా రాయడం మొదలుపెట్టారు.. ఇంకా ..ఆయన వివరాల్లోకి  వెళ్లామనుకోండి పట్టాన వదలడు దా పిల్లా కూర్చో అని మేడ మీద మడత మంచమేసి, పొగబండి వదులుతూ తానుపుట్టిన  ధవళేశ్వరం నదిలో మూడు మునకలేయించి మద్రాసులో వాళ్ళ ఇంట్లో తేలుస్తాడు... ఆయన గురించి సెపరేటు గా మాట్లాడుకుందాం..

 

ఇక మన హీరో దగ్గరికి వచ్చేద్దాం , మహ పెద్ద హీరోలెండి గట్టిగా 7 ఏళ్ళు దాటి ఉంటాయి మిసిమి వాడు పసిమి వాడు ..చిన్నవాడు చితకవాడు కాని గొప్ప హీరో గారు అప్పుడప్పుడు జెటకా వాడు, అప్పుడప్పుడు అలాడీన్ , అప్పుడప్పుడు అందరిని రష్చించే అవతారాలెత్తే హీరో గారి పేరే "బుడుగు" గారు, అసలు పేరు వాళ్ళ నాన్నని అడగాలిట !!

 

అసలు కథా కమామీషు ....

 

బుడుగు గారి చిన్ని పెపంచకమ్ లో అమ్మా రాద- నాన్నగోపాళం , వీడికొక పెద్ద బామ్మ , రెండు జెళ్ల సీతని ,అప్పుడప్పుడు సుబ్బలక్ష్మి ని ప్రేమించే ఫోకిరివాడు లాంటిబాబాయ్ ,ఇంకా లావుపాటి పక్కింటి పిన్నిగారు , పిన్ని గారి ముగుడు ..... హీరో గారి గర్లు ప్రెండు పేరు.. సీ.గాన పెసూనాంబ !!

 

అప్పుడప్పుడు చదువుకుంటూ మేష్టారువాడు చేత టెంకి జెల్లలు, మొట్టికాయలు తింటూ ఉంటాడు ,కానీ దెబ్బలు తినడం లో ఈయనకి కొన్ని అభిప్రాయాలున్నాయ్, చెవి ని ఎలా పడితే అలా తిప్పకూడదు , చిన్నవాడినా చితకవాడినా అని మేష్టారినే జాటర్ఢమాల్ అని కోప్పడేస్తూ ఉంటాడు, తర్వాత బామోయ్ అని ఏడుస్తూ ఉంటాడు అప్పుడు వాళ్ళ బామ్మ చేత మేష్టారికి అర్జన్ట్ గా ప్రైవేట్ చెప్పించేస్తాడు !!

 

          పెద్దయ్యాకా ఎలాగైనా జట్కాబండి కొనుక్కుని దానిని నడిపేసి పెద్ద రైల్ ఇంజన్ డ్రైవర్ అవ్వాలని కోరిక అందుకే అప్పుడప్పుడు అర్ధనా కాణీ సంపాయిస్తూ ఉంటాడు. జటకా బండి నడిపేవాడి చెవిలో బీడీ ఉండాలి కాబట్టి ముందస్తుగా నాలుగు బీడీ లు వెనకేసి ఉంచుకున్నాడు!!

 

ఇక వీడి దృష్టిలో వీడి అమ్మకన్నా అందగత్తె లేనే లేదు వీళ్ళ అమ్మ అప్పుడప్పుడు వీడిని వెర్రి నాగన్నా అంటుంది, అప్పుడు బాగా ఇంసల్టు ఫీలవుతూ ఉంటాడు , మరి చిన్నవాడా చితకావాడా!! అమ్మని ఏడిపించడం వీడికి ఇష్టం ఉండదు , అమ్మ ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి , నాన్న అమ్మని ఏడిపిస్తే నచ్చదు !!

 

     హీరో అప్పుడప్పుడు బాబాయ్ ని రష్చిస్తూ ఉంటాడు , ఒకరోజు బాబాయ్ ఉత్తరం లా ఉండే లవ్ లెట్రు రెండు జెళ్ల సీతకిమ్మని పంపితే పట్టుబడిన హీరో వాళ్ళ బాబాయ్ ని రష్చిద్దామని లెటర్ తానే రాసానని పెద్ద నింద తనపై వేసుకుంటాడు త్యాగజీవి.. తర్వాత వాళ్ళ నాన్నకి నిజం తెలిసి పోయి అందరికీ  ప్రయివేటు చెప్పించేస్తాడు. అప్పుడు బాబాయ్ కి సీత కి పెళ్ళి చేద్దామనే నిర్ణయానికి పెద్దరికం వహిస్తాడు

 

వీడొక సారి వాళ్ళమ్మతో ఆడవాళ్ళ పెట్టె ట్రైన్ లో ఊరెడుతుండగా వాళ్ళమ్మ తో పాటూ  పక్కన  ఉన్న ససి ని కూడా రష్చిద్దామనే పెద్ద బాధ్యత నెత్తిన వేసుకుంటాడు , కానీ ససి వీడిని ఖాతరు చేయక మొగుడుతో వెళ్ళిపోతుంది... అప్పుడు బుకురుకుగుకు కి సీ.గానపెసూనాంబ తో పరిచయం ఏర్పడేస్తుంది.. అప్పటి నుంచి ఎలాగైనా జటకాబండిలో తాను, పెసూనాంబ కలిసి సినిమాలకి షికారులకి వెడుతున్నట్టు ఊహించుకుంటూ ఉంటాడు.

 

కొత్త సమస్తరం లో అప్పుడప్పుడు పండక్కి హీరో గారు వినయంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, బామ్మ డబ్బులడిగితే గోళీలు కొంటుందే తప్ప జెటకా అడిగితే వెర్రి వెధవ అని తిట్టేస్తూ ఉంటుంది, అమ్మనడిగితే బుగ్గ గిల్లుతుంది అందుకే నాన్న, పిన్నిగారి ముగుడు గారు సిగరెట్లు కాలిస్తే నిజం చెప్పకుండా కాపాడేసి డబ్బులు సంపాయిస్తూ ఉంటాడు , జెట్కా కొనుక్కోవాలి గా..

 

పిల్లల పెంపకం విషయం లో కూడా కొన్ని సలహాలు ఇస్తూ ఉంటాడు .కొన్ని అంటే ఎన్ని అని అడగకూడదు, ఒకటి ,ఇంకోటి, మరోటి ఇలాంటి లెక్కలు లేదా ప్పది , ముప్పై వరుస ఉంటాయ్...

అప్పుడప్పుడు నాన్నతో ఆఫీసు కి వెళ్లి వాళ్ళ విగ్గులేని ఎముడితో ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు , కావాలంటే లావుపాటి పక్కింటి పిన్నిగారి సవరం ఇస్తానని మాట కూడా ఇస్తాడు..

 

పక్కింటి పిన్నిగారేమో వాళ్ళింట్లో కాఫీ అయిపోతే ఇక్కడ ఇంటికొచ్చి బామ్మ దగ్గర భోరున ఏడ్చి బోలెడు కాఫీ తాగేసి వెళ్ళిపోతుందని బుడుగు అభిప్రాయం.

 

బుడుగుకి బడి ఎగ్గొట్టడానికి బోలెడు సలహాలు ఇస్తూ ఉంటాడు .కలుపునొప్పి అని చెప్పాలి ,కుదరకపోతే ఎండలో నుంచుని జొరం అని చెప్పాలి , బామ్మలు నమ్మరు , చిన్న పిల్లలు అబద్ధం చెప్పకూడదని లాస్ట్ లో రియాలైజేషను ఉంటుంది.

 

వాళ్ళ నాన్న చెప్పిన అలాడీన్ కథలో ఆయనే హీరో.,

అయినా సరే మేష్టార్లతో వేగడం కష్టమని తన ఫీలింగ్..

 

చదువు అంటే పదమూడో ఎక్కం రావడం...అవి నేర్చుకుంటే రాచ్చసులు పారిపోతారు, సీ గానపెసూనాంబ ని పెళ్ళి చేసేసుకోవచ్చు..

దానికొక ఖద...

అనగనగా...

పదమూడో ఎక్కం చెప్పి రాచ్చసుడి నించి సీ.గాన పెసూనాంబ ని కాపాడేసాను అన్జెప్పేహేసి ఫ్రెండ్ కి గీత బోధ చేసి రాచ్చసుడు సీతను కాపాడమంటాడు...ఎక్కాల పుస్తకం లోని 13 ఎక్కం తీసుకొస్తే మంత్రంవేసి నేర్పిస్తానని చెప్పి....

గోపి గాడొచ్చేదాకా మనం ఎదురుచూస్తే ..బువ్వ తినొద్దా ???

 

ఇలా నా చేత కంగాళీగా రాయించేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టించేసిన మన బుడుగు గారి పేరు...."శంకరం" ...ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న  నా ఫ్రెండ్స్ కాబట్టి.. నాకు తెలిసిన బుడుగు కన్నా నేను రాసిన బుడుగు ఒక వంతే అన్ని విషయాలు తెలియాలంటే ఆయనతో మీరే డైరెట్టు మాట్లాడేసేయండి.

 

 

అందరికీ నమస్కారం.

రేడియో అన్నయ్య-రేడియో అక్కయ్యగా  వినుతికెక్కిన

న్యాయపతి రాఘవరావు, న్యాయపతి కామేశ్వరి పుణ్య దంపతుల గురించి

ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న అరవై దాటిన తెలుగు బాలలకు

బాగానే పరిచయం ఉండే ఉంటుంది.

వీరు అలనాటి మదరాసులో  ఆకాశవాణిలో పని చేస్తూనే 1940లో

ఆంధ్ర బాలానంద సంఘాన్ని స్థాపించి

తెలుగు పిల్లల సర్వతోముఖాభివృద్ధి కోసం ఎంతగానో తోడ్పడ్డారు

తదనంతరం 60 దశాబ్దంలో తెలుగు రాష్ట్రం ఏర్పడ్డాక,

మదరాసు ఆంధ్ర బాలానంద సంఘాన్ని మరొకరికి అప్పజెప్పి

హైదరాబాదులో స్థిరపడి పిల్లల కోసం అన్ని రకాలుగా ఎంతగానో

తోడ్పడ్డారు. వారివురూ పరమపదించాక, రేడియో అక్కయ్యగారి

మేన కోడలు  శ్రీమతి జంధ్యాల కామేశ్వరి గారు (పాపక్క)

బాలానందం బాధ్యతలను తమ భుజాలపై ఎత్తుకుని ఎనలేని కృషి చేస్తున్నారు.

2020 ఫిబ్రవరి 10 తేదీన బాలానందం 80 ఏళ్ల పండుగ సందర్భంగా

రవీంద్ర భారతిలో వేడుకలు అబ్బురంగా జరిగాయి.

అందులో భాగంగా వారి శిష్యకోటిలో ఒకడైన

 అత్తిలి అనంతు  ప్రదర్శించిన "పిల్లల దేవుళ్ళు"

డాక్యుమెంటరీని  మీరూ తిలకించి, కాస్సేపు బాలానందులైపోండి.

 

 అత్తిలి వెంకట అనతరామ్

************************************

 

తేటగీతి

లోకమునకు వెలుగునిచ్చు లోకసాక్షి!

వేయిచేతుల సామి! వేవెలుగు! జ్యోతి!

తిమిరమును తొలగించెడి దినకరుండ!

వందనంబు మార్తాండ! ప్రభవమునిమ్ము

 

వెంకట్ సి.హెచ్


మంచి పాట

 

హలమును భుజము కెత్తి పదరా

నేలను ఎదకు హత్తుకుని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా

పదర పదర పదరా

వెలుగను పలుగు దించి పదరా

పగుళ్లతో పనికిరానిదను బ్రతుకు భూములిక

మెతుకులిచ్చు కదరా

 

ప్రతొక్కరి కథవు నువ్వు కదరా

నీ ఒరవడి భవిత కలల ఒడి

బ్రతుకు సాధ్యపడు

సాగుబడికి బడిరా ..


అమరావతి కథలు - తులసి తాంబూలం

 

భగవంతుని ఆరాధనలో నిమగ్నమై తమ బ్రతుకును వెళ్లబుచ్చే ఆది దంపతులు వామనయ్య దంపతులు.  ఎవరికైనా నాలుగు వేళ్ళు నోటిలో కి వెళ్ళడానికి తాపత్రయం. కూటి కోసమే కోటి విద్యలు కదా....

 

పాపం పూట గడవడానికి వామనయ్య పడ్డ తాపత్రయం కళ్ళలో నీళ్లు తిరుగుతాయి....కొన్ని సార్లు మనం కూడా గుడిలో యాత్రికుని వలే ప్రవర్తిస్తాము కదా అనిపిస్తుంది.  ఇలాగ పూటలు గడవని కుటుంబాలు ఎన్నో...ఎన్నెన్నో.... గోపాలస్వామి కే ఎరుక...కాదు వేణు గోపాల స్వామే... వారికి రక్ష ....తులసి తాంబూలం ఎటువంటి వారికైనా కడుపు నిమ్పేనే, నోరు పండించేనే.....

 

జయహో అమరేశ్వరా ....జయహో సత్యం గారూ...

 

అమరావతి కథలు - భోజనచక్రవర్తి

 

అప్పంభొట్లు మల్లె సుష్టుగా భోజనం చేసే వాళ్ళను చూస్తే బహు ముచ్చటేస్తుంది తృప్తి గా పెట్టగలిగిన అమ్మలకు...కంది పచ్చడి, ఆవకాయ, గోంగూర, మజ్జిగ, రొట్టె ముక్కలు, మాగాయ, మెంతికాయ, ముక్కల పచ్చడి, పప్పులో కలుపుకొని తినడం, చింతకాయ పచ్చడి, పెరుగు, ఉసిరికాయ పచ్చడి....అబ్బబ్బ  కడుపునిండా భోజనంచేసినా కానీ మళ్ళీ ఆకలేస్తుంది ఇవన్నీ వింటూ ఉంటె...  సూరమ్మ లాంటి అన్నపూర్ణ తల్లులు తృప్తిగా భోజనం చేసే వాళ్ళను చూసే కడుపు నింపేసుకుంటారు కదా...

 

భోజనం చేసిన కృతజ్ఞత చాలు అప్పంభొట్లు లాంటి వాళ్లకు. పనైనా పురమాయించక ముందే మీదేసుకొని చేస్తారు...

 

అబ్బబ్బ అవడల గురించి వర్ణన.....నోట్లో నీళ్లూరక మానదు 

 

అయినా అప్పంభొట్లులాగా తిండి పుష్టి గల వాళ్ళు దొరకడం, వారికి వండి వడ్డించగలగటమూ కూడా అదృష్టమే కదా.....

 

జయహో అమరేశ్వరా ....జయహో సత్యం గారూ...

 

అమరావతి కథలు - నావెళ్లిపోయింది

 

కృష్ణమ్మ వొడ్డున పడవలనే నమ్ముని కుని ఉండే వారి జీవన శైలి ఇలానే ఉంటుందేమో..

 

శైవ వైష్ణవ బేధాలు జ్ఞానం ఉన్న వాళ్ళకే గాని,రంగయ్య లాంటి వాళ్లకు దేవుడు ఒక్కడే.. రంగయ్య పడవ నడిపే వాడు అయినా, బాగా కలుపుగోలు వాడు. పడవనెక్కి ప్రతి వాళ్ళను ఎదో ఒక పలకరింపు చేయక మానడుఅది కొత్తగా పెళ్లయిన జంట నైనా,వ్యాపారం చేసుకునే ఆసామినైనా... పడవలోని జనం నవ్వులూ, కన్నీళ్లూ పంచుకోవడమే అతని పనిఅంత కష్ట పడే వ్యక్తి బాధ్యతగా తన తండ్రి బాకీ తీర్చడం కూడా చూస్తే ఎంతటి నీతివంతమైన బ్రతుకు బ్రతకాలో సత్యo గారు చెప్పకనే చెప్పారు.

 

అమరేశ్వరుని లీలలు ఎవరికెరుక..బలమున్నోడిదే రాజ్యం, బలహీనుడికి కష్టం తప్పదా ఎప్పటికీ....

 

జయహో అమరేశ్వరా ....జయహో సత్యం గారూ...

 

అమరావతి కథలు - నీరునిలవదు

 

ఏమి సహజమైన వర్ణన....కృష్ణమ్మ నల్లటి చీరకు పువ్వులు పువ్వుల అంచులా వొడ్డునిండా ఆడవాళ్ళ వరుస... ఆడాళ్ళ మాటలు... ఊళ్ళో ఎవరిని వదలరు కదా..

 

వార్త ఒకరి నుండి మరొకరికి మారుతూ ఎలా రూపాంతరం చెందుతుందో చక్కగా వివరించారు...

 

కృష్ణమ్మా ఎన్నెన్ని కధలు విన్నదో, వింటోందో, వినబోతోందో.... కథ కబురూ నిల్వ ఉండదు...రుచే మిగులుతుంది.

జయహో అమరేశ్వరా ....జయహో సత్యం గారూ...

అమరావతి కథలు - ఎంగిలా?

ఆకృష్ణమ్మ ఎవరికైనా ఎలాంటి జ్ఞానోదయమైనా కలిగిస్తుందిలే.... మీరే చదవండి....

జయహో అమరేశ్వరా ....జయహో సత్యం గారూ...

అమరావతి కథలు - బాకీసంతతి

ఆసాముల కాఠిన్యాన్ని ఎలా చూపించారో కథలో... పెత్తందారీ వ్యవస్థ ఉన్నంత కాలం ఇలాంటి రంగయ్యలు బలి అయిపోతూనే ఉంటారు వాళ్ళ తర తరాలు భూస్వాములకు ఊడిగం చేస్తూ కరిగి పోతూనే ఉంటారు...ఇప్పటికీ పల్లెల్లో వ్యవస్థ మారలేదా.. ఏమో....

 

జయహో అమరేశ్వరా ....జయహో సత్యం గారూ...

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి, మహారాష్ట్ర


 "వానప్రస్తపు వాకిట్లో.."

 

అప్పటి ఆకర్షణ ఇప్పుడు మాలో లేదు..

అందరూ మా దరికి చేరిపోవడానికి..

మునుపటి ఉత్సాహం ఇప్పుడు లేదు..

అందరినీ ఊసులతో అలరించడానికి..

 

ముందు కాలపు అంద చందాలు

మచ్చుకైనా ఇప్పుడు లేవు

అందరిని చూపులను ఆకట్టుకోవడానికి..

 

అప్పటి సువాసనలు ఇసుమంతైనా లేవు..

నలుగురూ మమ్మంటి ఉండిపోవడానికి..!

మాతో అవసరాలు ఇప్పుడెవ్వరికీ లేవు..

ఇంకా మా గురించి ఆలోచించడానికి !

 

ఎగిరెగిరి అలసిన ఆశల రెక్కలను

తీరిగ్గా ఆరపెట్టుకుంటున్న వాళ్ళం!

 

ఎవరి స్పర్శకు నోచుకోని వాళ్ళం..

ఎవరి చూపులను అందుకోలేని వాళ్ళం..!

నిరాశ, నిసృహలనే  ఉఛ్వాస నిశ్వాసలుగా

మలచుకుంటూ..

 

చిరుగాలి సవ్వడికే ఉలికిలికి పడుతూ..

నేలతల్లి చిట్టచివరి పిలువు కోసం

ఆశగా నేల చూపులు చూస్తూన్నవాళ్ళం

 

 

జీవితం పూల మొక్కల రెమ్మలనే

ఆంటి పెట్టుకుని

ఇంకా వేళ్లాడుతున్న  వాడిన పువ్వులం..!

రాలిపోయేందుకు సిద్ధంగా ఉన్న వాళ్ళం!

 

ఆరుతున్న వెలుగులం!

వెలిసిన రంగులం..!

చెదిరిన నవ్వులం..!

మేం ..మొన్నటి పువ్వులం..!

 

దేవుని ఒడి కి చేరలేకపోయినా..

సహృదయుల గుండెనీ తాకలేని దీనులం..

అదృష్ట హీనులం..!

 

చేసిన పాప కర్మలను లెక్కవేసుకుంటూ

పశ్చాత్తాప భాష్పజలాలతో

ప్రతి క్షణం మమ్మల్ని మేం ప్రక్షాళన చేసుకుంటూ..

 

అందరి మధ్యనే జీవిస్తూ..

ఏవరికీ కానరానంత దూరంగా బతుకీడుస్తూ

ప్రస్తుతంలో  మేం!

 

" వసుధ"



ఆచార్య ఆత్రేయగా సినీరంగ ప్రవేశం చేసిన కిళాంబి వెంకట నరసింహాచార్యులు గారు (మే 7, 1921 - సెప్టెంబర్ 13, 1989) తెలుగులో నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత, దర్శకులు. దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన కవి.

ఆత్రేయ గారి స్మరణ:

 

#సేసలు

 

కొన్ని కొన్ని మనకు తెలియకుండానే తెలుస్తూ ఉంటాయి...

మొన్న పేరడీ తయారు చేసానా!పాడుతున్నపుడు నాతప్పులు బయటపడ్డాయి.

 

"ముద్దబంతి పువ్వులో" పాట తెలిసిందే.... చిన్నప్పటి నుంచి విన్నదీ... పాడుకుంటున్నదే కదాని...మరీ డీప్ రిసెర్చ్ చెయ్యకుండా నే రాసిన #పేరడి పాడేద్దామని మొదలు పెట్టా....మొదటి చరణం లో తడబడ్డా మళ్ళీ ప్రయత్నించి ముందుకెళ్ళా....రెండవచరణంలో 'కరాఒకే' ...ఓకె కాదు కుదరనంటోంది....ఏంటా అని ఆలోచించా, అప్పటికీ నా ఇగో ఆలోచిస్తుంది....చివరికి కుదరక దిగి వచ్చి.....మూగమనసులు పాట పెట్టుకు విన్నాను.... అప్పుడు తెలిసింది రెండో చరణం మొదటి చరణాల మధ్య తేడా.... దాంతో నేనేసుకున్న పేరడీ పదాలు కలవటం లేదు....ఏమిటా అని సారి #ఆత్రేయ గారి పదాలవంక ఆత్రంగా చూసా.....మహానుభావుడు ఎంత చక్కటి, అతి సామాన్య పదాలతో చిక్కటి పాట అందించారో....పాట మొత్తం చదివేసి వినేస్తే అంతా అర్థం ఐంది... తాత్పర్యం తెలిసిపోయింది....కానీ ఏదో ఎక్కడో సరిగ్గా తగలడం లేదు...పదం పదం జరిపి వెదికాను...మళ్ళీ రెండో చరణం దగ్గర ఆగింది.... తెలియని పదం తెలిసినట్టే నిలబడి ఉంది...

 

"సేసలు"....

ఇంతకు ముందు విన్నట్టు గుర్తులేదు ... అర్థం తెలీదు....

ఈయన పాటలలో ఇంద్రజాలం అదే...భావం దానంతటదే తెలిసిపోతుంది...అదే ఆయన గొప్పతనమేమో...

మరి ఆంధ్ర భారతిని కదిపాను....

సేసలు అంటే....

 అక్షతలు...తలఁబ్రాలు....

సేస అనేది శేష కి వికృతి కావచ్చు- ఎందుకంటే దేవునికి నివేదించి ఇచ్చేది-పవిత్రమైనది  'శేష'మంటారట.

ఉదా:శేష వస్త్రాలు

 

ఇక్కడ ఇంకొకటి మనం వాడే తలంబ్రాలు తప్పనొచ్చో, వాడకంలో అలా మారిందో   తెలియదు కాని- అసలు పదం తలఁబ్రాలు- ప్రాలు అంటే బియ్యం.

తలన్-ప్రాలు చాలా వాడకంలో ఉంది-ముఖ్యంగా మీడియా లో....

న్యూస్ పేపర్లలో చాలా సార్లు చూసాను- మీరు చూసారా?....లేదా??

నెత్తిన పాలు పోసినట్టు ...అద్గది....ఎవరికైనా ఇంకొకరివలన మంచి జరుగుతుందని, శుభం జరుగుతుంది అనే సందర్భంగా వాడకం చూసాను.

ప్రాలే ...పాలైయ్యాయన్నమాట....తలఁబ్రాలు మరి వాడేది శుభానికే కదా?!

నా అభిప్రాయం అన్నదే ఖాయం కాదు...నేను తెలుసుకున్నది చెప్పాను.

 

ఇంకా పెద్దలు  ఏమైనా వివరణ తెలిస్తే.. ఇంకొంచెం వివరించగలిగితే వారికి స్వాగతం.

 

భవదీయుడు: కన్నాజీరావు

*********************************


తరంగాలు

 

చిరుగాలి కబురందిస్తావా

నా చెలికి

అక్షరాలలో లిఖించిన

మధుర జ్ఞాపకాలు

ఎదను మీటీన వీణాతంత్రుల

శబ్దభేరీలు

లిప్త కాలంలో

నిక్షిప్తమైన చందన సమీరాలు

జారిన చేవ్రాళ్లు

జాబిలమ్మపై సంతకాలు

ఆకాశ మేఘాల

తమకపు కబురులు

నెమలి నృత్యాల

ఆశల సౌధాలు

చెలియ సొగసులు

సాగర సమీరాలు

వేకువ కాంతల

వెలిగే కాంతులు

సాగే కాలప్రవాహాలు

ఎదురీదే నవ్య తరంగాలు

 

కోవూరి

******** 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...