19, సెప్టెంబర్ 2020, శనివారం

రచనలు, సమీక్షలు , 19.09.2020

 


సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం

నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చల తత్వే జీవన్ముక్తిః...

 

  ****************** 

 

శీర్షిక:-(ఇంకా పేరు పెట్టలేదు)

రచన:-సూర్యతాడిపూడి.

విషయం:-లవ్ స్టొరీ

 

అడుగులు వేస్తూ అప్పుడే బయటకి అడుగు ముందుకేసింది స్కూటీ వైపు ఊహ. తెల్లటి షేర్వాణీ దుస్తులు ధరించి అప్పుడే  బయటకి వచ్చిస్కూటీ స్టార్ట్ చేసింది. రోజు హొలీ.

షాప్ కి అని బయలుదేరిన ఊహ అటుగా పార్క్ పక్కాగా వెలుతోంది.

అప్పుడే ఎదురయిన అభి  రంగులు జల్లుతూ తన చెల్లెలు, ఫ్రెండ్స్ తో పరుగెడుతూ వస్తున్నాడు అభి.

ఊహ.. అభి..  ఇద్దరికి మధ్య ఒక్క మల్లెపందిరికున్న  దూరంలో రంగులు జల్లుకుంటు వస్తున్నారు.

ఒక్కసారిగా  అభి ఊహను చూసి ఆగిపోయాడు.

ఎప్పుడూ చూడని తన కళ్ళు కడలి వైపు పరుగెడుతున్నట్టు...

కళలకు జీవం పోసిన తన రూపం చూసి తన రంగుల కల ఏదో తన ముందే సీతాకోకచిలుక లా వాలినట్టు... మెరుపులు మెరుస్తుంటే తన చెక్కిలి నవ్వులు పువ్వులై పూస్తున్నట్టు... హీరో అభి కి

తనని చూడగానే అలా అనిపించి. శిలలా ఐపోయాడు.

పరుగులు తీస్తున్న తన కాళ్ళు ఆగేసరికి తన గుండె వేగం పరిగెడుతోంది....

తనను క్రాస్ చేసి  వెళ్లిన ఊహ ఒకప్పటి తన జూనియర్.

అప్పటికి ఇప్పటికి చాలా మార్పు,అప్పుడు చూసిన ఊహ తినేనా...

అందమైన రూపం. తన నవ్వు...

రోజు కాలేజీ కాంటీన్ లో జరిగిన విషయం ఎప్పటికీ మర్చిపోలేదు అభి.

చాయ్ కోసం వెళ్తే చాక్లెట్ ఎదురైంది అంటూ సెటైర్ వేసిన అభికి చుక్కలు చూపించిన శివంగి. ఊహ...

చాలా స్ట్రాంగ్ పర్సన్ ఆమె.

చదువులోనే కాదు తెలివితేటలలో కూడా ఆమె చాలా స్ట్రాంగ్....

చూడగానే అక్కడ పడిపోయాడు అభి ప్రేమలో....

రోజు తను వచ్చే సమయానికి ముందే వచ్చి కాలేజ్ లైబ్రెరీ లో పేపర్ చదువుతూ ఒక్కడే కిటికిలోనుంచి తొంగి తొంగి చూస్తున్నాడు... ఊహ కోసం.

ఇంతలో రవి వచ్చి ఒరే బావ నిన్ను మొన్న ప్రిన్సిపల్ రూమ్ లో బ్యట్ ఆడిన అమ్మాయి గ్రౌండ్ లో తన ఫ్రెండ్స్ తో కూర్చుని వర్క్ రాస్తోంది అని చెప్పడంతో

సైలెంట్ అంటూ లైబ్రేరియన్ సార్ చెక్క ముక్కతో టేబుల్ పై గట్టిగా కొట్టాడు.

గేటౌట్ బొత్ ఆఫ్ యూ... అనేసరికి ఇద్దరు సైలెంట్ గా బయటకి వచ్చి పరుగులు పెట్టారు గ్రౌండ్ వైపు.

అక్కడ కూర్చున్న ఊహను చూసి ఏయ్ అమ్మాయి...! నీ పేరేంటి అని అడిగాడు.

ఓయ్ అబ్బాయ్....  నీకెందుకు అంటూ సమాధానం.

హుష్..... అనుకుని,

అలా కాదు నీ పేరెంటో చెప్తే పిలవచ్చుగా అన్నాడు అభి.

అవసరం లేదు అన్నట్టుగా ఒక లుక్ ఇచ్చి తన పని తాను చేసుకుంటోంది ఊహ...

ఇలా కాదు గాని క్లాస్ కి వచ్చాక అందరి పేర్లు అడిగి రేగింగ్ క్లాస్ తీసుకుంటా అప్పుడు తెలుస్తుంది అని అనుకుని వెళ్లి క్లాస్ స్టార్ట్ ఐయ్యాక వచ్చాడు క్లాసులోకి.

అందరిని పేర్లు అడుగుతూ ఇప్పుడు తన వొంతు వచ్చింది తప్పేట్టు లేదు అని అనుకుని  ఊహ. అంది....

సార్ ఏమయ్యింది.... ఇంట్లో సాసార్ లో పెట్టి వచ్చావా....  సీనియర్ ని సార్ అని పిలవడం తెలీదా...  అంటూ కుంచం రేగింగ్ చెయ్యబోయాడు.

ప్రొఫెసర్ ఆముదం అప్పారావు గారు వచ్చారు క్లాస్ చెప్పడానికి.

అభి ఏంటి ఇక్కడ గో టూ క్లాస్ అని పొంపి నవ్వుతూ...  హీ ఇస్  గుడ్ బాయ్...

మీకు డౌబ్ట్ ఉన్న తనని అడగండి మంచి అబ్భాయి చెప్తాడు ఎస్ప్లేన్ చేస్తాడు అన్నాడు...

దానితో ఊహ కి తనగురించి తెలుసుకోవాలని అనిపించి సీనియర్ అక్క రమను అడిగింది.

నిన్న  క్లాస్ లో అభి అని ఒకతను .....

... తెలుసు.  ప్రిన్సిపాల్ దగ్గర ఏదో చెప్పవటగా...

వాడు చాలా మంచోడు... గుడ్ బాయ్ అని మోసెస్తోంది.... ఊహ దగ్గర.

అసలు ఏమయ్యింది అని అడగకుండా తెలుసు అంటావేంటి అక్క అంది.

ఐతే చెప్పు వింటా...  అనేసరికి జరిగింది చెప్పి ప్రిన్సిపాల్ దగ్గర చడా మడా కడిగేసాను అంది.

మరి ప్రిన్సిపాల్ ఏమన్నారు అంది రమా...

ఏం అనలేదు పైగా సాయత్రం వాలీబాల్ గ్రౌండ్ కి రా రా అభి అంటూ పోంపేశారు...

అది అభి అంటే .....

చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి తను

అక్కడ చాక్లెట్ అన్నది నిన్ను కాదు మా క్లాస్మేట్ విద్యని....

తన నిక్ నేమ్అది అంది....

అప్పుడు నువ్ ఎదురుగా వచ్చేసరికి నిన్ను రేగింగ్ చేస్తున్నారు అనుకున్నవా గో యూ బెటర్ sorry టూ హిం 1st అంది రమా.

తను తప్పుగా అనుకున్న అని తెలిసి  బెంచ్ పైన కూర్చుని ఉన్న అభి దగ్గరకి వెళ్ళి అది.... అది...

అంటూ ఏదో చేప్పబోతోంది ఊహ..

బెంచ్ మీదేన అంటూ చమత్కరించారు నవ్వుతూ..

తను నవ్వుతూ iam so sorry abhi sir... అని అంటుంటే మధ్యలో i love you ఊహ అని అన్నాడు.... అభి.

వెనక్కి తిరిగి పరుగెడుతూ వెళ్ళిపోయింది ఏదో తెలియని భయం తనకి.

సాయంత్రం ఇంటిదగ్గర  తన గదిలో మంచం మీద పడుకుని ఆలోచిస్తోంది ఊహ.

ఏఁ తెలుసు నా గురించి చూడగానే i love you చెప్పేస్తారా.....  అబ్బాయిలు చాలా డేంజర్. బాబోయ్... అని తనని ఊహించుకుంటోంది ఊహ.

నిద్ర రాలే తను sorry చెప్పడానికి వెళ్తే తను నవ్వుతున్న రూపం ఊహను చాలా డిస్టర్బ్ చేస్తోంది.

i love you అంటున్న తన పెదాలు గుర్తుకొస్తు నిద్ర రావడంలేదు.

ఉదయం కాలేజీ కి వెళ్లిన వెంటనే తిట్టేస్తా అనుకుంటూ నిద్రపోయింది..... పట్టి పట్టని నిద్ర తనకి చాలా డిస్టర్బ్ గా ఉంది.

లేవగానే చకచకా పనులు పూర్తి చేసి తనకు ఇష్టం ఐన నీలిరంగు పంజాబీ డ్రస్ వేసుకుని వెళ్తుంది కాలేజీకి...

పార్కింగ్ లో బైక్ స్టాండ్ దగ్గర నుంచుని ఫ్రెండ్సతో

బాతాకాని పెట్టిన అభిని చూసిచూడనట్టు ముసిముసి నవ్వులతో క్లాస్ కి వెళ్లిపోతూ ఉన్న ఊహ అసలు విషయం మర్చిపోయింది.

తిట్టేస్తా అనుకుంది కానీ తనని చూస్తూ ఏఁ మాట్లాడాలో తేలిక తెలివిగా వెళ్లిపోతొంది క్లాస్ కి.

క్లాస్ లో కూర్చుని ఉన్న ఊహ. పక్కనే ఉన్న శోభ ని పలకరిస్తూ అభి ఏంటే... నా వెంట పడుతున్నాడు. నాకు ఏఁ చెయ్యాలో తెలియట్లే భయమేస్తోంది ఎక్కడ లవ్ లో పడిపోతానో అని. నవ్వుతూ....

శోభ పడిపోయావ ఏంటి కొంపతీసి... తరువాత నిన్ను భగవంతుడే కాపాడాలి నా నుంచి అంది.

అదేంటి కాపాడాల్సింది తన నుంచి కదా నీ నుంచి అంటావెంటే...

హా... వాడు నా అన్నయ్య.

అందుకు ! !

అలా అనేసరికి నోరెళ్ళబెట్టి తన చేతితో నోటిపై మూసుకుంటూ ఓరి దేవుడా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నారా కొంపతీసి. చచ్చాన్రా దేవుడా... అంటూ సిగ్గు ఆపుకోలేక తింగరి చూపులు నెలకేసిచూస్తూ...

ఏఁ మాట్లాడాలో తెలీని స్థితి ఊహాది.

ఎం కంగారు పడకు మా అన్నయ్యకు నేనేమీ చెప్పనులే. అంది శోభ.

ఇవన్నీ పాత రోజులూ... ఒక్కసారి అభికి గుర్తొచ్చాయి రోజు ఊహను చూశాక.

మరిచిపోలేని జ్ఞాపకం మరి. ఒక్కసారిగా వైజాగ్ లో మాయమైన ఊహ ఇప్పుడు హైదరాబాద్ లో కనిపించింది. నన్ను చూడలేదు నా చెల్లిని చూడలేదు మెరుపు వేగంతో స్కూటీ మీద వెళ్ళిపోయింది....

కాలనీ లొనే ఉంటోంది అనుకుంటా....

చెల్లి... చెల్లి. ఊహ.... ఊహా...  చూసావా నువ్.

ఊహ... తను ఇక్కడ ఎందుకు ఉంటుంది అన్నయ్య...

నువ్ మర్చిపోలేద ఇంకా .....

తను నిన్ను వదిలేసింది.

అది ఇప్పుడు ఎక్కడుందో....

ఎలా ఉందో...

ఎవరికి తెలీదు.

నాకు కూడా చెప్పలేదు.?

అన్నయ్య... ప్లీస్...

వదిలెయ్యి రా...

నడూ... నువ్ ముందు ఇంటికి....!

(అసలు ఏమయ్యింది... అభి ఊహల మధ్య ...

తన లవ్ కి ప్రాబ్లమ్ ఏంటి.... కారణం తెలుసుకోవాలా.... wait for next ఎపిసోడ్.)

 

సూర్య

 *********************

 

 నేటి సమీక్ష

 కథ  :  కొత్త వాకిలి

రచయిత : శ్రీ అశ్వనీ కుమార్ గారు 

 

ఒక అందమైన కథ చదువుతున్నప్పుడు అప్రయత్నంగా మన జీవితంలో తారసపడిన, ఎదురైన అనుభవాలనీ, సమయంలో మన హృదయంలోని అనుభూతులనీ వెతుక్కుంటాము.

కథలోని అక్షరాలతో మరింత మమేకమవుతాము..

మధురోహల మనసు చుట్టూ నింపేసుకుంటాము.

ఆయా పాత్రల్లో మన అనుభూతులను ఆఘ్రాణించడం మొదలుపెడతాము  

 

ప్రణీత్, హంసధ్వని కథ సాధారణ ప్రేమ కథ లాగా మొదలైనా, యండమూరి వారి వెన్నెల్లో ఆడపిల్ల కోసం రేవంత్ పడిన తపన, మల్లాది వారి అందమైన జీవితం లోని ప్రియతమ్ అంతరంగం కూడా స్పృశించడం గుర్తురావడం ఎంత యాధృచ్చికమో, అంత మనోహరం.. జవరాలి వాలు చూపుల కోసం నిరీక్షించని ప్రేమికుడి హృదయం ఉంటుందా చెప్పండి 

 

దస్తూరి ని బట్టి వ్యక్తిత్వం, హృదయ సౌందర్యం నిస్సందేహంగా అర్ధమవుతాయి...

ఎత్తుగడ, ఆలోచన చాలా  బాగుంది...

ఒక వ్యక్తికీ ఇంకో వ్యక్తిపై సహజ సిద్ధమైన అభిమానం కలగడానికి అందమైన అక్షరాలు ఎంతో మేలు చేస్తాయి  అని లోకానికి చాటిచెప్పారు

హంసధ్వనిని కలిసినప్పుడు అశ్వనీ కుమార్ గారు ఆయన లోని భావుకుడి ని ప్రణీత్ ద్వారా పరిచయం చేయడం, ఆహ్లాదభరితంగా, హాయిగా ఉంది. 

ముఖంపై జలపాతాల్లా ముంగురులు, కనుల కాంతులు.. ఇంకా ఆమె మనోహరమైన రూప లావణ్యం చక్కగా చాలా వర్ణించారు.. చిన్న మేలాక్తో ఆఖర్లో కాసేపు గిలిగింతలు కూడా పెట్టారు  

 

హృదయ సౌందర్యం నిస్సందేహంగా మహత్తరం...

హంసధ్వని లావణ్యం మాత్రం యాదృచ్చికం 

బాహ్య సౌందర్యాన్ని మించిన ఆత్మ సౌందర్యం జీవితాల్లో మరింత సౌందర్యాన్ని నింపుతుంది    

 

కస్తూరి శివశంకర్

 

***********************

#మనిషి

రచన:కన్నాజీరావు

 

మొన్నామధ్య "సీవుడ్స్ " గ్రాండ్ మాల్ లో పనుండి అలా వెళ్ళా!

తిరిగొచ్చేపుడు అనుభవం ఇది...

మాల్ లో బేస్మైంటు లో టికెట్ లిస్తారు.. కుంచెం ముందుకెళ్ళి పక్కకెళితే స్టేషనూ...

ఇలా టికెట్ తీసుకుని అలా లోకలెక్కేనో లేదో...వెనకా....లే.. పదండి తోసుకు పదండి ముందుకు అన్నట్టు రెండు జంటలు....

పిచ్చాడికి పితరుడి లా..కనీసం పదేళ్ల నుంచి తైల శుధ్ధెరుగని జుట్టు...

రేజరంటే ఎరుగని  గడ్డం ...

మా ఊళ్ళో పూసలోళ్ళలాగ పచ్చబొట్లు... చేతికి ఉంగరాల సాంబయ్య లా పదుంగరాలు... ఇలాంటి కేసులు ఏదో అల్లంత దూరంలో చూడ్డవే గానీ.....ఇదిగో ఇదే ఫస్టు....

సారీ ఫర్ బ్రేకు...

మరి జంటన్నా కదా.....హా...హా..హా..నాట్టూ వరీ...

చెప్తున్నా...

మహానుబావుడికి తోడు.... వంటింట్లో ఇల్లాలు హడావిడి గా పెట్టుకుంటారే అలాంటి ముడితో...   మరి డ్రెస్సే అంతో లేక ఖంగారులో మరచిందో పంజాబీ డ్రెస్సు టాపొక్కటేసు కొచ్చినదామ్మాయి...

ఈవిడా పూసలాలంకరణ తక్కువ కాదు....నానా పూసల సమాహారం

జంటకు తగ్గట్టు మరో జంట.... కొంచెం వేరుగా.... వెఱ్ఱి గా....

జుత్తు లేని పిల్ల....చెవులకి కసాపిసామని గుచ్చింపించుకున్న....అవేవో....మేకులా???

కళ్ళకి అద్దాలు ...పళ్ళకి చట్రాలూ..

అమ్మాయి బెస్టే కిందా పైనా వేసుకుంది...కాప్పోతే పాపం చింకిబట్టలు‌.....విత్ ఎగస్టా చిరుగులు...

మరి ఆమె జతగాడో.....

అబ్బా...గంతకి తగ్గ బొంత....

కావాలని గీకించుకున్న తపేళా క్రాపు...

మీసాలూ గెడ్డాలూ లేవు గానీ....కింద పెదం కింద కుచ్చు...చేతులకి పదికి తక్కువ లేకుండా రంగు లబ్బరి బేండ్లు...జస్ట్ డూ ఇట్...మాన్స్టర్, బైంగ్ హ్యూమన్ ఎట్సెట్రా...దేనికీ పొంతన లేకుండా...

కాళ్ళకి పేధ్ధ చేటల్లాంటి చెప్పులు

ఉఫ్....కానీ....

నేను వీళ్ళని చూసి అప్రయత్నంగా పక్కకి జరిగాను....

మా ఊళ్ళో అంతే.... ఇలాంటోళ్ళకి కొంచెం దూరంగా ఉంటాం...

పిల్లల నలుగురి చేతుల్లో ఆపిలీసుకి తక్కువ కాని ఫోనులు....

అమ్మా బాబులని అనాలి....

ఈలోగా నెరుళ్ వచ్చింది...జనం పెరగడంతో.. ఆనలుగురు నాకు మరీదగ్గరకొచ్చారు....ఏదో....కుళ్ళికాలవ పైన ఏక్సు వేస్తే మిక్సై వచ్చే వాసనా.....కంపా???

ఏమో....నన్ను నేను కాపాడుకుందామని ప్రయత్నించా‌...నో వే.... అప్పటికే ఉన్న ఖాళీలను పూరించేసారు నెరుళియన్సు.

వేరే దారిళ్ళయ.... పబ్లిక్ గా ముక్కు మూసుకున్నా...ఇంతలో ఆమె గుండమ్మాయి గసిరినట్టడిగింది...అరె హో.... థోడీ ఆత్ జా....అబ్బ....ఏం మాత్రం రెస్పెక్ట్ అన్నదానికి గౌరవం లేకుండా.... నేను తనకి చిన్నప్పటి నించీ మహా పరిచయం ఉన్నట్లు అడిగింది....

నాకూ మండింది ‌‌.. నేనున్న పళంగా అలానే నిలబడ్డా...ఏదో గొణిగింది....

తరాలకి భాషా వచ్చేడవదు...కాదు కాదు... వాళ్ళు  కావాలనే మాట్లాడరు.

వచ్చీరాని ఇంగ్లీషు..‌.పచ్చి పచ్చి హిందీ...తాళింపుగా మూడు ముక్కల మరాఠీ...

తెగులు ఇక్కడే కాదు...మన తెలుగు జనత కీ ఉంది.

మన ప్రాతీయం మాండలికం మనం మాటలాడుకోవడం ముద్దు.... అరువు తెచ్చి ఎంగిలి మాటలు వినడానికి ఏవగింపు గా ఉంటాయి అది ఏం ప్రాంతం వారైనా సరే!!

న్యూస్ పేపర్లు ..ఛానళ్ళు..టీవీ ప్రోగ్రాములు...సినిమాలు వెకిలి సంస్కృతి ని బాగా పోషిస్తున్నాయి.

అలా మాట్లాడటం "పోష్" అన్న భావన యువతలో ఉంది.

ఇలాటి పిల్లల భాషా జ్ఞానం వింటూ వారించని తల్లి తండ్రుల పాత్ర నూ నిందించాలి.

నిరంతరం సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతూ అసలు భాషనొదిలి సంకర సంస్కృతి ని నెత్తి నెక్కించుకుంటున్న యువత కళ్ళు తెరవాలి.

సరే.....మన చింపిరి పిల్లల కాడికొద్దాం....

జుయీనగరు దాటింది నలుగురూ గేటుకి దగ్గరకు పోయి వేళాడుతున్నారు.గమనించినో పెద్దాయన ఆడపిల్లలనడిగేడు...ఆడ పిల్లలు లోపలుంటే బాగుంటుందీ..వచ్చీ పోయేవాళ్ళు తగుల్తారని.... నిర్లక్ష్యమైన చూపు.... వెటకారమైన సమాధానం.... అంకల్....ఐసా అందర్ హీ రహేంగే తో బాహర్ కభీ ఆయేంగే...ఈక్వల్ రైట్ హోనా చాహియేనా...... వెకిలి నవ్వు పళ్ళ చట్రాల మెరుపు తో....వెనక సపోర్టివ్ నవ్వులు......మిగతా ముగ్గురూ....

డ్యూడ్ సహీ....దే....తాలీ......ఒకని చేతులుంకొళ్ళు కొట్టి సంఘీభావం చూపెట్టుకున్నారు......నాకు అసయ్యం పొంగి పొరలు తోంది. ఈలోగా వాశీ వచ్చింది....హమ్మ కంపునుండి సొతంత్రం అన్నట్టు బయట పడ్డాను.

నలుగురూ అక్కడే దిగేరు....ఎదురుగా టీ సీ.... అందరూ ఒకరిమొహాలొకళు చూసుకుంటున్నారు....తే కో దియారే....తుఝా కడేరే..... సాగుతోంది తతంగం....నలుగురికీ కలిపి మూడు వేల ఫైను....వేడికోలు మొదలు....పక్కా మరాఠీ లో సాగుతొంది నెగోషియేషను.సంకర భాష సంకట సమయాల్లో  పనికిరాదని తెలుసు వాళ్ళకి...టీసీ గారు పన్వేల్ నుంచి ఫస్టు క్లాసు ఛార్జీలు కట్టమంటున్నాడు... ఆపిలకాయలదగ్గర మరి పిక్కలున్నట్టు లేవు...మరి ఉన్నా వేషాలో....ఇంత సేపూ గాలి లో పల్టీలు కొడుతున్న వాళ్ళు ఒక్కసారి కూలబడ్డారు..పెద్దంతరం చిన్నం తరం చూడని వాళ్ళకి తగిన శాస్తి అని ఆనందించాను.

 

ఈలోగా గొంతు మధ్యలో వారించింది టీ టీ ని."సర్ లోగ్ సీవుడ్ సే బైఠే హై!"

రసకందాయంలో ఏక్షన్  నేనాందిస్తూంటే.... కట్ చెప్పిందెవరాని చూశా....ఆయనే ... ఇందాక ఆడపిల్లల్ని లోపలకు వెళ్ళమన్నాయన...మంచి చెప్పినందుకు వెటకారపు డైలాగులు విన్నాయన.....

ఇదేవిటా అనుకున్నా.... గుంటవెధవలు అంతలా వెక్కిరించి నా... మళ్ళా వాళ్ళ తరఫ్దారీ ఇస్తాడే.....నేనలగే చూస్తున్నాను....

 

ఆయన టీటీఇ కి ఏదో సంజాఇస్తున్నాడు....నాకు అప్పటికీ అర్థం కాలేదు....ఆయన చాలాసేపు టీసీ కి బానే క్లాసు పీకి... ఐదొందల నోటు తో ఒప్పిస్తున్నాడు....ఎందుకలా?????  మొత్తానికేదో అయింది...టీసీ రిసిప్ట్ రాసిచ్చాడు... నలుగురిని సారి చూసా..... అమ్మాయిల నిర్లక్ష్యపు చూపుల్లో తేడాలేదు..... గెడ్డం వాడి ఎక్స్ప్రెషన్ లు తెలియటం లేదు....కానీ లబ్బర్రింగులబ్బాయి కళ్ళలో కొంచెం తడి కనిపించింది.....వాడు కొంచెం కదిలి ముందుకొచ్చాడు...టీటీఇ తో మాటాడుతున్నాయనతో ఏదో అన్నాడు...ఆయన కాయ్ నయ్ కాయ్ నయ్ అని సర్ది చెప్తున్నాడు...

అబ్బాయి ఆయన కాళ్ళ కి మొక్కి క్షమించమంటున్నాడు. నాకొకటి అర్థమయింది......ఖలేజా సినిమాలో డైలాగ్ గుర్తొచ్చింది......దేవుడెక్కడోలేడు.....

 

మనం దేవుడంత అవనక్కర్లెద్దు గాని.....మనిషిలాంటి ఔన్నత్యం చూపెడితే చాలు... చుట్టుపక్కల ఉండే కొన్ని పశువులైనా మనిషిలా మారడానికి ప్రయత్నిస్తాయి.....   తరువాత ఆయన్ని కలిసి ఏదో అడగాలనుకొన్నా....కాని  నాకు అర్హత లేదనిపించింది......

కన్నాజీ రావు

******************

 

కధ పేరు::

గంటల కారు

 అనగా అనగా ఒక బుజ్జి పల్లెటూరు పల్లెటూరిలో చిన్ని అనే గడుగ్గాయి పిల్ల  వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉండేది. చిన్ని పుట్టిన వెంటనే దానికో తమ్ముడు పుట్టేశాడు మరి వాళ్ళమ్మ గడుగ్గాయి తో వేగలేదని అమ్మమ్మ తీసుకొచ్చేసింది. ఇక చిన్ని ఆడింది ఆట పాడింది పాట.  మూడో ఏడు నిండాక చిన్ని అల్లరి భరించలేక వీధిలో మహిళా మండలి టీచర్ ఒకావిడ పిల్లలకి లు నేర్పిస్తుంటే ఆవిడ దగ్గరికి తీసుకెళ్లింది చిన్ని వాళ్ళ అమ్మమ్మ. పెళ్ళికి ముందు చిన్ని వాళ్ళ అమ్మకి టైలరింగ్ నేర్పింది ఆవిడే. శిష్యురాలి కూతురు అదీ కాక బూరెల్లాంటి బుగ్గలతో ఉండే చిన్నిని  బాగా ముద్దు చెయ్యడం తో లు రాలేదు సరికదా రోజూ ఆవిడ పెట్టే చిరుతిళ్ళు తినేసి హాయిగా పలక మీద తలపెట్టుకుని నిద్రపోయే చిన్నిని మోసుకెళ్లడం వాళ్ళ అమ్మమ్మకి అదనపు పని అయ్యింది. అప్పుడే డిగ్రీ చదివి చిన్న కాన్వెంట్ లా పెట్టిన రమేష్ మేష్టారు దగ్గర వేశారు. చిన్నికి అక్కడ కూడా లు రాలేదు కానీ మాష్టారు కాల్చేసిన సిగరెట్టు పీకలు లెక్కపెట్టి ఒకట్లు వచ్చేశాయ్ 10 వరకు. ఏదో పనిమీద అటువెళ్లిన చిన్ని మామయ్య  అది చూసి  చిన్ని చెవి మేలేసి  ఇంటికి తీసుకొచ్చేశాడు. పాపం చిన్ని వాళ్ళ నాన్న

బళ్ళో మేష్టారు. నాలుగేళ్ళు

నిండినా లు రాకపోయేసరికి పండిత పుత్రా ....... అనే సామెత నిజం అవుతుందేమో అని వేసవి శలవల్లో తీసుకెళ్లి తను పాఠాలు చెప్పే బళ్ళో వేస్తాను అన్నారు. అంతే గొల్లుమంటూ చిన్ని అమ్మమ్మ చంకనేక్కెసింది. ఆవిడ కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ చంటిది బెంగెట్టేసుకుంటుంది బాబూ!! అనడం తో చిన్ని వాళ్ళ నాన్న గుర్రుమని ఉరుకున్నారు ఏం చెయ్యలేక.         

 చిన్ని  అమ్మమ్మవాళ్ళ  ఎత్తు అరుగుల ఇల్లు రోడ్డు పక్కనే   ఉండటం వలన చిన్ని ఇంచక్కా అరుగుమీద కూర్చుని బస్సులకి, ఎద్దుల బండి వాళ్ళకీ టాటా చెబుతూ ఉండేది. ఒక రోజు రోడ్డులో ఒక కొత్త రకం వాహనం గంటలు మోగించుకుంటూ వేగం గా వెళ్లిపోయింది. చెప్పొద్దూ చిన్నికి చాలా భయం వేసింది పక్కనే ఉన్న పిన్నిని గట్టిగా పట్టేసుకుంది. అప్పుడు పిన్ని నవ్వి ఎక్కడైనా ఇల్లు కానీ గడ్డివాము కానీ తగలబడిపోతే గంటల కారు వెళ్ళి  నీళ్ళు జల్లి అర్పేస్తుంది అని చెప్పింది.

ఇది జరిగిన కొద్ది రోజులకే చిన్ని వాళ్ళ అమ్మ , తమ్ముడిని తీసుకొచ్చింది వాడితో ఆటలే ఆటలు వాడికి తన నేస్తాలైన బుల్లి పక్షులు, తూనీగలు, సీతాకోక చిలుకలు అన్నీ చూపించింది. అరుగు మీద నిలబడి

బస్సు డ్రైవరికి టాటా చెప్పించింది. మాటల్లో వాడికి గంటల కారు గురించి చెప్పింది. వాడు చాలా ఉత్సాహ పడ్డాడు గంటల కారు చూడటానికి. అదేంటో అది రానేలేదు.

ఇక రేపు వెళ్లిపోతారు నాన్నకి శలవలు అయిపోయాయి అంట.

వాడు దిగులుగా వెళ్ళడం చిన్నికి అసలు నచ్చలేదు. బాగా ఆలోచించింది . మధ్యాన్నం అయ్యేటప్పటికి  మంచి ఆలోచన వచ్చింది.

ఎండ వేళ అని అందరూ పడుకున్నారు.

చిన్ని చిన్నగా తమ్ముడిని లేపి ఇంటి వెనుక ఉన్న గడ్డివాముదగ్గరకు తీసుకెళ్లింది. తమ్ముడికేమి అర్ధం కాలేదు. పిన్ని చేప్పింది ఏదైనా కాలిపోతే గంటల కారు వస్తుంది అని. అందుకే గడ్డివాముకి నిప్పు పెడతాను అంటూ అగ్గిపుల్ల గీసింది గాలికి ఆరిపోతోంది. పశువులకు గడ్డి వేయడానికి వచ్చిన పాలేరు వీళ్ళ ఘనకార్యం చూసి నెత్తి నోరు కొట్టు కుంటూ అందరినీ పిల్చుకొచ్చాడు. ఇంకేముంది అమ్మ చిన్ని వీపు విమానం మోత మోగించింది ఎప్పుడూ అడ్డుపడే అమ్మమ్మ కూడా తప్పిన ప్రమాదం గుర్తొచ్చి గమ్మునుండి పోయింది.

తమ్ముడు మాత్రం పాపం చిన్నిని ఓదార్చి పోనిలే

చిన్ని ఈసారి వచ్చినప్పుడు చూస్తాలే గంటల కారు అన్నాడు.  తమ్ముడికి గంటల కారు చూపించలేదు అనే బాధ కన్నా తరువాత చాలా కాలం వరకు  మామయ్య స్నేహితులు

ఏయ్ !!

గంటల కారూ అని పిలిచి ఏడిపించడం చిన్నికి పెద్ద అవమానం గా అనిపించింది.

బళ్ళు తెరిచాక చిన్నిని ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి లో చేర్చడంతో కొత్త స్నేహితుల మధ్య

బాధ కాస్త మర్చిపోయింది.  ఇప్పుడు చిన్ని బడి మానెయ్యడానికి కొత్త కేలెండర్ కనిపెట్టింది దానిలో చిన్నికి బడి మానాలి  అనిపిస్తే ఆదివారం వచ్చేస్తుంది. అది అంతే.

 

రమ

 *****************

 

 అమ్మ - ఆంగ్లము చదువు

 ఇది  మా  అమ్మ  మాకెప్పుడూ  చెబుతూ  వుండే  కథే. స్వాతంత్ర్యం రావటానికి  ముందు కథ, అంటే సుమారుగా 1945 అప్పుడు  అనుకోండి. ఆవిడ కథే.

 మా  అమ్మ  మా  తాతయ్య  గారికి ఒక్కగా నొక్క  కూతురు.  ఆవిడ చిన్నప్పుడే,  మా  తాతగారు  పోవడంతో,  మా  అమ్మను  ముగ్గురు  ముసలమ్మలు కలిసి పెంచారు, అదేనండి,  వాళ్ళ  అమ్మ,  అమ్మమ్మ, చిన్న  అమ్మమ్మ.  అందరూ  గంగా భాగీరథీ  సమానులే. ఇంట్లో  మగ దిక్కులేదు.  ఉన్న పొలాలు

చూసుకుంటూ,  పల్లె పట్టునే  వున్నారు.  ఉన్నంతలో  మనుమరాల్ని  అరచేతిలో  కాకపోయినా,కాలు  కందకుండా  చూసుకున్నారు.

ఇంతకూ  చెప్పొచ్చేదేమంటే,  మా  అమ్మ  వాళ్ళ  అమ్మమ్మకు మనవరాలిని సర్వ  విద్యా పారంగతురాలిని చేయాలని  తాపత్రయం.  పాపం  వాళ్ళు  చదువుకోలేదు కదా.అందుకే పల్లె నుండి మోస్తరు పట్నం  అదేనండి, తాలూకా  ప్రధాన పట్నం కు మారారు. అక్కడ  వెళ్లిన  తరువాత  పాపం  ఆవిడ కస్టపడి  మనవరాలిని  తీర్చిదిద్దడంలో మునిగిపోయారు.

సంగీతం,  వయోలిన్    పుట్టు గుడ్డి  మాష్టర్ ని పెట్టి  నేర్పించారట. స్వరం  తప్పు  పోయిందో,  చేతిలో  ఉన్న  కమాన్ తో  ఢమాల్,  ఢమాల్.

సైకిల్  తొక్కడం  కూడా  నేర్పించారట.  ఈత  కూడా

నేర్పిద్దామని  అనుకున్నారు కానీ,  చేద  బావులు  తప్ప,  దిగుడు  బావులు లేవని,  మానేశారు.

యిక  చదువు  విషయానికొస్తే,  వాళ్ళ  అమ్మమ్మకు  మనవరాలు  ఆంగ్లము  నేర్చుకొని  ఎడాపెడా మాట్లాడేయాలని తాపత్రయం.   అందుకే  అక్కడే  ఉన్న  బళ్ళో,  అదేనండి మగపిల్లల బడి లో  చేర్పించడానికి  చూసారు.  కానీ,    ప్రధానోపాధ్యాయుడికి  ఆడపిల్లలు చదువు కోవడం ఇష్టం లేదేమో,  ససేమిరా  చేర్చుకోనన్నారు.  కానీ

అమ్మమ్మ గారు  మాత్రం  పట్టు  వదలని  విక్రమార్కుడిలా  ఊరంతా తిరిగి ఒక  ప్రైవేట్ మాష్టర్ను  ( బుడుగుకు  ప్రైవేట్ చెప్పే  మాష్టర్  కాదండి, నిఝము  ప్రైవేట్ మాష్టర్ ) పట్టుకుంది.  అయన కూడా స్త్రీ  విద్యకు వ్యతిరేకే,  కానీ  ఈవిడ  ఆయన  కాళ్ళు,  గడ్డం పట్టుకొని  ఒప్పించేసింది,ఒక  షరతు మీద. అందరితో పాటు చెప్పడానికి ఒప్పుకున్నారు.  యిక  ఏముంది, ఆంగ్లము  చదువు  మొదలయింది.

పనిలో పని, హిందీ కూడా  నేర్పిద్దామనుకుంది  మనవరాలికి  అమ్మమ్మగారు. ఇంకేముంది  వేట  మళ్ళీ  మొదలు. ఈసారి త్వరగానే  దొరికారండోయ్  హిందీ  మాష్టర్ గారు.  ఇంతకీ  ఎవరంటారా  సందు  చివర్లో ఉన్న  తురకమాయన.  ఆలా  మనవరాలికి  అన్నీ  విద్యలు  నేర్పిస్తుండగా,   అన్నీ  తూచ్  అయిపోయాయి.చదువులన్ని   అటక ఎక్కేశాయి.  అదేనండి,  మనవరాలికి  పెళ్ళి కుదిరించేసింది,  శారదా చట్టాన్ని కూడా  లెక్క  చేయకుండా,.ఆలా  మనవరాలు  పదాల  దాకా  నేర్చుకన్న  ఆంగ్లము  చదువు  వాక్యాలు  మొదలు పెట్టకుండానే ఆగిపోయింది. హిందీ  చదువు  ఆదిలోనే  ఆగిపోయింది.  కానీ  మనవరాలు గారు  ముత్తవ్వ  అయినా  చరవాణి  సహాయం  తో కూరగాయల  పేర్ల  లాంటివి  నేర్చుకొని,  తన పిల్లలకు,  పిల్లల పిల్లలకు  పరీక్షలు పెడుతోంది. అంతేకాదండోయ్,  వాక్యాలు  ఇప్పుడు  నేర్చుకొని  చిన్న  చిన్న  కథలు,  మనవరాలు  బహుమతిగా ఇచ్చిన  డైరీలో  వ్రాసుకొని,  పిల్లలందరికీ  చదివి విన్పిస్తోంది.  ఆలా  మనవరాలు  అమ్మమ్మగారి  ఆశయాన్ని  కొనసాగిస్తోంది.

కథ కంచికి, మనము *

తెతే కి

 అవళూరు సీత

***************************









 

నేటి కథ..

నా జీవితంలోని ఒక ప్రత్యేక మైన అనుభవాన్ని సమర్పిస్తున్నాను, ఒక జరిగిన కథ లా .

1.

కథా సంఘటన కాలం 1 972 జూన్ నెల.

నేను తిరుపతి కాలేజి లో బీకాం చదివేవాడిని. ఆఖరి సంవత్సరం పరీక్షలు రాసి ఇంటికి వచ్చాను.ఫలితాలు వచ్చేంతవరకూ సెలవులు.  మిత్రులతో  కబుర్లు , బీకాం తర్వాత ఏం చేయాలి అనే చర్చలు, ఇలా హాయిగా  కాలం గడిచిపోతున్నది.

2.

అలా ఉండగా ఒకరోజు  బీకాం ఫలితాలు వార్తా పత్రికల్లో వచ్చాయి. పక్కింటి బట్టల దుకాణం వాళ్ళు పత్రిక తెప్పిస్తారు. అక్కడికి వెళ్లి పత్రిక తిరగేసాను ఫలితాలకోసం. కొంచెం టెన్షన్ మొదలైంది.. ఫలితాల లిస్టు చూశాను. నా నెంబర్ లేదు. మళ్లీ చూశాను, నెంబర్ కనిపించలేదు. ఉద్రిక్తత కు లోనయ్యాను . పేపర్ వెంటనే పక్కన పెట్టేసి, ఇంటికి వెళ్ళాను. తాపీగా కూర్చో లేక పోయాను, ఒకవైపు భయం ఇంకొకవైపు అవమానం ఇలా ఎన్నెన్నో ఆలోచనలు పరంపరగా వస్తున్నాయి. ఇలా తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను  అవమానం భరించేకంటే చని పోవడం మేలని . తర్వాత ప్రశ్న , ఎలా  చావాలని. నేను తిరుపతిలో చదివాను కాబట్టి చాలా మార్లు తిరుమల కొండకు నడుచుకుంటూ వెళ్లాను. అందుకని, తిరుపతి కొండ పైకి వెళ్లి కిందికి  దూకితే బాగుంటుంది అని నిర్ణయానికి వచ్చాను.   కొండ మార్గం నాకు పరిచయం గనుక అనువైన ప్రదేశం కూడా మనసులో ఎంచుకున్నాను. అప్పటికి మధ్యాహ్నం 12:00 అయింది. నాన్న వచ్చిన తర్వాత,  ఏదో వంక చెప్పి తిరుపతికి వెళ్లాలని నిశ్చయించుకున్నాను.

 

3.

ఇంతలో  నాన్న వచ్చాడు.. ఆయనకు ఎవరో దారిలో  చెప్పినట్టు ఉన్నారు బీకాం ఫలితాలు వచ్చాయని.  రాగానే అడిగారు.  ఫెయిల్ అయ్యాను అని చెప్పాను. నాన్న  ముఖంలో స్పందనా లేదు.  పేపర్ తీసుకురమ్మని చెప్పి భోజనానికి వెళ్లాడు. కాసేపటికి భోజనం చేసి వచ్చి ఈజీ  చైర్ లో కూర్చున్నారు. నేను పేపర్ తెచ్చి ఇచ్చాను. నా నెంబరు తీసుకున్నాడు. మళ్లీ నాకు ఒత్తిడి మొదలైంది, తిరుపతి కెళ్లే ప్రస్తావన ఎలా తీసుకురావాలా అని.

4.

నాన్న పేపర్ చూడడం అయిపోయింది. భయం భయంగా ఆయనకేసి చూసాను. ఆశ్చర్యంగా ఆయన ముఖంలోనాకు సంతోషం కనిపించింది ."నీవు ఫస్ట్ క్క్లాస్ లో పాస్ అయ్యావు రా" అని పేపర్ నాకు ఇచ్చారు అన్నారు. నా చెవులను నేనే నమ్మలేదు, క్షణం ఆలస్యం చేయకుండా పేపర్ లో ఫలితాలు మళ్లీ చూశాను, ఫస్ట్ క్లాస్ లో నా నెంబర్ ఉంది. అప్పుడు  బోధపడింది నేను చేసిన తప్పేమిటని. నేను  మొదటగా సెకండ్ క్లాస్ లిస్టులో నా పేరు చూశాను , లిస్టులో కనిపించకపోగా థర్డ్ క్లాస్ లో చూశాను, ఫస్ట్ క్లాస్ లో చూడకపోవడానికి కారణం నా నమ్మకపు స్థాయి తక్కువ  . నాన్నకు నా మీద చాలా నమ్మకం, అందువల్ల మొట్టమొదట ఫస్ట్ క్లాస్ లో చూశారు. ఇదీ తేడా.

5.

సంఘటన నాకు అత్యంత మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది.. అందుకు రెండు కారణాలు- ఒకటి, ఫెయిల్  అయ్యాను అనుకున్న నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడం,  నా మీద నా కున్న నమ్మకం కంటే నాన్నకు నామీద ఎక్కువ నమ్మకం ఉండటం.  సంఘటన తర్వాత  నేను వ్రాసిన సి . . పరీక్ష ఫలితాల ఎప్పుడు మా మిత్రులను కోరాను , నా నెంబర్ చూసి చెప్పమని..  అలాగే ఎప్పుడైనా క్లిష్టమైన వ్యక్తిగత సమస్యలు వచ్చినప్పుడు కూడా  పరిష్కారాలకు / నిర్ణయాలకు నా భార్యను అడిగే వాడిని. నేను నిశ్చింతగా ఉండేవాడిని.

 

CA కె మల్లికార్జునరావు

 

****************************


 

 

*గొప్పఆలోచన*

 

అమలాపురం ఎస్. కె. బి.ఆర్ కళాశాల లో1992 ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువు తున్న రోజులు అవి. ప్రతీ ఏడాది ఇంటర్ కాలేజియెట్ పోటీలలో  వివిధ సాంస్కృతిక  కార్యక్రమాలు జరిగేవి. పోటీలలో  పాల్గొనే విద్యార్థులు వివిధ కళాశాలనుండి వచ్చి   పోటీలలో పాల్గొనేవారు . అలా వచ్చిన వారిలో మల్లాది బ్రదర్స్  మృదంగ విభాగం లో తమ ప్రతిభ కనబరిచారు, లలిత సంగీత విభాగం లో  ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి అబ్బాయి మోహన కృష్ణ కి మొదటి బహుమతి వచ్చింది. ఈయన పాడిన లలిత గేయం " పల్లెటూరి గుండెల్లో పండగొచ్చింది  "ఇప్పటికి నాకు జ్ఞాపకమే. ఆరోజు రాత్రి   పాట ఎలా పాడింది  నేర్చుకున్నది ,  అన్ని విషయాలు మాతో పంచుకోవడం తో ఒకటే ఆలోచన నాలో...

 

మరుసటి రోజు అనుకొంటా బహుమతుల ప్రధానోత్సవములో భాగంగా  మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి కచేరి జరిగింది.  ఏర్పాట్లు లో నేనూ భాగం కావడం మూలంగా వేదిక మీద పక్క గా ఉండటం జరిగింది. బాలమురళి గారు కచేరి ప్రారంభ కావడానికి ముందు వేదిక మీద ఉన్నవారితో ముచ్చటించే సమయం లో కోకిల కూసినట్టు ఆయన రెండు మూడు సార్లు ఆయన నోటితో అన్నారు ఆశ్చర్యం కోకిల కంటే ఈయన కూతే చాలా బాగుంది  అంటే అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు.

 

 అప్పటివరకు రేడియో లో ఎందరో మహానుభావులు పాట వినడం తప్ప పెద్దగా పాటలు వినింది లేదు కానీ అందరూ గొప్పగా అయన గురించి చెప్పుకుంటూ ఉంటే వినేవాడిని.  అప్పుడూ నాలో ఒక్కటే ఆలోచన....

 

 

ఆరోజు రాత్రి ఇంటికి వచ్చిన తరువాత భోజనం ముగించి నిద్రలో జారుకున్నాను.. హఠాత్తు గా నా చెవులలో అయన స్వరం మారుమ్రోగుతోంటే మంచంమీద లేచి కూర్చున్నాను.. రాత్రి ఇంక నిద్రపోలేదు అప్పుడూ ఒక్కటే ఆలోచన..

నాలోచనలకు   రూపు లేదు మనో ఫలకం లో బహుశా ముద్ర పడిపోయిందేమో...

 

గొప్ప వారి తాలూకు సాంగత్యం, వారి ప్రతిభ నన్ను కదిలించాయి ఏదో సాధించాలి అని మాత్రం ఉండేది. కానీ సాధించాలి అంటే విభిన్నం గా ఆలోచించాలి అనుకొనే వాన్ని కానీ నా ఆలోచన రూపు నిచ్చేంత శక్తి అప్పుడు నాకు  లేదు. మరలా నాలో ఆలోచన...

 

ఏళ్ళు గడిచిన కొద్దీ ఆలోచనా పరిధి పెరిగింది.పండు తయారు కావడానికి  పరిపక్వత ఎంత అవసరమో మనిషి కి ఏదైనా సాధించాలి అనడానికి మంచి ఆలోచన అవసరం అని పించింది

 

నాలో నేను పడిన సంఘర్షణ ఆలోచనల మధనం నుండి పుట్టినదే

 

" తెలివైన మనుషుల ఆలోచనలు విని గ్రహించడమే "

అనే దే నా  గొప్పఆలోచన

 

సమాప్తం.

స్వీయ రచన.

 

మాదిరెడ్డి సురేశ్

***************************


 

లాక్ డౌన్ అనుభవం

 

అమ్మ ఎప్పుడో నా చిన్నప్పుడు బట్ట సంచీ ఇచ్చి

జేబులో  రూపాయి నోటుని పిన్నీసుకి గుచ్చి

మరీ బజారుకి పంపించేది...

కాస్త పెద్దయ్యాక ...

హవాయి చెప్పులు తెగిపోతేనో

చొక్కా గుండీ ఊడిపోతేనో, నిక్కరు బొత్తాలు ఊడిపోతేనో

బడికి వెళ్ళడానికి బాగానే పనికి వచ్చేది మాయదారి  పిన్నీసు.

కానీ సేఫ్టీ పిన్నుని మోడర్ను ఆడ లేడీసు మాత్రం  ఇప్పటికీ వదల్లేదు.

పైగా వీటిలో నా పిండాకూడు డిజైనులు కూడానూ!

అసలు సంగతి ఏంటంటే....

ఇందాక సరిగ్గా బైటికి వెళ్తూంటే మాస్కు తాడు తెగిపోయింది.

మళ్ళీ ఎన్నో దశాబ్దాల తరువాత పిన్నీసుని వాడక తప్పలేదు.

పవిత్రమైన సేఫ్టీ పిన్నే  ఇవాళ నా పరువు కాపాడింది.

అయినా మొహానికి మాస్కు లేకుండా బైటికి ఎలా వస్తాను చెప్పండి మీరే...హవ్వ ??

ఎంత అప్రదిష్ట! ఎంత అవమానం! ఎంత సిగ్గుచేటు!

పిర్ర మీద లాఠీ దెబ్బ పడిందంటే ఎవరికి చెప్పుకోనూ? ఎవరికీ చూపించుకోనూ??  

----.----

అత్తిలి అనంతు, ముంబాయి

***********************


అల వైకుంఠపురం సినిమా మనకు బాగా దగ్గర  చేసిన మొదటి అంశం. సామజవరాగమనా పాట. పాట ఎన్ని సార్లు మనం విన్నామో, విని ఎన్ని సార్లు ఊహల్లో తేలామో మనకే తెలుసు. పాట లోని సాహిత్యం కూడా అంతే బాగుంటుంది. సిరివెన్నెల గారి పదాలతో మరింత అందంగా మారిన పాట గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం రండి..

 

కానీ అసలుసామజవరగమనాఅంటే ఏంటో, ఇంకా సిరివెన్నెల గారు పాట లో కొన్ని కవితాత్మకమైన అందమైన వర్ణనలు కూడా రాసారు, వాటిని తెలుసుకుందాం.

 

సామజవరగమనాత్యాగరాయ కీర్తన :

పల్లవి: సామజవరగమనా! సాధుహృత్సారసాబ్జపాల! కాలాతీతవిఖ్యాత! ॥సామజ॥

అనుపల్లవి: సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల! దయాలవాల! మాంపాలయ! ॥సామజ॥

చరణం: వేదశిరోమాతృజ సప్తస్వర నాదాచలదీపా। స్వీకృత యాదవకులమురళీ!

గానవినోదన మోహనకర త్యాగరాజ వందనీయ ॥సామజ॥

 

కీర్తన త్యాగ రాయ కీర్తనలన్నిటిలో ప్రసిద్ధి పొందినది.. కీర్తన లో ని ప్రతి పదం, శ్రీ కృష్ణుడిని వర్ణిస్తూ ఉంటుంది..

 

ప్రతి పదార్ధం :

సామజ(ఏనుగు) వర(వంటి) గమనా(నడక కలిగిన వాడ) – ఏనుగు నడక లాంటి గంభీరమైన నడక కలవాడా

 

సాధుహృత్సారసాబ్జపాల – సాధువులు, సజ్జనుల హృదయపద్మములను పాలించేవాడా

కాలాతీతవిఖ్యాత – అన్నికాలములలోనూ కీర్తింపబడేవాడా

సామనిగమజ సుధామయగానవిచక్షణ – సామ వేదానికి మొదలు గా సంగీతముని నిత్యం పరిశీలిస్తూ పర్యవేక్షించేటి వాడ

గుణశీలదయాలవాల – గుణముకు దయకు ఉదాహరణగా నిలిచేటి వాడ

మాంపాలయ – నన్ను పాలించు

వేదశిరోమాతృజ – వేదములలో గొప్పదైన సామవేదమునుండి పుట్టిన

సప్తస్వరనాదాచలదీప – సప్తస్వరముల లయము వలన కలిగిన కదలని దీపమువంటి నాదమువలె ప్రకాశించువాడా

స్వీకృతయాదవకుల – యాదవకులములో జన్మించినవాడా

మురళీగానవినోదనమోహనకర – మురళీగానముచే వినోదించుచూ అందరిని ఆనదింప జేసేవాడా;

త్యాగరాజ వందనీయ – త్యాగరాజుచే నమస్కరింపబడినవాడా

 

అర్ధం:

ఏనుగు నడకవంటి గంభీరమైన నడక తో, మునులు మనిషులు హృదయాలను ఏలుతున్న శ్రీ హరి, నువ్వు కాలం తో సంబంధం లేకుండా అందరి చేత పొగడ బడతావు..

సామవేదం పుట్టుక నీవల్లే జరిగింది.. సంగీతాన్ని రక్షించేవాడివి నీవే, గుణమునకి, దయకి ఉదాహరణ నీవే.. నన్ను కూడా నీవే నడిపించాలి..

సమావేదమునుండి పుట్టిన సప్తస్వరముల వల్ల, ప్రకాశిస్తూ.. గోవులని రక్షిస్తూ.. మురళి గానం తో మామ్మలందరిని ఆనంద పరుస్తూ.., త్యాగరాజ వందనములను అందుకో

 

త్యాగయ్య, శ్రీకృష్ణుడి నడక ని, ఏనుగు నడక తో పోల్చారు. మనం ఏనుగు నడక ని గమనిస్తే, ఎంతో గంభీరంగా, నెమ్మది గా నడుస్తుంది. సింహం నడక హింస తో కూడిన అధికారానికి ప్రతీక అయితే, ఏనుగు నడక హింస లేని అధికారానికి ప్రతీక.

 

సిరివెన్నెల గారిసామజవరగమనా”:

పల్లవి:

నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు

చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయ లేదా అసలు

నీ కళ్ళకి కావలికాస్తాయే కాటుకలా నా కలలు

నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు

నా ఊపిరి గాలికి ఉయ్యాలాగ ఊగుతూ ఉంటే ముంగురులు

నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు

సామజవరగమనా నిను చూసి ఆగ గలనా?

మనసు మీద వయసుకున్న అదుపు చెప్పా తగునా

 

చరణం:

మల్లెల మాసమా మంజుల హాసమా

ప్రతి మలుపులోన ఎదురు పడిన వెన్నల వనమా

విరిసిన పింఛమా విరుల ప్రపంచమా

ఎన్నెన్ని వన్నెచిన్నలంటే, ఎన్నగ వశమా?

 

అరె, నా గాలే తగిలినా నా నీడే తరిమినా..

ఉలకవా, పలకవా, భామా

ఎంతో బతిమాలినా ఇంతేనా అంగనా..

మదిని మీటు మధురమైన మనవిని వినుమా..

 

త్యాగయ్యసామజవరగమనాఅని శ్రీకృష్ణుడిని వర్ణిస్తే, సిరివెన్నెల గారు అమ్మాయిని వర్ణించారు, పాత్రలోని గాంభీర్యాన్ని ని వర్ణించారు.

 

ఏనుగు ఎప్పుడు ముక్కుసూటి గా వెళ్తుంది(చదరంగం లో కూడా అంతే), అలా నడుస్తున్నప్పుడు దారిలో ఏమున్నా తొక్కేస్తూ, తొండం తో అవతలికి విసిరేస్తూ ఉంటుంది.

 

అలానే అమ్మాయి కూడా, అబ్బాయి కళ్ళు, తన కాళ్ళని పట్టుకుని ఉన్న తొక్కేస్తూ వెళ్ళిపోతోంది. తనదైన గంభీరత్వం తో నడుచుకుంటూ..

కాటుకల అమ్మాయి కళ్ళకి కాపల గా ఉందామనుకున్న, నులిపేస్తోంది.

తన ఊపిరి తో అమ్మాయి ముంగురులని (ముందుకు వచ్చే జుట్టుని) ఉయ్యాలలా ఊపుదామనుకుంటే ముంగురులని కూడా నెట్టేస్తోంది.

ఇలా ఆగకుండా ఎన్ని చేస్తున్న అమ్మాయి అస్సలు పట్టించుకోవట్లేదు..

అమ్మాయికి మల్లెల మాసం లాంటి మనోహరమైన రూపం ఉంది.

మంజుల (అందమైన) నవ్వు ఉంది..

అబ్బాయి ఎక్కడికి వెళ్లిన వెన్నల లా ఎదురుపడుతోంది..

విరిసిన పింఛం లాంటి ముఖం.

పువ్వులాంటి సువాసన కలది.

ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మాయి గురించి చెప్పడం చాలా కష్టం.

అలాంటి తను, అబ్బాయి గాలి తగిలిన, నీడలా వెంటాడుతున్న, ఒక్క చూపు కూడా చూడట్లేదు..

(ఇక్కడఅంగనఅనే పదం ఉపయోగించారు సిరివెన్నెల గారు, అంటే, మంచి రూపం గల అమ్మాయిని అని అర్ధం (ప్రేమ కి దేవత అని అర్ధం))

అలా తను ఎంత బతిమాలిన ఒక మాటైనా అనట్లేదు.. ఒక్కసారైనా మాట్లాడమని మనవి చేసుకుంటున్నాడు ఇక అబ్బాయి.

 

పూసపాటి

*******************

 

 పిలుపు

 "ఒరేయ్ అభి మామయ్య కు ఫోన్ చేసి వచ్చి నన్ను ముంబయి తీసుకెళ్లిపోమని చెప్పరా".... అన్న శైలజమ్మ గారి మాటలు విన్న అభి ఉలిక్కిపడి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ తయారుచేస్తున్న లాప్టాప్ పక్కన తోసేసి వచ్చి అమ్మమ్మ పక్కన ఆమె చేయి తన చేతిలోకి తీసుకొని అడిగాడు.

"ఏమి ఆజి నీకు ఇక్కడ ఏమైనా అసౌకర్యంగావుందా" అని.

 

" నాకేమి లోటురా నువ్వు,మీ అమ్మ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. కానీ వెళ్లిపోవాలిరా"...

 

86 ఏళ్ళు వచ్చినా చూస్తే రెండు చేతులూ ఎత్తి మొక్కాలి అనిపించే చక్కని ముఖ వర్చస్సు, మొక్కవోని ఆత్మ విశ్వాసం, వయసులో కూడా తన అల్లడు గారు దూరమైన లోటు తెలియకూడదు అని కూతురికి ధైర్యంగా ఉండేటందుకు సహాయ పడదామని ఏడాది క్రితం హైదరాబాద్ కి వచ్చారు ఆమె.

 

నేను కొంచెం రాచకార్యాలతో మునిగి ఉండటం వలన నా అర్ధాంగి సహజం గానే ధైర్యవంతురాలు కాబట్టి మా తో ముంబై లో ఉన్న వాళ్ళ అమ్మగారిని భాగ్యనగరం లో దింపేసి అక్క వాళ్ళ ఇంటి నుండి ఇంకొక అమ్మ గారిని (నా భార్య అత్తను కూడా అమ్మ అనేది) తీసుకొని వస్తాను అని బయలుదేరింది.

 

మా నాన్న గారు నాకు 17 ఏడులోనే హఠాత్తుగా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు.  అప్పటి నుండి నాన్న ను సరిగా చూసుకొనే వయసు లేనందున అమ్మ కు ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి అని నేను మా అన్నయ్య గట్టిగా నిర్ణయం చేసుకున్నాం.  ఆమె 50 సంవత్సరాలు లోపు చూడని పొందని సౌకర్యాలన్నీ ఆమె కు కల్పించే ప్రయత్నం చేశాము ఇద్దరం.

 

ఆమె సహజంగా బాగా చురుకు, కష్టపడే తత్త్వం.  నెల రోజుల క్రితమే విజయవాడ కు వెళ్లి అన్నయ్య వదిన వాళ్ళతో ఒక వారం గడిపి వచ్చింది.  పెళ్లి అయిన తరువాత నుండి జీవించిన బందరు కు వెళ్లి పాత మిత్రులందరిని ఒక సారి తిరగేసి వచ్చేసింది.  సంతుష్టాత్మ.

 

నా సహధర్మచారిణి అనుకున్నట్లుగానే మా అత్తగారిని హైడ్ లో దింపేసి మా అమ్మగారిని తీసుకొచ్చింది. విమానాశ్రయం లో చూశాను చాలా నీరసించి పోయింది అమ్మ.  నిలపడే శక్తి లేకపోతే వీల్ చైర్ తీసుకెళ్ళాను.  ప్రయాణం ఎలా మేనేజ్ చేసిందో నా భార్య స్వామికే ఎరుక.

 

ముంబయి లో ఉండాలి అని చిన్నప్పటి నుండి మా అమ్మకు బలమైన కోరిక.అది నేను వృత్తి రీత్యా 5 ఏళ్ల క్రితం ఇక్కడకు రావడం తో తీరింది.  బయట పిచ్చుకలను, పావురాలను, మరాఠీ మాట్లాడే తాయి లను, చిట్టి పాపాయిలను చూసి మురిసి పోయేది.

 

కొంచెం ఆరోగ్యం క్షీణించడంతో నన్ను పిలుస్తూ ఉండేది, నా పక్కనే కూర్చో అంటూ ఉండేది.

 

గజిబిజి గడబిడ ముంబై నగరం లో అది ఎలా సాధ్యం.... పోనీ సెలవు పెట్టుకుందామంటే ఎన్నాళ్ళు? ఎలా అని ఆలోచిస్తున్నాను.  భగవంతుడి పైన అపారమైన నమ్మకం ఉండడం వల్ల ఆయనే దారి చూపిస్తాడులే అని ఊరుకున్నా.

 

అంతలోనే టీవీలో మిత్రోన్ అని మోడీ గారి ప్రసంగం....

 

భగవంతుడు ఆయనతో కరోనా మహమ్మారి వలన జనతా కర్ఫ్యూ మరియు లాక్ డౌన్ ప్రకటించేసేలా చేశాడు. 

 

ఇది ఒక అద్భుతం, కలలో కూడా ఉహిoచలేని నిజం... 28 రోజుల పాటు అమ్మ ప్రక్కనే ఆమె చేయి నా చేతిలో ఎన్నెన్నో విషయాలు మాట్లాడుతూ అన్ని విషయాలు గుర్తు చేసుకుంటూ ....అమ్మ ఆరోగ్యం మరింత క్షీణించింది... నా సహచరి దొడ్డ ఇల్లాలు అసహ్యం, అసాధ్యం అనకుండా ఎన్నో సపర్యలు చేసింది. 28 రోజల్లో ఎన్ని వందల సార్లు అమ్మ నా పేరు పిలిచిందో లెక్కలేదు.

అమ్మ హైడ్ లో అభి తో ముంబై వెళ్ళిపోవాలి అని ఎందుకు అన్నదో నాకు అర్ధమవ్వడానికి కొన్ని రోజులు పట్టింది.  ఏప్రిల్ 11 శ్రీనివాసుని రోజు ఆమె తల ఒడిలో, నా భార్య కడుపు నిమురుతూ, నా కొడుకు కాళ్ళు పడుతూ .....నవ్వుతూ పాండురంగ అని వెళ్ళిపోయింది.

ఎంత లావు మనిషైనా తత్సమయంలో నిస్చేష్టులైపోతారేమో.... ఏమి చెయ్యాలో తెలియలేదు. లొక్డౌన్ సమస్యలు మొదలైనాయి. మరణ ధ్రువీకరణ చేయడానికి డాక్టర్ ముందుకు రాలేదు.  ఒక పెద్దమనిషి హడావుడి గా ముగ్గురు నర్సులతో వచ్చి చూసి, మీకు బుద్ధి లేదా? మనిషి బ్రతికుండడానికీ, చనిపోవడానికి చాలా తేడా వుంది నేను మందీ మార్బలం తో వచ్చాను. మీకు కొంచెం కూడా ఇంగితం లేదు అని కసిరి ఎంత వేగం గా వచ్చాడో అంతే వేగoగా వెళ్ళిపోయాడు.  అసలు ఏమి జరిగింది అతను ఎందుకు అన్ని విసురులు విసిరాడు ఇప్పటికీ అర్ధం కానీ ప్రశ్న లానే మిగిలిపోయింది.

నా సహోదరులు ఎక్కడో ఉన్నారు రాలేకపోయారు, నా మిత్రులు, పక్కింటి నేస్తాలే ఏకోదరులై నలుగురే అంబులెన్సు లో వెళ్లాలనే నిబంధన ఉండడంతో నేను కాక ముగ్గురు, వాళ్ళే నా సహోదరులై నాకు సాయం ( చాలా చిన్న మాట) చేశారు.

ఇంటికి రాగానే ఎదో తెలియని నిశ్శబ్దం,రోజుకి కొన్ని పదుల సార్లు పిలిచే పిలుపు లేదా,ఇక వినపడదా.....

 

చటుక్కున గుర్తొచ్చింది...గురుకృప వలన ఏవో పద్యాల లాంటివి రాయడం మొదలు పెట్టాను కదా, అవి అమ్మ చూసిందా.....చరవాణి లో ఆయి చాట్స్ తిరగేసాను. ఆమె చివరి మెసేజ్ హైద్రాబాద్లో కులాసాగా ఉన్నప్పుడు పంపింది చూశాను.... నాన్నా నిజానికి కవివైనావు....వేంకటేశుని దీవెనలు నీ పై చల్లగా ఉండాలి ఆశీస్సులతో...అమ్మ ఆయీ .... 

 

ఏమైందో అర్ధం కాలేదు అక్షరాల మసక మసక గా కనిపించాయి... మన నేస్తాలు అవసరమైనప్పుడు వెచ్చగా మన కళ్ళల్లోకి వస్తాయిగా.... అలవోకగా కలం కదిలింది.....

 

అమ్మ మాట కన్న యమృత మొకటి లేదు

అమిత మైన దోయి ఆమె ప్రేమ

తీయ నైన పిలుపు తీపికలగమారె

అమ్మ కన్న దొడ్డ అంబ లేదు....

 

ఇది కధ కాదు.....

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

*******************

 

ప్రార్థన

 

మనలో చాలా మందికి మనసులో ఒక కొరత ఉంటుంది . ప్రార్థన చేసుకోవడానికి లేక పూజ చేసుకోవటానికి లేక ధ్యానం చేసుకోవడానికి సరి అయినది వాతావరణము ఇంట్లో లేదని. అసలు విషయం ఏమంటే అంతరంగంలో ప్రశాంతత ఉన్నట్లయితే బయటి వాతావరణం మనకు ముఖ్యం కాదు.. ఇందుకు ఉదాహరణగా మా గురువుగారు ఒక చిన్న కథ చెప్పే వారు.

 

ఒక ఊరిలో  ఎండాకాలం లో  ఒక గుడి నిర్మించే పనులు జరుగుతున్నాయి... మధ్యాహ్నం ఎండ లో కూలీలు ఇటుకలు మోస్తున్నారు . అటుగా వెళ్తున్న  గురువుగారు వారిలో ఒకరిని పిలిచి "ఏం చేస్తున్నావు నీవు "అని అడిగాడు . అందుకు వాడు "చూస్తున్నారు కదా రాళ్లు మోస్తున్నాను"  అని సమాధానమిచ్చాడు..

ఇంకొకరిని పిలిచి అదే ప్రశ్న అడిగారు గురువుగారు.."నా కుటుంబాన్ని పోషించడానికి కష్టపడుతున్నాను" అని అన్నాడు రెండోవాడు.. గురువుగారు ఇంకొక డిని పిలిచి అదే ప్రశ్న అడిగారు. అందుకు మూడోవాడు" నేను దేవుడికి దేవాలయం కట్టే పుణ్య కర్మలు చేస్తూ ఉన్నాను స్వామి"అన్నాడు. మూడవ కూలి భక్తిశ్రద్ధలతో చేసే పనియే ప్రార్థన.

 

కథ వల్ల మనకు తెలిసిన విషయం ఏమంటే, ప్రార్థనకు, పూజకు, ధ్యానానికి ప్రత్యేకమైన ప్రదేశం అక్కర్లేదు. మన మనసే ప్రదేశం..

 

సందర్భంగా ఇంకొన్ని విషయాలు-


భక్తి

అన్నంలో ప్రవేశిస్తే ప్రసాదం అవుతుంది

ఆకలికి తోడైతే ఉపవాసం అవుతుంది

నీటి లో ప్రవేశిస్తే తీర్థము అవుతుంది

సంగీతానికి కలిస్తే కీర్తన అవుతుంది

గృహంలోకి ప్రవేశిస్తే గుడి అవుతుంది

సహాయం లో ప్రవేశిస్తే సేవ అవుతుంది

పనిలో  ప్రవేశిస్తే పుణ్య కర్మ అవుతుంది

 

పైన చెప్పిన విధంగా ప్రతి చర్యని  మనము

శ్రేష్టమైన కార్యంగా మార్చుకోవచ్చు.

 

CA కె మల్లికార్జునరావు

 

*********************





కె.వి. సతీష్ కుమార్ 


సత్తు గిన్నె - చిన్నోడు.

 

చిన్నోడు తల్లి తన చిన్న కొడుకుని పిలిచే పిలుపది. ఆరుగురి సంతానంలో అందరికంటే చిన్నవాడవటము వలన ఆపిలుపు. చిన్న వాడుఆఖరి వాడవటం వలన కొంచెం గారం ఎక్కువ. వయసు ఆరు వస్తున్నా బళ్లో వేయలేదా చిన్నోడిని. కారణాలు అనేకం, గ్రామీణ వాతావరణం, ఆర్ధిక స్థితి పని వత్తిడులు.

 

ఇక ప్రస్తుత కథలోనికి వస్తే, బజారులో ఒక పిలుపు వినిపించింది, 'పాత్రాలపై పేర్లు వేస్తాం' . చిన్నోడికి చెప్పి అతనిని ఇంటికి పిలిపించి ధర మాట్లాడింది అమ్మ, అక్షరానికి పైసలు అయిదు. కొన్ని పాత్రలు ఇచ్చి చిన్నోడి తండ్రిపేరు పాత్రలపై వ్రాయమంది. అతను గుండ్రముగా చెక్కడం మొదలెట్టాడు దీక్షతో. ఇంతలో చిన్నోడు అమ్మ మెడ చుట్టూ చేయి వేసి అమ్మా నాపేరు రాయించు అని మారాం.

వద్దు, నాన్నారి పేరే రాయాలి, నువ్వు పెద్దయ్యాక రాస్తార్లే అమ్మ సమాధానం. కాదు కావాలి చిన్నోడి మంకు. అప్పటికి పేర్లు రాయటం పూర్తయ్యింది. చిన్నోడు మారాం వదల్లేదు. సరే ఎదో గిన్నెపై వాడి పేరు  కూడా రాయిబాబు, అమ్మ సర్దుబాటు. వద్దు నాపేరొక్కటే కావాలి, వా.. చిన్నోడి రాగం.

సరే ఇంట్లో వెదికి చిన్న సత్తుగిన్నె తెచ్చి వాడి పేరు వ్రాయమంది అమ్మ. వాడు చిన్నోడి పేరు అందంగా చెక్కి చేతులో పెట్టాడు. వాడా గిన్నె చూసి మళ్ళీ ఏడుపు, ఇప్పుడేంటి అమ్మ విసురు. ఇది నా పేరు కాదు చిన్నోడి ఏడుపుకి కారణం. కాదు నాన్నా ఇది నీపేరే అమ్మ సముదాయింపు.

వాడికి చదువు రాదు, ఇప్పుడెలా? పెద్ద ప్రశ్న.

అమ్మకదా ఎదో ఒక ఉపాయం ఆలోచించి చెప్పింది, వెళ్లి మల్లయ్యగారిని అడుగుఇక్కడ మల్లయ్య గారంటే చిన్నోడి పక్కింట్లో ఉండే పెద్దాయన. చిన్నోడిని గిన్నెతో తీసుకెళ్లి మల్లయ్య గారిని సత్తు గిన్నెపై పేరు చదవమన్నది. పెద్దాయన నోటి నుండి చిన్నాడి పెరు వినిపించగానే వాడి కళ్ళలో మెరుపు. ఆగిన్నె వదలకుండా పట్టుకు తిరుగుతూ అందరికి చూపినప్పుడు వాడి ఆనందం.

 

ఇదీ సత్తు గిన్నె- చిన్నోడి కధ.

ఇది కధ కాదు.

చిన్నోడేవరో మీకు తెలిసిందని నాకు తెలిసింది.

 

వెంకటప్పయ్య సూరే 


 

ఉషోదయం

రాత్రి అంతా ఒకటే వాన

సముద్రంలో పుట్టిన అలజడి

నాలోని ఆలోచనల్లా...........

చూట్టూ చిమ్మ చీకటి

ఆకాశం నిండా నల్లనిమబ్బులు

నాలోని దుఃఖంలా.............

నిద్ర తెలియని కన్నులు

భగ భగ మండే కొలిమి ఆనవాళ్లు........

మూడోజామున ఉరిమిన ఉరుము

భయమెరుగని పుడమిపుత్రుని కలవరపాటు......

తెల్లారి జారుతున్న చూరునీళ్లు

కొత్తప్రపంచానికి చూపుతున్న ఉషోదయం.......

 

కోవూరి


 

రంగుల చీర!

ఆకాశంలో విరిసిన రంగుల రాట్నంతో

నే నేసా నేత చీర...

కడలి అలలు తరుముతుంటే

నీలాన్ని మోసుకొచ్చి నే నేసా నేత చీర

పరువపు పైరు పచ్చాన్ని పరిచి

చిలకపచ్చని చీర నే నేసా నేత చీర

ఆకాశంలో చుక్కలని తుంచుకొచ్చి

నిన్నే తలచి చుక్కలచీర నే నేసా నేత చీర

చందమామ ఒంటరి తనం చూడలేక

తెల్లటి రేయంచు చీర నే నేసా నేత చీర

నీ అందమే చీరలో...నేసిన నా నేతలో...

చీరనై అంచున ఊగంగ...

నా మనసు వూగెనే జడగంటలా....

 

సూర్య తాడిపూడి. 


కంభాలదిన్నె గ్రామం

 

కంభాలదిన్నె కమ్మ ని సన్నిదీ

కమనీయమైన వసుధైక పెన్నిదీ

అనురగపు లోగిలో ధరణిది

ప్రకృతి ఒడిలో ప్రసవించిన పుడమిది

కంభాలదిన్నె కమ్మ ని చరితా పఠనం

జన్మ జన్మ సకల పాప హారణం

గ్రామ గడపన పారే మున్నేరు జలనిది

గ్రామ జనుల దాహార్తి తీర్చే జీవనది

కాఠిన్య మెరుగని కమ్మ ని గ్రామమిది

హరివిల్లే నిలయమై నిల్చిన సన్నిది

కోకిల రాగాలతో కొలువై ఉన్నది

సప్త స్వరాల సంఘమమైన స్థానమిది

యాదలవాగు వెంటాడే గ్రామమిది

మోపాడు చెరువుతో పసిడి పండే పుడమిది

కులాల కంపుని కోరని కంభాలదిన్నె ఇది

సమైఖ్య భావనతో సాగే స్వర్గ దామమిది

మామతానురాగాలు పంచే మట్టి ఇది

 

మహిమాన్విత చరితే మా గ్రామ నిధి

సూర్యకిరణ ప్రభోదములతో విద్యా ప్రక్రియ

సూర్యనారాయణ విద్యా దానముతో సాగిన క్రియ

సర్వ జనుల ఉన్నతి కోరే స్థల ప్రభావమిది

మౌనంగానే మెరిసిన మహోన్నత స్వస్థలమిది

 

వి.వి.శ్రీనివాస్ , కంభాలదిన్నె(గ్రామం)

పామూరు(మండలం), ప్రకాశం(జిల్లా) 

**************


18 సెప్టెంబర్, ఈరోజు తెలుగు భాషా పండితుడు, అభ్యుదయ రచయిత, విమర్శకుడు, పాత్రికేయుడు, హేతువాది, నాస్తికుడు తాపీ ధర్మారావు జయంతి

****************

జీవిత చరిత్ర

ధర్మారావు 1887 సంవత్సరంలో సెప్టెంబర్ 19 ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న బెర్హంపూరు (బరంపురం ) లోని ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు. ఈయన మాలపిల్ల, రైతుబిడ్డ మొదలైన సినిమాలకు సంభాషణలు రాశాడు. ఈయన ప్రాథమిక విద్యను శ్రీకాకుళంలో, మెట్రిక్యులేషన్ విజయవాడలో, పర్లాకిమిడిలో ఎఫ్.. వరకు చదువుకొని మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో చేరాడు. పర్లాకిమిడిలో చదివే రోజులలో వ్యవహారిక భాషావేత్త అయిన గిడుగు రామ్మూర్తి ఈయనకు గురువు కావటం విశేషం.ధర్మారావు తల్లి పేరు నరసమ్మ. తండ్రి అప్పన్న. వీరి ఇంటి పేరు మొదట్లో "బండి" లేదా "బండారు" కావచ్చును. అప్పన్న తాత లక్ష్మయ్య కొంతకాలం మిలిటరీలో పనిచేశాడు. తరువాత తాపీ పనిలో మంచి పేరు తెచ్చుకొన్నాడు. అలా అతనికి శ్రీకాకుళంలో "తాపీ లక్ష్మయ్యగారు" అన్న పేరు స్థిరపడిపోయిందట. కల్లికోట రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేశాడు. 1910 ప్రాంతంలో కొందరు మిత్రులతో కలిసి బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించాడు. ఇతని తొలి రచన 1911లో 'ఆంధ్రులకొక మనవి' అనే పేరుతో విలువడింది. పత్రికా నిర్వహణలో ఇతని నేర్పు అనన్య సామాన్యమైనది. కొండెగాడు, సమదర్శిని, జనవాణి, కాగడా మొదలైన పత్రికలు ఇతని ప్రతిభకు నిదర్శనాలుతెలుగు సినిమా దర్శకులు తాపీ చాణక్య ఇతని కుమారుడు.

అప్పట్లో కులాంతర వివాహాలకు,దండల పెళ్లిళ్లకు పురోహితుడిగా వ్యవహరించారు.వితంతు, వర్ణాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ వ్యాసాలు రాశారు.40 సినిమాలకు మాటలు, పాటలు రాశారు.ఆయన రాసిన "వాడే వీడు"అనే డిటెక్టివ్ నవల బహుళ ప్రజాదరణ పొందింది.

నార్ల వెంకటేశ్వరరావు, బోయి భీమన్న మొదలగు వారు ఆయన దగ్గర ఉప సంపాదకులుగా పనిచేశారు.

ఆయన వ్యావహారిక భాష వ్యాప్తికి ఎనలేని కృషి చేశారు.

 

ఉమ్మడి రాష్ట్రంగా వున్న రోజుల్లో బొబ్బిలి రాజా వారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు- ధర్మారావుగారు ఆయన దగ్గర కార్యదర్శిగా పనిచేశారు.

ఆంధ్ర రాష్ట్ర పత్రికా రచయితల మహాసభ జరిగినప్పుడు తాపీవారే మొదటి అధ్యక్షులు.

తాపీని గౌరవంగా 'తాతాజీ' అని పిలిచేవారు.

1943 లో జరిగిన మొదటి అభ్యుదయ రచయితల సమావేశానికి ఆయనే అధ్యక్షుడిగా వ్యవహరించారు.

 

రచనలు

-----------

ఆంధ్రులకొక మనవి

దేవాలయాలపై బూతుబొమ్మలు ఎందుకు? 1936

పెళ్ళి దానిపుట్టుపూర్వోత్తరాలు 1960

ఇనుపకచ్చడాలు

సాహిత్య మొర్మొరాలు

రాలూ రప్పలూ

మబ్బు తెరలు

పాతపాళీ

కొత్తపాళీ

ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ

విజయవిలాసం వ్యాఖ్య

అక్షరశారద ప్రశంస

హృదయోల్లాసము

భావప్రకాశిక

నల్లిపై కారుణ్యము

విలాసార్జునీయము

ఘంటాన్యాయము

అనా కెరినీనా

ద్యోయానము

భిక్షాపాత్రము

ఆంధ్ర తేజము

తప్తాశ్రుకణము

 

పురస్కారములు

----------------------

శృంగేరి పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖర భారతీ శంకరాచార్యుల వారి నుండి 1926లోఆంధ్రవిశారదబిరుదు,

చేమకూరి వెంకటకవి రచించినవిజయవిలాసంకావ్యానికి చేసినహృదయోల్లాస వ్యాఖ్యకు 1971లో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారము.

 

మూలం వికీపీడియా, తదితర వెబ్సైట్లు

**************


సమాప్తం

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...