06 - 09 - 2020 ; ఆదివారం ప్రత్యేకం - సాహితీ ప్రశ్నావళి
అంశం : ప్రబంధ తెలుగు సాహిత్యం రచనలు
(పూర్తి సమాధానములు)
జవాబు
లకుమ - కుమారగిరిరెడ్డి ఆస్థానంలో నర్తకి; లకుమ ప్రస్తావన డా సినారె గారి కర్పూర వసంతరాయలు కావ్యాల్లో కనిపిస్తుంది
మాచల్దేవి : ప్రతాపరుద్రుని ఆస్థానంలో రాజనర్తకి
మాచల్దేవి ప్రస్తావన వినుకొండ వల్మాలభారాయుని రచన క్రీడాభిరామం లోని నాయకి మచల్దేవి
లకుమ - కుమారగిరిరెడ్డి ఆస్థానంలో నర్తకి; లకుమ ప్రస్తావన డా సినారె గారి కర్పూర వసంతరాయలు కావ్యాల్లో కనిపిస్తుంది
మాచల్దేవి : ప్రతాపరుద్రుని ఆస్థానంలో రాజనర్తకి
మాచల్దేవి ప్రస్తావన వినుకొండ వల్మాలభారాయుని రచన క్రీడాభిరామం లోని నాయకి మచల్దేవి
2️⃣ "జ్వలద్దీపప్రభారాజి కౌముది" అంటూ పరమేశ్వరుడిని ప్రకృతి తో పోల్చిన ప్రబంధ యుగం కవి ఎవరు ??
జవాబు
ధూర్జటి గారికి ప్రకృతి లో ఏమి చూసినా కాళహస్తీశ్వరుడు గుర్తురావడం అంటే ఇదొక తార్కాణం మాత్రమే... కాళహస్తీశ్వర మహత్యం లో కనిపించే అందమైన పద్యం
తూర్పు దిక్కులో ఉన్న ఉదయించిన సూర్యోదయం చూసి పరవశించి ఆయన చెప్పిన పద్యము.. మత్తేభంలో
మ
ఉదయగ్రావము పానవట్ట, మభిషేకోదప్రవాహంబు వా
ర్ధి, దరధ్వాంతము ధూపధూమము, జ్వలద్దీపప్రభారాజి కౌ
ముది, తారానివహంబు లర్పితసుమంబుల్ గాఁ దమోదూరసౌ
ఖ్యదమై శీతగభస్తిబింబశివలింగంబొప్పెఁ బ్రాచీదిశన్
3️⃣ "అరిజూచున్... హరిజూచు" అంటూ నరకాసురవధ ఘట్టంలో కూడా అంత మనోహరమైన పద్యం చెప్పిన కవి ఎవరు ?
ఇదే సందర్భంలో ఇదే శైలిలో పద్యం అందించిన ఇంకొక అత్యంత ప్రఖ్యాత కవి ఎవరు ?
జవాబు
"అరిజూచున్... హరిజూచు " పద్యం ఉత్తర హరివంశ కావ్యం లోనిది.
నాచన సోమనాథుడు రచించిన పద్యము
ఈ చక్కని పద్యం పోతన గారికి కూడా ఎంతో స్ఫూర్తి నిచ్చింది బహుశా . కొంచెం వ్యంగ్యంగా సోమన చెప్పిన భావాన్ని పోతన వాచ్యంగా చెప్పి అందమైన భావుకత నేలఁగొల్పాడు. భాగవతంలోనూ నరకాసుర వధ ఘట్టం ఉంది కదా. అక్కడ పోతన వ్రాసిన ఆ పద్యాన్నీ ఆస్వాదించండి
నాచన సోమనాథుడు రచించిన పద్యము
ఈ చక్కని పద్యం పోతన గారికి కూడా ఎంతో స్ఫూర్తి నిచ్చింది బహుశా . కొంచెం వ్యంగ్యంగా సోమన చెప్పిన భావాన్ని పోతన వాచ్యంగా చెప్పి అందమైన భావుకత నేలఁగొల్పాడు. భాగవతంలోనూ నరకాసుర వధ ఘట్టం ఉంది కదా. అక్కడ పోతన వ్రాసిన ఆ పద్యాన్నీ ఆస్వాదించండి
మ ll
పరు జూచున్ వరు జూచు నొంప నలరింపన్ రోష రాగోదయా
విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరుగన్ కన్నులు కెంపు సొంపు బరగన్ జండాస్త్ర సందోహముల్
సరసాలోక సమూహమున్ నెరపుచున్ చంద్రాస్య హేలాగతిన్
పరు జూచున్ వరు జూచు నొంప నలరింపన్ రోష రాగోదయా
విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరుగన్ కన్నులు కెంపు సొంపు బరగన్ జండాస్త్ర సందోహముల్
సరసాలోక సమూహమున్ నెరపుచున్ చంద్రాస్య హేలాగతిన్
4️⃣ అష్టదిగ్గజాలలో వికటకవి అయిన తెనాలి రామకృష్ణ కవి వ్రాసిన మొట్టమొదటి గ్రంధమేది ? ఆ గ్రంధాన్ని ఎవరికి అంకితం ఇచ్చారు
జవాబు
తెనాలి రామలింగడు వ్రాసిన మూడు గ్రంధములు
i) ఉద్భటారాధ్య చరిత్రము
ii) ఘటికాచల మహత్యము
iii) పాండురంగ మహత్యము
ఆయన వ్రాసిన మొదటి గ్రంధం ఉద్భటారాధ్య చరిత్రము..
ఉరేదేచమంత్రికి అంకితమిచ్చారు.
పాల్కురికి సోమనాధుడు రచించిన బసవ పురాణంలోని ఏడవ అశ్వాసంలో కల 38 పద్యాల ఉద్భుటారాద్య వృత్తాంతము ఆధారముగా రచించబడిన ఈ కావ్యము, మూడు అశ్వాసాలు, 842 పద్యాలు గల శైవ గ్రంథము.
దీనిలో కథానాయకుడు ఉద్భటుడు. ఇందులో మదాలస చరిత్ర, ముదిగొండ వంశ మూల పురుషుని కథ ఉన్నాయి. రామలింగడు ఈ కావ్యాన్ని కొండవీటి దుర్గాధ్యక్షుడైన నాదెండ్ల గోపన వద్ద ముఖోద్యోగిగా ఉన్న ఊరదేచమంత్రికి అంకితమిచ్చాడు.
5️⃣ "నా మతము తీవ్ర మహోగ్ర భయంకరంబుగా తిట్టితినా మహాగ్రహమతిన్" అంటూ కోపంతో ఉత్పలమాలిక చెప్పిన ప్రబంధ కవి ఎవరు ?
ఆ పద్యం ఎవరి మీద కోపంతో చెప్పాడని చారిత్రకారులు భావిస్తారు.
జవాబు
తెలుగు సాహితీ చరిత్రలో మొట్టమొదటి సుదీర్ఘమైన తిట్టు పద్యం గ చెప్పబడే ఈ పద్యాన్ని అందించిన కవి రామరాజభూషణుడు,
మొత్తం 25 పాదాల సుదీర్ఘమైన ఉత్పలమాల
ఈ పద్యాన్ని తిమ్మరుసు మీద కోపంతో చెప్పిన పద్యంగా భావింపబడుతుంది. పూర్తి పద్యాన్ని మరొకసారి అందిస్తాను.
6️⃣ తెలుగు పద్యంలోనే అందమైన సంస్కృత శ్లోకం కూడా చేర్చి చెప్పిన అష్టదిగ్గజాలలోని కవి ఎవరు ? ఈ కావ్యము ఏమిటి ?
జవాబు
పద్యంలో సంస్కృత శ్లోకం చేర్చి చెప్పిన కవి పింగళి సూరనామాత్యుడు. మీలో చాలా మంది అల్లసాని పెద్దనామాత్యుడు అని సమాధానం ఇచ్చారు. అల్లసాని వారు సంస్కృతాధారములలో సమానార్ధములో పద్యాన్ని అందించారు.
కందము
మాయమ్మానసునీవే
రాయలవైకావదేవరాజేజేజే
మాయాతుమలానినయది
పాయకసంతోసమున్నపలమిలసామీ
కళాపూర్ణోదయం లో ఇటువంటి పద్యాలు కనిపిస్తాయి.
7️⃣ తోలి తెలుగు స్వతంత్య్ర ప్రబంధ కావ్యంగా భావించే కావ్యము ఏది ? ఈ కావ్యం అందించిన ప్రబంధ కవి ఎవరు.
జవాబు
కళాపూర్ణోదయం
అష్టదిగ్గజాలలో ఒకరైన పింగళి సూరన రచించిన తెలుగు కావ్యం. దీనిని ప్రప్రథమ స్వతంత్రాంధ్ర నవలగా అభివర్ణించారు.
అంతకు ముందు వచ్చిన మిగిలిన ప్రబంధ కావ్యాలు అన్నీ సంస్కృతం నుండీ తీసుకున్నవో, పురాణాలు, రామాయణ భారతాల లోని కధల లోని అంశాలే.. కొంత కాల్పనికత జోడించి అందించిన మొట్టమొదటి ప్రబంధ స్వతంత్య్ర కావ్యము కళాపూర్ణోదయము.
8️⃣ "కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా, పురవీథి నెదురెండ బొగడదండ " అని బాధ పడిన ప్రఖ్యాత కవి ఎవరు ?
జవాబు
శ్రీనాధుడు
9️⃣ "కళా విలాసము" కావ్యం రచించిన ప్రఖ్యాత కవి ఎవరు ?
జవాబు
నన్నెచోడుడు
1️⃣0️⃣ "జాహ్నవీ మహత్యము" కావ్యం రచించిన ప్రఖ్యాత కవి ఎవరు ?
జవాబు
ఏనుగు లక్ష్మణకవి
**********************************
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి