1, సెప్టెంబర్ 2020, మంగళవారం

ఆదివారం ప్రత్యేకం, 30.08.2020, సాహితీ ప్రశ్నావళి

ఆదివారం ప్రత్యేకం - సాహితీ ప్రశ్నావళి - 30.08.2020,  

 

1.      వీరభద్ర విజయము రచన చేసినది ఎవరు ? పురాణం ఆధారంగా కావ్యం రచింపబడినది ?

 జవాబు

బమ్మెర పోతనామాత్యుని రచన వీరభద్ర విజయము

వాయుపురాణం ఆధారంగా వ్రాసిన కావ్యం.  నాలుగు ఆశ్వాసాల ప్రబంధ కావ్యం

 వీరభద్రుని జన్మ వృత్తాంతమూ, దక్షయజ్ఞము కావ్యానికి ఇతివృత్తము. 1960 దశకంలో వచ్చిన "దక్షయజ్ఞం" తెలుగు సినిమా కూడా కావ్యం ఆధారంగానే తీశారు

 

2.      ప్రబోధ చంద్రోదయము రచించిన తెలుగు కవులు ఎవరు ?

 జవాబు

ఒక వేదాంత రూపకాన్ని మొట్టమొదటి ప్రబంధ కావ్యంగా మలచిన ఘనత మన తెలుగు కవులది.

 మొదట కావ్యం రచించినది మల్లయ - ఘంటసింగన అనే జంట కవులు (వీరు పింగళి సూరన పూర్వీకులు)..

తరువాత అదే కావ్యాన్ని 19 శతాబ్దంలో వసురాయకవి వడ్డాది సుబ్బారాయుడు గారు మరోసారి తెలుగు వారికి వడ్డించారు

 

3.      రసికజనమనోభిరామము ఎవరి రచన కావ్యం ఇతివృత్తము ఏమిటి  ?

 జవాబు 

కావ్యరచన చేసినవారు కూచిమంచి తిమ్మకవి.  పూర్తి శృంగార ప్రబంధమే.

కావ్యంలోని  కందాష్టకం, కంద పద్యాలలో చేసిన శివస్తుతి చాలా ప్రసిద్ధి.

 గర్భితచరణదుర్ఘట సీసముగర్భితకందము వంటి ప్రయోగాలు ఇందులో కనిపిస్తాయి

రసికజన మనోభిరామం ఆరు ఆశ్వాసాల ప్రబంధం.

 మహాభారతంలో ఉపరిచర వసువు కథతో భట్టుమూర్తి వ్రాసిన వసు చరిత్ర కి సరైన ప్రౌఢిమనందించిన కావ్యంగా రసికమోనోభిరామము ఉండునని కూచిమంచి తిమ్మకవి చెప్పుకున్నారు

 "బహు పురాణములుప్రబంధముల్లక్షణ

శాస్త్ర ముల్వివిధ కోశముల

నాటకము లలంకార శాస్త్రములను

ప్రౌఢిమై నేత్రత్ప్రబంధ మెనొనర్చెద"

 అని చెప్పుకున్నారు  కావ్యం గురించి

 

4.      రామాభ్యుదయము కావ్యం రచన ఎవరిది ? కావ్యం ప్రత్యేకత ఏమిటి ?

 జవాబు 

రామాభ్యుదయము కావ్యం  అష్టదిగ్గజాలలో ఒకరైన అయ్యలరాజు రామభద్రుడు  గారి  విరచితం. కావ్యం ఎనిమిది ఆశ్వాసాల బృహత్ప్రబంధం; ఇందులో పద్దెనిమిది వందలకు పైగా పద్యాలున్నాయి. 1530 లో రచించిన కావ్యం అని మల్లంపల్లి వారి అధ్యయనంలో తెలిసిన విషయం

 రామాభ్యుదయము మిక్కిలి ప్రౌఢిమమైన అలంకారాలతోయమకానుప్రాసములను, పద గుంభనములతో కనిపిస్తుంది. రామాయణాన్ని ఇతివృత్తంగా వచ్చిన ఒకే ఒక్క ప్రబంధ కావ్యం రామాభ్యుదయం

 రామాయణంలోని నీతిని, షట్చక్రవర్తుల వైభవం, దశరధుని జననం నుండి అన్నీ వివరిస్తూ రామ పట్టాభిషేకం తో కావ్యం ముగిస్తారు. శూర్ఫణక శాప విమోచన కథ, రావణ పూర్వ జన్మ వృత్తాంతం వంటి విషయాలు కూడా కనిపిస్తాయి

  కావ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు కి అంకితం ఇవ్వాలనుకున్నారు కవి, కానీ ఆయన మరణానంతరం విసిగి రాజాశ్రయము ఎక్కడా దొరకక చివరికి శ్రీకృష్ణదేవరాయని అల్లుడయిన రామరాజు మేనల్లుడు అయినా గొబ్బూరి నరసరాజుకు రామాభ్యుదయము అంకితం ఇస్తారు.

 

5.      చారు చంద్రోదయము కావ్య రచన చేసిన కవి ఎవరు ? ప్రబంధం ఇతివృత్తం ఏమిటి ?

 జవాబు 

చారు చంద్రోదయము కావ్య రచన  చేసినవారు చెన్నమరాజు

 చారు చంద్రోదయము ఐదాశ్వాల ప్రబంధ కావ్యము. ఇది పూర్తి స్వతంత్ర ప్రబంధ కావ్యము. శ్రీకృష్ణుని కుమారుడైన చారుచంద్రుని అభ్యుదయము ప్రపంచానికి చెప్పిన ప్రయత్నం చారు చంద్రోదయము

  కావ్యంలో  ఎన్నో శబ్దాలంకారములు, అచ్చ తెలుగు పద ప్రయోగములు, సామెతలు, జాతీయాలు కనిపిస్తాయి

 ఛందో వ్యాకరణాలంకార విశేషాలుశైలీ విశేషములు, వర్ణన ఆద్యంత మహత్తరం అని డా పొట్లూరి భారతీదేవి గారి వివరణ.

 

6.      రాజశేఖరచరిత్రము ప్రబంధ కావ్యం ఎవరి రచన ? కావ్యం ఎవరికీ అంకితమీయబడినది ?

 జవాబు

రాజశేఖర చరిత్రము అని ప్రబంధము రచించిన వారు అష్ట దిగ్గజాలతో ఒకరైన మాదయ్యగారి మల్లన సృష్టి

మూడవ శతాబ్దం లో అవంతీ పురాన్ని పాలించే "రాజశేఖరుడు" అనే రాజు యొక్క యద్ధ విజయాలను, ప్రణయ విజయాలను వర్ణించారు.

 గ్రంథమును ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములో చేరకముందే రచించాడు.  సమకాలీన ప్రబంధ కవులకు భిన్నంగా, రాజశేఖర చరిత్ర యొక్క కథ పూర్తిగా మాదయ్యగారి మల్లన మేథోసృష్టే.  కావ్యానికి ఎటువంటి సంస్కృతమూలం లేదు. ఈయన సమకాలీనులతో పోలిస్తే, శృంగార వర్ణనలు చాలా సున్నితంగా, పరిమితంగా వ్రాశాడు.

కావ్యాన్ని వినుకొండగుత్తి సీమలను పరిపాలించిన నాదెండ్ల అప్పమంత్రికి అంకితమిచ్చారు.

శ్రీ కందుకూరి వీరేశలింగము గారు 1880 సంవత్సరంలో అందించిన రాజశేఖర చరిత్రము నవల ఇతివృత్తం పూర్తిగా వేరు.

 

7.      గయోపాఖ్యానం మొట్టమొదటి సారి తెలుగులో  వ్రాసిన  కవి ఎవరు ?

 జవాబు

గయోపాఖ్యానం మొట్టమొదటి సారి తెలుగులో వ్రాసిన వారు రామానాత్యుడు

  కావ్యాన్ని జనసామాన్యం అలరించే పద్యాలతో చక్కని నాటకంలా శ్రీ చిలకమర్తి వారు రచించారు. వీరు, వారి శిష్యులు టంగుటూరి ప్రకాశం గారు కూడా నాటకాల్లో రచించారు

  కావ్యం ఆధారంగా వచ్చిన తెలుగు సినిమా శ్రీకృష్ణార్జున యుద్ధము.

  

8.      నలచరిత్రము అను ద్విపద కావ్యం రచించిన కవి ఎవరు ?

 జవాబు 

నలచరిత్రము అన్న ద్విపద కావ్యం రచించిన వారు చక్రపురి రాఘవాచారి

కావ్యం ఆసాంతమూ ద్విపదలే కనిపిస్తాయి

 

9.  నిర్వచనోత్తర రామాయణము రచన ఎవరిది ? నిర్వచన విచిత్రరామాయణము రచన చేసిన కవి ఎవరు ?

జవాబు 

నిర్వచనోత్తర రామాయణము రచించిన వారు - తిక్కన సోమయాజి

నిర్వచన విచిత్ర రామాయణము రచించిన వారు వేల్పూరి వేంకటకవి

 నరసింహదేవర వెంకటశాస్త్రి గారు  రచించిన కావ్యం విచిత్ర రామాయణము.

 

 10.   భర్తృహరి సుభాషితాలు తెలుగులో అందించిన కవి / కవుల  పేర్లు తెలుపగలరు ?

 జవాబు

భర్తృహరి సుభాషితాలు తెలుగులోకి అనువదించిన మొదటివారు

ఎలకూచి బాలస్వరస్వతి (16 శతాబ్దం)

తరువాత తెనుగించిన వారు

ఏనుగు లక్ష్మణకవి (18 శతాబ్దము) మరియు 18 శతాబ్దానికి చెందిన పుష్పగిరి తిమ్మన.

 

అందరికీ నమస్సులతో స్వస్తి  ! సర్వేజనా: సుఖినోభవంతు.

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...