2, జనవరి 2021, శనివారం

25.12.2020, గీతా జయంతి, క్రిస్మస్,

 


నేడు పరమ పవిత్రమైన గీతా జయంతి.

మీకు బాగా పరిచయమున్న ఒకటి లేదా రెండు శ్లోకాలని యోగములోనివో పరిచయం చేస్తూ భావాలని "పద్యాలలోఅందించే ప్రయత్నం చేయగలరు 

 

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా,  ఔత్సాహికులు క్రీస్తు దివ్యబోధలని పద్యాలలో పరిచయం చేయగలరు



నేను ఎంచుకున్న కర్మసన్యాసయోగంలోని 16 శ్లోకానికి నా పద్యం.

కం ll

జ్ఞానమదే భవ్యమై   

జ్ఞానము పోకార్చు కాంతి సౌజన్యములై !

మానితమై తత్వమువి

జ్ఞానము సత్యమగు నిత్యచైతన్యమదే !

ఈరోజు గీతా జయంతి సందర్భంగా నా సమర్పణ..

ప్రపంచంలో   గ్రంథానికి జయంతి నిర్వహించబడదుఒక్క భగవద్గీతకు మాత్రమే గౌరవం దక్కింది ..

 

భగవద్గీతలో అన్ని  శ్లోకాలు అద్భుతమైవే.. అయినా అందులో నుండి  ప్రతి మనిషికి  మరియు  మేనేజ్మెంట్ పాఠాలు గా సహాయపడే ఒక మూడు శ్లోకాలను ఇక్కడ పేర్కొన్నాను...

 

1.

*కర్మణ్యేవాధికారస్తే

మా ఫలేషు కదాచన |

మా కర్మ ఫలహేతుర్భూ:

మాతే సంగోస్త్వకర్మణి ||

 

వ్యాఖ్యానం:*

అంటే, "నువ్వు కర్మలు చేయడానికి మాత్రమే. కర్మఫలాలకు అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో ఎట్టిపరిస్థితుల్లో కర్మలు చేయకు. అలాగని చేయడం మానకు" అని అర్ధం.

 

ప్రతీ ఆంట్రప్రెన్యూర్ కు శ్లోకం వర్తిస్తుంది. చేయాల్సిన పని గురించి  నిక్షిప్తమైన సార్వజనీన సత్యం ఇది. ప్రతీ వ్యాపారి లేదా ఉద్యోగి ఇదే సూత్రం మీద పనిచేయాలి. ప్రతిఫలం గురించి ఆశించకుండా చేసుకుంటూ పోవడమే. ప్రాసెస్ ఎంజాయ్ చేసుకుంటూ తీరం చేరుకోవాలే తప్ప.. ఎంతసేపూ ఫైనల్ ఔట్ పుట్ మీదనే ఏకాగ్రత చేయొద్దు. అలా అని పూర్తిగా ఆశావాదం లేకుండా పనిచేయమని కాదుఫలితాల మీద వ్యామోహం తగదు అని.

 

2.

*వాసంసి జీర్ణాని యథా విహాయ

నవాని గృహ్ణాతి నరోపరాణి |

తథా శరీరాణి విహాయ జీర్ణాని

అన్యాని సంయాతి నవాని దేహీ ||

 

వ్యాఖ్యానం:*

అంటే,"చిరిగిపోయిన బట్టలను పడేసి, మనం కొత్తబట్టలు ఎలా కట్టుకుంటామో, జీర్ణమైన శరీరాన్ని వదిలిన ఆత్మ కూడా- మరోకొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది" అని అర్ధం.

 

ఆంట్రప్రెన్యూర్లు కూడా అంతే. వెర్సటాలిటీ చూపించాలి. దేన్నయినా స్వీకరించేలా ఉండాలి. అవే సక్సెస్ రుచి చూపిస్తాయి. ముఖ్యంగా మార్పును ఎప్పటికప్పుడూ గమనించాలి. కొత్త ట్రెండ్ ఫాలో అవ్వాలి. నా ఇష్టం- నాకు ఇదే ఇష్టం అంటే- వాళ్లు అక్కడే ఉండి పోతారు. అలా కాకుండా కొత్తదాని కోసం అన్వేషించాలి. కొత్తదనాన్ని ఆహ్వానించి కొత్త అవకాశాల కోసం ఎదురుచూడాలి. అదే నిజమైన ఆంట్రప్రెన్యూర్ లక్షణం. బిజినెస్ అంటేనే నిరంతర ప్రయాణం. నాలుగు గోడల మధ్యనే ఉంటే ప్రపంచం ఏనాటికీ అర్ధం కాదు. మొండిగా ఉండొద్దు. ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలి. సంకుచిత భావాలు వదిలేయాలి. స్పాంజి నీళ్లను పీల్చుకున్నట్టు అనుభవాల్ని పాఠాలుగా మలుచుకోవాలి. అప్పుడే గమనం వేగం అందుకుంటుంది.

 

3.

*క్రోధాద్భవతి సమ్మోహః

సమ్మోహాత్ స్మృతి విభ్రమ

స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్దినాశాత్‌ప్రణశ్యతి||

 

వ్యాఖ్యానం:*

అంటే, "కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల మతిమరుపు, మరుపుతో బుద్ధినాశనం, బుద్ధినాశనంతో మనిషే నాశనం." అని అర్థం.

 

ఇదొక యాంగర్ మేనేజ్‌మెంట్ లాంటిది. ఆంట్రప్రెన్యూర్లకు ఎక్కువగా ఉండాల్సిన లక్షణం. లేకుంటే చెప్పుడు మాటలు విని, వాస్తవాలతో పనిలేకుండా ఆలోచించి బుర్రపాడు చేసుకుంటారు మరియు  మైండ్ లో ఒకరకమైన కన్ ఫ్యూజన్ పుడుతుంది. దాంతో సహజంగానే మతిమరుపు వస్తుంది. ఆటోమేటిగ్గా లక్ష్యం నుంచి తప్పుకుంటాం. అందరిముందు నవ్వుల పాలవుతాం. అందుకే కోపాన్ని జయించాలి. ఎట్టి పరిస్థితుల్లో సహనం కోల్పోకూడదు.

 

CA కె మల్లికార్జునరావు

 

 

"కృష్ణంవందే జగద్గురుమ్"

భగవద్గీత ను ప్రతి హిందువు విధి గా చదవాల్సిందే. చనిపోయిన తర్వాత పారాయణ ము చేసేది కాదు.జీవించి ఉన్నపుడు  చదవాలి.గీత అనేది జ్ఞాన బండారం.జ్ఞానం అందరికి అవసరం.జీవితములో వచ్చే సమస్యలను దుఃఖం ను కష్టాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇస్తున్నది గీత ఉపనిషత్ ల సారాంశం.కర్తవ్యాన్ని ధర్మాన్ని బోధిస్తుంది. మనలో పిరికి తనము తీసేసి ధైర్యాన్ని నిపుతున్నది.ఆత్మ విశ్వాసము ఇస్తుంది.వ్యక్తిత్వ వికాసం మానసిక వికాసం నిర్మాణమౌతది

నేను చేయగలను అనే నేను మారగలను మార్చ గలను. అనే canfidenes వస్తది. నేను ఎవరిని? నాకు సృష్టికి సృష్టి ని సృష్టించిన భగవంతుని కి సంబంధం ఏమిటి ? జీవం అనగా నేమి? జ్ఞాన కర్మ భక్తి ఎలా చేయాలి.నేను ఎలా ఆనందంగా ప్రశాంతంగా ఉండాలి.కోపం అసూయ ద్వేషం ..ఇంద్రియ నిగ్రహం ధ్యానము ..అసుర గుణాలు దైవీ గుణాలు భక్తుని గుణాలు  మనిషి ఎలా ఉండాలి.ఎలా ఉండకూడదు.ఏమి తినాలి ఎలాంటి ఆహారం తినాలి.ప్రకృతి ఏమిటి?యోగం అంటే ఏమిటి ఎలా మాట్లాడాలి ?ఎలాంటి విషయాలను .. తల్లి లాగా మనకు అర్థం చేస్తుంది.గీత .గీత చదివిన వారు మహాత్ములు గా గొప్ప వరయ్యారు.నేడు గీతను చదవకుండా మన జీవనమును నడుపుతున్నాం. అందుకే మన  వ్యక్తి గత జీవనము సామాజిక ము అధపథనం చూస్తున్నాం.చట్టాల వలన మనిషి మారాడు.మనిషి తనకు తాను మారాలి .బుద్ది మారాలి.దానికి నిజమైన  శ్రేష్ఠమైన జ్ఞానం కావాలి.అది ప్రేమతో తల్లి హృదయము తో గీత నిజమైన జ్ఞానం ఇస్తుంది. నా దక్కరు కు రా !నీ జీవనము అందంగా పవిత్రంగా చేసుకో అంటున్నది గీత.చేయనిది రాదు చేసింది పోదు ఉచితముగా లభించదు.కర్మ చేయాలి భగవంతుణ్ణి ప్రార్థించాలి.ఇలా ఎన్నెన్నో విషయాలు అర్థం చేయించి ...

సామాన్య మానవున్ని... గొప్పవాని గా ...పురుషోత్తముని గా  భక్తునిగా ..భగవంతుని కుమారునునిగా తయారు చేస్తున్నది.మన తల్లి గీత మా

అందరం గీతను చదువుదాం. మంచి మనుషులు గా అతల్లి కోరుకునే విధంగా ఈ విశ్వమును సుందరంగా దివ్యంగా భవ్యంగా తయారు చేసి అతల్లికి సమర్పిద్దాం

"కృష్ణంవందే జగద్గురుమ్"

 

శా ||

యుక్తాయుక్త విచక్షణల్ నెఱిఁగి శ్రేయోమార్గముల్ చిత్తమున్ 

యుక్తంబౌ నియతిన్ భుజించగ సదా యోచించు విన్యాసమై      

_యుక్తంబౌ విధులే మనంబున మహాయోగ్యమ్ములై జ్ఞానమై_

శాక్తేయంబుల యోగమై, భవములై, సంవేద్యమౌ సంపదై

 

కస్తూరి శివ శంకర్

 

 

తేటగీతి

కర్మ ఫలమునాసక్తి లేక,నొనరించ

 కార్యములనధికారంబు గలదు గాని,

 కర్మ ఫలముల కధికారి గాదని, విధి

 యుక్త ధర్మము లందనాసక్తి వలదు!!

 

 

తేటగీతి

మతముగిరి గీసుగొనుట సన్మతము గాదు

లోకమేమెరుగును నూతి లోని గప్ప !

సర్వమతములు బుట్టెను శాంతి కొరకె

విశ్వ సౌభ్రాత్య భావనే విజ్ఞతగును!!

 

 

2. సంస్కృత మూలం భగవద్గీత

 

వాసంసి జీర్ణాని యథా విహాయ

నవాని గృహ్ణాతి నరోపరాణి |

తథా శరీరాణి విహాయ జీర్ణాని

అన్యాని సంయాతి నవాని దేహీ ||

 

తెలుగు లో నా తేటగీతి పద్యము

 

 విడచి పాత వలువలు తాదొడుగు నూత్న

 వస్త్రముల కైవడి, శిధిల వపువు వీడి !

 క్రొత్తదౌ యుపాధిని జేరు కోరి యాత్మ

 సత్యమిదియె ధనుర్ధరా శాంతి నొందు!!

 

డా. నాగులపల్లి

 

 

ఆటవెలది

సమము బుద్ధి గలిగి జనియించి యుండిన

తాముజేయుకర్మ ధర్మమొదలి

జాత మృత్యు చక్ర సంబంధమీడును

మోక్ష మొందు వారుసుఖముగాను             

 

భావం వచనంలో :

సమత్వ బుద్ధిగలవారు, తాముకర్మలుచేసినా     ఆ కర్మలను విడిచి పెడతాడు.            

అటువంటివాడు జనన మరణచక్రమునుండివిడిపడతాడు.శాశ్వత సుఖము నిచ్చు మోక్షము      పొందుతాడు.

 

హేమలత

 

 

శ్రీ మల్లిఖార్జున రావు గారు ఆణిముత్యాల వంటి భగవద్గీత శ్లోకాలను చాలా గొప్పగా వివరించారు....వారికి కృతజ్ఞతలు చెబుతూ, ఆ శ్లోకాల భావాన్ని పద్యాలలో చెప్పే చిన్ని ప్రయత్నం చేస్తాను...దయచేసి భావాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని చూడండి...యిది true translation కాబోదు....

 

 గీతా జయంతి సందర్భంగా........

1.

*కర్మణ్యేవాధికారస్తే

మా ఫలేషు కదాచన |

మా కర్మ ఫలహేతుర్భూ:

మాతే సంగోస్త్వకర్మణి ||

 

వ్యాఖ్యానం:*

అంటే, "నువ్వు కర్మలు చేయడానికి మాత్రమే. ఆ కర్మఫలాలకు అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో ఎట్టిపరిస్థితుల్లో కర్మలు చేయకు. అలాగని చేయడం మానకు" అని అర్ధం.

 

 నా పద్యం .**

కర్మలందధికారము కలిగి లేదు

జేయు కర్మముల్ తప్పక, జెప్పినట్లు

ఫలిత మాసించి జేయకు పనుల నెపుడు

పనులు మానక జేయుము పట్టువిడక

2.

*వాసంసి జీర్ణాని యథా విహాయ

నవాని గృహ్ణాతి నరోపరాణి |

తథా శరీరాణి విహాయ జీర్ణాని

అన్యాని సంయాతి నవాని దేహీ ||

 

వ్యాఖ్యానం:*

అంటే,"చిరిగిపోయిన బట్టలను పడేసి, మనం కొత్తబట్టలు ఎలా కట్టుకుంటామో, జీర్ణమైన శరీరాన్ని వదిలిన ఆత్మ కూడా- మరోకొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది" అని అర్ధం.

 

 నా పద్యం..**

పాత బట్టలు దూరంగ పారవైచి

క్రొత్త దుస్తులు ధరియించె క్రొత్తగాను

నటులె వేగంగ వెళ్లురా యాత్మగూడ

క్రొత్త దేహంబు లోనికి క్రొత్తగాను...

3.

*క్రోధాద్భవతి సమ్మోహః

సమ్మోహాత్ స్మృతి విభ్రమ

స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్దినాశాత్‌ప్రణశ్యతి||

 

వ్యాఖ్యానం:*

అంటే, "కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల మతిమరుపు, మరుపుతో బుద్ధినాశనం, బుద్ధినాశనంతో మనిషే నాశనం." అని అర్థం.

 

నా పద్యం..***

కోపమెక్కువైన నవివేకులుగమారు

బలము, జ్ఞాపక శక్తియున్ పట్టు సడలు

బుద్ది దూరమౌ, జ్ఞప్తియుంబోవు పిదప

మనిషి నాశన మౌనుగా మనిషి చేత....

 

 

క్రిస్మస్ పర్వదిన సందర్భంగా...   

తేటగీతి

క్రీస్తు జననము బోధించె ప్రేమ, కరుణ

దయయు, ,క్షమమును దెలిపిన దైవమతడు

సర్వ మతముల నెతికినా సార మదియె

యేసు ప్రభువును ప్రార్థింతు హితము గోరి....

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

వాడు ,వీడు,నేను

అప్పటి బడిలో ఇప్పటి కొలువుల్లో

అన్ని మతాల వారందరం

స్నేహితులం, సోదరీసోదరులం

సవ్యమైన జీవన మార్గాల్ని , విధాల్ని తెలుసుకుంటూ ,

ఆచరిస్తూ సులువైన సేవల నందరికీ అందించ

గలగడం మతాలందరి పవిత్ర గ్రంధాల సారము , సారాంశమూనూ !

ఆ దేవుడే అందరితో అందరిలో ఆ దేవుడే

 

జి మురళీ మోహన్ రావు

 

కం ౹౹

భగవద్గీత ప్రబోధక !

జగమే నీ తత్వమెరిగి సాష్టాంగమిడన్

జగతికి నీవే గురువై

అగణితగుణ ధామ! కృష్ణ ! నర్చింతు సదా.

గీతా జయంతి సందర్భంగా రెండు శ్లోకాలు,భావాలు,వాటికి నా ఆంద్రీకరణ పద్యాలు.

నాల్గవ అధ్యాయం - జ్ఞాన కర్మ సన్యాస యోగం లో 39 శ్లోకం

 

శ్రద్ధా వాన్ లభతే జ్ఞానం

తత్ పరస్సం యతేంద్రియః

జ్ఞానం లబ్ధ్వా పరాం

శాంతి మచిరే నాధి గచ్ఛతి.

 

భావం:

 శ్రద్ధ కల్గిన జితేంద్రియు డైన మనిషికి భగవత్ తత్వ జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం లభించిన వెంటనే భగవత్ తత్వరూపమైన పరమ శాంతిని పొందును.

 

భావం ఆటవెలది లో

శ్రద్ధ గల్గు నరుడు జ్ఞానమ్ము పొందును

దాని పొందినంత త్వరితముగను

సదయ దైవ రూప శాంతిని పొందును

శ్రద్ధ చూప వలయు సకల జనులు.

 

మరో శ్లోకం.

16 అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగం లో 21 శ్లోకం

 

త్రి విధం నరకస్యేదం

ద్వారం నాశనాత్మనః

కామః క్రోధస్తధా లోభః

తస్మా దేతత్రయం త్యజేత్.

 

భావం:

కామ క్రోధ లోభ ములు అను మూడు నరక ద్వారములు.అవి ఆత్మ నాశనమునకు కారణములు.కనుక మూడింటిని త్యజింప వలెను.

 

భావం తేటగీతి లో

కామము మరియు క్రోధము గాఢ లోభ

మనెడు మూడును శత్రువు లాత్మ నా శ

కారణములు నరకమును జేరవేయు

నవ ని జనుల కా మూడును త్యా జ్య మౌను.

డి.రామ నాగేశ్వరరావు.

 

భగవద్గీతార్థం గా

తే.

నరుడ! ఇంద్రియ నిగ్రహం బెరిగి దైవ

చింతనందు మనసు నిల్పి శ్రేష్టమైన

జ్ఞానసంపదన్ గడియించు మానవుండె

రహిగ స్థిర బుధ్ధిమంతుడై మహిమనొందు

 

యేసుక్రీస్తు బోధన గా

తే.

నీతి కొరకు ప్రాభవముగ నిలబడంగ

నతడు పలు హింసలకు గురి యగుదు రట్టి

వానికి ప్రభు కరుణ కూడి పావనునిగ

దైవ రాజ్యము బ్రాప్తించు తథ్యమిదియె

 

వెంకట్.సి హెచ్

 

 

గీతా జయంతి సందర్భంగా , ప్రణాళిక అనుసరించి భగవానుని గీత లో

నవమాధ్యాయంరాజవిద్య రాజగుహ్యా యోగములో

 

శ్లోకము:

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి|

తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః|| 9-26 ||

 

అర్థం:

నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకుగాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, లేదా నీరైనా గాని సమర్పిస్తే, స్వచ్ఛమైన మనస్సుగల నా భక్తుని చే ప్రేమతో ఇవ్వబడిన దానిని, నేను సంతోషంగా ఆరగిస్తాను.

 

తేటగీతి లో నా పద్య పుష్ప సమర్పణ:

భక్తితోడ యర్పణ చేయు ఫలము గాని

పత్రమయిన పూవయినను పానియంబు

నిర్మల మనము భక్తితో నిచ్చు వాని  

ప్రేమగని  విడువక గాతు  ప్రీతిమేర

 

సతీష్

 

 

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన

మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి .

 

శ్లోక సారమును పూర్తిగా వినియోగించుట చాలా అవసరము .

ఉద్యోగులు వారి వారి విధులను సవ్యంగా, నిస్వార్ధంగా నిర్వర్తించితే దాని ఫలితములు గురించి చింత పడనక్కరలేదు .

ఆందోళన పడువారు ఖశ్చితముగా విధులు విస్మరించిన వారవుదురు .

అలా వారి విధియే వారిని వీధికో లేక కటకటాల వెనుకకో పంపును .

కావున అందరూ తమ విధులను నిజాయితీగా, నమ్మకంగా నిర్వహిస్తూ  వారి సేవలు అందరికీ సమయంలో అందునట్లు  చేయవలయును .

 

జి మురళీ మోహన్ రావు

 

 

భగవద్గీత - 10.78

యత్ర యోగీశ్వరః కృష్ణో    యత్ర పార్థో ధనుర్ధరః

తత్ర శ్రీర్విజయో భూతిర్    ధ్రువా నీతిర్మతిర్మమ

 

.వె /

యోగివరులకెల్ల యోగివై సత్యమై

సవ్యసాచి యెందు సరసనుండు

నందుఁ దప్పకుండ నమరు శ్రీలు గెలుపు

ధర్మ మదియు నాడు తాండవమ్ము

 

వై శ్రీదేవి

 

సీ.

భగవానుడు వచింప పావనమౌ దివ్య గీతను కడగి తా ప్రీతి తోడ

నిత్యసత్యములన్ని నిరతిశయమ్ముగ విశదపరచినట్టి విపులరాశి;

పరమ రహస్యముల్వాసిగా వివరించు గంభీర భావంపు కమ్రవాణి;

సకల వేదార్థాల సారమై వరలుచు పరమ సుందరమాయె భవ్యగీత!

 

.వె.

భక్తి జ్ఞాన కర్మ భావనా లహరుల

విహిత పరచు గీత మహిమ నెఱిగి

శ్రవణ కీర్తనాది సాధనముల తోడ

తలచు వారి జన్మ ధన్యమవదె!

చల్లా దేవిక

 

 

ఈ రోజు గీతాజయంతి . భగవద్గీతను క్లుప్తంగా ఒక అధ్యాయంగా , పద్మభూషణ్ శివ్. కె.కుమార్ గారు , తమ ఆంగ్ల మహాభారతంలో అందించారు. దానిని తెలుగు అనువాదం చేశారు శ్రీ డి. చంద్రశేఖర్ రెడ్డి గారు. శ్రీ శివ్ కె.కుమార్ గారు హైద్రాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లో ఆంగ్ల శాఖ అధ్యక్షులుగా పదవీవిరమణ చేశారు. మిత్రులు వినడం కోసం క్లుప్తంగా భగవద్గీత....గీతాజయంతి సందర్భంగా.

కొప్పర్తి రాంబాబు ,

 

భగద్గీత కొన్ని ఆలోచనలు: 2017 లో నా ఫేసుబుక్ పోస్టింగ్ మళ్ళీ ఉంచుతున్నాను :     చిన్నప్పటి నుంచి, భగద్గీత గురించి వినడం, గీతా శ్లోకాలను వినడం, 1986 లో స్వామీ చిన్మయానంద "గీతా జ్ఞాన యజ్ఞం " పేరుతో చేసిన అద్భుత  ప్రసంగాలు ఒక వారం పాటు భీమవరంలో వినడం, చదివినా చదవకపోయినా, రాసినా రాయకపోయినా  ప్రతిఏటా గీతా ప్రెస్ గోరఖ్ పూర్ వాళ్ళ డైరీ "గీతా దైనందిని " కొని భద్రంగా దాచడం, ఘంటసాల భగవద్గీత , అనేక సందర్భాలలో (.....మంచీ చెడూ కూడా ) వినవస్తుంటే వినడం, సినిమా మాటల్లో పాటల్లో ....."గీతార్థ సారమిచ్చి గీతలన్నీ మార్చేనే " అని కృష్ణ భగవానుడు , నుడివిన , ఆ మహా ఏక వాక్య కావ్యం " భగద్గీత " గురించి ఇప్పటికిప్పుడు వచ్చిన నా ఆలోచనలు కొన్ని పంచుకోవాలి అనిపించి రాస్తున్నాను.........

 భగవద్గీత పుట్టుకే అసలు బహు ప్రశస్తమైనదీ, విశిష్టమైనది. ఎందుకంటే అది చావు పుట్టుకల మధ్య సందేహంలాగా సాగే జీవితంలో  ఎదురయ్యే సమస్యలకి పరిష్కారమార్గ నిర్దేశం సూచించే  ఒకానొక ఆధ్యాత్మిక భావనా  పేటిక. మానవ  జీవన గ్రంథానికి పీఠిక.భగవద్గీత  ప్రభవించిన  ప్రదేశం " యుద్ధ భూమి " .అశాశ్వతమైన అధికారం, రాజ్యం, భోగ భాగ్యాలు వీటికోసం రక్తం పంచుకుపుట్టిన అన్నదమ్ములు రక్త పాతానికి సిద్హ పడిన సందర్భంలో , శత్రువుని జయించగల ( ఇక్కడ నేను ఓడించగల అన్న మాట వాడటంలేదు ) భుజశక్తి ఉన్న ఒక మహా వీరుడు , గెలుపు ఓటములను గురించి ఆలోచించకుండా , సాధారణ మానవునివలే ఆ క్షణంలో రాగ ద్వేషాలకు  లోనయి భగవంతుడిని ఆశ్రయించి , ప్రశ్నించి , రాబట్టుకున్న జీవన సూత్రాల సమాహారం  భగవద్గీత.

 స్మృతి అని ఎందుకు అనాలి అంటే భగవద్గీతలో మనుషులు, అంటే మనం అనుక్షణం , అడుగడుగునా గుర్తుకు తెచ్చుకోవలసిన బ్రతుకు మాటలు, బ్రతికించే మాటలు, బ్రతుకునిచ్చే మాటలు, బ్రతకాలి అనిపించే మాటలు అనేకం శ్లోకాల రూపంలో సూత్రీకరించబడి ఉన్నాయి. అవి అన్నీ కూడా వివిధ యోగాలు కింద విభజన చేసి ఉన్నాయి. జీవితంలో కష్టం, సుఖం, లాభం , నష్టం, ఆశ , నిరాశ, నిట్టూర్పు , ఓదార్పు, జయం, భయం, బాధ, సంతోషం .........ఇవి అన్నీ కూడా ఒకదానివెంట ఒకటి ఉంటూనే ఉంటాయని, వాటిని అధిగమించి , మనిషి జీవితంలో ఆధ్యాత్మిక జీవన విజయ పథగామి ఎలా కావాలో వివరించే శ్లోకాలు భగద్గీతలో ఉన్నాయి.

 తన ఎదురుగా మోహరించి ఉన్న తాత, తండ్రులు, సోదరులు,మేనమామలు , వీరిని శత్రువులుగా భావించి (?) సంహరించడానికి ఉద్యుక్తుడు కావడం సామాన్యం కాదు.తీరా సిద్హ పడ్డాక , మనిషికి సహజంగా ఉండే రాగ బంధం మూలంగా  పిరికితనంగా బయటపడ్డాడు అర్జునుడు. ఆ సమయంలో కృష్ణ భగవానుడు , ఒక మహా మానవ  మారణ హోమాన్ని ధర్మ యుద్ధం గా ప్రకటించి  మనిషిని కర్తవ్య నిర్వహణకు  సిద్ధం చేసి కార్యోన్ముఖుడిని చేసిన ఒక 18 భాగాలు (యోగాలు ) 700 వందల శ్లోకాల గానం. భగద్గీత. మానవ జీవన విధాన గీతం, విధాత తలపున ప్రభవించిన ఆద్యంతాలు లేని అనాది జీవన గానం. కాల నిర్ణయం జరిగి ఉండచ్చు, కురుక్షేత్ర యుద్ధ సమయాన్ని బట్టీ ! కానీ కాలాలకు , అతీతమైన జీవన సూత్రాలను , ఒక క్రమ పద్ధతిలో సూత్రీకరించి ప్రవచించిన స్మృతి భవద్గీత.

 రోజువారీ జీవితంలో ఎదురయ్యే అనేకానేక సమస్యలు  , సమస్యలుగా కనిపించినా, పరిష్కారం వెదికే దిశలో , సమస్య యొక్క చిక్కుముడిని విప్పేక్రమంలో ఏ విధమైన ఆలోచనా ధోరణిని అలవర్చుకోవాలి అనిచెప్పేది భగవద్గీత. ధర్మము, జ్ఞానముమోక్షము .....ఈ మూడింటిని ఏ విధంగా అనుసరించి , సమకూర్చుకుని , సాధించాలి అనేది గీత యొక్క సారాంశం.

 వ్యక్తిత్వ వికాస పుస్తక రచనకు మూల సూత్రాలను అందించే అమృత వాహిని భగద్గీత. అటువంటి భగద్గీతను , మతంతో ముడిపెట్టడం అవసరమా ? సంకుచితమైన జాతి మతాల సరిహద్దుల్ని చెరిపివేసి అకుంఠితమైన మానవీయ పతాకను ఎగురవేయాలి అంటే గీతా గానం చేసుకోవాలి.మనసుని అమృత భావనా ధారలతో నింపుకోవాలి. భగవద్గీత లోని విషయాలను , క్లుప్తంగా చెప్పే అవకాశం నేను తీసుకోదల్చుకోలేదు. ఎందుచేత అంటే గీతా శ్లోకాలను పట్టుపట్టి కూర్చుని చదివి అర్థం చేసుకుని , వివరణ ఇచ్చిన మహానుభావుల వ్యాఖ్యాన గ్రంధాలు అనేకం ఉన్నాయి. అదీగాక భగవద్గీత లోని ప్రతి అధ్యాయం ఒక మహోపన్యాసం.ప్రతి శ్లోకం అనేక సానుకూల ఆలోచనా ధోరణుల  సమిస్రితం . భగద్గీత గురించి ఎంటచెప్పినా తక్కువే , తరగని గని ఆ దైవవచనం.

 భగవద్గీత 18 భాగాలుగా విభజించబడినా ప్రధానంగా , సాంఖ్య యోగంకర్మ యోగం, ధ్యాన యోగంజ్ఞాన యోగంరాజ యోగం, భక్తి యోగము, మోక్ష యోగము ఎక్కువగా వ్యాఖ్యానించ బడిన , అర్థ వివరణ ఇవ్వబడిన యోగాలు. గీతకు వివరణ, భాష్యము, దేశ విదేశాలలో , దాదాపుగా అన్ని ప్రపంచ భాషలలో , శ్లోకానికి శ్లోకం , వాక్యానికి వాక్యం,పదానికి పదం , అర్థం వెతుక్కుని, ఆలోచించి, ఒకరకంగా కాదు పలురకాలుగా విశ్లేషించి , వివరించిన మహానుభావులు ఎందరో ఉన్నారు.వివేకానందుడు, గాంధీ మహాత్ముడు, బాల గంగాధర తిలక్, సర్వేపల్లి రాధాకృష్ణన్ వీళ్ళందరూ మనకు తెలిసిన పేర్లు.స్వరాజ్య ఉద్యమంలో , జాతీయ భావ ప్రచారంలో గీత మనదేశ నాయకులకి ఒక స్ఫూర్తిగా నిలిచి, ప్రజలకి దిశానిర్దేశం చేయించేందుకు అవసరమైన మానసిక బలాన్ని ఇచ్చిన వికాస గ్రంథం.

 పాఠ్య అంశంగా ప్రవేశ పెడితే , హైస్కూల్ స్థాయి నుండి  ప్రతి తరగతిలో ఉన్న ప్రతి విద్యార్థి అర్థం చేసుకోగల స్థాయిలో ఉన్న శ్లోకాలను సమీకరించి , ఏర్చి కూర్చి చేర్చాలి.భక్తి యోగం ఏమిటి జ్ఞాన యోగం ఏమిటి, తెలుసుకుంటే ఎంసెట్ లో ర్యాంకు రాలేదని భయపడి ఆత్మ హత్య చేసుకునే విషాద యోగం లోకి యువత జారదు. ఇది సత్యం.ఇది నిత్యం.ఇది విధి.

 మీ కొప్పర్తి రాంబాబు

 

 

కర్మ సన్యాసయోగం నందలి 22 శ్లోకం

 

యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తేl

ఆద్యంతంవంతః కౌంతేయ తేషు రమతే బుధః  ll22ll

 

తాత్పర్యం :

విషయేంద్రియ సంయోగము వలన ఉత్పన్నములగు భోగములన్నియును భోగ లాలసులకు సుఖములుగా భాసించినను, అవి దుఃఖ హేతువులు, అనిత్యములే.కావున వివేకి వాటి యందు ఆసక్తుడు కాడు.

 

తే.గీ.

ఇంద్రియమ్ముల భోగమ్ములింపుయనుచు

విషయ భోగ లాలసతోడ వేష్టితమవ

దుఃఖ భాజనులై కడు దురపిల్లు

గావున వివేకి చూపడు కౌతుకమ్ము!

చల్లా దేవిక.

 

 

భగవద్గీతయందలి సాంఖ్యయోగము లోని శ్లోకములు సుపరిచితములు. కానీ నిత్యజీవితములో పాటించుట మిక్కిలి కష్టమగును అను భావంలో...

1️ వాసాంసి జీర్ణాని....నవాని దేహి...

 

ఆట వెలది:

ఆత్మయన్న జూడ నాకారమది లేదు

జీవమున్న సకల జీవులందు

ముసలి దేహము విడి మసలును మరియొక

కాయమందు జేరి కర్మ జేయు.....

 

2️ జాతస్యహి....శోచితుమర్హసి

 

తేటగీతి:

పుట్టిన మనిషికంతము గట్టి చర్య

యనుచు వేదముల్ ఘోషించుయనితరముగ

బంధములు విడజాలని బంధుగణము

నిజము తెలిసికూడ సతము నీల్గుచుండు.....

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

* భగవద్గీత విశిష్టత*

లోకంలో మరే ఇతర గ్రంధాలకి లేని విశిష్టత ఒక్కభగవద్గీతకు మాత్రమే ఉంది.

 

1) ఏమిటా విశిష్టత? 

అవతారమూర్తులు,మహర్షులు,మహానుభావులు జన్మించినప్పుడు వారివల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది. మహానుభావులు లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞత గా వారి జన్మదినాన్నిజయంతిగా జరుపు కుంటారు.

అలాగే భగవద్గీత వల్ల లోకానికి చేకూరిన మహోపకారం వల్లగీతాజయంతిని జరుపుకుంటారు. ప్రపంచం లో ఒక్క ఇతర గ్రంధానికి కూడా జయంతి లేదు.

 

2)ఏమిటి భగవద్గీత వల్ల లోకానికి కలిగిన ప్రయోజనం..?

సుమారు 5200 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మహానిర్వాణం సమీపిస్తున్న సమయంలో.. కలియుగం కారుమేఘం లాంటి అజ్ఞనం తో ప్రవేశిస్తున్న తరుణంలో.. అజ్ఞనపు గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ..మానవజాతి పై వెలుగులు విరజిమ్ముతూ భగవద్గీత ఉదయించింది.

 

3) ఏముంటుంది భగవద్గీత లో..?

ఏది తెలిస్తే మానవుడికి ఇంక మరేదీ తెలియాల్సిన అవసరం లేదో

ఏది ఆత్మ, పరమాత్మ తత్వాన్ని సమగ్రంగా వివరించగలదో..

ఏది మనిషిని ముక్తి మార్గం వైపుకి నడిపించగలదో.. అదే ఉంటుంది.

 

నూనె రాస్తే రోగాలు పోతాయి..దయ్యాలు వదిలిపోతాయి లాంటి మూఢనమ్మకాలు ఉండవు. నన్ను నమ్మనివాన్ని చంపండి అనే ఉన్మాదం ఉండదు. నన్ను దేవుడిగా ఒప్పుకోనివాన్ని నరకంలో వేసి కాలుస్తా అనే పైశాచికత్వం ఉండదు.

 

4) భగవద్గీత చదివితే వైరాగ్యం కలిగి జీవితం పై ఆసక్తి పోతుందా..?

భగవద్గీత విన్న అర్జునుడు అడవులకి పోలేదు..  గాంఢీవాన్ని ధరించి కదనక్షేత్రానికి వెళ్లాడు.  భగవద్గీత కర్తవ్య విముఖుడు ఐనవాడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది.

 

5)భగవద్గీత శాస్త్రీయ గ్రంధమా..?

ప్రపంచం లో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలందరూ భగవద్గీత ని కోట్ చేసినవాళ్ళే..  భగవద్గీత ని మొదటిసారి చదివిన రోజు నా జీవితంలో అత్యంత అమూల్యమైన రోజు అని బహిరంగంగా ప్రకటించిన వాళ్ళే..

 

6) ఇంత ఉన్నతంగా ఉంటే భగవద్గీతే ప్రపంచం లో మొదటి స్థానం లో ఉండాలి కదా..

ఇతర మత గ్రంధాలు ముందు వరసలో ఉన్నాయని అంటున్నారు?

కలియుగం లో అజ్ఞనానికి ఆదరణ ఎక్కువ ఉండటం సహజం.

విదేశీయుల్లా కత్తి పట్టుకుని,రక్తపాతం సృష్టించి భారతీయులు భగవద్గీతని ప్రచారం చేయలేదు.

 టిష్ వాళ్లు, మొహమ్మదీయులు మతవ్యాప్తి కోసం ప్రపంచం పై చేసిన దండయాత్రలు, తద్వారా జరిగిన విద్వంసం ..చరిత్రలో సజీవ సాక్ష్యాలుగా నిలిచే ఉన్నాయి.

వారు కొన్ని వందల సంవత్సరాల పాటు భారతదేశం పై దాడులు చేసి, దురాక్రమణలు చేసి, ప్రలోభపెట్టినా చేయలేని పనిని..  ఇస్కాన్ వారు అతి తక్కువ కాలంలోనే భగవద్గీత ని ప్రచారం చేయడం ద్వారా కొన్ని కోట్లమంది పాశ్చాత్యులని కృష్ణభక్తులుగా మార్చారు..

ప్రపంచం ఇప్పుడు భగవద్గీత వైపు మనోవేగం తో పరుగులు తీస్తుందనడానికి ఇదే నిదర్శనం.”

ఓం నమో నారాయణాయ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...