4, నవంబర్ 2020, బుధవారం

శనివారము - పుస్తక సమీక్ష & రచనలు 31.10.2020

 


పుస్తక సమీక్ష & రచనలు

నేటి వ్యాసం:

గతి - మతి

 

మనము నిత్యజీవితంలో ఎన్నో విధముల పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుంది.

 కొన్ని పరిస్థితులు అనుకూలంగా , కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. అనుకూలమైతే పొంగిపోవడం ప్రతికూలమైతే కుంగిపోవడం జరుగుతుంది . అలాంటి ఉద్వేగాలకు గురి అయినప్పుడు వాటివల్ల కలిగే పరిణామాలు జీవితంలో ఎంతో ప్రభావం చూపిస్తాయి. ప్రాచీన గురువులు ఆధ్యాత్మిక గురువులు అందరు చెప్తున్న ఒకే మాట మనము అన్ని పరిస్థితులలోనూ సమస్థితి కలిగి ఉండాలి అని. దీన్నే"గతి తప్పనా మతి తప్పకూడదు" అని  క్లుప్తంగా అంటారు . విషయాన్ని భగవద్గీతలో

" స్థిత ప్రజ్ఞతఅని భగవానుడు సూచించారు. స్థిత ప్రజ్ఞత వల్ల ప్రశాంతత లభిస్తుంది.

అంశం పై నా వ్యాసం రెండు కథల ఉదాహరణలతో.

 

1. *సోక్రటీస్: *

 

ప్రసిద్ధ గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ గురించి అందరికీ తెలిసిందే . ఆయన భార్య మహా గయ్యాలి . అకారణంగా భర్తతో దెబ్బ లాడుతూ ఉంటుంది . ఒక  సమయంలో ఏదో  విషయంపైన  ఆమెకు చాలా కోపం వచ్చింది . భర్తను నోటికి వచ్చినట్లు తిట్టడం ప్రారంభించింది . మహాత్ముడు తనను కాదన్నట్టుగా మాటలను చెవిలో వేసుకోలేదుఅతని స్పందన లేని స్థితి చూసి  ఆమెకు మరింతగా రేగిపోయింది . పక్కనే ఉన్న నీళ్ల కుండ అమాంతం ఎత్తి అతని నెత్తిన పడవేసింది. అప్పుడు సోక్రటీసు పక్కన అతని మిత్రుడు ఉన్నాడుఇదంతా మిత్రుడు చూస్తుండగానే జరిగిందిమిత్రుడు షాక్ తిన్నాడు. "ప్రతిరోజు వట్టి ఉరుములే. ఈరోజు వర్షం కూడా పడింది . " అని సోక్రటీస్ చల్లగా అన్నాడు.. అప్పుడు మిత్రుడు అన్నాడు "నీ భార్య అలా చేస్తుంటే నీకు కోపం రాలేదా? ఒక గట్టి కర్ర తీసుకుని కొడితే ఎముకలు విరిగి ఆమె రోగం కుదురుతుంది."

 

అందుకు సమాధానంగా " ఏమయ్యా మా ఇద్దరికీ తగవులు పెట్టి తమాషా చూద్దాం అనుకున్నావా"   అని నవ్వుతూ సోక్రటీసు  మిత్రునితో అన్నాడు.

 

సోక్రటీసు పరమశాంత స్వభావానికి మిత్రుడు సిగ్గుపడిపోయాడు.

 

ఎంత గొప్ప క్షమాగుణం ఉన్నవాడు సోక్రటీస్?

"బయట గుండెపగిలినా లోపలి కుండ (హృదయంపగలలేదు . ప్రపంచం తలకిందులైనా  మతిని చెడగొట్టు కోనుఅన్నది సోక్రటీస్   సిద్ధాంతం.

 

2. తుకారాం:

 

ఇదే అంశంపై ఇంకొక  కథ. భక్త తుకారాం చిన్నపాటి రైతు. తనకున్న కొద్ది పొలంలో చెరుకు పైరు వేసినాడు . పంట పండిందిపంట కోసినారుఒక బండి పట్టినంత

మాత్రమే  దిగుబడి వచ్చిందిపంటను బండిలో వేసుకొని ఇంటికి వస్తున్నాడు తుకారందారిలో పిల్లలు "తాతా తాతా నాకు ఒక చెరుకు గడ ,నాకు ఒక చెరుకు గడ, అంటూ వెంట పడ్డారు . దయా మూర్తి కదాతుకారాం తలా ఒక చెరువు గడ  ఇచ్చాడు. తీరా ఇల్లు చేరేసరికి ఒక్క చెరుకు గడ మాత్రం మిగిలింది. మిగిలిన ఒక్క చెరుకుగడ చేతిలో పట్టుకొని ఇంటికి వచ్చాడు

భార్య జిజియా భాయ్ కి విషయం తెలిసి వచ్చింది. బీద సంసారం . అయినా తుకారం చేసే పనులు విధంగా ఉంటాయి . ఆమెకు వళ్ళు మండింది . వెంటనే ఆయన చేతిలోని చెరకుగడ లాక్కొని టపీమని నెత్తిపై బాదింది దెబ్బకు చెరువు గడ రెండు ముక్కలైంది. ఒక ముక్క కింద పడింది. ఇంకో ముక్క ఆమె చేతిలోనే ఉండిపోయింది.

 

అప్పుడు తుకారాం ఒంగి కింద పడిన ముక్కను తన చేతిలోకి తీసుకొని మెల్లగా భార్యతో అన్నాడు " నేను అనుకుంటూనే ఉన్నా . సగం నీ కిచ్చి సగం నేను తీసుకుందామని . ఇప్పుడు సరిపోయింది. అది నువ్వు తీసుకో ఇది నేను తింటాను" అని.

దెబ్బ అతని తలకు తగిలింది, కానీ  హృదయం పై తగల్లేదు. ఎంత నిబ్బరం? ఎంత గంభీరం?.

 

3. నీతి:

 

గతి చెడినా మతి చెడి పోరాదు ప్రపంచంలో ఏక గతి ఎప్పుడూ ఉండదు. గతులు మారుతుండటం ప్రారబ్ధ కారణం , కానీ  మతులను  స్థిరంగా ఉంచుకోవటం మానవుని ఆధీనం.

స్థిర మతులు గా ఉండటానికి క్షమాగుణం అతి ముఖ్యమైన సాధనం  .


 

యండమూరి  వీరేంద్రనాధ్ : మంచు పూల వర్షం లోని మరికొన్ని ప్రఖ్యాత సుభాషితాలు

 

అంశం : విజయానికి ఆరో మెట్టు

 

1) గెలుపు వద్దనుకునేవాడికి, గెలిచి వద్దనుకునేవాడికి తేడా మోక్ష సన్యాసం

 

2) పుస్తకమూ తానంత తాను మనిషిని మార్చలేనన్నది ఎంత వాస్తవమో, ప్రతి మనిషి తనని తాను మార్చుకోగలడన్నది అంతే వాస్తవం

 

3) మనిషికి ధైర్యాన్ని ఇచ్చాడే, ధైర్యాన్ని పోగొట్టేది, రెండూ భవబంధమే

 

4) మనిషి మంచి మనుగడే మతము యొక్క అభిమతము. ప్రజల్లో అసంతృప్తి పెరిగి, అభిలాషలో మార్పు వచ్చినప్పుడల్లా ఒక మతం జన్మించింది

 

5) న్యాయం వేరు, నష్టం వేరు.. నష్టం జరిగిన వారి వైపే న్యాయం ఉండాలని రూలు లేదు

 

6) పుస్తకం ముందు పాఠం చెప్పి  తరువాత పరీక్ష పెడుతుంది. అనుభవం మూడు ముందు పరీక్ష పెట్టి తరువాత పాఠం నేర్పుతుంది.

 

7) ఎక్కడ స్వార్ధం లేదో, అక్కడ నష్టం కూడా లేదు

 

8) దేనికోసం దేనిని వదిలేయాలో తెలుసుకోవటమే జ్ఞానం

 

9) విశ్రాంతి అంటే తనకిష్టమైన పని చేయటమే

 

10) జ్ఞానం పెరిగే కొద్దే బంధం తగ్గిపోతుంది. విధంగా దుఃఖం కూడా తగ్గిపోతుంది

  

11) అంతర్గత భయాలు ఎక్కువ ఉన్నవారు నా అంటూ తమ గురించే  ఎక్కువ మాట్లాడతారు 

 

12) నువ్వు నిన్ను విపులీకరించే కొద్దీ అవతలివారికి ఒక గాలిబుడగలా కనిపిస్తావు.

 

యండమూరి వీరేంద్రనాధ్  

మంచు పూల వర్షం, తప్పు చేద్దాం రండి లోని  కొన్ని ముఖ్యమైన సుభాషితాలు

 

1. అందరూ మూర్ఖులుగా మారి  ఒక్కడు మారకపోతే సమస్య.

ఒక్కడు తొందరగా మారి అందరూ మారకపోతే ఇంకా పెద్ద సమస్య

 2. గెలుపు అంటే శిఖరం చేరుకోవటం కాదు, చేరుకున్నాక ఏమి చెయ్యాలో తెలియటం

3. తెలివి కావాలంటే ప్రతిరోజూ కొంత అవసరమైనది నేర్చుకోవాలి.. జ్ఞానం రావాలంటే ప్రతిరోజూ కొంత అనవసరమైనవి వదులుకోవాలి

4. మార్పు నీ మీద ప్రభావం చూపే లోపులో, నువ్వు మార్పుని ప్రభావితం చెయ్యి

 

5. ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద ట్రాజెడీ (విషాదం) బాల్యంలో చనిపోవటం కాదు. 75  సంవత్సరాలు బ్రతికి ఏమీ సాధించకపోవటం

6. గతం గొప్పదే. కానీ, గతం కన్నా రోజు గొప్పగా లేకపోతే, వ్యక్తి జీవన విధానంలో ఎదో తప్పు ఉందన్న మాట  

7 పోరాటానికి వెళ్తున్నప్పుడు నీతో పాటు విజయోపన్యాసాన్ని తీసుకువెళ్లటం నీపై నీకున్న నమ్మకం

8 ప్రపంచంలో అందరినీ సంతోష పెట్టాలనుకునేవాడు తానూ సుఖంగా ఉండలేడు. తన వారిని సుఖపెట్టలేడు  

9 "అంతా తనదే" అన్నది మమకారము. "అంతా తానే" అన్నది అహంకారము. రెండూ వదలవలసినవే

10 పొరపాటుకి క్షమాపణ చెప్పటం పాత పధ్ధతి. పొరపాటుని కరెక్టుగా సరిదిద్దుకోగలగటం కొత్త పధ్ధతి

11 వెళ్తున్నప్పుడు విత్తనాలు జల్లుకుంటూ వెళ్తే, వచ్చేటప్పటికి చెట్లు స్వాగతమిస్తాయి   

12 గొప్ప విజయం కోసం చిన్న విజయాన్ని త్యాగం చేయటమే "పవర్"

 

సేకరణ : కస్తూరి శివశంకర్ తెలుగు తేనియలు


 

 

గయో పాఖ్యానం

 

రచయిత :-చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు.

ప్రధాన పాత్రలు =శ్రీ కృష్ణుడు, అర్జునుడు, గయుడు.

"గయో పాఖ్యానం " నాటకం  గురించి సమీక్ష మొదటిసారి కాకపోయుండొచ్చు. పునస్సమీక్ష గా చెప్పవచ్చు నేమో !ఎందుకంటే చిర పరిచితమైన నాటకం కాబట్టి, అందునా ప్రబంధ ములను, కావ్యములను అవపోసన పట్టిన పండిత సభ్యుల బృందం మన తేనియల బృందం కాబట్టి పునస్సమీక్ష అని చెప్పాను.

 తెలుగు సాహిత్య చరిత్ర లో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న నాటకం.

 

కథ లోనికి

 

 అర్ఘ్యం ఇస్తున్న కృష్ణుని చేతిలో ఆకాశమార్గాన వెళుతున్న గంధర్వుడు అయిన గయుడు చేసిన నిష్టీ వనం పడుతుంది. దాంతో అతడు ఎవడైనా చంపుతాను అని ప్రతిజ్ఞ చేశాడు కృష్ణుడు. గయుడు అర్జునుని శరణు వేడతాడు (కలహభోజనుడు పాత్ర కూడా ఉంది.). గయుడి విషయంగా కృష్ణార్జునుల యుద్ధం జరిగింది.కృష్ణుడు అధర్మాన్ని శిక్షించేందుకు- అర్జునుడు శరణా గతుణ్ణి  రక్షించేందుకు శపధాలు  చేయడం జరిగింది. గయోపాఖ్యానం అని కాకుండా మరొక పేరుకూడా  ఉంది.ప్రచండ యాదవం అని. చిలకమర్తి నాటకం వ్రాసే కాలములో  పద్య నాటక యుగమని చెప్పవచ్చు.సులభ శైలిలో అలతి పదాలతో సరళంగా ఉండి భావం అందరికీ అర్థంమయ్యేవిధంగా  ఉండడంతో సామాన్య జనులకు సైతం ఆకట్టుకుంది.

   సుభద్ర అర్జునినితో యుద్ధం వద్దని చెబుతుందిదీనికి అర్జునుడు సుభద్రను  పుట్టినింటికి కడు కూర్పు పొలఁతి ఎప్పుడు అంటాడు. అదే సందర్భంలో శ్రీకృష్ణుడు సుభద్రను పుట్టినింటినుంచి  చీరలు నగలు చాలా గొనుచు  మగని పై కూర్మి మగువకెపుడూ అంటాడు. విధంగా అధిక్షేపణలు, దెప్పిపొడుపులు  అడుగడుగునా కనిపిస్తాయి. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అనే లోకోక్తి నాటకంలోనిదే.

అల్లుడా రమ్మని యాదరమ్మున బిల్వ

బంపు మామను బట్టి జంపగలమే.... ఇట్లా అర్జునుడు కృష్ణుని అధిక్షేపిస్తూ ఉన్న పద్యాలు బహుళ ప్రచారాన్ని పొందాయి.చిలకమర్తి గయోపాఖ్యానం పద్యాలు

ఇంటింటావాడవాడలా గొడ్ల కాపర్లు మొదలు గొప్పింటి పెద్దల వరకు రాగయుక్తంగా పాడుకునే వారంటే అతిశయోక్తి కాదు పద్యనాటకం అయినప్పటికీఅందరికీ అర్థమయ్యే రీతిలో సరళ సుందరంగా తెలుగుతనం ఉట్టిపడుతూ భాషా ప్రియుల మనసు దోచుకున్న నాటకం గయోపాఖ్యానం. చిలకమర్తివారి మరణానంతరం శ్రీ కృష్ణార్జున యుద్ధం గా చలనచిత్రం వెలువడింది. ఎన్టీఆర్, ఏఎన్నార్లు కృష్ణార్జునులు అద్భుతంగా నటించారు.తెలుగువారి ప్రతి ఇంటా ఉండాల్సిన నాటకం గయోపాఖ్యానం.అందరికీ తెలిసిన కథను పునస్సమీక్ష  చేయడంలో ఆపాత మధురాలను స్మరించు కొనే ఉద్దేశ్యమే కానీ అన్యము కాదని భావించగలరుధన్యవాదములు

 

శిరీష తెలుగు తేనియలు

 


 

నాకు నచ్చిన పుస్తకము : శ్రీలేఖ

నవల రచయిత:  చక్రవర్తి శ్రీ మదిగొండ శివప్రసాదు గారు  

ఆంధ్ర దేశం చక్రవర్తి : శాతకర్ణి 

సర్వసేనాధిపతి: విజయాదిత్యుడు

నాగవరదాదేవి (రాణి,గూఢచారి ప్రధానాధ్యక్షురాలు)

యువరాజు : పూర్ణోత్సంగుడు 

కళింగరాజు : ఖారవేలుడు 

నాయిక : శ్రీలేఖ 

బౌద్ధ గురువు : నందిపాలుడు 

నందిపాలుని కుమార్తెగాపెంచబడిన శ్రీలేఖ..  

చిన్నచిన్నరాజ్యాలను కలిపి విదేశీయులను తమ గడ్డమీదకు రాకుండా చేయాలని నాగవరదాయని తన 6 కుమారుడు దత్తపుత్రున్ని (విజయాదిత్యున్ని సర్వ సేనానాయకుడినీ) రాజ్య సరిహద్దులకుపంపుట   

కృష్ణా నదీతీరంలోని ఒక పల్లెటూరిలో ఊరి బయటమర్రిచెట్టు నీడలో నిధి ని సేకరించటానికవచ్చి,నదినీటి ప్రవాహంలో కొట్టు కొని పోతున్న యువతి ని కాపాడుట(ఆమె శ్రీలేఖ బౌద్ద బిక్షువు అని తెలుసుకొనుట)

ఆమెకు తనగుర్రం పేరు భానుమతితో విజయాదిత్యుడు భానుమంతునిగా పరిచయం అగుట. 

అక్కడ తొలిసారిగా గ్రామాధికారి కూతురు సుషమ బియ్యపు రొట్టెను ఆహారంగా ఇచ్చుట.ఆకాలంలో అదిచేయు విధానము తెలిసికొనుట, అక్కడ చాలా మంది కళింగరాజు ఖారవేలుని అనుయాయులుగా మారుటను తెలిసికొని వారిని బంధించుట, బ్రాహ్మణుల ఇండ్లను పిశాచాల రూపంలో వచ్చి దోచుకొనుట,విజయాదిత్యునికి జై అని తప్పించుకొనుట.

ఒకసారి విజయాదిత్యుని రూపంలో వచ్చినఒక ఖారవేలుని సైనికుడు బౌద్ద భిక్షువు శ్రీలేఖను ఎత్తుకెళ్ళుట   ...

యువరాజు పూర్ణోత్సంగుని సాయంతో జరుగుతున్నాయని తెలుసుకొన్న రాణి నాగవరదాయిని గారు సర్వసైన్యాధ్యక్షుని కిరాజ్యబహిష్కరణ శిక్ష విధించుట

మాయాఖారవేలుని రూపంలోవెళ్ళి శ్రీలేఖను ఖారవేలుని బంధిఖానానుండి విడిపించుటకు ప్రయత్నించి పట్టు బడుట, ఖారవేలుడి దగ్గరి బందీలందరిని పులులకు, సింహాలకూ ఆహారంగ వేయ ప్రయత్నించుట,విజయాదిత్యుడు తనసేనలూ,గూఢచారులద్వారా ఖారవేలుని అవమానించి శ్రీలేఖను తప్పించుట.

పుష్యమిత్రుని కుమారుడు అగ్నిమిత్రుడూ ఆయనభార్య మాళవిక వారి చెలికత్తె రాజనర్తకి రాజలేఖ, రాజలేఖ దగ్గరి దాది శ్రీలేఖ, రాజలేఖ రాజవంశీయులే అని విజయాదిత్యునికి తెలియజేయుట,ఖారవేలుని బంధించి పతంజలి ఆశ్రమంలో బంధించుట.

ఖారవేలుని మాంసాహారం రోజూ తినేవాన్ని శాకాహారిగా మార్చుట.

మాయాఖారవేలునిగా విజయాదిత్యుడు కళింగరాజ్యాన్ని పరిపాలిస్తూ, ఖారవేలుని భార్య కాళిని దూరంగ ఉంచి రాజకార్యాలు చక్కబెట్టుట....

ఇది కాలనేమిని ఖారవేలుని మంత్రి, శ్రీలేఖశాంతి వచనాలతోనూ,కళింగయుద్దం చూచి మనసు వికలమగుట...

ఇక సైన్యాధ్యక్షపదవికి దూరంగా ఉండాలనుకొనుటశ్రీలేఖ తన తండ్రి హత్యచేయబడగా,తనను కాపాడే వారు లేకపోగా ఖారవేలుని బందీగా వెళ్ళివచ్చుట, వెంటనే  తన అహింసా సిద్దాంతల నుండి వైదొలిగి విజయాదిత్యుని వివాహమాడుట తరువాత పతంజలి ఆశ్రమంలో నుండి బయటపడి కళింగరాజ్యానికి రాణిగాతనభార్యకాళి ని పట్టాభిషేకంచేసి ఖారవేలుడు శ్రీలేఖ విజయాదిత్యులతోకలిసి దేశాటనకు వెళ్ళుట.

 

స్థూలంగా ఇది కథ... కేవలం చాలా క్లుప్తంగా చెప్పే వ్రాసే ప్రయత్నం చేశాను.

 

 

 

నేడు వాల్మీకీ జయంతి సందర్భంగా

 

రామాయణం క్విజ్...

 

1. సీతదేవి లంకాపురి లో ఉన్నది అని..అంగదుడు మొదలైన వారికి చెప్పినదెవరు?

సంపాతి.

 

2.లంకా నగరంలో ఎవరిని చూసి హనుమ సీత అనుకుంటాడు?

మండోదరి.

 

3.సీత తన మాట వినకపోతే ఎవరికి ఆహారం అవుతావు అని బెదిరిస్తాడు రావణుడు?

రావణునకు

 

4. ఉద్యానవనంలో హనుమ ను బంధించినది ఎవరు?

ఇంద్రజిత్తు

 

5. శ్రీరాముని దూతగా వచ్చాను అని చెప్పింది ఎవరు?

హనుమ/అంగదుడు

 

6 సీత ఆంజనేయునికి ఇచ్చిన తన ఆనవాలు ఏమిటి?

చూడామణి

 

7. సముద్రానికి సేతువు కట్టమని శ్రీరామునికి సలహా ఇచ్చినది ఎవరు?

జాంబవంతుడు

 

8.కుంభకర్ణుడు ఎవరు?

రావణుని సోదరుడు

 

9.రావణుని అస్త్రం తో శ్రీరాముడు వధిస్తాడు?

బ్రహ్మాస్త్రం

 

10.రావణుని తరువాత లంకా రాజ్యానికి రాజు ఎవరు?

విభీషణుడు

 

11.యద్ద్రవ్యం బాన్ధవానాం వా మిత్రాణాం

వా క్షయే భవేత్‌

నాహం తత్‌ ప్రతిగృహ్ణీయాం భక్ష్యాన్విషకృతానివ

పై వాక్యాలు.. శ్రీరాముడు సందర్భంలో ఎవరితో అంటాడు?

 

రాముడు  లక్ష్మణుడితో చెప్పే వాక్యాలు, భరతుడిని చూసి చెప్పే వాక్యాలు

 

12.చాకలి నింద గురించి రాముడికి చెప్పినది ఎవరు?

భద్రుడు

 

13.శ్రీరాముని కుమారులేవరు?

లవకుశులు

 

14.సౌమిత్రి యోగ సమాధికి కారణం అయిన ముని ఎవరు?

దుర్వాస మహర్షి

 

15. నది ఒడ్డున శ్రీరాముడు అవతారం చాలించాడు?

సరయు

 

 

రామాయణ కల్పవృక్షం

బాలకాండ - అవతార ఖండం 282

మత్తేభము

శ్రమపొందన్ క్షుధయున్ పిపాసయును దీరన్ క్లిష్ట కార్యాంత వి

శ్రమ మొందన్ నిదురింప పండుకొన నిద్రన్ మేలుకొన్నన్ వచో  

గ్రిమభాగంబుల సర్వ భూ ప్రజకు తండ్రీ! రామచంద్రా! యట 

న్న మహావాక్యమె గోచరించె సుమహానందంబు సంధించుచున్.

 

1)అహల్య  నందనుడు‌ ఎవరు?

శతానందుడు

 

2)విశ్వామిత్రుడు అప్సరసకు‌ శాపం  ఇచ్చాడు?

రంభ

 

3)జనకుని‌ సోదరుడు ఎవరు?

కుశధ్వజుడు

 

4)పరశురాముడు వద్ద ఉన్న విష్ణువు చాపము‌ ఎవరి‌ వద్ద దాచబడినది ?

ఋచీకుడ

 

5)భరతుని మేనమామ పేరు ఏమిటి ?

శంబరుడు

 

6)దశరధుడు ఎవరితో‌ యుద్దము చేసిన సమయంలో కైకకు రెండు వరము లిచ్చాడు?

 

7)దశరధుని మంత్రి ఎవరు?

సుమంతుడు

 

8)వనవాస యోగ్యంగ జటా ధారులు‌‌ అగుటకు మర్రి పాలు‌  ఎవరు  తెచ్చారు

గుహుడు

 

9)దశరధునికి పుత్తశోకము‌ తప్పదని‌ శపించిన ముని‌యొక్క‌ కుమారుని‌ పేరు ఏమిటి?

శ్రవణ కుమారుడు

 

10)హా  రామా లక్ష్మణా   సీతా‌  అని ప్రాణము విడిచిపెట్టి నది‌ఎవరు?

దశరధుడు

 

11)చిత్రకూటమ్  నది‌ ఒడ్డున ఉన్నది?

మందాకినీ

 

12)వనవాస‌‌ సమయంలో రామలక్ష్మణుల ఎదురుగా   సీతను పట్డుకొన్న రాక్షసుడు ఎవరు?

విరాధుడు

 

13)పంచవటి‌లో ఆశ్రమం నిర్మాణం చేసి అక్కడ ఉండమని‌ రామునికి ఎవరు చెబుతారు?

అగస్త్యుడు

 

14)ఖరుని అక్క ఎవరు?

శూర్పణఖ

 

15)మాయా లేడి రూపము ఎత్తిన రాక్షసుడు ఎవరు?

మారీచుడు

 

 

వాల్మీకి  జయంతి సందర్భంగా.........

నాలుగైదు రోజుల కిందట విజయదశమినాడు ఇక్కడ ఊరిచివర సాయిబాబా గుడికి వెళ్ళి వస్తూండగా ఎవరో బాట పక్కనుంచి ప్రేమగా పిలిచినట్టనిపించి ఆగిచూసాను. ఎవరూ కనిపించలేదు. ఒకటి రెండు నిముషాలు గడిచాక అర్థమయింది, అది బాటపక్కన విరబూసిన ఏడాకుల పొన్న చెట్టు పిలిచిన పిలుపని. శరత్కాలమంటే అందరికీ పారిజాతాలు గుర్తొస్తాయి. కాని గాల్లో చెరకురసాన్ని పిచికారీ చేసినట్టు విరబూసే ఏడాకుల పొన్నపూల గురించి ఒక్క మహాకవి మాత్రమే మాట్లాడగలడు. శరత్కాలం తన శోభనంతా ఏడాకుల పొన్నచెట్లలో నింపిపెట్టిందంటున్నాడాయన:

 

శాఖాసు సప్తచ్ఛదపాదపానామ్

ప్రభాసు తారార్క నిశాకరాణామ్

లీలాసుచైవోత్తమవారణానామ్

శ్రియం విభజ్యాద్య శరత్ ప్రవృత్తా (కిష్కింధ, 30:29)

 

(శరత్కాలం తన శోభనంతటినీ ఏడాకుల పొన్నచెట్లకొమ్మలమీదా, తన కాంతుల్ని సూర్యచంద్రతారకల్లోనూ, తన లీలావిలాసాన్ని చక్కటి ఏనుగులగుంపుల్లోనూ పంచిపెట్టింది)

 

రోజు శరత్పూర్ణిమ. ఒక మహాకవి పుట్టడానికి ఇంతకన్నా అనుకూలమైన రోజు మరేముంటుంది? రోజు వసంతకాలపు కవోష్ణమధురిమలు లేవు. వేసవికాలపు పెనుగాడ్పులు లేవు. వర్షాకాలపు ఉరుములు మెరుపులు లేవు, హేమంతకాలపు శీర్ణపత్రాలుగానీ, శిశిరర్తు హిమపాతాలు గానీ లేవు. మహర్షి అన్నట్లుగా శరత్కాలంలో సూర్యుడూ, చంద్రుడూ, నక్షత్రాలూ అన్నీ శోభాయమానంగానే ఉంటాయి. వెలుగు రాజ్యం చేసే కాలమిది.

 

ప్రతి కవికీ తాను పుట్టిన ఋతువుతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఎందుకంటే, రోజుల్లో అతడు తన తల్లికడుపులో మేలుకుని ఆమె ద్వారా తన చుట్టూ ఉన్న ఋతుసౌరభాన్ని ఆఘ్రాణించి ఉంటాడు. టాగోర్ కి వైశాఖమంటే అందుకే అంత ప్రేమ, నాకు ఫాల్గుణం లాగా. వాల్మీకి తన తల్లి కడుపులో ఉన్నప్పుడు శరత్కాల సౌందర్యాన్ని చూడటం కాదు, విన్నాడని ఊహించవలసి ఉంటుంది.

 

జలగర్భాః మహావేగాః కుటజార్జున గంధినః

చరిత్వా నిరతాః సౌమ్య వృష్టివాతాః సముద్యతాః (కి.30:25)

 

( సౌమ్యుడైనా లక్ష్మణా! ఇంతదాకా నీళ్ళతో నిండిఉండి, కొండగోగుపూలనీ, తెల్లమద్ది పూలసువాసనల్నీ విరజిమ్ముతూ మహావేగంతో సంచరించిన వానగాలులు ఇప్పటికి సద్దుమణిగాయి)

 

ఘనానామ్ వారణానామ్ మయూరాణామ్ లక్ష్మణ

నాదః ప్రస్రవణానాం ప్రశాంతః సహసానఘ (కి.30:26)

 

(లక్ష్మణా, ఇంతదాకా హోరెత్తించిన మేఘగర్జనలు, ఏనుగుల ఘీంకారాలు, నెమళ్ళ క్రేంకారాలు సెలయేళ్ళ సునాదాలూ ఇప్పటికి ప్రశాంతమయ్యాయి.)

 

శాతమంటే శమించడం. రామాయణం కరుణ రస ప్రధానంగా కనిపించే శాంతరస కావ్యం. శమించడం, నెమ్మదికావడం, సద్దుమణగడం-మనలో పదితలలతో విజృంభించే ప్రలోభాలు నెమ్మదిగా అడగిపోవడం. రాముడు నడిచిన దారి అటువంటి ఒక శాంతాన్వేషణ.

 

నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడూ, నా పసితనంలోనూ మాఘఫాల్గుణాల చివరిదినాల్నీ, వసంతకాలపు తొలిదినాల మహాసౌందర్యాన్నీ కళ్ళారా చూసాను. రోజులదగ్గరే ఆగిపోయాను. నా జీవితమంతా తిరిగి సౌందర్యం కోసమే అన్వేషిస్తో ఉన్నాను. ఒక పునర్యానం చేస్తోనే ఉన్నాను.

 

మహాకవి తాను పుట్టినప్పటి ఒక ప్రశాంతిని తనలో నిలుపుకున్నాడు. ప్రశాంత మనస్కతను మనకు ఒక దొన్నెలో పెట్టి తేనెలాగా అందించాడు. అంతరంగమంతా ఆయన శరత్కాల వర్ణనలో కనిపిస్తున్నది.

 

అభివృష్టాః మహామేఘైః నిర్మలాశ్చిత్ర సానవః

అనులిప్తా ఇవాభాన్తి గిరయశ్చిత్రదీప్తిభిః (కి.30:27)

 

(మహామేఘాలు మహావర్షాలు కురిపించి వెళ్ళిపోవడంతో నిర్మలమైన పర్వతాల కొండచరియలకి రంగురంగుల కాంతులు పూసినట్లు కనిపిస్తున్నాయి)

 

రామాయణమంతా మహామేఘాలు కురిపించిన మహావృష్టి. కావ్యాస్వాదన పూర్తయిన తర్వాత రసజ్ఞ హృదయం తేటపడుతుంది. కావ్యరామణీయకత అప్పుడు తేటపడ్డ హృదయంలో ప్రతిఫలించి రసజ్ఞ హృదయమే రంగురంగులతో చిత్రితమయిందా అనిపిస్తుంది. తన కావ్యసౌందర్యాన్ని కవి సహృదయసౌందర్యంగా భావింపచేస్తాడన్నమాట.

 

రామాయణాలు ఎన్నో. రామాయణం ప్రయోజనం దానికుంది. కాని వాల్మీకి రామాయణం ప్రయోజనం అన్నిటికన్నా ముందు మనకొక భాషనివ్వడంలో ఉంది. అది శుభ్రభాష, సుసంస్కృత భాష. అది పారాయణం చెయ్యదగ్గ భాష. భాష మనమాటల్లోని మాలిన్యాన్ని శుభ్రం చేయడమేకాక, తర్వాత మనమాటలకొక కాంతినీ, సొగసునీ అద్దిపెడుతుంది.

 

సంప్రత్యనేకాశ్రయ చిత్రశోభా

లక్ష్మీః శరత్కాల గుణోపనీతా

సూర్యాగ్రహస్తప్రతిబోధితేషు

పద్మాకరేష్వభ్యధికం విభాతి (కి.30:30)

 

(ఇప్పుడు విప్పారిన రంగురంగుల పూలతో నిండి ఉండి శరత్కలా శోభమరింత లక్ష్మీప్రదంగా గోచరిస్తున్నదివిప్పారుతున్న తామరపూల కాంతి ఉదయసూర్యకాంతితో మరింత ఇనుమడిస్తున్నది.)

 

రామాయణ కర్తకి తన ఇష్టాలకీ, తన కావ్యనాయకుడి ఇష్టాలకీ మధ్య తేడా తెలుసు. రెండింటి మధ్యా ఆయన ఎన్నడూ పొరపడడు. రాముడికి హేమంత ఋతువంటే ఇష్టమని లక్ష్మణుడితో చెప్పిస్తాడు. కాని తనకి ఋతువు ఇష్టమో ఎక్కడా వాచ్యంగా చెప్పడు. ఆయన చేసిన అయిదు ఋతువర్ణనలూ వేటికవి తీసిపోనివే. వర్ణన చదివితే ఋతువే ఆయనకి అత్యంత ఇష్టమయినదేమో అనిపిస్తుంది. కాని, నా మనసుకి మాత్రం వాల్మీకికి శరత్కాలమే అత్యంత ప్రియమైన కాలమని అనిపిస్తూంది. అలాగని ఆయన వట్టి వెన్నెలని మాత్రమే ప్రేమించాడని చెప్పలేము. శరత్కాలమంటే ఆయనకి వెన్నెల, తుమ్మెదలు, ఏనుగులు, అన్నిటికన్నా ముఖ్యంగా ఏడాకుల పొన్నపూలు.

 

సప్తచ్ఛదానామ్ కుసుమోపగంధీ

షట్పాదబృందైరనుగీయమానః

మత్తద్విపానామ్ పవనోనుసారీ

దర్పం వనేష్వభ్యధికం కరోతి (కి:30:31)

 

(శరత్కాల పవనాలు ఏడాకుల పొన్నపూల సుగంధాలతో నిండి ఉన్నాయి. తుమ్మెదల గుంపులు వాటి గుణగానం చేస్తున్నాయి. మదించిన ఏనుగుల్ని అవి మరింత మత్తెక్కిస్తున్నాయి)

 

మదప్రగర్భేషు వారణేషు

గవామ్ సమూహేషు దర్పితేషు

ప్రసన్నతోయాసు నిమ్నగాసు

విభాతి లక్ష్మీ బహుధా విభక్తా (కి.30:33)

 

(బాగా మత్తెక్కిన ఏనుగుల్లోను, మత్తెక్కి సంచరిస్తున్న ఆలమందల్లోనూ, స్వచ్ఛజలాలతో ప్రవహిస్తున్న సెలయేళ్ళలోనూ, జలపాతాల్లోనూ శరత్కాల శోభ అనేకవిధాలుగా ప్రకాశిస్తున్నది)

 

మనోజ్ఞగంధైః ప్రియకైరనల్పైః

పుష్పాతిభారావనతాగ్రశాఖైః

సువర్ణగౌరైర్నయనాభిరామైః

ఉద్యోతతనీవ వనాంతరాణి (కి.30:35)

 

(మనసుని దోచుకునే సుగంధాలు చల్లుతూ బాగా పూసిన పూలకొమ్మలతో చెట్లు కిందికి వాలి ఉన్నాయి. అవి తెల్లగానూబంగారుకాంతితోనూ కనువిందుచేస్తున్నాయి. అడవుల్లోపల శోభ మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది)

 

వ్యపేత పంకాసు సవాలుకాసు

ప్రసన్నతోయాసు సగోకులాసు

ససారసారావవినాదితాసు

నదీసు హృష్టా నిపతంతి హంసాః (కి.30:43)

 

(నదులు బురద తగ్గి జలాలు ప్రసన్నంగా కనిపిస్తున్నాయి. వాటి ఇసుకతిన్నెలమీద ఆలమందలు హాయిగా సంచరిస్తున్నవి. సారసపక్షుల కలరవాలతో ప్రతిధ్వనిస్తున్న నదీజల్లాల్లో హంసలు సంతోషంగా క్రీడిస్తున్నవి)

 

సంతొషభరితమైన శరత్కాల వర్ణనలోనే సుప్రసిద్ధమైన వర్ణన కూడా మహాకవి నోటివెంట వెలువడింది:

 

చంచచంద్ర కరస్పర్శహర్షోన్మీలిత తారకా

అహో రాగవతీ సంధ్యా జహాతి స్వయమంబరమ్ (కి.30:46)

 

(చంద్రకిరణస్పర్శవల్ల కలిగిన ఆకాశంలో తారకలు మిలమిల్లాడుతుండగా, ఆహా, ఏమాశ్చర్యం! సంధ్య తనంతట తానే అంబరాన్ని విడిచిపెడుతున్నది)

 

కరస్పర్శవల్ల ఆమె తన వస్త్రాంబరాన్ని తనంతతానుగానే విడిచిపెడుతున్నదనే మరొక అర్థం కూడా స్ఫురిస్తున్నందువల్ల, శ్లోకం వాల్మీకిది కాదనీ, ప్రక్షిప్తమనీ భావించేవారు లేకపోలేదు. కానీ, శరత్కాల వర్ణనలో సీతావియోగవేదన తేమగా పరుచుకుని ఉన్నదని మనం గుర్తుపెట్టుకుంటే, శ్లేషార్థంలో శృంగారం కన్నా ఆశ్చర్యమే అధికంగా కనిపిస్తున్నది చెప్పుకోవాలి.

 

పూలూ, తుమ్మెదలూ, మదించిన ఏనుగులూ వసంతకాలంలో కూడా కనిపించేవే కదా, వాటిని బట్టి ప్రత్యేకంగా శరత్కాలాన్ని ఎట్లా గుర్తుపట్టగలం అనిపించవచ్చు. కాని, వసంతంలో లేనిదీ, శరత్కాలంలో మాత్రమే ఉన్నదీ ఒక నైర్మల్య స్ఫురణ. శుభ్రత, స్వచ్ఛత.

 

ప్రసన్న సలిలాః సౌమ్య కురరీభిర్వినాదితాః

చక్రవాక గణాకీర్ణా విభాంతి సలిలాశయాః

ఆసనాః సప్తపర్ణాశ్చ కోవిదారశ్చ పుష్పితాః

దృశ్యంతే బంధుజీవాశ్చ శ్యామశ్చ గిరిసానుషు (కి.30:58-59)

 

(లక్ష్మణా, జలాశయాలు నిర్మలంగా, ప్రసన్నంగా ఉన్నాయి. వాటి ఒడ్డుమీద చక్రవాకాల గుంపుల మధురకూజితాలు వినవస్తున్నాయి. గోరింట చెట్లు, కోవిదార వృక్షాలు, ఏడాకుల పొన్నచెట్లు విరబూసి ఉన్నాయి. దట్టంగా పూసిన చెట్లతో కొండచరియలు శ్యామవర్ణశోభితాలుగా ఉన్నాయి.)

 

'ప్రసన్నం'! అదీ కవి అంతరంగాన్ని పట్టిచ్చే మాట. అందుకనే 'ఋషీ, రెండవ వాల్మీకి 'అయిన నన్నయ తన కవిత్వం 'ప్రసన్న కథాకలితార్థయుక్తి'తో కూడి ఉంటుందని చెప్పుకున్నాడు.

 

శరత్కాల వర్ణనలో కవికి విసుగులేదు. చూసిన దృశ్యమే మళ్ళీ మళ్ళీ చూస్తున్నా చెప్పడంలో పునరుక్తి లేదు.

 

నవైర్నదీనాం కుసుమప్రభాసైః

వ్యాధూయమానైర్మృదుమారుతేన

ధౌతామలక్షౌమ పటప్రకాశైః

కూలాని కాశైరుపశోభితాని (కి 30: 52)

 

(నదీ తీరాల్లో కొత్తగా వికసించిన రెల్లుపొదలు పిల్లగాలులకి మృదువుగా తలలూపుతున్నాయి. తెల్లటిపూలకాంతులతో శరదృతువు ఉతికి ఆరవేసిన తెల్లటి పట్టువస్త్రంలాగా శోభిస్తున్నది.)

 

వనప్రచండా మధుపాన శౌండాః

ప్రియాన్వితాః షట్చరణాః ప్రహృష్టాః

వనేషు మత్తాః పవనాను యాత్రాం

కుర్వంతి పద్మాసన రేణు గౌరాః (కి: 30: 53)

 

(తుమ్మెదలు అడవుల్లో స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. బాగా పూలతేనెలు పీల్చి సంతోషంతో పరవశిస్తున్నాయి. తామరపూల గోరింటపూల పుప్పొడి అంటుకుని పసుపురంగులో కనిపిస్తున్నాయి. గాలివాటుకి కొట్టుకొస్తున్న పరిమళాల్ని తమ ప్రియురాళ్ళతో కలిసి పానం చేస్తున్నాయి)

 

శరత్కాలం ప్రసన్నం. గోదావరి నీళ్ళలాగా రమ్యం. కాని మహాకవికి శరత్కాలమంటే ఇందుకు మాత్రమే ఇష్టం కాదు.

 

వ్యక్తం నభః శస్త్రవిధౌత వర్ణం

కృశప్రవాహాని నదీజలాని

కల్హారశీతాః పవనాః ప్రవాంతి

తమోవిముక్తాశ్చ దిశః ప్రకాశాః (కి:30:37)

 

(మబ్బులు తొలగిపోవడంతో ఆకాశం స్వచ్ఛమైన శస్త్రంలాగా విరాజిల్లుతున్నది. వరద మందగించడంతో నదులు సన్నబడి ప్రవహిస్తున్నాయి. ఎర్రతామరపూల మీంచి గాలులు ప్రసరిస్తున్నాయి. చీకట్లనుంచి బయటపడి దిక్కులు ప్రకాశిస్తున్నాయి.)

 

'శస్త్ర విధౌత వర్ణం'.  సానబెట్టిన కత్తిలాగా ఉందట శరత్కాలం. అంత మృదు ఋతుగానంలో ఆయనకి శస్త్రం ఎందుకు స్ఫురించింది? తర్వాత రానున్నది యుద్ధకాండ కాబట్టి అనుకోవాలా? కాదు. ఒక మనిషి మనసు ప్రసన్నం కావడమంటే చీకట్లు తొలగి దిక్కు తోచడం. తనని చుట్టుముట్టిన చీకట్లని చీల్చుకోడానికి ఒక శస్త్రం దొరకడం. శరత్కాలమంటే  ఒక ఖడ్గసృష్టి. శస్త్రంలా శరత్కాలం సాక్షాత్కరించాక జైత్రయాత్ర ఎలానూ మొదలు పెట్టక తప్పదు.

 

సేకరణ

వాడ్రేవు చిన వీరభద్రుడు గారి ఫేసుబుక్ పోస్టింగ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...