9, నవంబర్ 2020, సోమవారం

శనివారము పుస్తక సమర్పణలు, రచనలు 07.11.2020



నేటి కథ

ఎవరి కష్టాలు వారివి

( ఎవడి గోల వాడిది)

 

సాధారణంగా మనలో ప్రతి ఒక్కరికీ  ఒక అభిప్రాయం ఉంటుంది-తమకు ఉన్న  కష్టాలే ఎక్కువ బాధాకరమని తక్కిన  వారి కష్టాలు ఇంతగా బాధించేవి కావని . అంశంపై ఒక మంచి కథ సమర్పిస్తున్నాను.

 

పూర్వము ఒకానొక ఊరిలో ఒక పెద్ద దనికుడు ఉండేవాడు. ఇంద్ర భవంతి లాంటి ఇంట్లో ఎందరో నౌకర్ల సేవలతో దర్జాగా నివసిస్తున్నాడు... ఇంటి పక్కనే ఒక పూరి గుడిసె లో ఒక పేదవాడు నివసిస్తున్నాడు. అతను కాయకష్టం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

 

దనికుడికి ఒక అలవాటు ఉంది . తన భవంతి బాల్కనీలో కూర్చుని , పక్కన ఉన్న

గుడిసె లో పేద వాడు ఏం చేస్తున్నాడు అని గమనిస్తూ ఉండేవాడుఅదే రీతిగా పేదవాడు కూడా తన గుడిసె కప్పు చిల్లుల్లో నుండి చూస్తూ ధనికుడు ఏం చేస్తున్నాడు అని గమనిస్తూ ఉండేవాడు . ఇరువురికీ వారి వారి వారి సమస్యలు ఉన్నాయివాళ్ల వాళ్ల సౌకర్యాలూ ఉన్నాయి.

 

ఇలా ఉండగా ఒక సాధువు వూరికి వచ్చాడు, మొట్టమొదట ధనికుడి ఇంటికి వెళ్ళాడుధనికుడు సాధువుకు అతిధి సత్కారాలు చేసి -"స్వామి నాదొక కోరిక తీర్చాలి" అని ప్రార్థించాడు ..

సాధువు : ఏమి నాయనా నీ కోరిక ?

ధనికుడు: స్వామీ, నాకు బాగా తినాలి అన్న తపన ఉంది . కానీ ఏమీ తిన లేని పరిస్థితిలో ఉన్నాను . కోరిక తీర్చాలి తమరు.

సా: ఎలా తీర్చాలి?

స్వామీనా శరీరంలో సర్వ రోగాలు ఉన్నాయి . ఏమి తిన్నా సమస్య వస్తుంది. అందువల్ల మా ఇంటి పక్కన గుడిసె లో ఉన్న కష్టజీవి శరీరం నాకిప్పిస్తే  వాడి శరీరంలో ప్రవేశించి నాకు కావాల్సినవన్నీ తినేస్తాను.

 

సా: విధంగా చేయటం నాకు సాధ్యమే కానీ నిన్ను నా శరీరంలో ప్రవేశపెట్టాలంటే

వాడి అనుమతి కూడా కావాలి కదా . కొంచెం సమయము ఆగు. నేను వెళ్లి కనుక్కొని వస్తాను.

 

విధంగా సాధువు పేదవాడి ఇంటికి వచ్చాడు . పేదవాడు కూడా  తన శక్తిమేరకు సాధువుకు మర్యాద చేసి ఆయన మాట్లాడే లోపలే "స్వామీ, నాది ఒక కోరిక "అని అడిగాడు .

సా: ఏమి నాయనా నీ కోరిక?

పేదవాడు: స్వామి నాకు ఎన్నో తినాలని  చాలా ఆశగా ఉంది, కానీ నా దుర్భరమైన  ఆర్థిక పరిస్థితి కారణంగా నేను ఏమి తినలేక పోతున్నాను . కాబట్టి నా కోరికను తీర్చండి.

సా: ఎలా తీర్చ మంటావు?

పే: మా ఇంటి పక్కన ఒక ధనికుడు ఉన్నాడుఆయనకు లేనిదేదీ లేదు , ఏమి కావాలన్నా తెప్పించుకో గలడుఆయన శరీరం లోనికి నన్ను ప్రవేశం పెట్టినట్లయితే శరీరం లోనికి వెళ్లి నాకు కావలసింది అంతా తిని కోరిక తీర్చుకుంటాను.

 

ఇంకేం ఇద్దరు కోరికలు సమానంగా ఉన్నాయి.. సాధువుకు పని సులభం అయింది. ఇద్దరు ఆత్మలను కుండ మార్పిడి చేస్తే సరి. సాధువు విధంగా నిర్ణయించుకొని ఇద్దరితో విడివిడిగా ఇలా అన్నాడు.

"ఒక్క రాత్రికి మీ ఆత్మలను నేను ఒకరికొకరికి మార్పు చేస్తాను . తెల్లవారిన తర్వాత మీ అనుభవాల ననుసరించి కొనసాగిద్దామా లేదా అని నిర్ణయించు కుందాము" అని. ప్రణాళికకు ఇద్దరూ అంగీకరించారు. విధంగా సాధువుకు ఇద్దరి ఆత్మలు మార్చి వేసినాడు. ఇద్దరూ ఆనంద పడ్డారు.

 

పేదవాడు ధనికుని  శరీరంలోకి వచ్చిన వెనువెంటనే సేవకుడిని పిలిచి "ఒరేయ్ ఆకలిగా ఉంది బంగారు కంచం లో అన్ని వడ్డించండి " అని అన్నాడు.. సేవకులు అలాగే వడ్డించారు . కానీ కంచం లో పదార్థాలు చూడగానే పేదవాడికి ఒక రకంగా అనిపించింది. అయినా తినటానికి ఉపక్రమించి ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. చాలా చప్పగా ఉంది. " ఒరేయ్ ఓయ్ ఏంట్రా చప్పిడి కూడా పెట్టారు నాకు "అని అన్నాడు పేదవాడు. దానికి సేవకులు" అయ్యా తమరు ఉప్పు తినకూడదు " అని అన్నారు. "ఎందుకు ?" అన్నాడు పేదవాడు.. సమాధానంగా సేవకులు "అయ్యా తమకు రక్తపోటు ఉన్నది. అందువల్ల మీరు ఉప్పు తినరాదు" అని అన్నారు.. "సర్లే ఏదైనా కారంగా పెట్టండి రా " అని అడిగాడు పేదవాడు. దానికి సమాధానంగా సేవకులు-" అయ్యా తమరు కారం తినకూడదు తమరి కడుపులో పుండ్లు ఉన్నవి" అని అన్నారు..."పోనీలే తీయగా తింటాను . ఏవైనా తీపి పదార్థాలు తీసుకొనిరండి " అని  అన్నాడు పేదవాడు.. దానికి సేవకులు -"అయ్యా నీకు తీపి పట్టదండి . మీకు మధుమేహ వ్యాధి ఉంది ." అని అన్నారు.. పాపం పేదవాడు చేసేదేమీలేక చప్పడి కూడా  తినలేక తిని అక్కడి నుండి నిష్క్రమించి శయన మందిరానికి వెళ్ళాడు.. అక్కడ హంసతూలికా తల్పం చూడగానే పేదవాడికి పట్టరాని ఆనందం కలిగింది. మెత్తని పరుపు మీద పడుకునేందుకు ఉపక్రమించాడు. అలా  శరీరం వాల్చాడో లేదో భరించలేనంత నడుము నొప్పి మొదలైంది. వెంటనే సేవకులని పిలిచి అడిగాడు -"ఏమిటి ఇలా ఉంది పరుపు " అని . అందుకు సేవకులు -" అయ్యా పరుపు లో తప్పులేదు . మీ నడుము లోనే లోపం ఉంది పరుపును మీరు చూస్తూ ఉంటారుకానీ నేల మీద పడుకొంటారు, కాబట్టి ఈరోజు కూడా ఇలాగే కానిచ్చేయండి " అని అన్నారు.

పాపం పేదవాడు ఏమి చేయలేక కిందనే పడుకున్నాడు , ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ.

 

ఇక్కడ ఇలా జరుగుతుండగా, పేదవాడి శరీరంలోకి వెళ్లిన ధనికుడు , ఇల్లాలిని పిలిచి -" ఆకలవుతుంది ఏమైనా పట్టుకురా" అన్నాడు . అందుకు ఆమె  రోజువారీ పెట్టే గంజి తెచ్చింది . గంజి నోట్లో పెట్టుకుంటే వాంతికి వచ్చింది దనికుడికి . మనసులో  ఇదేమిటి రకమైన తిండి తినడానికా శరీరం లోకి వచ్చాను అనుకున్నాడుఅనుకుంటూనే -" ఏమిటి ఇలాంటిది పెట్టావు. మంచిది తీసుకురా అన్నాడు ". అందుకామె- "అయ్యోరామా ! ప్రతి రోజు మనము తింటున్నది ఇదే కదారోజూ జుర్రుకుంటూ తాగుతావు కదా. రోజు ఏమైంది నీకు" అని అన్నది. అందుకు ధనికుడు - "సర్లే ఏదైనా  తీపి పట్టుకురా " అన్నాడు. అందుకు సమాధానంగా ఆమె -" అలాగే తయారు చేస్తాను. కానీ నువ్వు వెళ్లి కూలి చేసి నాలుగు డబ్బులు తీసుకురా . అప్పుడు నేను వెళ్లి పంచదార కొనుక్కుని వచ్చి పాయసం చేసి పెడతాను.   ఇప్పడు ఇంట్లో సొమ్ము ఏమీ లేదు." అని అన్నది.. అలా వారు ఇరువురు గొడవ పడ్డారు. ధనికుడు అత్యంత నిరాశ చెందాడు . సరేలే అని సర్దుకుని ఇప్పటికే ఆలస్యమైంది నిద్ర పోదామని అనుకుని ఇల్లాలితో పరుపు తెమ్మన్నాడు . ఇల్లాలు వెళ్లి ఒక చింకి చాప తెచ్చింది . చేసేది ఏమీ లేక   చాపమీద నే ఒక రాయిని  దిండుగా చేసుకొని పడుకున్నాడు ధనికుడుకానీ దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. విపరీతమైన బాధ . నిద్ర పట్టలేదు దనికుడికి.

ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ తలవాల్చాడు.

 

విధంగా భవంతిలో ధనికుడి శరీరంలోని పేదవాడు, గుడిసెలో పేదవాని శరీరంలో ధనికుడు, ఇరువురు వారి వారి బాధలను అనుభవిస్తూ ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తున్నారు..

 

మరుసటి రోజు ఉదయం రానే వచ్చింది. ఇద్దరూ పరుగు పరుగున సాధువును కలుసుకొని -" స్వామీ! మాకు అలవాటైన దేదో అదే బాగుంది . మా తప్పు తెలిసి వచ్చింది. మా ఆత్మలను యధాతథంగా పూర్వ శరీరాలకు పరస్పరం మార్చేయండి." అంటూ ప్రాధేయపడ్డారు..

 

నీతి: ఒకరి కష్టాలు తక్కువ ఒకరి కష్టాలు ఎక్కువ అని అనుకోవటం మూర్ఖత్వం. కష్టాలైనా స్వీకరిస్తే బాధలు నివృత్తి అవుతాయి...

 

CA కె మల్లికార్జునరావు

 

 

 


 

అంతర్జాలమునుండి సేకరణ

కన్యాశుల్కం (నాటకం)

 

కన్యాశుల్కం గురజాడ అప్పారావు రచించిన తెలుగు నాటకం. తెలుగులో తొలి ఆధునిక రచనల్లో ఒకటిగా పేరుపొందింది. కన్యాశుల్కం నాటకం రెండు కూర్పులను రాసి ప్రచురించారు. మొదటి కూర్పు 1897 లో ప్రచురించబడింది. నాటకం మొట్టమొదటి ప్రదర్శన 1892 ఆగస్టు 13 విజయనగరం లో జరిగింది. అంతకు ముందు 5 సంవత్సరాల క్రితం రచన జరిగిందని తెలుస్తోంది. అయితే 1909లో ప్రచురించిన రెండవ కూర్పే ప్రస్తుతం అత్యంత ప్రాచుర్యం పొంది, ప్రజాదరణ పొందిన కన్యాశుల్కం.

అగ్నిహోత్రావధాన్లు తన చిన్న కుమార్తెకు చిన్నతనంలోనే ధనాశతో కన్యాశుల్కం తీసుకుని ముసలివాడైన లుబ్ధావధాన్లకు రామప్పంతులు మధ్యవర్తిత్వంతో పెళ్ళిచేయ నిశ్చయిస్తారు. తన మేనకోడలికి అవస్థ తప్పించేందుకు అగ్నిహోత్రుని బావమరిది కరటకశాస్త్రి గుంటూరు శాస్త్రులుగా పేరుమార్చుకుని రామప్పంతులు వద్ద ఉంటున్న సహృదయురాలైన సాని మనిషి మధురవాణి సాయంతో తన శిష్యుడికి ఆడవేషం వేసి లుబ్దావధాన్లుకు పెళ్ళిచేస్తారు. గుంటూరుశాస్త్రి కన్యాశుల్కంతో ముందు, మారువేషంలోని శిష్యుడు నగలు, బట్టలతో తర్వాత పారిపోతారు. మరోవైపు గిరీశం అనే మోసగాడు అగ్నిహోత్రావధాన్లు మొదటి కుమార్తె, విధవరాలు అయిన బుచ్చెమ్మను మాయచేసి లేవదీసుకుని పోతారు. వీటన్నిటితో జరిగిన గలాభాలో లుబ్దావధాన్లు, అగ్నిహోత్రావధాన్లు దావాలు తెస్తారు. నిజాయితీపరుడు, సంఘసంస్కర్త అయిన సౌజన్యరావు పంతులు సమస్యను పరిష్కరిస్తాడు. మధురవాణి సౌజన్యరావు పంతులుకు గిరీశం నిజస్వరూపం తెలియజేయగా, అతనితో బుచ్చెమ్మ పెళ్ళి తప్పించి శరణాలయానికి పంపడంతో నాటకం ముగుస్తుంది. ఇది కన్యాశుల్కంగా ప్రాచుర్యం పొందిన రెండవ కూర్పు కథ. మొదటి కూర్పుకు ఇతివృత్తంలోనూ, పాత్రల స్వరూప స్వభావాల్లోనూ తీవ్రమైన భేదం ఉంది.

నాటక రచనా కాలానికి నాటకాల్లో అరుదుగా కానవచ్చే సజీవమైన వాడుక భాషనే నాటక రచనకు వినియోగించుకున్నాడు గురజాడ.

కన్యాశుల్కంలో ప్రధానమైన ఇతివృత్తం సంఘ సంస్కరణ. అగ్నిహోత్రావధాన్లు తన రెండవ కుమార్తెను చిన్న పిల్ల అని చూడకుండా 70 ఏళ్ళు నిండుతూన్న ముసలివాడు లుబ్దావధాన్లకి ఇచ్చి కన్యాశుల్కం కోసం పెళ్ళి చేయబోతాడు. అగ్నిహోత్రావధాన్లు కుమారుడికి ట్యూషన్ చెప్తానంటూ అప్పులు చేస్తూ, గొప్పలు చెప్పుకుంటూన్న గిరీశం అనే మోసకాడు ఇంట్లో ప్రవేశిస్తాడు. అగ్నిహోత్రావధాన్లు అప్పటికే పెద్ద కూతురు బుచ్చెమ్మకి కన్యాశుల్కం తీసుకుని ముసలివాడికి కట్టబెట్టగా, పెళ్ళిచేసుకున్న వ్యక్తి పెళ్ళి పూర్తికాకుండానే మరణిస్తాడు. విధవగా ఇంట్లో ఉన్న బుచ్చెమ్మ అందానికి ముగ్ధుడైన గిరీశం ఆమెను మోసగించి వివాహమాడదామని ప్రయత్నిస్తాడు. మరోవైపు గతంలో గిరీశం పోషణలో ఉండే మానవత్వం కలిగిన సాని మనిషి మధురవాణి, లుబ్దావధాన్లును మోసం చేసి పెళ్ళికి ఒప్పించి డబ్బు తీసుకుందామని ప్రయత్నిస్తున్న రామప్పంతులు వద్దకు చేరారు. కుమార్తెకు పెళ్ళి చేస్తే, చనిపోతానని అగ్నిహోత్రావధాన్లు భార్య బెదిరించగా, ఆమె అన్నగారు కరటకశాస్త్రి పెళ్ళి తప్పించేందుకు ప్రయత్నిస్తాడు. తన శిష్యుడికి ఆడవేషం వేసి రామప్పంతులుకు గుంటూరుశాస్త్రులుగా పరిచయం చేసుకుని, అగ్నిహోత్రావధాన్లు కుమార్తెతో లుబ్దావధాన్లుకు పెళ్ళి తప్పించి ఆడవేషం వేసిన శిష్యునికి ఇచ్చి పెళ్ళిచేసి కన్యాశుల్కం తీసుకునివెళ్ళిపోతాడు. కనిపెట్టినా, కరటకశాస్త్రి చేసే పని మంచిదన్న ఉద్దేశంతో పెళ్ళికి మధురవాణి సాయం లభిస్తుంది. ఆడవేషంలోని శిష్యుడు సాధ్యమైనంత బాధపెట్టి, నగలు, బట్టలు మూటకట్టుకుని వెళ్ళిపోతాడు. ఈలోగా పెళ్ళికి తరలివచ్చిన అగ్నిహోత్రావధాన్లు బంధుకోటిలోంచి బుచ్చెమ్మను తీసుకుని గిరీశం లేచిపోతాడు. అగ్నిహోత్రావధాన్లు పరిణామాలకు ఆగ్రహం చెంది, రామప్పంతులుతో కలిసి లుబ్దావధాన్లుపై దావా తెస్తాడు. కేసులో లుబ్దావధాన్లు పక్షాన్ని ధర్మాత్మునిగా, సంఘసంస్కర్తగా, వేశ్యా వ్యతిరేకిగా పేరొందిన లాయరు సౌజన్యారావు పంతులు వకాల్తా పుచ్చుకుంటాడు. చివరికి నిజం తేలడంతో పాటుగా, మధురవాణి సౌజన్యారావు పంతులుకి గిరీశం నిజస్వరూపం తెలియజేయడంతో బుచ్చెమ్మను శరణాలయానికి పంపడంతో నాటకం ముగుస్తుంది.[1]

 

గురజాడ కన్యాశుల్కము నాటకానికి రెండు కూర్పులు ఉన్నాయి. తొలి కూర్పును 1895లో రచించగా, 1909లో మలికూర్పు వెలువడింది. అయితే సాహిత్యలోకంలో విస్తృతంగా ప్రాచుర్యం పొంది, ఆధునిక సాహిత్యంలో గొప్ప రచనల్లో ఒకటిగా పేరొందినది కన్యాశుల్కము రెండవ కూర్పే. కన్యాశుల్కము మొదటి కూర్పు ప్రచురితమైన దాదాపు పదేళ్ళు గడిచిన తర్వాత 1908లో కన్యాశుల్కము విజయనగరంలో ప్రదర్శితమైందన్న ప్రోత్సాహకరమైన వార్తను మహారాజా ద్వారా తెలుసుకోవడంతో గురజాడ కొద్ది మార్పులతో రెండవ ముద్రణకు పూనుకున్నాడు. అయితే ఎస్.శ్రీనివాస అయ్యంగార్ సూచన మేరకు, నడుమ కాలంలో గురజాడ దృక్పథంలోనూ, అనుభవంలోనూ వచ్చిన పరిణతి మేరకు కొద్ది మార్పులు కాక, నాటకం చాలావరకూ మార్చివేసి రెండవ కూర్పు చేసి ప్రచురించాడు.

రెండవ కూర్పులో సంభాషణల నైపుణ్యం, వ్యావహారిక శైలి అభివృద్ధి చెందడం, కొన్ని పాత్రలు తీసివేయడం, కొన్ని చేరడం, రామప్పంతులు వైదీకి నుంచి నియోగి కావడం, అనేక పాత్రల ప్రవర్తనల్లో ఔచిత్యం పెరగడం, సంభాషణల హాస్యస్ఫోరకత అభివృద్ధి అవడం వంటి మార్పులు జరిగాయి. ప్రధానంగా మొదటి కూర్పులో చౌకబారు వేశ్య పాత్ర నుంచి అత్యుత్తమమైన వివేకం, నీతి కలిగిన పాత్రగా రెండవ కూర్పు నాటికి మధురవాణి రూపొందడం ప్రధానమైన విశేషం. అలానే రెండవ కూర్పులో సంభాషణలు, సన్నివేశాలు పెరిగి నాటకం చాలా విస్తరించిందనీ, తద్వారా ఏకోన్ముఖత, ప్రదర్శన యోగ్యత దెబ్బతిందని విమర్శకులు కొందరు భావించారు.

కన్యాశుల్కం తెలుగుజీవనాన్నీ, వాతావరణాన్నీ,మనుషుల శ్వాసనిశ్వాసాల్నీ, ఆంతరిక వ్యధల్నీ, భ్రష్టు పట్టిన మానవస్వభావాల్నీ ఆవిష్కరించే మొదటి సాంఘిక నాటకం. ఆనాటి హేయమైన మానవ నైజాలూ, జీవచ్ఛవాల్లాంటి బాలవితంతువులూ, సారామత్తులో ఉండే బైరాగులూ, దొంగ సాక్షులూ, వేశ్యలూ, లాయర్లూ, … నాటి సంక్షుభిత సమాజ సమగ్ర స్వరూపాన్ని గురజాడ ఫొటో తీసి మన ముందుంచాడు.

తెలుగు సమాజంలో వేళ్లూనుకుంటున్న వినిమయ సంస్కృతిని, పాతుకుపోయిన పితృస్వామిక భావజాలాన్ని, జుగుప్స కలిగించే కట్టుబాట్లను, ఆంగ్లభాషపై పెరుగుతున్న మోజుని అద్భుతంగా పట్టుకున్నారు గురజాడ.

నాటక కథలో ఎక్కువ భాగపు సంఘటనా స్థలాలు విజయనగరానికి చేరువగా ఉన్న అగ్రహారాలు. నాటకం అప్పటి సామాజిక స్థితిగతులకు దర్పణంగా నిలచింది. కన్యాశుల్కం లో చిత్రించిన అనేక రుగ్మతలు ఇప్పటికీ సమాజంలో పేరుకుపోయి ఉన్నాయి.(?).

నాటకంలోని కథావస్తువుసంఘసంస్కరణకి ఉద్దేశించింది. అందులో ముఖ్యాంశాలివి. చిన్న పిల్లల్నిముసలివాళ్ళకిచ్చి పెళ్ళిచేయడం,వేశ్యావృత్తి హైన్యత, స్త్రీల దుస్థితి, పెద్ద మనుషులుగా చెలామణీ అయే కుహనామేధావులు.

ఐదేళ్ళకే బాలికలకి పెళ్ళిచేసేవారు. అన్యాయాన్నిఎత్తి చూపాడు గురజాడ. పసిపిల్లల్ని కాలం గడిచినవాళ్ళకిచ్చి పెళ్ళిచేస్తే వైధవ్యం రాక తప్పదు. బాలవితంతువులుగా జీవితం వెళ్ళబుచ్చవల్సిందే. నాటకంలో అగ్నిహోత్రావధాన్లు తన చిన్న కూతురిని లుబ్ధావధాని కివ్వడంలో ప్రేమ లేక కాదు ధనాశ వల్లనే. ఎందుకంటే తన కొడుక్కి కూడా డబ్బు ఖర్చు లేకుండా పెళ్ళి చెయ్యాలనుకుంటాడు కాబట్టి.

కన్యాశుల్కం తీసుకోవడంలో ఉచితానుచితాలూ,న్యాయాన్యాయాలూ లేవు. అభం శుభం తెలియని ఆడపిల్లకి అమానుషంగా పెళ్ళి చెయ్యడం వెనుక ఉన్నది ధనవ్యామోహం. వీటిని గురజాడ వెల్లడించాడు.

పెద్ద మనుషులుగా, విద్యావంతులుగా నటిస్తూ,ఆదర్శాలకీ ఆచరణలకీ పొంతనలేని వ్యక్తుల్ని గురజాడ చూసిగిరీశం” “రామప్పంతులువంటి పాత్రల్నికథలో పొందు పరచాడు. మోసాలు, అబద్ధాలు,సొంతడబ్బా, ఎలాగో అలా పబ్బం గడుపుకోవడాలు …. వీటిని నాటక వస్తువులో ఉపాంగాలుగా చేసాడు. “ఆధునికతపేరుతో ఇంగ్లీషు చదువుపై గల వ్యామోహాన్ని వ్యక్తం చేసాడు. నాటకంలోని వస్తువు మన సంస్కృతీరుగ్మతను హెచ్చరిస్తూ సంఘ సంస్కరణ ఎంత అవసరమో వెల్లడిస్తుంది.

ఈనాటి వాళ్ళకి కన్యాశుల్కంలోని వస్తువు పాతది.అందులోని ప్రధాన సమస్య అయిన కన్యాశుల్కం ఈనాడు లేనేలేదు. చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు కూడా లేవు. కన్యాశుల్కం స్థానంలో వరకట్నం వచ్చింది. వేశ్యలకి చదువు, తెలివి, సంపద పోయి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా ఈనాటికీ నాటకం జనాదరణ పొందడానికి కారణం, నాటకాన్ని ఒకసజీవసాహిత్య ప్రక్రియగా గురజాడ రూపొందించడమే. ఆయనలోని కళాప్రతిభ కూడా ఒక ముఖ్యకారణం. పాత్రల తీరుతెన్నులు,సంభాషణల్లోని నైపుణ్యం, నాటకాన్ని సజీవం చేసాయి.”గిరీశంపాత్ర నాటకానికి పుష్టి కలిగించింది. హాస్యం అన్ని కాలాల్లో అందరూ ఆనందించేటట్టు పోషింపబడింది. రోగిష్టి సమాజం, మనసు పుచ్చిన మనుషులు ఉన్నంతవరకూ నాటకం నిలుస్తుంది. నిలిచి శస్త్ర చికిత్స చేస్తుంది కూడా. నాటకం ఆధునిక నాటకసాహిత్యానికివిఙ్ఞాన సర్వస్వంవంటిది. నాటకాన్ని ఒక సాంఘిక అధిక్షేప నాటకమని గాని, సాంఘిక ఇతిహాస నాటకమని గాని అనవచ్చు.

నాటకానికైనా ఇతివృత్తానికైనా ప్రాణాలు పాత్రలే. నాటకంలోని పాత్రలు సజీవంగా ప్రకాశిస్తూంటాయి. ఒక పాత్ర మరొక పాత్రతో పోటీ పడుతూంటుంది. ఇవి మన సమాజంలో మనకు కనుపించే పాత్రలే. రామప్పంతులు వంటి దగాకోరులు, స్వార్ధపరులు, గిరీశంలాంటి బడాయి కోరులూ మాటకారులు, అగ్నిహోత్రావధాన్లులాంటి ధనాశాపరులు, సంస్కర్తలకి కూడా బుద్ధి చెప్పగల మధురవాణి వంటి సమయోచిత ప్రఙ్ఞగల స్త్రీలు నేటి సమాజంలో అడుగడుగునా కన్పిస్తారు. ఇంతటి వైవిధ్యం, సహజత్వం గల పాత్రపోషణ వల్ల నాటకం సజీవంగా నిలిచింది. కన్యాశుల్కం నాటకం లో ఎవరి ప్రవృత్తికి తగ్గట్టుగా యా పాత్రలకు పేర్లు పెట్టడం గురజాడ చతురతకు నిదర్శనం. లుబ్దావధాన్లు, కరటక శాస్ర్తి, మధురవాణి, గిరీశం, పోలిశెట్టి, వెంకటేశం, పండా సిద్ధాంతి వంటి పేర్లకు తగ్గట్టే వారి ప్రవర్తన ఉంటుంది. సౌజన్యరావు పంతులు వంటి సౌజన్య మూర్తి వంటి న్యాయవాదులు కూడా ఉంటారు. నిరంతరం మధువు, గంజాయి వంటి వాటితో కాలక్షేపం చేసే బైరాగులు అప్పుడే కాదు, నేడూ మనకు దర్శనమిస్తారు. నాటి కన్యాశుల్కంలోని పాత్రలన్నీ నేటికీ వివిధ వ్యక్తుల్లో సజీవంగానే ఏదో రూపంలో మనకు కనుపిస్తుంటాయి. కవి క్రాంత దర్శి అంటారు. అందులోనూ మహాకవి నాలుగు రాళ్ళు ఎక్కువే చదివారు. అందుకే అడుగుజాడ గురజాడదిగా పేర్కొన్నారు.

సర్దేశాయి తిరుమల రావుకన్యాశుల్క నాటకకళఅనే విమర్శలో నాటకంలోని పాత్రల్నిరెండు వర్గాలుగా విభజించాడు మంచి పాత్రలూ, చెడ్డ పాత్రలు. మనిషిలోని మంచి,చెడ్డల మేలుకలయిక మంచితనంగానూ, చెడ్డ,మంచిల కీడుకలయిక చెడ్డతనంగానూ తెలిపారు. మధురవాణి, బుచ్చమ్మ, కరటక శాస్త్రి, సౌజన్యారావు పంతులు పాత్రలు మంచివి. గిరీశం, రామప్పంతులు, అగ్నిహోత్రావధాన్లు, లుబ్ధావధాన్లు చెడ్డపాత్రలు. సుబ్బి రంగస్థలంపైకి రానినాయికవంటిది. సుబ్బిని రంగం మీదకి తీసుకురాకపోవడానికి కారణం ప్రేక్షకుడిలో సెన్టిమెంటాలిటీ పుట్టకుండా చెయ్యడాని కనిపిస్తుంది.కన్నీళ్ళు ,వెక్కిళ్ళూ కనుపించనీయకూడదని నాటక కర్త ఉద్దేశం కావచ్చు. ఇంకా ఇతర పాత్రలున్నాయి. కొందరన్నట్టు అసలు నాటకంలో కనుపించని పాత్ర గురజాడ. “సామూహిక పాత్రీకరణఅంటే, పాత్రశీలానికి ఒక్క పాత్రను గాక, రెండుగాని అంతకంటె ఎక్కువగాని పాత్రలని ప్రతినిధులుగా నిలబెట్టే విధానం కన్యాశుల్కంలో కనుపిస్తుంది.ఇందుకు ఉదాహరణలు అగ్నిహోత్రావధాన్లు, లుబ్ధావధాన్ల పాత్రలే. గురజాడ గొప్పదనానికి ఇదొక నిదర్శనం.

నాటకాని ప్రసిద్ధి తెచ్చిందీ, అందరినీ ఆకర్షించిందీ గిరీశం పాత్ర. ఇది నాయక పాత్ర కాకపోయినా నాటకమంతా పరచుకొంది. నాటకం మొదలు, ముగింపూ పాత్రతోనే కాబట్టి రచయిత పాత్రవిషయంలో ఒక ఆద్యంతసమత పాటించాడనవచ్చు. గిరీశంవల్ల రచయిత ప్రయోజనాన్ని ఆశించాడు? ఇది కేవలం ఒక హాస్య పాత్రా? అనే ప్రశ్నలు తలెత్తుతాయి మనలో. నాటకంలో గిరీశం చాలాపనులు చేసినట్టు కనుపించినా, పనులవల్ల ప్రయోజనం, మార్పూ కనుపించదు.

గిరీశం సమాజంలోని దొంగ పెద్ద మనుషులకి ప్రతీక,.మాయమాటల్తో పబ్బం గడుపుకోవడమే గాని, ఇతనికి ఒక సిద్ధాంతం, ఆశయం ఉన్నట్టు కనుపించవు. స్వప్రయోజనం కోసం ఇతరులకి కష్టాల్నితెచ్చిపెట్టడానికి కూడా వెనుకాడడు. తాను చేసే ప్రతిపనీ అన్యాయమని తెలిసే చేస్తాడు. వేడుకొని, భయపెట్టి, నవ్వించి, ఏడిపించి, ఏడ్చి ఇతరుల్ని తన దారిలోకి తిప్పుకోగల లౌక్యుడు. నాటకంలో జరిగే సంఘటలపై వ్యతిరేకంగా వ్యాఖ్యానించే గిరీశం పాత్ర సాంఘిక, సాంస్కృతిక ప్రయోజనాల్నిఆశించి గురజాడ సృష్టించి ఉండవచ్చు. “డామిట్‌ ! కథ అడ్డం తిరిగిందిఅంటూ నాటక రంగం నుంచి నిష్క్రమించినా సమాజంలో కనుపిస్తూ నేటికీ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే ఉన్నాడు.

నాటకంలోని రెండవ ముఖ్య పాత్రమధురవాణి”. పాత్రలో అసాధారణత, పరిణామం, శీఘ్రప్రగతీ కన్పిస్తాయి. మొదట్లో సామాన్య వేశ్యగా కన్పించే మధురవాణి, నాటకం ముగిసేసరికి గొప్ప మనిషిగా కనబడుతుంది. ఇది గురజాడ ఇంద్రజాలం. రామప్పంతులు తన బుగ్గ గిల్లినప్పుడు, “మొగవాడికైనా ఆడదానికైనా నీతి ఉండాలి. తాకవద్దంటే చెవిని బెట్టరు గదాఅని మందలించడంలోనే ఆమె మనసు అర్ధమవుతుంది.

వ్యక్తి స్వాతంత్య్రాన్ని, పట్టుదలను ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కోల్పోని గుండె నిబ్బరం గలది. విమర్శనాఙ్ఞానం, విశ్లేషణ కలది. ఎదుటి వాళ్ళగురించి ఆలోచిస్తుంది. తృతీయాంకంలో రామప్పంతులు పైన పటారం లోన లొటారం అని పసిగడుతుంది. ఇతర వేశ్యలు ధనం గుంజాలని చూస్తూంటే, మధురవాణి తనని ఉంచుకున్నవాడు బాగు పడాలనీ, అదే తనకు ఎక్కువ గొప్పనీ చెబుతుంది.ఆమె సంస్కారవతి. దురాచారాల్ని సహించదు. కన్యావేషంలో ఉన్నశిష్యుణ్ణి లుబ్ధావధానికి కట్టబెట్టి, సుబ్బి పెళ్ళి తప్పించడంలో ఆమె వ్యూహాశక్తి మనకి తెలుస్తుంది. కరటక శాస్త్రితోవృత్తి చేత వేశ్యని గనక చెయ్యవలసిన చోట ద్రవ్యాకర్షణ చేస్తాను గాని మధురవాణికి దయాదాక్షిణ్యాలు సున్న అని తలిచారా?” అనడం ప్రత్యక్షర సత్యం. నాటకం చివర కరటక శాస్త్రిని జైలు నుంచీ,లుబ్ధావధానిని మరణ శిక్ష నుంచీ తప్పిస్తుంది. “ఆహా! ఏమి యోగ్యమైన మనిషిఅని రామప్పంతులు కూడా అనకుండా ఉండలేక పోతాడు. అయితే నాలుగో అంకంలోనీకు సిగ్గులేదే లంజా!” లాంటి మాటలు పాత్రచేత అనిపించడం సబబుగా లేదు.

ఆరవ అంకంలో మధురవాణి సంఘం మీద దాడి చేస్తుంది. స్త్రీస్వాతంత్ర్యోద్యమానికి మధురవాణి పాత్ర నాందిగా చెప్పవచ్చు. పొరుగువారికి సాయపడుతూ, పాపపు లోకంలో కూడా మంచి ఉందని నిరూపించిన త్యాగజీవి మధురవాణి. పాత్ర ఒక్కొక్క సారి నాటక పరిధిని దాటిపోయి విశ్వరూపాన్ని చూపిస్తుంది.

డబ్బు గడించి దానిపై వ్యామోహం లేకుండా ప్రేమకోసం పరితపించే పాత్ర మధురవాణి. “కాపు మనిషినై పుట్టి మొగుడి పొలంలో వంగ మొక్కలకూ, మిరప మొక్కలకూ దోహదం చేస్తే యావజ్జీవం కాపాడే తన వాళ్లైనా ఉందురేమోఅనుకోవటంలో పాత్రలో పరివర్తన కనుపిస్తుంది. దీన్ని గురజాడ హఠాత్తుగా కాక క్రమంగా వచ్చిన మార్పుగా చిత్రించడంలో తన కళాప్రతిభ, సహజత్వం చూపించారు.

రామప్పంతులు పాత్ర చాలా ఆసక్తికరమైనది. ఇతను కుటిల దృష్టికలవాడు. “నమ్మిం చోట చేస్తే మోసం, నమ్మం చోట చేస్తే లౌక్యవూఁనుఅనే అవకాశవాద, కపట బుద్ధి ఉంది. అయినా మధురవాణి వ్యూహంలో చిక్కుకుపోయాడు. ఇతను ఎవళ్ళెక్కువ డబ్బిస్తే వాళ్ళ పక్షం. ఒక మాటమీద నిలబడడు.

అగ్నిహోత్రావధాన్లు వేద వేత్త, అమాయక బ్రాహ్మణుడు,ధనాశాపరుడు, సనాతనాచారాలున్నవాడు.

సౌజన్యారావు న్యాయవాది . వివిధ స్వభావాలున్నమనుషుల్ని చూసినవాడు. వ్యవహారాన్ని నేర్పుగా చక్కబెట్టే ప్రవృత్తి గలవాడు. మొదట్లో గిరీశం పెద్ద మనిషని నమ్మినా, విషయం తెలిసాక, అతన్నిగెట్‌ అవుట్‌అంటాడు. మధురవాణి వ్రతం సౌజన్యా రావుని పెద్దవాడిగా నిలిపిందా? లేక సౌజన్యా రావు ప్రవర్తన మధురవాణిని మంచిదానిగా చేసిందా అనిపిస్తుంది.

ఇకపోతే తనకు తానుగా చెడు చెయ్యని లుబ్ధావధాని, మంచి స్వభావంగల కరటక శాస్త్రి, తండ్రికి బుద్ధి చెప్పే పాత్రలో మీనాక్షి.. ఇలా ఎన్నో.మొత్తం మీద కొన్ని లోపాలున్నా పాత్ర పోషణా నైపుణ్యం కన్యాశుల్కం సజీవంగా నిలబడడానికి దోహదం చేసింది.

కన్యాశుల్కం అనగానే హాస్యం గుర్తొస్తుంది. నాటకంలో పాత్రలే ఒకరికిఒకరు పేర్లు పెట్టుకొని హాస్యమాడుకున్నారు.గిరీశం అగ్నిహొత్రావధానినిఅగ్గిరావుఁడన్నాడు. కరటక శాస్త్రిమూర్ఖపగాడ్దె కొడుకన్నాడు. గిరీశాన్ని రామప్పంతులుగిర్రడు” “బొట్లేరుఅని కొట్టిపారేశాడు. అగ్నిహోత్రావధాన్లు కూడా గిరీశాన్నిహనుమాన్లుగా ఆట పట్టించాడు. మధురవాణి దృష్టిలో రామప్పంతులు,లుబ్ధావధాని లొట్టిపిట్టలు. లుబ్ధావధాని పెళ్ళి ముసలి మనువు కాబట్టి హాస్యాన్ని కల్గిస్తుంది. మధురవాణి ఇంట్లో రామప్పంతుల్నీ, గిరీశాన్ని పూటకూళ్ళమ్మ చీపురుతో కొట్టడం,గిరీశం లుబ్ధావధానికి వ్రాసిన లేఖ,గిరీశం,వెంకటేశాల సంభాషణలూ మొదలైనవి హాస్యాన్ని పుట్టించాయి. రామప్పంతులునాకు యింగిలీషే వస్తే దొరసాన్లు నా వెనకాల పరిగెత్తరా?” అన్నప్పుడు, మధురవాణి లుబ్ధావధానిని పన్ను కదిలిందా? కన్నుకు దృష్టి తగ్గిందా?, చూడండి మీ కండలు కమ్మెచ్చులు తీసినట్టు యెలా వున్నాయోఅన్నప్పుడూ నవ్వుకుంటాం.

సంఘంలోని కొన్ని లోపాల్ని ఎత్తిచూపడం కోసం గురజాడ హాస్యాన్ని ఆయుధంగా వాడాడు. ఉదాహరణకి, గిరీశంలెక్చర్లు ఎంతసేపూ సిటీల్లోనే గాని పల్లెటూళ్ళలో ఎంతమాత్రం పనికిరావుఅంటాడు. అలాగేనీ మాస్టరుకు నన్ను చూస్తే గిట్టదు. అందుచేత నిన్ను ఫెయిల్‌ చేసాడు గానీ..” అనడం గూడా. “పొగత్రాగని వాడు దున్నపోతై పుట్టున్‌, “మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్ట కాల్చడం ఒక్కటే!” అన్నప్పుడు సరదాగా నవ్వుకుంటాం. అలాగే, “సత్యం మే, ధర్మం మేవంటి వేద మంత్రాలకుచేగోడిం మేలాంటి పేరడీలు హాస్యస్ఫోరకాలు. సంభాషణలు భాష నాటకానికి జవజీవాలు. తెలుగు పలుకుబడులతో, పాత్రోచిత భాషతో, వ్యంగ్యంతో, హాస్యంతో సంభాషణల్ని నడిపించిన గురజాడ ప్రతిభ అసామాన్యం. “నా దగ్గర చదువుకున్న వాడు ఒహడూ అప్రయోజకుడు కాలేదు. పూనా డక్కన్‌ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు ది ఇలెవెన్‌ కాజెస్‌ ఫర్ది డీజనరేషన్‌ ఆఫ్‌ ఇండియాను గూర్చి మూడు గంటలు వక్క బిగిన లెక్చరిచ్చేసరికి ప్రొఫెసర్లు డంగై పోయినారువంటి మాటలు గిరీశం పాత్రపోషణకు బలాన్నిచ్చాయి. గిరీశం సంభాషణలు తెలుగు వాళ్ళ నోళ్ళల్లో సామెతలుగా నిలబడిపోయాయి. ” మనవాళ్ళు వట్టి వెధవాయలోయ్‌", “డామిట్‌ కథ అడ్డం తిరిగిందిలాంటివి సాక్ష్యాలు.

పూటకూళ్ళమ్మ గురించిమీరుండగా వెధవెలా అవుతుందిఅనడం, కన్య వేషంలోని కరటక శాస్త్రి శిష్యుణ్ణి గురించి కన్నెపిల్ల నోరు కొంచెం చుట్ట వాసన కొడుతోందిఅనడం లాంటి వాటి ద్వారా మధురవాణి సంభాషణా నైపుణ్యాన్ని చూపించాడు గురజాడ. “వీళ్ళమ్మా శిఖా తరగా! ప్రతిగాడిద కొడుకూ తిండిపోతుల్లాగా నా ఇంట జేరి నన్ననే వాళ్ళే! తాంబూలం ఇచ్చేశాను, ఇహ తన్నుకు చావండిఅన్న వాక్యం నేటికీ ప్రజల్లో వినబడడమే గురజాడ సంభాషణల్ని నడిపిన చాతుర్యానికి నిదర్శనం.

న్యాశుల్కం వాడుకభాషలో రాయబడ్డ మొదటి సాంఘిక నాటకం.ఒక్క వాడుక భాషేకాక, మాండలికాలు, పాత్రోచిత ప్రయోగాలూ కూడా ఉన్నాయి. కళింగాంధ్ర మాండలికాలకు ఉదాహరణలుచెప్పాను కానా?”, “నా ఆబోరుండదండీ, “గుంటవెధవ, “కనిష్టీబు, ”నాను ఉంది, “అనాడీ చేస్తున్నారు, “వగుస్తున్నారు, “కొసాకి వినుమొదలైనవి.

పాత్రోచితంగా అగ్నిహోత్రావధానిమానా! మానులా వున్చానంచావూ? గూబ్బగల గొడతాను.” వెంకమ్మమీకు మాత్రం అబ్బిమీద ప్రేఁవ లేదా యేవిషి?” గిరీశంనేనే దాని హజ్బన్డై ఉంటే నిలబడ్డపాట్ననీ తండ్రిని రివాల్వర్తో షూట్‌ చేసి ఉందును.”

మాట్లాడే భాషకి చాలా దగ్గరగా ఉన్న పదాల్ని ప్రయోగించి సహజత్వానికి అద్దం పట్టాడు గురజాడ. ఉదాహరణకి,సాన్దీ, యవరో, జంఝప్పోస, సమ్మంధం, నాలుగ్గింజలు మొదలైనవి ఇలాంటివే. “కుంచం నిలువుగా కొలవడానికి వీలులేనప్పుడు,తిరగేసైనా కొలిస్తే నాలుగ్గింజలు నిలుస్తాయి, “ఒపీనియన్స్‌ అప్పుడప్పుడు చేన్జి చేస్తూంటేగాని పొలిటీషియన్‌ కానేరడువంటి కొత్త సూక్తులు కనిపిస్తాయి.

మానవత్వాన్ని చాటి చెప్పి, మానవుడిని క్రియాపరునిగా ప్రేరేపించగల శక్తి గలది ఉత్తమ సాహిత్యమైతే, “కన్యాశుల్కంఉత్తమ సాహిత్యరూపం. ఉదాత్తమైన నాటకం. తెలుగు వాడు గర్వించదగ్గ నాటకం.

 

నాటకం మొదటి కూర్పు 1892లో తొట్టతొలిగా విజయనగరం మహారాజు పోషణలోని జగన్నాథ విలాస నాటక సంస్థ వారు ప్రదర్శించారు. ప్రదర్శన నాటికి, నాటకం మొదటి ముద్రణ కూడా కాలేదు, పైన 5 సంవత్సరాల తర్వాత మొదటి కూర్పు తొలిగా ప్రచురితమైంది. జగన్నాథ విలాస నాటక సంస్థ అప్పటివరకూ కేవలం సంస్కృతభాషలోని నాటకాలనే ప్రదర్శించేవారు, అయితే విజయనగరం మహారాజుకు నాటకం అన్నివిధాలుగా నచ్చివుండడంతో ఆయన కోసం దీన్ని ప్రదర్శించారు. గురజాడ అప్పారావు రచనలో లేని సంస్కృత ప్రవేశికను చేర్చి ప్రదర్శించారు.

కన్యాశుల్కం రెండవ కూర్పు మాత్రం చాలా పెద్దది కావడంతో మొదటి కూర్పుతో పోలిస్తే ప్రదర్శనకు చాలా కష్టంగా తయారైంది. గురజాడ నాటకాన్ని, మరీ ముఖ్యంగా రెండవకూర్పును, రచించేప్పుడు ప్రదర్శనపై పెద్దగా దృష్టిలో పెట్టుకోలేదు లేదా నాటక ప్రదర్శనలో అనుభవం అయినా లేకపోయివుండవచ్చు అని విమర్శకుడు వెల్చేరు నారాయణరావు భావించాడు. నాటకం పొడవు, సుదీర్ఘమైన స్వగతాలు, చాలా ఎక్కువ పాత్రలు, రంగస్థలంపై ప్రదర్శించే వీలు లేని సన్నివేశాలు వంటివి పూర్తి నాటకాన్ని ప్రదర్శించడం దాదాపు అసాధ్యం చేసేశాయి. నాటకం రెండవ కూర్పు ప్రచురితమైన 15 సంవత్సరాల పాటు ప్రదర్శనకు నోచుకోలేదు.

అయితే ఈలోపుగా నాటక ప్రతులు బాగా అమ్ముడై, చాలామంది చదివారు. గిరీశం, మధురవాణి వంటి పాత్రలు తెలుగువారి మాటల్లోకి వచ్చిచేరాయి. దశలో 1924లో తెనాలిలో ప్రాచుర్యం పొందిన రంగస్థల నటులతో మొదటిసారిగా పూర్తి నాటకం ప్రదర్శితమైంది. ఆపైన పలువురు రంగస్థల నటులు, సినీనటులు రామప్పంతులు, లుబ్ధావధాన్లు, గిరీశం, మధురవాణి వంటి పాత్రల్లో నటించి పేరుతెచ్చుకున్నారు. మధురవాణి పాత్రలో స్థానం నరసింహారావు, అయితం రాజకుమారి, సావిత్రి వంటివారు పేరొందారు.

1932లో సాహిత్యకారుడు అబ్బూరి రామకృష్ణారావు నాటకాన్ని ప్రదర్శనకు అనుకూలమైన సమయానికి కుదించి రాశాడు. అంతేకాక తాను కుదించిన కూర్పుతో 100సార్లకు పైగా ఆంధ్రదేశమంతటా ప్రదర్శించాడు. తర్వాతికాలంలో జె.వి.సోమయాజులు, జె.వి.రమణమూర్తి, .ఆర్.కృష్ణ వంటి దర్శకులు తమదైన శైలిలో మార్పులు చేసుకుని ప్రదర్శించారు. రంగస్థలంపై వృత్తి కళాకారులు కాకుండా ఔత్సాహికులు, విద్యార్థులు వేర్వేరు వేదికలపై అసంఖ్యాకంగా ప్రదర్శించారు. అయితే ఇవేవీ పూర్తిస్థాయిగా నాటకమంతటినీ ప్రదర్శించినవి కావు. తాము ఎంచుకున్న సన్నివేశాలను కానీ, తమవైన కుదించిన కూర్పులను కానీ ప్రదర్శించారు. 1982లో పెమ్మరాజు వేణుగోపాల రావు తాను కుదించిన కూర్పుతో అమెరికాలోని అట్లాంటాలో ప్రదర్శించాడు. ఆపైన అమెరికా లోని పలు నగరాల్లో ఆయన తెలుగువారి కోసం తన కూర్పును నిర్మించి ప్రదర్శనలు ఇచ్చాడు.

పూర్తి నాటకాన్ని 1939లో విశాఖపట్టణం ఆంధ్ర విశ్వకళాపరిషత్తు లోనూ, 1948, 1956 సంవత్సరాల్లో ఒడిశా కు చెందిన పర్లాకిమిడి లో ప్రదర్శించారు. పూర్తి నాటకం ప్రదర్శించేందుకు ప్రదర్శన సమయం, రంగస్థలంపై ప్రదర్శించడానికి కష్టమైన దృశ్యాలు వంటివి ఇబ్బంది కలిగించేటట్లు ఉండడంతో పూర్తి నాటకం ప్రదర్శనలు విస్తృతంగా సాగలేదు. 2006లో పూర్తినాటకాన్ని మార్పులూ లేకుండా టెలివిజన్ కోసం చిత్రీకరించి వారాలపాటు ప్రదర్శించారు.[2]

 

చదువు కోటానికి 

అంతర్జాలమునుండి సేకరణ

 

 

 


 

ఆత్మీయ సమూహ సభ్యులకు నమస్సులు వారాంతపు సమీక్ష లో భాగం గా  అభ్యుదయ రచయిత గా పేరుగాంచిన శ్రీ గురజాడ అప్పారావు గారు రచించిన కన్యాశుల్కం నాటకం గురించి ఈరోజు అందరం సమీక్షలు పంచుకుందామని  అనుకున్నాము కదా !!

ముంజేతి కంకణానికి అద్దమేలా  అన్నట్టు మనలో చాలమంది

కన్యాశుల్కం నాటకం రేడియో లో వింటునో దురదర్శన్ లో చూస్తునో పెరిగాము.

కాబట్టి సమీక్ష రాయడం కాస్త కష్టమే. తెలియని కధ చెప్పడం  సులువు. అందరికీ తెలిసిన కధని నా దృష్టికోణం తో చెప్పడం అంటే

కొంచెం తడబాటుగా ఉంది. అయినా నా ప్రయత్నం నేను చేసాను

ఏమైనా లోపాలు ఉంటే సహృదయులైన సమూహ సభ్యులు మన్నించగలరు.

పుస్తకం పేరు :: కన్యాశుల్కం

రచయిత:: శ్రీగురజాడ అప్పారావు (మొదటి కూర్పు -1897) (రెండవ కూర్పు – 1909)

మూలకధ  :: కన్యాశుల్కంలో ప్రధానమైన ఇతివృత్తం సంఘ సంస్కరణ. అగ్నిహోత్రావధాన్లు తన రెండవ కుమార్తెను చిన్న పిల్ల అని చూడకుండా 70 ఏళ్ళు నిండుతూన్న ముసలివాడు లుబ్దావధాన్లకి ఇచ్చి కన్యాశుల్కం కోసం పెళ్ళి చేయబోతాడు. అగ్నిహోత్రావధాన్లు కుమారుడికి ట్యూషన్ చెప్తానంటూ అప్పులు చేస్తూ, గొప్పలు చెప్పుకుంటూన్న గిరీశం అనే మోసకాడు ఇంట్లో ప్రవేశిస్తాడు.

 

 

అగ్నిహోత్రావధాన్లు అప్పటికే పెద్ద కూతురు బుచ్చెమ్మకి కన్యాశుల్కం తీసుకుని ముసలివాడికి కట్టబెట్టగా,

పెళ్ళిచేసుకున్న వ్యక్తి పెళ్ళి పూర్తికాకుండానే మరణిస్తాడు. విధవగా ఇంట్లో ఉన్న బుచ్చెమ్మ అందానికి ముగ్ధుడైన గిరీశం ఆమెను మోసగించి వివాహమాడదామని ప్రయత్నిస్తాడు

చిన్న కుతురు సుబ్బికి లుబ్ధావధాని తో పెళ్ళి చేస్తే, చనిపోతానని అగ్నిహోత్రావధాన్లు భార్య బెదిరించగా, ఆమె అన్నగారు కరటకశాస్త్రి పెళ్ళి తప్పించేందుకు ప్రయత్నిస్తాడు. తన శిష్యుడికి ఆడవేషం వేసి రామప్పంతులుకు గుంటూరుశాస్త్రులుగా పరిచయం చేసుకుని, అగ్నిహోత్రావధాన్లు కుమార్తెతో లుబ్దావధాన్లుకు పెళ్ళి తప్పించి ఆడవేషం వేసిన శిష్యునికి ఇచ్చి పెళ్ళిచేసి కన్యాశుల్కం తీసుకునివెళ్ళిపోతాడు. కనిపెట్టినా, కరటకశాస్త్రి చేసే పని మంచిదన్న ఉద్దేశంతో పెళ్ళికి మధురవాణి సాయం లభిస్తుంది. ఆడవేషంలోని శిష్యుడు

నగలు, బట్టలు మూటకట్టుకుని వెళ్ళిపోతాడు. ఈలోగా పెళ్ళికి తరలివచ్చిన అగ్నిహోత్రావధాన్లు బంధుకోటిలోంచి బుచ్చెమ్మను తీసుకుని గిరీశం లేచిపోతాడు. అగ్నిహోత్రావధాన్లు పరిణామాలకు ఆగ్రహం చెంది, రామప్పంతులుతో కలిసి లుబ్దావధాన్లుపై దావా తెస్తాడు.

కేసులో లుబ్దావధాన్లు పక్షాన్ని ధర్మాత్మునిగా, సంఘసంస్కర్తగా, వేశ్యా వ్యతిరేకిగా పేరొందిన లాయరు సౌజన్యారావు పంతులు వకాల్తా పుచ్చుకుంటాడు. చివరికి నిజం తేలడంతో పాటుగా, మధురవాణి సౌజన్యారావు పంతులుకి గిరీశం నిజస్వరూపం తెలియజేయడంతో బుచ్చెమ్మను శరణాలయానికి పంపడంతో నాటకం ముగుస్తుంది.

ఈ నాటకంలోని   ముఖ్యాంశాలివి.

 చిన్న పిల్లల్ని మసలివాళ్ళకిచ్చి పెళ్ళిచేయడం,

కన్యాశుల్కం తీసుకోవడంలో ఉచితానుచితాలూ,న్యాయాన్యాయాలూ లేవు. అభం శుభం తెలియని ఆడపిల్లకి అమానుషంగా పెళ్ళి చెయ్యడం వెనుక ఉన్నది ధనవ్యామోహం. వీటిని గురజాడ వెల్లడించాడు.

ఈనాటి వాళ్ళకి కన్యాశుల్కంలోని వస్తువు పాతది. అందులోని ప్రధాన సమస్య అయిన కన్యాశుల్కం ఈనాడు లేనేలేదు. చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు కూడా లేవు. కన్యాశుల్కం స్థానంలో వరకట్నం వచ్చిందిఅప్పుడు కనీసం ఊహ తెలియని పిల్లల్ని అమ్ముకున్నారంటే ఎదోలే అనుకోవచ్చు . ఇంత అభివృద్ది సాధించాక ,

బాగా చదువుకుని యుక్తవయ్సు వచ్చి ఉద్యోగాలు చేస్తున్న ఈరోజుల్లో కూడా వర్కట్నం అనే హేయమైన  దురాచారాన్ని నిస్సిగ్గుగా పాటిస్తున్న మనం సిగ్గుపడటం కూడా మర్చిపోయాం అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను.

  నాటకం రచించి దాదాపు  125 ఏళ్ళు గడుస్తున్నా నాటికీ నాటకానికి ఆదరణ తగ్గకపోవడానికి ముఖ్య కారణం గురజాడవారు సృష్టించిన సజీవ పాత్రలే కారణం అని నా వ్యక్తిగత అభిప్రాయం .

ఎందుకంటే ఆవేశమే తప్ప ఆలోచన లేని అగ్నిహోత్రవధానులు ,

తెలిసింది తక్కువ ప్రదర్శించేది ఎక్కువ చేసే  గిరీశాలు,

వృత్తి ఏదైనా విజ్ఞత, మానవత్వం తో సాటివారికి సాయపడే మధురవాణులు, భర్త కి ఎదురు చెప్పే ధైర్యం లేక సమస్య రాగానే చావే శరణ్యం అనే వెంకమ్మ లు ,

ఆధారం లేకపోయినా తెలిసిన పని చేసుకుంటూ

లౌక్యంతో జీవనం గడిపే పుటకుళ్ళమ్మ లూ

పైకి పెద్దమనుష్యుల్లా నటిస్తూ వెధవ వేషాలు వేసే రామప్ప పంతుళ్ళు , నమ్ముకున్న ఆశయాలకోసమే జీవించే సౌజన్య రావులు  మనకి తారస పడుతూనే ఉంటారు మన దైనందిన జీవన ప్రయాణం లో  కన్యాశుల్కం అనగానే అందరికీ  గుర్తొచ్చే  కొన్ని డైలాగులు ::

1.గిరీశం ::  డామిట్‌ ! కథ అడ్డం తిరిగింది

2. నాతో మాట్లాడటమే ఎడ్యుకేషన్

3. ఒపీనియన్స్‌ అప్పుడప్పుడు చేన్జి చేస్తూంటేగాని పొలిటీషియన్‌ కానేరడు

4. మనవాళ్ళు వట్టి వెధవాయలోయ్‌

5.అగ్నిహోత్రవధానులు :: తాంబూలాలు ఇచ్చేశాను, ఇహ తన్నుకు చావండి

6. “కుంచం నిలువుగా కొలవడానికి *వీలులేనప్పుడు తిరగేసైనా కొలిస్తే నాలుగ్గింజలు నిలుస్తాయి

వంటి కొత్త సూక్తులు కనిపిస్తాయి.

రామాయణం చదవకపోయినా మన జీవితాలలో పాత్రలన్నీ ఎలా మమేకం అయిపోయాయో అలాగే కన్యాశుల్కం లోని పాత్రలు వాళ్ళు వాడే పదాలు మన దైనందిన జీవితం లో భాగం అయిపోయాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు.

రమ

 

కన్యాశుల్కం నాటకం  - నా  అనుభూతి మాత్రమే

కన్యాశుల్కం ఎందుకు చదవాలి ??? ఎప్పుడో వంద క్రితం ఎవరో వ్రాసిన నాటకాన్ని ఎందుకు చదవాలి అనే ఉత్సుకతప్రశ్నలు సహజమే 

కన్యాశుల్కం ఎంతో గొప్పది...

ఎంత గొప్పది అంటే జీవితమంత అంటారు శ్రీశ్రీ. 

అప్పటి సమాజంలోని దుర్భర పరిస్థితులనూ  సాహితీ దర్పణం లో వాస్తవికతను ఇంత సమగ్రంగా ప్రదర్శించిన నాటకం ఇప్పటికీ మరొకటి లేదు అంటే నమ్మలేని విషయం.

భారతదేశంలో ఇప్పటి వరకు వచ్చిన నాటకాల్లో మృచ్చకటికంతోపాటు ఒక్క కన్యాశుల్కాన్నే  ఎన్నిక చేయాలి ...వసంతసేనకంటే మధురవాణి గొప్ప సృష్టి అని ఆధునిక సాహితీవేత్తలందరూ సాహితీకారులంతా ముక్తకంఠంతో తీర్మానించారు. 

బాల్య వివాహాల విషయంలోను, వృద్ధవివాహాల విషయం లోనూ స్త్రీ పునర్వివాహ విషయంలోనూ నిందించినది అప్పట్లోనే పండితవర్గాన్నే... అందుకే గురజాడ వారు అప్పట్లో కూడా బహిష్కరణలు ఎదుర్కొన్నారు  

కన్యాశుల్కం నాటకం మొత్తం భీభత్సరసప్రధానమైన విషాదాంతనాటకంగా ఇప్పటికీ అభివర్ణించడం మానలేను అని శ్రీశ్రీ గారు అన్నారంటే నాటకం ఆయనపై, సమాజంపై ఎంత ప్రభావశీలత చూపించిందో అర్ధం చేసుకోవచ్చు... 

 

కథలో (నాటకం) గిరీశం,రామప్పంతులు లాంటి వాళ్ళు ఎలా ద్వంద్వ  వైఖరులు చూపిస్తారో.. విశ్లేషిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం అసలు నాటకంలో మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు అని విశ్లేషిండం మహా కష్టం...

ముఖ్యపాత్రల్లో మాత్రం మధురవాణి, బుచ్చమ్మ (వితంతువు అయిన అగ్నిహోత్రావధానులు కూతురు), వెంకమ్మ (అగ్నిహోత్రావధానులు భార్య)...సౌజన్యారావు పంతులు గారు (ఈయన ప్లీడరు కూడా).. మిగతా పాత్రలన్నీ మేక వన్నె పులులే, వారి స్వార్ధానికి అందరినీ మోసం చేసేవాళ్లే (తీయని మాటలతోనే)

కథలో నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి

అగ్రహారాల్లో ఉండే పండితుల ఆలోచనలు,

లుబ్ధావధానులు, అగ్నిహోత్రావధానుల వంటి దురాశపరులు, గిరీశం డాంబికాలు (సినిమాలో కొంత హీరోయిజం చూపించారు అనుకోండి)

రామప్పంతులు లౌక్యం (మోసం అనకూడదు అని నమ్మించే ప్రక్రియ... ఇలా ఎన్నో ఉన్నాయి)

నేను తరువాత అందించే పాత్రల పరిచయంలో కొంత లోతుగా విశ్లేషణ అందించే ప్రయత్నం చేస్తాను.

******

కన్యాశుల్కం అనగానే గిరీశం చేత గురజాడ వారు పలికించిన ఎన్నో వ్యంగోక్తులు గుర్తుకు వస్తాయి,

 మనవాళ్ళు వట్టి వెధవాయలోయ్‌,       డామిట్‌ కథ అడ్డం తిరిగింది

పొగత్రాగని వాడు దున్నపోతై పుట్టున్‌    మొదలైనవి నేటికీ వినపడే జాతీయాలు అయిపోయాయి

 

సరే రోజు నేను కన్యాశుల్కం నాటకం లో

పొగత్రాగని వాడు దున్నపోతై పుట్టున్‌ అనే మాటల గూర్చి మాత్రమే నా వివరణ, స్పందన అందిస్తున్నాను.

 

సరే, మాటలు ఒక పద్యంలో పాదం

అదికూడా ఒక కంద పద్యం అంటే చదివినపుడు ఆశ్చర్యం కలుగుతుంది

కందం లో అందంగా కూర్చిన 4 పాదం లో ప్రసిద్ధ పదాలు చదవండి

 

ఖగపతి అమృతము తేగా

భుగ భుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్

పొగచెట్లయి జన్మించెను

పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్

 

గరుత్మంతుడు అమృతం తీసుకుని వెళ్లేసమయం లో భూమిపై పడ్డ కొన్ని బిందువులు పొగ చెట్టుగా పుట్టింది, అందువలన పొగ త్రాగక పోతే దున్నపోతు గా పుడతారు అని ఒక పురాణ కథ చెప్పేస్తాడు గిరీశం, ఇది చదవగానే మన పురాణాలలో జరిగే, జరగుతున్న  ప్రస్తుత ప్రక్షిప్తాలు ఎలా వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు

 

భావాన్ని ఒక భద్రకం లో భద్రపరిస్తే   ఇది

 

గారుడే అమృత మందెనే

దారిలో ఇలను చిందెనే

భూరుహై స్తరము పుట్టెనే

సైరిభౌ స్తరము వద్ద నన్

 

భూరుహ చెట్టు,  స్తరము పొగ,   సైరిభ - దున్న

సతీష్

 

 

ఈ నాటి సమీక్ష : క్షన్యాశుల్కం నాటకం

రచయిత : గురజాడ అప్పారావు గారు

 

కన్యాశుల్కం నాటకం పై పూసపాటి గురువు గారు   పూస గ్రుచ్చినట్టుగా చెప్పారు. చెల్లాయి  రమ ఇంకా లోతుకు వెళ్ళి కథా కథనంమనకు ఎక్కువగా వినపడే డైలాగులు  చెప్పింది.

నేను త్రిసంథాగ్రాహిని కాబట్టి ఏవైనా పునరుక్తి అయితే సమూహ సభ్యులు ఓర్పుతో మన్నిస్తారని భావిస్తూ ప్రారంభిస్తున్నాను.

 

కథ, కథనం జోలికి నేను వెళ్లడం లేదు. నా అభిప్రాయాల్ని జోడిస్తాను.

 

ఏదైనా రచన సమకాలీన సమస్యల్ని ప్రతిబింబిస్తూ

వాటి తప్పొప్పులను చూపించగలిగితే అది పది కాలాల పాటు నిలుస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు. దానికి ఉదాహరణ కన్యా శుల్కం నాటకం.

సమస్య గురించి నాటి వారికి తెలిసే అవకాశమే లేదు. కానీ కాల క్రమేణా  అది వరకట్నం గా రూపు మార్చుకొంది.

 

 కన్యాశుల్కం నాటకంలో గురజాడ వారు కొన్ని పాత్రలకు కూడా అతికినట్లుగా పేర్లు పెట్టారు. పిసినారి మనస్తత్వమున్న పాత్రకు, లుబ్ధవధాన్లు, పరమ కోపిష్టి, అదే నండీ, బుచ్చమ్మ తండ్రి కి అగ్నిహోత్రావ ధాన్లు, మాయోపాయంతో పెళ్ళి తప్పించాలని చూసిన బుచ్చమ్మ మేనమామ , కరటక శాస్త్రి, సహృదయుడైన ప్లీడరు గారికి సౌజన్యరావు పంతులు, అమాయకపు బుచ్చమ్మ ఇలా  అన్నమాట.

 

రెండోది విజయనగరం వైపు ఎక్కువగా బ్రాహ్మల ఇళ్లలో భాషను వాడుతూ అంటే వాడుక భాష లో

వ్రాయటం వల్ల ప్రజలకు బాగా అర్థం అవుతుందని గురజాడ వారి ఆశయమని నా అభిప్రాయం.

 

ఆరోజుల్లో కన్యాశుల్కం ఆచారమైపోయింది కానీ దాన్ని సమస్య గా జనాలు గుర్తించలేదనుకుంటాను.

సమస్య వల్ల అమాయకపు అమ్మాయిలు, ఏమి తెలియని2 వయసులో వితంతువులు గా మిగిలి పోవడం, వాళ్లకు ఎటువంటి జీవితం లేకుండా పోవడం గర్హనీయం. సమస్యను జనాల ముందు పెట్టి దాన్ని కూకటి వేళ్ళతో పెళ్ళగించాలంటేగురజాడ వారు ఎన్నుకున్న మాధ్యమం నాటకం.

  నాటకం ఎన్నిసార్లు ప్రదర్శింప బడిందో తెలియదు కాని, శారదా చట్టం వచ్చి బాల్య వివాహాలు తగ్గిపోయాయి. కన్య శుల్కం పోయి, వరకట్నం వచ్చింది. ఇక్కడా బాధితులు స్త్రీలే.

 

అంతటి తీవ్ర సమస్య నైనా, గురజాడ వారు నాటకంఆద్యంతం హాస్య రస ప్రధానంగా వ్యంగ్యోక్తుల తో నడుస్తుంది. "నమ్మితే మోసం, నమ్మకపోతే లౌక్యం," "డామిట్,కథ అడ్డం తిరిగింది"పొగత్రాగని వాడు  దున్నపోతై పుట్టున్"వంటివి మన దైనందిన జీవితంలో అలవాటైపోయాయి.

 

ఇక పాత్రల మనస్తత్వాలకు వస్తే, అందరూ లౌక్యులే, అందరూ స్వార్థపరులే. వాళ్ళ స్వార్థం కోసం, పక్కవాళ్ళను వాడుకోవడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. లోపాయకారీ తనం, లౌక్యం, ఆస్తి కోసం వ్యాజ్యాలు ఇవన్నీ ఎక్కువగానే కన్పిస్తూ ఉంటాయి.

నాటకం చదివిన తరువాత, గురజాడ వారికి డాక్టరేట్ పట్టా ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది.

 

నాటకం లో కన్యాశుల్కం ఒక్కదాన్నే ఎత్తి చూపించలేదు. బాల్య వివాహాలు, స్త్రీ విద్య, వితంతు పునర్వివాహాలు ఇలాంటి సమకాలీన సమస్యలన్నిటిని అరటిపండు వలచిపెట్టినట్టుగా దర్శనం చేయించారు గురజాడ వారు.   "దేశమును ప్రేమించుమన్నా"అని అన్నా, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథ చెప్పినా, కన్యాశుల్కం నాటకం వ్రాసినా గురజాడ వారి ట్రేడ్మార్క్ కన్పిస్తూ ఉంటుంది. ఆయన  విమర్శ లకు , సంఘ బహిష్కరణ లకు గురైనా ఆనాటి ఛాందస వాదుల్ని ఎదుర్కోవడానికేమాత్రము వెనుకంజ వేయలేదు. అందుకే కన్యాశుల్కం వ్రాసి 125 సంవత్సరాలు గడిచినా నిత్య నూతనం గా ఉండి మనల్ని అలరిస్తూ ఉంటుంది.

 

గురజాడ వారు పుట్టిన తెలుగు గడ్డ పై పుట్టినందుకు, వారి నాటకం చదివినందుకు, మీతో నా అభిప్రాయాలు పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

 

అవళూరు  సీత


 

 

యెన్నాళ్లు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే

కొన్నాళ్లకో రామ చిలకా...

మూన్నాళ్ళ బ్రతుకునకు

మురిసేవు త్రుళ్ళేవు

ముందు గతి కానవే చిలుకా!!

యిల్లు యిల్లనియేవు యిల్లు నాదనియేవు

నీ యిల్లు ఎక్కడే చిలకా...

ఊరికి ఉత్తరాన సమాధిపురములో

కట్టె ఇల్లున్నదే చిలకా

 

కన్యాశుల్కం

 

ఇక కథ - కబురు అందరికీ విదితమే కనుక... నేను అర్థం చేసుకున్న విభిన్న పాత్రధారుల- భిన్నరూపాలు.

 

కీర్తి - కాంత - కనకం వీటి చుట్టూ కథ, కథ చుట్టూ పాత్రలు వెరసి కన్యాశుల్కం.

 

గిరీశం: తనకి తానే కథానాయకుడనుకుని , అన్నీ తనకే తెలుసనుకుని , బ్యూటీఫుల్ యంగ్ విడోని పెళ్ళి చేసుకుంటే , విడో మ్యారేజ్ సభవారు నెల నెలా ఇచ్చే డబ్బుతో పాటు కీర్తి కూడా వస్తుందని, పరాయి పంచన చేరి వెకిలి వేషాలేసి పబ్బం గడుపుకునే బుద్ధి ఉన్నవాడు.

 

వెంకడు :  చెడు సావాసం పడితే పిల్లలు ఎలా తయారవుతారు అనేదానికి ఇతనే పెద్ద ఉదాహరణ , చుట్టలు తాగడం తప్పుకాదని చిన్నతనంలోనే తెలుసుకున్న జ్ఞాని.

 

రామప్పంతులు : ఎండకా గొడుగు పట్టి ,ఎదుటివారిని మోసం చేసి అది లౌక్యంవోయ్ అని చెప్పి తప్పించుకు తిరుగుతూ , కాంతల వెంటపడే చపలబుద్ధి వాడు..అః.. .....సరవెల్లి !!

 

అగ్నిహోత్రావధాన్లు :  పేరులో ఉన్న పవిత్రత ఆయన మాటల్లో , చేతల్లో ఇంచుమించు ఇంచు కూడా ఉండదు, పెళ్ళాం ఛస్తానన్నా లెక్కలేదు , కన్న కూతురనే కనికరం లేకుండా సీజనల్ సీతాఫలాన్ని అమ్మినట్టు , కన్యాబజారులో కన్నపిల్లల్ని అమ్మేసేరకం, వేదాలు చదివేంలాభం విషయం వంటపట్టనపుడు , మంత్రాలు వచ్చేమ్ లాభం నోటి కి మంచి మాట రానపుడు ..అనేదానికి ఈయనే పెద్ద ఉదాహరణ!

 

లుబ్ధావధానులు : మహానుభావుడికి ముందే ఊహించి పెట్టినపేరు, కాటికి కిలోమీటర్ దూరంలో కూర్చుని కాసుల వర్షం కప్పు నుంచి కురుస్తుందనుకునే కక్కుర్తి మహారాజు , జాతకం బాగున్నదంటే అప్పుడే పుట్టిన పసికందుని కూడా పెళ్లాడటానికి సిద్ధమైపోతాడు. కన్నకూతురి దుస్థితి చూసి వేరేవారికి అలాంటి స్థితి రాకూడదనే ఇంగితం కూడా ఉండదు, చేతులు కాలాకా ఆకులు పట్టినట్లు, పతాక సన్నివేశానికి పాతిక నిమిషాల ముందు బుద్ధి వస్తుంది.(నేను చెప్పేది పుస్తకంలో పాతిక పేజీలముందని నా అర్థమండి, చదవలేదనుకునేరు)

 

 

 

కరటకశాస్త్రి-సుబ్బు: గురుశిష్యులు , అక్కకోసం ప్రణాళికలు వేసి ,శిష్యుణ్ణి స్త్రీగా చేసి , లుబ్ధావధానుల గారి జీవితాన్ని ఇస్త్రీ చేసి, ఆయన కథకు మలుపు తెచ్చి నా అభిమానం చూరగొన్న పాత్రధారి కరటకశాస్త్రి, గురువుగారు పిల్లనిస్త్తానంటే పిల్లగా మారాడు, అప్పు తీర్చాలంటే తాకట్టు వస్తువుగా మారాడు ఇంతకన్నా ఏం చెప్పాలి అసలైన శిష్యుడిచ్చిన సిసలైన గురుదక్షిణ గురించి ?

 

మీనాక్షి - బుచ్చమ్మ : ఇద్దరిదీ ఒకటే స్థితి , కన్నవారు చేసిన కసాయి పనికి పసితనంలోనే తలచెడి , చిటికెడు కుంకుమే కాదు సుఖం ,సంతోషం అనేవి వారి నుదుటన రాసిలేక వాళ్ళ ఖర్మ అనుకుని ఎవరినీ నిందించలేక , కన్నవారితో చివాట్లు తింటూ పుట్టింట్లో కాలం గడుపుతూ, ఉద్ధరిస్తానన్నవాడున్నాడు మాదొడ్డ మనసున్న మారాజనుకుని నమ్మి , రామప్పంతులు-గిరీశం తోకలు పట్టి గోదారి ఈదడానికి సిద్ధపడిన అమాయకపు వెర్రి మారాణులు వీరు...పాపం !!

 

అసిరిగాడు : నమ్మతగిన పనోడు... ఎవరు డబ్బులిస్తే వాళ్ళకి నచ్చినట్లు కూపీలిస్తాడు !!

 

ఇహ నాకు నచ్చిన హీరో-హీరోయిను ::

 

మధురవాణి : పేరు లానే మనిషి మధురం , మాట మధురం, వృత్తికి వేశ్య అయినా తనకీ నీతి ఉందని , పరోపకారం చేయడంలో తనకు మించింది లేదని నిరూపిస్తుంది, సాయమడగ వచ్చిన వారికి తన తెలివితో సాయం చేయడమే కాకుండా, తనని చీదరిస్తారని తెలిసినా ఒక వెర్రి బాగులోనికి అన్యాయం జరగకూడదని సౌజన్యరావు ఇంటికి మారువేషంలో వెళ్ళి , లాభం ఆశించకుండా ఎదుటివారికి మంచి చేసిన ఆమె ఆల్చిప్ప కాదు ఆణిముత్యమని నిరూపించుకుంటుంది

 

సౌజన్యరావు పంతులుగారు అనబడే వకీలు : అమాయకులకి న్యాయం చేద్దామని, నీతిగా బతుకుదామని నియమం పెట్టుకున్న ఆంటీ నాచ్ ఈయన , ఈయన దృష్టిలో వేశ్యలు అంటే నీతిలేనివారని , వారి వంక చూసినా పాపమని తలిచే కృష్ణ భక్తుడు , విడో మేరేజెస్ ప్రోత్సాహిస్తూ,బాల్యవివాహం తప్పని నొక్కి వక్కాణించే సంఘ సంస్కర్త , వృత్తిని బట్టి మనిషిని అసహ్యించుకోకూడదనే నీతి తెలుసుకుని మధురవాణికి కరచాలనం చేస్తాడు.

 

ఈపైన ప్రస్తావించిన మనుషుల పేర్లు కాలానుగుణంగా మారుతూ వచ్చాయే కానీ,అలాంటి మనుషులు ఇప్పటికీ తారసపడుతూనే ఉంటారు, అందుకేనేమో ఎన్నిసార్లు నవల చదివినా, సినిమా చూసినా పాతదేలే ఇప్పుడలా లేదు కాలం మారింది అనుకోవడానికి లేదు.... రూపం, వేష, భాషా, భూషణం మారిందేమో .....అయినా....మనిషి మారలేదు !!!

 

విష్ణుప్రియ

 

అవసరా కోసం అడ్డదారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరీ నాటకంలో . . . .

 

 

 

 

 

నేను నా సమీక్ష కాకుండా నాకు ఆత్మీయులైన శ్రీ ద్వా. నా శాస్త్రి గారు అందించిన వ్యాసం యధావిధిగా అందిస్తున్నాను.

 

ముందుగా అజారామరమైన ఈ నాటకాన్ని, సాహిత్యాన్ని అందరూ చదవాలని ఆశించే అడ్మిన్ లందరికీ నా నమస్సులు, ఆశీస్సులు

 

నేను నా సమీక్ష కాకుండా నాకు ఆత్మీయులైన శ్రీ ద్వా. నా శాస్త్రి గారు అందించిన వ్యాసం యధావిధిగా అందిస్తున్నాను.

"కన్యాశుల్కం - గురజాడ అద్భుత సృష్టి" అనే వ్యాసం మీ కోసం

 

రచన - ద్వానా శాస్త్రి

 

ఆధునిక సాహిత్యానికి వేగుచుక్క గురజాడ.

కొత్తపాతల మేలుకలయికతో తెలుగువారి మత్తువదల గొట్టిన భావ విప్లవకారుడు గురజాడ.తనకి అవసరమైన సాహిత్యాన్ని తరమే సృష్టించుకొంటుందన్న సూక్తికికన్యాశుల్కంప్రత్యక్షనిదర్శనం. సాంఘిక నాటకాలు, స్వతంత్ర నాటకాలు, సామాజిక సమస్యగల నాటకాలు లేని లోటునుకన్యాశుల్కంపూరించింది.

 

కన్యాశుల్కం నాటకం 1897 లో ప్రచురించబడింది. అంతకు ముందే 1892 లో విజయనగరంలో ప్రదర్శింపబడింది. కొద్ది మార్పులతో రెండవ ముద్రణ పొందింది.

 

అప్పట్లో విజయనగరం ప్రాంతంలో కన్యాశుల్కం ఆచారం బాగా ఉండేది. రాజావారు చేసిన సర్వే వల్ల ఏటా దాదాపు 344 బాల్యవివాహాలు జరిగేవని తెలుసుకొన్న గురజాడ కలత చెందగాకన్యాశుల్కంఅనే ఒక గొప్ప సాంఘిక నాటకం మనకి లభించింది.

 

గురజాడ కన్యాశుల్కం గొప్పనాటకం నిరూపించే అంశాలు

1. వస్తువు,

2. పాత్రపోషణ,

3. హాస్యం, అధిక్షేపం,

4. సంభాషణలు,

5. భాష.

 

వస్తువు

కన్యాశుల్కం తెలుగుజీవనాన్నీ, వాతావరణాన్నీ,మనుషుల శ్వాసనిశ్వాసాల్నీ, ఆంతరిక వ్యధల్నీ, భ్రష్టు పట్టిన మానవస్వభావాల్నీ ఆవిష్కరించే మొదటి సాంఘిక

నాటకంఆనాటి హేయమైన మానవ నైజాలూ,జీవచ్ఛవాల్లాంటి బాలవితంతువులూ, సారామత్తులో ఉండే బైరాగులూ, దొంగ సాక్షులూ, వేశ్యలూ, లాయర్లూ, … నాటి సంక్షుభిత సమాజ సమగ్ర స్వరూపాన్ని గురజాడ ఫొటో తీసి మన ముందుంచారు.

 

నాటకంలోని కధావస్తువుసంఘసంస్కరణకి ఉద్దేశించింది. అందులో ముఖ్యాంశాలివిచిన్న పిల్లల్నిముసలివాళ్ళకిచ్చి పెళ్ళిచేయడం,వేశ్యావృత్తి హైన్యత స్త్రీల దుస్థితి, పెద్ద మనుషులుగా చెలామణీ అయే కుహనామేధావులు.

 

ఐదేళ్ళకే బాలికలకి పెళ్ళిచేసేవారు. అన్యాయాన్నిఎత్తి చూపారు గురజాడ. పసిపిల్లల్ని కాలం గడిచినవాళ్ళకిచ్చి పెళ్ళిచేస్తే వైధవ్యం రాక తప్పదు. బాలవితంతువులుగా జీవితం వెళ్ళబుచ్చవల్సిందే. నాటకంలో అగ్నిహోత్రావధాన్లు తన చిన్న కూతురిని లుబ్ధావధాని కివ్వడంలో ప్రేమ లేక కాదు ధనాశ వల్లనే. ఎందుకంటే తన కొడుక్కి కూడా డబ్బు ఖర్చు లేకుండా పెళ్ళి చెయ్యాలనుకుంటాడు కాబట్టి.

 

కన్యాశుల్కం తీసుకోవడంలో ఉచితానుచితాలూ,న్యాయాన్యాయాలూ లేవు.అభం శుభం తెలియని ఆడపిల్లకి అమానుషంగా పెళ్ళి చెయ్యడం వెనుక ఉన్నది ధనవ్యామోహం వీటిని గురజాడ వెల్లడించారు.

 

పెద్ద మనుషులుగా, విద్యావంతులుగా నటిస్తూ,ఆదర్శాలకీ ఆచరణలకీ పొంతనలేని వ్యక్తుల్ని గురజాడ చూసిగిరీశం” “రామప్పంతులువంటి పాత్రల్నికధలో పొందు పరచారు. మోసాలు, అబద్ధాలు,సొంతడబ్బా, ఎలాగో అలా పబ్బం గడుపుకోవడాలు …. వీటిని నాటక వస్తువులో ఉపాంగాలుగా చేసారు. “ఆధునికతపేరుతో ఇంగ్లీషు చదువుపై గల వ్యామోహాన్ని వ్యక్తం చేసారు. నాటకంలోని వస్తువు మన సంస్కృతీరుగ్మతను హెచ్చరిస్తూ సంఘ సంస్కరణ ఎంత అవసరమో వెల్లడిస్తుంది.

 

ఈనాటి వాళ్ళకి కన్యాశుల్కంలోని వస్తువు పాతది.అందులోని ప్రధాన సమస్య అయిన కన్యాశుల్కం ఈనాడు లేనేలేదు. చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు కూడా లేవు. కన్యాశుల్కం స్థానంలో వరకట్నం వచ్చింది. వేశ్యలకి చదువుతెలివి, సంపద పోయి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా ఈనాటికీ నాటకం జనాదరణ పొందడానికి కారణం, నాటకాన్ని ఒకసజీవసాహిత్య ప్రక్రియగా గురజాడ రూపొందించడమే. ఆయనలోని కళాప్రతిభ కూడా ఒక ముఖ్యకారణం. పాత్రల తీరుతెన్నులు,సంభాషణల్లోని నైపుణ్యం, నాటకాన్ని సజీవం చేసాయి.”గిరీశంపాత్ర నాటకానికి పుష్టి కలిగించింది. హాస్యం అన్ని కాలాల్లో అందరూ ఆనందించేటట్టు పోషింపబడింది. రోగిష్టి సమాజం, మనసు పుచ్చిన మనుషు లున్నంతవరకూ నాటకం నిలుస్తుంది. నిలిచి శస్త్ర చికిత్స చేస్తుంది కూడా. నాటకం ఆధునిక నాటకసాహిత్యానికివిఙ్ఞాన సర్వస్వంవంటిది. నాటకాన్ని ఒక సాంఘిక అధిక్షేప నాటకమని గాని, సాంఘిక ఇతిహాస నాటకమని గాని అనవచ్చు.

 

పాత్రపోషణ

నాటకానికైనా ఇతివృత్తానికైనా ప్రాణాలు పాత్రలే. నాటకంలోని పాత్రలు  సజీవంగా ప్రకాశిస్తూంటాయి. ఒక పాత్ర మరొక పాత్రతో పోటీ పడుతూంటుంది. ఇవి మన సమాజంలో మనకు కనుపించే పాత్రలే. రామప్పంతులు వంటి దగాకోరులు, స్వార్ధపరులు, గిరీశంలాంటి బడాయి కోరులూ మాటకారులు, అగ్నిహోత్రావధాన్లులాంటి ధనాశాపరులు, సంస్కర్తలకి కూడా బుద్ధి చెప్పగల మధురవాణి వంటి సమయోచిత ప్రఙ్ఞగల స్త్రీలు నేటి సమాజంలో అడుగడుగునా కన్పిస్తారు. ఇంతటి వైవిధ్యం, సహజత్వం గల పాత్రపోషణ వల్ల నాటకం సజీవంగా నిలిచింది.

 

సర్దేశాయి తిరుమల రావు గారుకన్యాశుల్క నాటకకళఅనే విమర్శలో నాటకంలోని పాత్రల్నిరెండు వర్గాలుగా విభజించారు మంచి పాత్రలూ, చెడ్డ పాత్రలు. మనిషిలోని మంచిచెడ్డల మేలుకలయిక మంచితనంగానూ, చెడ్డమంచిల కీడుకలయిక చెడ్డతనంగానూ తెలిపారుమధురవాణి, బుచ్చమ్మ, కరటక శాస్త్రి, సౌజన్యారావు పంతులు పాత్రలు మంచివి. గిరీశంరామప్పంతులు, అగ్నిహోత్రావధాన్లు, లుబ్ధావధాన్లు చెడ్డపాత్రలు. సుబ్బి రంగస్థలంపైకి రానినాయికవంటిది. సుబ్బిని రంగం మీదకి తీసుకురాకపోవడానికి కారణం ప్రేక్షకుడిలో సెన్టిమెంటాలిటీ పుట్టకుండా చెయ్యడాని కనిపిస్తుంది.

 

కన్నీళ్ళు వెక్కిళ్ళూ కనుపించనీయకూడదని నాటక  కర్త ఉద్దేశ్యం కావచ్చు. ఇంకా ఇతర పాత్రలున్నాయి. కొందరన్నట్టు అసలు నాటకంలో కనుపించని పాత్ర గురజాడ. “సామూహిక పాత్రీకరణఅంటే, పాత్రశీలానికి ఒక్క పాత్రను గాక, రెండుగాని అంతకంటె ఎక్కువగాని పాత్రలని ప్రతినిధులుగా నిలబెట్టే విధానం కన్యాశుల్కంలో కనుపిస్తుంది.ఇందుకు ఉదాహరణలు అగ్నిహోత్రావధాన్లు, లుబ్ధావధాన్ల పాత్రలే. గురజాడ గొప్పదనానికి ఇదొక నిదర్శనం.

 

నాటకాని ప్రసిద్ధి తెచ్చిందీ, అందరినీ ఆకర్షించిందీ గిరీశం పాత్ర. ఇది నాయక పాత్ర కాకపోయినా నాటకమంతా పరచుకొంది. నాటకం మొదలు, ముగింపూ పాత్రతోనే కాబట్టి రచయిత పాత్రవిషయంలో ఒక ఆద్యంతసమత పాటించాడనవచ్చు. గిరీశంవల్ల రచయిత ప్రయోజనాన్ని ఆశించాడు? ఇది కేవలం ఒక హాస్య పాత్రా? అనే ప్రశ్నలు తలెత్తుతాయి మనలో. నాటకంలో గిరీశం చాలాపనులు చేసినట్టు కనుపించినా, పనులవల్ల ప్రయోజనం,మార్పూ కనుపించదు.

 

గిరీశం సమాజంలోని దొంగ పెద్ద మనుషులకి ప్రతీక.మాయమాటల్తో పబ్బం గడుపుకోవడమే గాని, ఇతనికి ఒక సిద్ధాంతం, ఆశయం ఉన్నట్టు కనుపించవు. స్వప్రయోజనం కోసం ఇతరులకి కష్టాల్నితెచ్చిపెట్టడానికి కూడా వెనుకాడడు. తాను చేసే ప్రతిపనీ అన్యాయమని తెలిసే చేస్తాడు. వేడుకొని, భయపెట్టి, నవ్వించి, ఏడిపించి,ఏడ్చి ఇతరుల్ని తన దారిలోకి తిప్పుకోగల లౌక్యుడు.

 

నాటకంలో జరిగే సంఘటలపై వ్యతిరేకంగా  వ్యాఖ్యానించే గిరీశం పాత్ర సాంఘిక, సాంస్కృతిక ప్రయోజనాల్నిఆశించి గిరజాడ సృష్టించి ఉండవచ్చు. “డామిట్‌ ! కధ అడ్డం తిరిగిందిఅంటూ నాటక రంగం నుంచి నిష్క్రమించినా సమాజంలో కనుపిస్తూ నేటికీ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే ఉన్నాడు.

 

నాటకంలోని రెండవ ముఖ్య పాత్రమధురవాణి”. పాత్రలో అసాధారణత, పరిణామం,శీఘ్రప్రగతీ కన్పిస్తాయి. మొదట్లో సామాన్య వేశ్యగా కన్పించే మధురవాణి, నాటకం ముగిసేసరికి గొప్ప మనిషిగా కనబడుతుంది. ఇది గురజాడ ఇంద్రజాలం. రామప్పంతులు తన బుగ్గ గిల్లినప్పుడు, “మొగవాడికైనా ఆడదానికైనా నీతి ఉండాలి. తాకవద్దంటే చెవిని బెట్టరు గదాఅని మందలించడంలోనే ఆమె మనసు అర్ధమవుతుంది.

 

వ్యక్తి స్వాతంత్య్రాన్ని, పట్టుదలను ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కోల్పోని గుండె నిబ్బరం గలది. విమర్శనాఙ్ఞానం,విశ్లేషణ కలది. ఎదుటి వాళ్ళగురించి ఆలోచిస్తుంది. తృతీయాంకంలో రామప్పంతులు పైన పటారం లోన లొటారం అని పసిగడుతుంది. ఇతర వేశ్యలు ధనం గుంజాలని చూస్తూంటే, మధురవాణి తనని ఉంచుకున్నవాడు బాగు పడాలనీ, అదే తనకు ఎక్కువ గొప్పనీ చెబుతుంది.ఆమె సంస్కారవతి.దురాచారాల్ని సహించదు. కన్యావేషంలో ఉన్నశిష్యుణ్ణి లుబ్ధావధానికి కట్టబెట్టి, సుబ్బి పెళ్ళి  తప్పించడంలో ఆమె వ్యూహాశక్తి మనకి తెలుస్తుంది. కరటక శాస్త్రితోవృత్తి చేత వేశ్యని గనక చెయ్యవలసిన చోట ద్రవ్యాకర్షణ చేస్తాను గాని మధురవాణికి దయాదాక్షిణ్యాలు సున్న అని తలిచారా?” అనడం ప్రత్యక్షర సత్యం. నాటకం చివర కరటక శాస్త్రిని జైలు నుంచీ,లుబ్ధావధానిని మరణ శిక్ష నుంచీ తప్పిస్తుంది. “ఆహా! ఏమి యోగ్యమైన మనిషిఅని రామప్పంతులు కూడా అనకుండా ఉండలేక పోతాడు. అయితే నాలుగో అంకంలోనీకు సిగ్గులేదే లంజా!” లాంటి మాటలు పాత్రచేత అనిపించడం సబబుగా లేదు.

 

ఆరవ అంకంలో మధురవాణి సంఘం మీద దాడి చేస్తుంది. స్త్రీస్వాతంత్రోద్యమానికి మధురవాణి పాత్ర నాందిగా చెప్పవచ్చు. పొరుగువారికి సాయపడుతూ, పాపపు లోకంలో కూడా మంచి ఉందని నిరూపించిన త్యాగజీవి మధురవాణి. పాత్ర ఒక్కక్క సారి నాటక పరిధిని దాటిపోయి విశ్వరూపాన్ని చూపిస్తుంది.

 

డబ్బు గడించి దానిపై వ్యామోహం లేకుండా ప్రేమకోసం పరితపించే పాత్ర మధురవాణి. “కాపు మనిషినై పుట్టి  మొగుడి పొలంలో వంగ మొక్కలకూ, మిరప మొక్కలకూ దోహదం చేస్తే యావజ్జీవం కాపాడే తన వాళ్లైనా ఉందురేమోఅనుకోవటంలో పాత్రలో పరివర్తన కనుపిస్తుంది. దీన్ని గురజాడ హఠాత్తుగా కాక క్రమంగా వచ్చిన మార్పుగా చిత్రించడంలో తన కళాప్రతిభ, సహజత్వం చూపించారు.

 

మిగిలిన పాత్రల గురించి

రామప్పంతులు పాత్ర చాలా ఆసక్తికరమైనది. ఇతను నిశిత దృష్టికలవాడు. “నమ్మిం చోట చేస్తే మోసం, నమ్మం చోట చేస్తే లౌక్యవూఁనుఅనే సూక్ష్మబుద్ధి ఉంది. అయినా మధురవాణి వ్యూహంలో చిక్కుకుపోయాడు. ఇతను ఎవళ్ళెక్కువ డబ్బిస్తే వాళ్ళ పక్షం. ఒక మాటమీద నిలబడడు.

 

అగ్నిహోత్రావధాన్లు వేద వేత్త, అమాయక బ్రాహ్మణుడు,ధనాశాపరుడు, సనాతనాచారాలున్నవాడు.

 

సౌజన్యారావు న్యాయవాది . వివిధ స్వభావాలున్నమనుషుల్ని చూసినవాడు. వ్యవహారాన్ని నేర్పుగా చక్కబెట్టే ప్రవృత్తి గలవాడు. మొదట్లో గిరీశం పెద్ద మనిషని నమ్మినా, విషయం తెలిసాక, అతన్నిగెట్‌ అవుట్‌అంటాడు. మధురవాణి వ్రతం సౌజన్యా రావుని పెద్దవాడిగా నిలిపిందా? లేక సౌజన్యా రావు ప్రవర్తన మధురవాణిని మంచిదానిగా చేసిందా అనిపిస్తుంది.

 

ఇకపోతే తనకు తానుగా చెడు చెయ్యని లుబ్ధావధాని, మంచి స్వభావంగల కరటక శాస్త్రి, తండ్రికి బుద్ధి చెప్పే పాత్రలో మీనాక్షి.. ఇలా ఎన్నో.మొత్తం మీద కొన్ని లోపాలున్నా పాత్ర పోషణా నైపుణ్యం కన్యాశుల్కం సజీవంగా నిలబడడానికి దోహదం చేసింది.

 

హాస్యం – ఎత్తిపొడుపు

కన్యాశుల్కం అనగానే హాస్యం గుర్తొస్తుంది. నాటకంలో పాత్రలే ఒకరికిఒకరు పేర్లు పెట్టుకొని హాస్యమాడుకున్నారు.గిరీశం అగ్నిహొత్రావధానినిఅగ్గిరావుఁడన్నాడు. కరటక శాస్త్రిమూర్ఖపగాడ్దె కొడుకన్నాడు. గిరీశాన్ని రామప్పంతులుగిర్రడు” “బొట్లేరుఅని కొట్టిపారేశాడు. అగ్నిహోత్రావధాన్లు కూడా గిరీశాన్నిహనుమాన్లుగా ఆట పట్టించాడు. మధురవాణి దృష్టిలో రామప్పంతులు,లుబ్ధావధాని లొట్టిపిట్టలు. లుబ్ధావధాని పెళ్ళి ముసలి మనువు కాబట్టి హాస్యాన్ని కల్గిస్తుంది

 

మధురవాణి ఇంట్లో రామప్పంతుల్నీ, గిరీశాన్ని పూటకూళ్ళమ్మ చీపురుతో కొట్టడం,గిరీశం లుబ్ధావధానికి వ్రాసిన లేఖ,గిరీశంవెంకటేశాల సంభాషణలూ మొదలైనవి హాస్యాన్ని పుట్టించాయి. రామప్పంతులునాకు యింగిలీషే వస్తే దొరసాన్లు నా వెనకాల పరిగెత్తరా?” అన్నప్పుడు, మధురవాణి లుబ్ధావధానిని పన్ను కదిలిందా? కన్నుకు దృష్టి తగ్గిందా?, చూడండి మీ కండలు కమ్మెచ్చులు తీసినట్టు యెలా వున్నాయోఅన్నప్పుడూ నవ్వుకుంటాం.

 

సంఘంలోని కొన్ని లోపాల్ని ఎత్తిచూపడం కోసం గురజాడ హాస్యాన్ని ఆయుధంగా వాడాడు. ఉదాహరణకి, గిరీశంలెక్చర్లు ఎంతసేపూ సిటీల్లోనే గాని పల్లెటూళ్ళలో ఎంతమాత్రం పనికిరావు”  అంటాడు. అలాగేనీ మాస్టరుకు నన్ను చూస్తే గిట్టదు. అందుచేత నిన్ను ఫెయిల్‌ చేసాడు గానీ..”  అనడం గూడా. “పొగత్రాగని వాడు దున్నపోతై పుట్టున్‌, “మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్ట కాల్చడం ఒక్కటే!” అన్నప్పుడు సరదాగా నవ్వుకుంటాం. అలాగే, “సత్యం మే, ధర్మం మేవంటి వేద మంత్రాలకుచేగోడిం మేలాంటి పేరడీలు హాస్యస్ఫోరకాలు.

 

సంభాషణలు

సంభాషణలు భాష నాటకానికి జవజీవాలు. తెలుగు పలుకుబడులతో, పాత్రోచిత భాషతో, వ్యంగ్యంతో, హాస్యంతో సంభాషణల్ని నడిపించిన గురజాడ ప్రతిభ అసామాన్యం. “నా దగ్గర చదువుకున్న వాడు ఒహడూ అప్రయోజకుడు కాలేదు. పూనా డక్కన్‌ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు ది ఇలెవెన్‌ కాజెస్‌ ఫర్ది డీజనరేషన్‌ ఆఫ్‌ ఇండియాను గూర్చి మూడు గంటలు వక్క బిగిన లెక్చరిచ్చేసరికి ప్రొఫెసర్లు డంగై పోయినారువంటి మాటలు గిరీశం పాత్రపోషణకు బలాన్నిచ్చాయి.

 

గిరీశం సంభాషణలు తెలుగు వాళ్ళ నోళ్ళల్లో సామెతలుగా నిలబడిపోయాయి. ” మనవాళ్ళు వట్టి వెధవాయలోయ్‌, “డామిట్‌ కధ అడ్డం తిరిగిందిలాంటివి సాక్ష్యాలు.

 

పూటకూళ్ళమ్మని గురించిమీరుండగా వెధవెలా అవుతుందిఅనడం, కన్య వేషంలోని కరటక శాస్త్రి శిష్యుణ్ణి గురించి కన్నెపిల్ల నోరు కొంచెం చుట్ట వాసన కొడుతోందిఅనడం లాంటి వాటి ద్వారా మధురవాణి సంభాషణా నైపుణ్యాన్ని చూపించాడు గురజాడ. “వీళ్ళమ్మా శిఖా తరగా! ప్రతిగాడిద కొడుకూ తిండిపోతుల్లాగా నా ఇంట జేరి నన్ననే వాళ్ళే! తాంబూలం ఇచ్చేశాను, ఇహ తన్నుకు చావండిఅన్న వాక్యం నేటికీ ప్రజల్లో వినబడడమే గురజాడ సంభాషణల్ని నడిపిన చాతుర్యానికి నిదర్శనం.

 

భాష

కన్యాశుల్కం వాడుకభాషలో రాయబడ్డ మొదటి సాంఘిక నాటకం.ఒక్క వాడుక భాషేకాక, మాండలికాలు, పాత్రోచిత ప్రయోగాలూ కూడా ఉన్నాయి. కళింగాంధ్ర మాండలికాలకు ఉదాహరణలుచెప్పాను కానా?”, “నా ఆబోరుండదండీ, “గుంటవెధవ, “కనిష్టీబు,”నాను ఉంది,  “అనాడీ చేస్తున్నారు, “వగుస్తున్నారు, “కొసాకి వినుమొదలైనవి.

 

పాత్రోచితంగా అగ్నిహోత్రావధానిమానా! మానులా వున్చానంచావూ? గూబ్బగల గొడతాను.” వెంకమ్మమీకు మాత్రం అబ్బిమీద ప్రేఁవ లేదా యేవిషి?” గిరీశంనేనే దాని హజ్బన్డై ఉంటే నిలబడ్డపాట్ననీ తండ్రిని రివాల్వర్తో షూట్‌ చేసి ఉందును.”

 

మాట్లాడే భాషకి చాలా దగ్గరగా ఉన్న పదాల్ని ప్రయోగించి సహజత్వానికి అద్దం పట్టాడు గురజాడ. ఉదాహరణకి,సాన్దీ, యవరో, జంఝప్పోస, సమ్మంధం, నాలుగ్గింజలు మొదలైనవి ఇలాంటివే. “కుంచం నిలువుగా కొలవడానికి వీలులేనప్పుడు,తిరగేసైనా కొలిస్తే నాలుగ్గింజలు నిలుస్తాయి,  “ఒపీనియన్స్‌ అప్పుడప్పుడు చేన్జి చేస్తూంటేగాని పొలిటీషియన్‌ కానేరడువంటి కొత్త సూక్తులు కనిపిస్తాయి.

 

మానవత్వాన్ని చాటి చెప్పి, మానవుడిని క్రియాపరునిగా ప్రేరేపించగల శక్తి గలది ఉత్తమ సాహిత్యమైతే, “కన్యాశుల్కంఉత్తమ సాహిత్యరూపం. ఉదాత్తమైన నాటకం. తెలుగు వాడు గర్వించదగ్గ నాటకం.

 

శ్రీదేవి

 

**********

 

 

రాజీ

 

నీటిలోన చేప ఎగిరెగిరి పడేను

నింగి పైన పక్షి చక చక చక్కర్లు కొట్టేను

నేలపైన మయూరం నాట్యమాడేను

ఏమి ఆనందం! ఏమి ఆహ్లాదం!

ఏమి పరవశం!

మది ఉప్పొంగిన వేళ  మనసు పురివిప్పినవేళ

చెలి చిరునవ్వు నవ్విన వేళ వేళ కాని వేళ రాజీ పడిన వేళ

ఉషోదయం నవ్వింది కోయిల పాడింది

అవని మురిసింది

 

కోవూరి

 

 

కన్యాశుల్కం

 

కన్యాశుల్కం నాటకం ఒక అద్భుత సృష్టి గా గురజాడ కలం నుండి  జాలువారింది.. శతాబ్దం పైబడిననూ  నాటకం ఇంత మహోన్నతంగా నిలబడగలిగింది అంటే దానికి ఒక ముఖ్య కారణం సమాజంలో సాగుతున్న దురాచారాన్ని ఎత్తి చూపటం అయితే , ఇంకొక ముఖ్య కారణం  హాస్యరస ప్రధానంగా నడిచిన కథనం మరియు అందులో అంతర్గతంగా  చోటు చేసుకున్న వ్యంగ్యం. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, ఒకటి మాత్రం ఇక్కడ వివరిస్తున్నాను..

 

ఒకానొక సందర్భంలో, గిరీశం మధురవాణి తో అంటాడు " మైల పడితే స్నానం చేసి వేగిరంరా."అని.

అందుకు సమాధానంగా మధురవాణి "ఇప్పుడేం తొందర , తలంటు కుంటాను" అని అంటుంది.

మధురవాణి మాటల్లో ధ్వనించే వ్యంగ్యం-

" నీ వ్యవహారం పూర్తిగా కడిగేసుకుంటా" నని.

 

CA కె మల్లికార్జునరావు

 

 

 

 

 

 

 

 

ద్వాదశ జ్యోతిర్లింగాలు.............

 

 

పల్లవి,

ద్వాదశ జ్యోతిర్లింగాలు, శివుని బహువిధ రూపాలు,

జగతికి వెలుగుల మణి దీపాలు, తొలగించును సకల పాపాలు....

 

చరణం 1.

రామ, చంద్రుల చే ప్రతిష్టించబడినవి,

రామేశ్వర, సోమనాధ్ లింగాలు,

అష్ట భైరవ, ఏకాదశ రుద్రులు నెలవైవున్న,

ఉజ్జయినీ మహా కాళేశ్వర్ లింగం

 

చరణం 2.

ద్వాదశలింగం, శక్తిపీఠం మల్లికార్జునుని శ్రీశైలం,

వారణాసి లో వాసికెక్కిన విశ్వనాధం లింగం,

నాసిక్ లోని త్రయంబకేశ్వర్, ద్వారక లోని నాగేశ్వరలింగాలు,

అసుర సంహారానంతరం విశ్రమిస్తున్న భీమేశ్వర లింగం...

 

చరణం 3.

మామలేశ్వర్ వెలసిన ఓంకారేశ్వర అమరేశ్వర్లింగం,

మందాకినీ తటి మంచు లో కూర్చిన కేదారేశ్వర లింగం,

భక్తుల కోర్కెలు తప్పక తీర్చే ఘృష్ణేశ్వర్ లింగం n

ఆరోగ్యప్రదాత గా ఖ్యాతి కెక్కిన వైద్యనాధ లింగం..

 

హామీ. ఇది నా స్వంత రచన,

చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...