26, నవంబర్ 2020, గురువారం

వారాంతపు పుస్తక సమీక్షలు, ఆదివారము, 22.11.2020

 


వారాంతపు  పుస్తక సమీక్షలు

మరియు సభ్యుల రచనలు

22.11.2020,  ఆదివారము


కధ పేరు : మిధునం

 

రచయిత : శ్రీ రమణ గారు

ఈ కధలో నాయకుడు అప్పదాసు 

కధనాయకురాలు బుచ్చిలక్షి  

 

కథ ఇతివృత్తం :

 చాలా సామాన్యమైనది ఆరు పదుల వైవాహిక   బంధం పెనవేసుకున్న చక్కని భార్యా భర్తలు వీరిద్దరు.    వృద్ధాప్యంలో ఉన్న దంపతులు (అప్పదాసుబుచ్చిలక్ష్మి),

వారి పిల్లలు తమ ఉద్యాగాల కోసం మరెక్కడో బతుకుతున్నపుడుఒకరికొకరు తోడుగా గడిపే దైనందిన జీవితంలో ఉండే విశేషాలువారి మధ్య ఉన్న అంతులేని అనురాగంచిలిపి చేష్టలుకోపతాపాలుమాటల్లో అనురాగంతో కూడిన విసుర్లువారున్న ఇంటిలోని వాతావరణంభోజన అలవాట్లు మొదలైన వివరాలతో కళ్ళకు కట్టినట్టుండే దృశ్యాలను అతి తేలికగా ఊహించుకొనేట్లు

 శ్రీ రమణ గారు అత్యద్భుతంగా రాసారు.

 

కథ చివర్లో ఈ దంపతులకు వియోగం ఎలా వస్తుందో కూడా చిత్రిస్తూ కథ ముగిస్తారు రమణ గారు. కానీ ఈ కథలో ముగింపు కూడా ఒక కొసమెరుపే. అప్పదాసు బుచ్చిలక్ష్మి ల అన్యోన్యతకి ప్రత్యక్ష సాక్షి మన రమణ గారే మనకి కధలో కనిపించే మూడో పాత్ర.

 

అప్పదాసు గారి పెరటి వర్ణన రాయాలి అంటే అదొక సమీక్ష అవుతుంది. ఈ కధ నచ్చితే మిథునం సినిమా కూడా చూసేయ్యండి. అప్పుడు అప్పదాసుగారి పెరడు చూడొచ్చు.

 

ఇక ఈ కధలో మన కళ్లను మనసును కట్టిపడేసే కొన్ని వర్ణనలు కొన్ని అచ్చ తెలుగు అప్పదాసు గారి  సంభాషణలు.

 

మిడి మేలపు దొరలకంటే ఏపూట ఫలసాయం ఆపుట ఇచ్చే ఈ కొలువుకన్నా ఇంకేం కావాలి ?

సత్ సంగత్సే నిస్సంగత్వం అన్నట్టు  మంచి తోడు నీడా నాకు దొరికినంత గొప్పగా  ఆ దేముడికి  కూడా దొరకదేమో బుచ్చీ. 

 

నిమ్మ చెట్టు కి పూత పూస్తే కిష్టప్ప చేతి కొచ్చాడని  మామిడి పిందెలు వేస్తే మాధవుడు మనల్ని ఒకకాపు కాస్తాడని ఇలా చెట్లకి పిల్లల పేర్లు పెట్టుకుని మురిసిపోతూ ఉంటారు  ఆ దంపతులు

 

అప్పదాసు గారు రోజు తినే అన్నాన్ని ఎంత ఇష్టంగా భక్తితో *తింటారో ఈ వర్ణన లో చెబుతారు  మొదటి ముద్ద స్పటిక లింగం దానికి నేతి తో అభిషేకం చేసి ఆవకాయ తో బొట్టెట్టి కొత్తిమీర మాల వేస్తా అంటారు ఇంతకముందు అమరావతి కధల్లో అప్పంబొట్లు  భోజన ప్రియత్వం గురించి చెప్పుకున్నాం కదా మన అప్పదాసు గారు కూడా అంతే. 

 

దప్పళం తెర్లుతుంటే క్షీరసాగర మధనం లా కోలాహలం గా ఉండాలి. పోపు పెడితే తొలకరిలా  ఉరిమి రాచిప్పలో ఉప్పెన రావాలి. అలాగే ఇంగువ ఉదారంగా ఓ రుద్రాక్ష పరిమాణం లో ఉండాలి. కరివేపాకు చెట్టునుండి సరాసరి దప్పళం లో పడాలి లాగే మామిడి టెంకలు అసలు మర్చిపోకూడదు

 

దప్పళం మరిగినకొద్దీరుచి   దాంపత్యం ఏళ్ళు గడచిన  కొద్దీ అందం 

పచ్చడి లో కొత్తిమీర దూడ మేతలా వేయకు

అసలు విషయాన్ని మింగేయ్యకుండా తత్వాలు పాడే *టప్పుడు తాంబూరా శృతి లా ఉండాలి

ఎవరి రుచి బతుకులు వాళ్ళవి. ఎంత కొడుకులైతే మాత్రం అకారణం గా వాళ్లమీద వాలిపోకూడదు 

 

అప్పదాసు గారి హఠాన్మరణం తరువాత  ఒంటరిగా కూర్చున్న బుచ్చి  లక్ష్మి దగ్గరకు వెళ్ళిన రమణ గారితో ఇలా అంటుంది ఆడవాళ్లందరు పుణ్యస్త్రీ గా పోవాలి అనుకుంటారు కానీ నేను మాత్రం మీ మమయ్యే ముందు చనిపోవాలి అనుకున్నాను . వైధవ్యం కోరుకునే వెర్రిదాన్ని అనుకోకు. మీ మామయ్య అంటే నాకు పిచ్చి ప్రేమ. ఆయనకి చీకటి అంటే భయం ఉరుములు అంటే భయం. ఏ అర్ధరాత్రో లేచి ఆకలి అంటే ఆవిరి కుడుములుకందట్లు పొంగణాలు ఎవరు వేసిపెడతారు అందుకే ఆయనే ముందు పోవాలి అనుకున్నాను అంటుంది బుచ్చిలక్ష్మి.

మా లగ్గం కాగానే పల్లకిలో అమ్మవారి గుడికి వెళ్ళేదారిలో మధుపర్కాలకి ముడి వేసిన వేరుసెంక్కాయలు నా దోసిట్లో పోసి తిను బాగుంటాయి అన్నాడు మీ మామయ్య వీడెవడో మంచోడిలా ఉన్నాడు అనుకున్నాను అలా అప్పుడు మొదలయ్యింది.

 

మా  ఇద్దరి స్నేహం

జత కుదిరితే భార్యా భర్తల స్నేహం కంటే మంచి స్నేహం *ఎక్కడ దొరుకుతుంది ?

70 ఏళ్ళు అయినా ఇంకా ఆ వేరు శనక్కాయల రుచి ఇంకా గురుతు ఉందిరా .

లక్కా బంగారం లా కలసిపోయము బంగారం కరిగి పోయింది ఒట్టి లక్కలా నేనున్నాను

 నా విస్తరాకులు అయిపోగానే నేనూ పోతాను.   అని    కన్నీళ్లు పెట్టుకున్న అత్తయ్యని చూసి *ఇన్నీ చెప్పి ఈ ఏడుపు ఏమిటి అంటే అదేరా భడవా జీవితం అంటే అని  బుచ్చిలక్ష్మి

 ఒక బోసి నవ్వు నవ్వడం తో ఈ కధ ముగుస్తుంది.

 

 

మిథునం కథలో కొన్ని పదాలు క్రమేణా తెలుగువారు మర్చిపోయారేమో అనిపిస్తుంది.  (రాచ్చిప్ప దప్పళం లాంటి కొన్ని పదాలు)  కొన్ని ప్రాంతాలలో ఉన్న తెలుగువారి భోజన విశేషాలుఅలవాట్లు ఈ కథలో ప్రతి చోట కనపడుతూ ఉంటాయి. కథలోని అన్ని అంశాలు గొప్పవైనాఈ కథా కాలం నాటి మన రాష్టంలో కొన్ని ప్రాంతాల్లొ ఉన్న వాడుక భాష పదాలను తరవాతి తరాలకు అందించటం కోసమైనా ఈ కథను చదవాలి. గుర్తు పెట్టుకోవాలి!

ఈ సమీక్షని చదివినందుకు ధన్యవాదాలు. ఏమైనా లోటు పాట్లు ఉంటే సహృదయంతో మన్నించండి

 

రమకంకిపాడు.

 ******

 

ఇది ముమ్మాటికీ నిజము

 

పుస్తకం లోని ఏ పేజీ తిరగేసినా ఒక దివ్యమైన సమ్మోహనం హ్రదయాంతరాళంలో పలకరిస్తూ ఉంటుంది.

కవిత్వం వ్రాయాలనుకునే ప్రతి ఒక్కరికీ దివ్యమైన కరదీపిక వంటిదే

 

Page 17

 

ఎప్పుడో ఒక పసిమి కోనలో

పిక్కటిల్లిన క్రేంకారం

అది నా గర్భం ప్రసవించిన షడ్జం

అది నాదక్షోణి స్పందించిన గాంధారం

ఎక్కడో ఏటి గట్టులో

రెక్కలెత్తిన క్రౌంచ కంఠం

 

Page 22

 

ప్రకృతి లోని చలన శీలానికి

పరిణామం మనిషి

జగతిలోని భ్రమణగుణానికి

ప్రతిరూపం మనిషి

 

Page 30

 

ఏ రూపమూ లేని మనసు

నాదంగా ఎగిసింది

పదంగా నడిచింది

రేఖలుగా మెరిసింది

మూర్తులుగా నిలిచింది

అణువణువులోని లయలను

తనువులో ఒలికింది

మదిరాక్షి కళ్ళలో మునకలేసింది

 

Page 46

 

అరుణోదయం ఊరుకోదు

కిరణాలను సారించనిదే

వసంతోదయం ఊరుకోదు

పరిమళాలు పారించనిదే

ప్రసరించే నీరు ఊరుకోదు

పల్లం అంటుముట్టనిదే

ప్రతిఘటించే మనసు ఊరుకోదు

ప్రశ్నలని ఎక్కు పెట్టనిదే

 

ఇలా వ్రాసుకుంటూ పొతే ప్రతి అక్షరంలోని పదునైన కోణమూసరళ మాధుర్యమూ ఆస్వాదించాలి 

 

మరీ ముఖ్యంగా ఆ అక్షరాల వెనకాల ఉన్న మనోగణాక్షాలని స్పృశించే ధైర్యం చేయాలి

అదే కదా సినారె ప్రతి మనిషి మనసులోసమాజంలో ఆశించే జ్వలిత చేతన

 

శివశంకర్ కస్తూరి

 

 

ఇదిగోండి "తప్పు చేద్దాం రండి" అనబడే ఈ వ్యక్తిత్వ వికాసనిధిలో బాగా నచ్చినవి కొన్ని మీ అందరి కోసం.  

ఇలాంటి పుస్తకాలకు సమీక్షలు ఏమి ఇస్తాము మస్తకంలో పొందిన అనుభూతి తప్ప. . .

యండమూరి వీరేంద్రనాధ్ - తప్పు చేద్దాం రండి  లోని కొన్ని ముఖ్యమైన సుభాషితాలు.

 

1. అందరూ మూర్ఖులుగా మారి  ఒక్కడు మారకపోతే సమస్య. ఒక్కడు తొందరగా మారి అందరూ మారకపోతే ఇంకా పెద్ద సమస్య

 

2. గెలుపు అంటే శిఖరం చేరుకోవటం కాదుచేరుకున్నాక ఏమి చెయ్యాలో తెలియటం

 

3. తెలివి కావాలంటే ప్రతిరోజూ కొంత అవసరమైనది నేర్చుకోవాలి.. జ్ఞానం రావాలంటే ప్రతిరోజూ కొంత అనవసరమైనవి వదులుకోవాలి

 

4. మార్పు నీ మీద ప్రభావం చూపే లోపులోనువ్వు మార్పుని ప్రభావితం చెయ్యి

 

5. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద ట్రాజెడీ (విషాదం) బాల్యంలో చనిపోవటం కాదు. 75  సంవత్సరాలు బ్రతికి ఏమీ సాధించకపోవటం

 

6. గతం గొప్పదే. కానీగతం కన్నా ఈ రోజు గొప్పగా లేకపోతేఆ వ్యక్తి జీవన విధానంలో ఎదో తప్పు ఉందన్న మాట  

 

7 పోరాటానికి వెళ్తున్నప్పుడు నీతో పాటు విజయోపన్యాసాన్ని తీసుకువెళ్లటం నీపై నీకున్న నమ్మకం

 

8 ఈ ప్రపంచంలో అందరినీ సంతోష పెట్టాలనుకునేవాడు తానూ సుఖంగా ఉండలేడు. తన వారిని సుఖపెట్టలేడు  

 

9 "అంతా తనదే" అన్నది మమకారము. "అంతా తానే" అన్నది అహంకారము. రెండూ వదలవలసినవే

 

10 పొరపాటుకి క్షమాపణ చెప్పటం పాత పధ్ధతి. పొరపాటుని కరెక్టుగా సరిదిద్దుకోగలగటం కొత్త పధ్ధతి

 

11 వెళ్తున్నప్పుడు విత్తనాలు జల్లుకుంటూ వెళ్తేవచ్చేటప్పటికి చెట్లు స్వాగతమిస్తాయి   

 

12 గొప్ప విజయం కోసం చిన్న విజయాన్ని త్యాగం చేయటమే "పవర్"

 

తేటగీతి

పాప పుణ్యములరయక పరుల గోజి

గాసిబెట్టి జనంబుల కరుణ లేక

పాలసులుగ జీవింపగ ఫలము గలదె;

మాననీయుల మాటను మరువకెపుడు!

 

తేటగీతి

ఘోర పాపములను జేసి గురుత పాసి

పుణ్యమంతయు గోల్పోయి పూజ్యమవగ

పరితపింపజేయు తుదకు పాతకములు;

మాననీయుల మాటను మరువకెపుడు!

 

తేటగీతి

మానవత్వమొకటె తన మత మటంచు

కరుణ తోడ చరించెడు కల్యుని గన

దేవుడంచు మ్రొక్కదగును దివ్యముగను;

మాననీయుల మాటను మరువకెపుడు!

చల్లా దేవిక.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...