9, నవంబర్ 2020, సోమవారం

పుస్తక సమీక్ష - రచనలు, ఆది వారము 08.11.2020

 


తెలుగు తేనియలు

రచనలు, పుస్తక సమీక్షలు

 

రామాయణము క్విజ్    

 

1)         రాముని వనవాసము ఎన్ని సంవత్సరములు

14

2)         వనవాసములో దాగిన మర్మము  ఏమిటి

పురము ను విడచి వనవాసము చేయుట వలన దేశ పౌర సత్వము కోల్పోతారు

3)         ద్వాపర యుగములో  ఎన్ని సంవత్సరములు దేశము విడచి జీవిస్తే పౌర సత్వము కోల్పోతారు

13

4          కలియుగములో ఎన్ని సంవత్సరములు దేశము విడచి వేరే  ప్రదేశము లో  జీవిస్తే పౌర సత్వము కోల్పోతారు

12

5          మహా యుగ పరిణామము ఎన్ని సంవత్సరములు

43,20,OOO

6          కృత యుగము పరిమాణము ఎన్ని సంవత్సరములు

17,28,000

7          ద్వాపర యుగము  యొక్క పరిమాణము ఎన్ని సంవత్సరములు

12,96,000

8          త్రేతాయుగము యొక్క పరిమాణము ఎన్ని సంవత్సరములు

8,64,000

9          యుగము అన్నిటి కన్నా చిన్నది

కలియుగము

10        యుగము అన్నిటి కన్నా పెద్దది

కృతయుగము

11        రాముడు యుగము లో పుట్టాడు

త్రేతా యుగము

 

********

 

కన్యాశుల్కం ప్రశ్నావళి - ఆదివారం ప్రత్యేకం 

 

 1. ఖగపతి యమృతముతేగా అన్న పద్యం శాస్త్రంలో కనిపిస్తుందని గిరీశం ఉవాచ ?

 

2. లుబ్ధావదాన్లుగారు ఎవరి పెద్దతల్లి కొడుకు ? లుబ్దావధానులు సంబంధం ఎవరితో జరిపించాలని నాటకంలో పన్నాగం 

 

3. నలదమయంతు లిద్దరు మనః ప్రభవానల దహ్యమానులై అన్న పద్యము ఎవరు ఎవరితో చెప్పే పద్యం నాటకంలో 

 

4. దేవభాషలాగ భోజనాల దగ్గిరకూడా మాటలే (ఇంగిలీషు ముక్కలు) కూస్తారు; సంధ్యావందనం శ్రీసూక్త పురుషసూక్తాలూ తగలబడిపోయినాయి అంటూ తెగ బాధ పడిపోయేవారెవరు 

 

5. మధురవాణి రెండువందల ఎవరి దగ్గ అప్పు తీసుకుంటుంది 

 

6. వెఱ్ఱికుదిరింది, రోకలికి తలకి చుట్టమన్నాట్ట ఎవడో ... సామెత చెప్పే మేధావి ఎవరు... ఎవరితో చెప్పే సామెత

 

7. కరటక శాస్త్రి పేరుతో అగ్నిహోత్రావధానులకు పరిచయం చేసుకుంటాడు పెళ్లి సంబంధం కోసం  ?

 

8. కాముని విరిశరములబారికి నే నేమని సహింతునే అన్న పద్యం చెప్పేవారెవరు ? ఎవరి మీద 

 

9. తాంబోలం యిచ్చేశాను. యిహ తన్నుకుచావండి. అన్న మాటలు ఎవరి నోట వినిపిస్తాయి  

 

10.  జాతకాలు కాగితమైతే అగ్గిపుల్లతో ఫైసల్‌! తాటాకైతే నీళ్లపొయ్యి! కొత్తజాతకం బనాయించడం అయిదు నిమిషాలు పని...  మా సిద్ధాంతిమట్టుకు నాలుక్కాలాలు చల్లగావుండాలి అన్న ఉచిత సలహా ఇచ్చే వారెవరు

 

********** 


 

మన కవులు క్విజ్

 

1)జంట కవులు కాని వారు ఎవరు

 

జవాబు : పెద్దన / తిమ్మన

 

2ప్రభంధ కవులు కాని వారు ఎవరు

 

జవాబు : అన్నమయ్య

 

3వీరిలో శతక కవులు కాని వారు ఎవరు

 

జవాబు : కాళోజి

 

4)జాతీయోద్యమ కవులు కాని వారు ఎవరు

 

జవాబు) క్షేత్రయ్య

 

5)శివ కవులు ఎవరు

 

జవాబు ) అల్లసాని పెద్దన

 

6)అభ్యుదయ కవులు కాని వారు ఎవరు

 

తెనాలి రామకృష్ణ

 

7)దిగంబర కవులు కాని వారు ఎవరు

 

జవాబు) రామిరెడ్డి

 

8)స్త్రీ వాద కవులు కాని వారు ఎవరు

 

జవాబు) సావిత్రి

 

9)దళిత వాద కవులు  కాని వారు ఎవరు

 

జవాబు) మనసి ప్రధాన్

 

10)అనుభూతి కవులు కాని వారు ఎవరు

 

జవాబు) పేర్వారం కవులు

 

 *********

 

కన్యా శుల్కం - కొన్ని quotable quotes నాకు నచ్చిన

గిరీశం, మరియు ఇతరుల యొక్క గిమ్మిక్కులు:

 

* నేను ఎదో ఉద్యోగాలూ ఊళ్లు ఎలి తనతో వైభవం వెలిగిస్తాననే నమ్మకం తో ఉంది పూర్ క్రీచర్...

* అట్నుంచి నరుక్కురమ్మన్నారు.. 

* ప్రఖ్యాతి గాంచిన కంద పద్యం: పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్.

* నేను నీతో వస్తానన్న మాట పిట్ట కైనా తెలియనివ్వొద్దు జాగ్రత్త...

* తాంబూలం ఇచ్చేస్తాను ఇహ తన్నుకు చావండి..

*ఇలాంటి ప్రమాదాల్నించి తప్పించుకోవడమే ప్రజ్ఞ...

* త్రొయింగ్ పెరల్స్ బిఫోర్ స్వైన్... 

* ఒకడు చెప్పిందల్లా మహా బాగుందనడమే సమ్మోహనాస్త్రం...

* ఒపినియన్స్ అప్పుడప్పుడు చేంజ్ చేస్తూంటే కానీ పొలిటిషన్ కానేరడు...

* అడగ్గానే ఇస్తే వస్తువు విలువ తగ్గిపోతుంది....

 

*******


 

నది నురగలు కక్కుతోంది

ప్రవాహ వేగం తో కాదు

తనలో నిండిన కాలుష్యం తో

 

గొడ్డలి కాఠిన్యం నింపుకుంది

ఎదిగిన చెట్టు తల్లడిల్లుతోంది

నరికే బాధను దిగమింగడానికి

 

అర్దరాత్రి స్వాతంత్రం

తెల్లారితే దిన దిన గండం

చీకటి తొలిగెదెన్నడో 

వెలుగులు చిమ్మేదెన్నడో

 

కోవూరి

 

 

 

 నీలాఆకాశం

మసి పులుముకుంది

మనిషి చేసే కాలుష్యం

హద్దులు దాటింది

ఆమ్లవర్షంతో అవని

తడిసి ముద్దయింది

 

మనిషి స్వార్ధం

రెక్కలు తొడుక్కుంది

హరితారణ్యం బీడుపడింది

జంతుజాలం మూగబోయింది

ప్రకృతి సమతూకం దెబ్బతింది

 

చూసే చూపు వక్రమైంది

పూలు పూయాల్సిన చోట

ముళ్ళు గుచ్చుకుంటున్నాయి

అతివా అవనిలో సుస్థిరత ఎక్కడ

 

ఈశాన్యంలో పుట్టింది

చీనీల చాప చించింది

గ్లోబు మొత్తం పాకింది

మనిషిని అచేతనం చేసింది 

 

కోవూరి

 


 

పుస్తకము : శశికళ

రచన -  శ్రీ అడివి బాపిరాజు గారు

మన బృందంలో ఇంతకు ముందు విశ్వనాధ వారి కిన్నెరసాని, నండూరి వారి ఎంకి పాటలు చూశాము... నేడు బాపిరాజు గారి శశికళ సంగతులు 

అడివి బాపిరాజు గారు కవి, రచయితగానే కాకుండా గొప్ప చిత్రకారులుగా కూడా ఆంధ్ర దేశమంతటా సుపరిచితులు.

ఆయన రాసిన బావా బావా పన్నీరు పాట కొన్ని లక్షల మంది తెలుగు పాఠకులను ఉర్రూతలూగించింది అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ అందరి నోళ్ళలో నానుతున్న పాట ఇది 

అందరికీ కలల సుందరి ఉన్నట్లే.. బాపిరాజు గారికి కూడా ఊహాసుందరి ఉంది.

ఆమే శశికళ.

కావ్యం రచించినప్పటికే.. ఆయన విశ్వనాథ వారి కిన్నెరసాని పాటలకు అందమైన చిత్రాలు గీసి ఉన్నారు. బహుశా ప్రేరణతోనే బాపిరాజు గారిలోని చిత్రకారులు, కవి అందమైన మగువ పాత్రకు రూపకల్పన చేశారని.. శశికళకు ఊపిరి పోశారని అంటారు.

శశికళ అంటే ఎవరు ??

శశికళ పాటల సంపుటిని ప్రచురించడానికి ముందు.. కలల సుందరిని తలచుకొని బాపిరాజు గారు ఎన్నో బొమ్మలు గీశారట. కొన్ని కథలు కూడా రాశారట. అందుకే ఆయనకు రహస్య ప్రేయసి కచ్చితంగా ఉండే ఉండి ఉంటుందని.. ఆయన స్నేహితులు ఆట పట్టించేవారు.

 కొందరు ఆయనకు ఎవరెవరితోనో లేనిపోని సంబంధాలు  అంటగట్టేవారు. కొందరు పలువురు సినీ తారల పేర్లు కూడా చెప్పేవారు. అందుకు కారణం ఆయన అప్పటికే సినీ రంగానికి.. కళా దర్శకుడిగా పరిచయం కావడం. కానీ బాపిరాజు గారి కుమార్తె ప్రేమ కుమారి..

ఆయన మరణించాక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శశికళ తన తండ్రి గీసిన అందమైన కవితా ఊహా చిత్రమేనని తేటతెల్లం చేశారు.

 

శశికళకు ఎన్నో రూపాలను అద్దారు బాపిరాజు గారు. ఒక పాటలో ఆమె సూర్య సూత..

మరో పాటలో ఆమె నర్తకి.

ఒక వర్ణనలో ఆమె యోగిని..

మరో గేయంలో ఆమె ఒంపు సొంపులను ప్రదర్శించే మగువ.

ఒక సందర్భంలో ఆమె గాన సుందరిగా హ్రుదయ గీతాలాపన చేస్తుంది. మరోసారి ఆమె దేశికగా..

ప్రేయసిగానూ మారిపోతుంది.

శశికళ పేరుతో తాను రాసిన గేయ సంపుటిని శశికళకే అంకితమిచ్చారు బాపిరాజు గారు. అలా అంకితమిస్తూ.. ఆమెను తన ఆశయమూర్తిగా, ఆత్మ పూజా పీఠస్థగా, శిల్ప కళా లక్ష్మిగా పేర్కొన్నారు.  అలాగే ఇదే సంపుటిలోని కొన్ని గేయాలను తన మిత్రుడు, నేపథ్య గాయకుడు ఎమ్మెస్ రామారావు గారి చేత పాడించి, రికార్డు చేయించారు.

తెర చాటు మగువ  

శశికళ పాటల సంపుటిలో 75 గేయాలున్నాయి. ఒక్కో గేయానిది ఒక్కో ప్రత్యేకత.  ఎంత ప్రేమలో పడినా రోజుల్లో యువతీ యువకులు సిగ్గరులు. ప్రియుడికి అమ్మాయి కళ్లలోకి కళ్లు పెట్టి చూసేంత ధైర్యం కూడా ఉండేది కాదు. కళ్లు కళ్లూ కలిసి.. పరిచయం ప్రేమగా మారి.. ఒక దగ్గరితనం అనేది ఏర్పడేవరకూ.. అంతా విరహ వేదనే.

అందుకే తొలిసారిగా తనను ప్రేమించిన వ్యక్తి ఇంటికొస్తే.. ప్రేయసి తెరచాటు నుండే సైగలు చేస్తుంది గానీ.. అమాంతం దగ్గరకొచ్చి వాటేసుకోవాలని కోరుకోదు. ఎంత ప్రేమలో మునిగి తేలినా.. కాలం నాటి కట్టుబాట్లు  తెర అనే బాపిరాజు కవితలో ప్రస్ఫుటితంగా కనిపిస్తాయి. అందుకే ఆయన కూడా తెర ఉన్నదే బాల.. తెర ఉన్నదే.. కన్నులు కానని రూపం తలచి.. కౌగిలికందని భావం తలచి* .. అన్నాడు. ఆమె వైపు తేరిపారా చూడకుండా తెర వైపే తన చేతులు మోడ్చి ఎదురు చూస్తానంటాడు.

 

స్వప్న సుందరి సంపుటిలో బాపిరాజు కలలు కన్న స్వప్నాలు మనకు కనిపిస్తాయి. యవ్వనంలో యువకుడికైనా కలలు సర్వ సాధారణం. కలల్లో తనకు ప్రేయసి మాత్రమే కనిపిస్తుంది. ప్రేయసిని ఎన్నో రూపాలలో ఊహించుకుంటాడు.

చిత్రమేమిటంటే..

కలలో నుండి బయటకు వచ్చినా అదే ప్రేయసి ఏదో రూపంలో గుండెలో తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది. మత్తులోకి లాగేస్తుంది. అప్పుడు ప్రియుడు తెలివిలో ఉన్నా.. గాఢ నిద్రలో ఉన్నా ఒకటే. అందుకే  కనుతెరిచిన కలల మధ్య కలలెరుగని గాఢ నిద్రలో.. శశికళ అన్నాడు కవి. పైగా ఒకసారి కల చెదిరిపోయినా.. నిద్ర చెడిపోయినా తన ప్రేయసిని వెతికే అర్హత తనకు లేదంటాడు.

కథలోని దేవత ఒక రకంగా చెప్పాలంటే.. సంపుటిలోని కవితలు .. పాటల్లా.. గేయాల్లా ఉన్నా.. చిత్రమైన చిట్టిపొట్టి కథలను చదువుతున్న భావన కూడా పాఠకుడిగా కలుగుతుందట.

ఎందుకంటే కవికి తన ప్రేయసి  పుట్టుపూర్వోత్తరాలు తెలియవు. తన ఊహా సుందరి చంద్రుడి వలే శ్వేత శిల్పంలా ఉంటుంది కాబట్టి.. శశికళ అని పేరు పెట్టుకున్నాడు. ఆమె ఎవరి పుత్రికో.. లోకం నుండి వచ్చిందో తెలియదు కాబట్టి.. 

చెలీ.. నీవెవరూ అన్నాడు.. కథలోని దేవతవా.. కతలోని దేవివా అన్నాడు.. అలాగే గోదావరి సప్త కూలంకషానుగత తాపస పవిత్ర పద తాళ స్వరూపానివా అని కూడా తాత్విక ధోరణిలో ఆమెను నదులతోనూ, పవిత్ర పద తాళాలతోనూ పోల్చాడు. గొప్ప వస్తువులోనైనా తన ప్రేయసిని చూడడం కవికే సాధ్యం.

ఎవరు సుందరి తన ఊహా సుందరి కవికి కలలోని పాపలా మారిపోతుంది.  ప్రణవంలా ఘోషిస్తుంది. నిశి రేయిలో పూల మొగ్గలు విరిసినా.. వాటి మాటున తన మగువ కోసం కవి వెతుకుతుంటాడు. ఆమె సొగసును పూలతో పోలుస్తుంటాడు.

రాగాలాపనలోనూ.. గీతావిష్కరణలోనూ ఆమె కోసం ఎదురుచూస్తుంటాడు. అయినా ఆమె దొరకదు. ఆమె దొరకదు కాబట్టే.. తన ఊహలకే పట్టం కట్టేస్తాడు కవి.

 

రచనా శైలి శశికళ కవితా సంపుటిలో .. ఎన్ని రకాలుగా కవి తన ఊహా సుందరిని సంబోధించాడో తెలిస్తే ఆశ్చర్యపోతాం.

విభిన్న పద ప్రయోగాలు, వ్యవహారికంతో పాటు అక్కడక్కడ గ్రాంథిక పదజాలం ప్రాచీన కవుల శైలిని గుర్తుకు తెస్తుంది.

చిన్నారి పడుచు,  కన్నె రాణి, కంటి బొమ్మ,

హృదయ కమలం, చంద్ర బాల, సోమ సుత, విమల గాత్రి, కోమలాంగి, జన్మ జన్మల రాణి, పూర్ణమూర్తి,  ప్రియ బాల, అమర సఖి, నీల రత్న, ఆర్య సఖి, నిత్య యౌవన స్నిగ్ధ, ప్రణయ దేవి, మోహనాంగి, పూర్ణ కుంత,  నగ్న బాల, ధవళ కమల, సౌగంధిక, ఇందీవర లోచని, నిర్మల, జ్యోత్స్న.. 

ఇలా ఒక ప్రేయసిని ప్రియుడు విధంగా వర్ణించవచ్చో  చెబుతూ.. కావ్యంలో గొప్ప ప్రయోగమే చేశాడు.

కిన్నెరసాని పాటలు, ఎంకి పాటల మాదిరిగానే.. శశికళ కూడా అందమైన మగువకు పట్టం కట్టిన కావ్యం. కానీ ఇదే కావ్యంలో కవి ఆత్మ.. కావ్య నాయికతో మమేకమై నడవడం మనం చూస్తాం. పూజకు వేళయితే ఆమెలో కవి దేవిని చూస్తాడు. ఆశయ సాధనలో ఆమెలోని స్ఫూర్తి ప్రదాతను చూస్తాడు. వెన్నెల కాంతి నందు ఆమెలో అర్థ చంద్రుడిని చూస్తాడు. ఆమె ప్రవాహమైతే.. శబ్ద గీతమైపోతాడు. 

కొత్తగా సినీ కవిత్వం రాస్తున్న వారికి.. ప్రేమలేఖలు రాయాలని భావించే కుర్రకారుకి.. శశికళ తప్పక నచ్చుతుంది. కానీ గాఢతతో నిండిన భాష, పదజాలం అడుగడుగునా పరీక్ష పెడుతుంది. కొన్ని చోట్ల కవిత్వం శ్లోకాల మాదిరిగా, పద్యాల మాదిరిగా ఉంటుంది. ప్రణయ కవిత్వాన్ని రోజుల్లో..

శైలి లో వర్ణించారంటే  భావ కవిత్వ ప్రభావం కచ్చితంగా ఉందనే భావించాలి.

 

******

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...